Social Media News
-
సోషల్ మీడియాను షేక్ చేసి.. ఇదేందిది అనిపించిన వంటకాలు!
2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో కొన్ని వింత ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఎవరూ ఎప్పుడూ చూడని వంటకాలు కూడా కనిపించి అందరికీ కంగుతినిపించాయి. అవి వైరల్గా మారి కొందరికి నవ్వు తెప్పించగా, మరికొదరికి అసహ్యం కలిగించాయి. మరికొందరైతే ఇలాంటి వంటకాలు కూడా ఉంటాయా అని తెగ ఆశ్చర్యపోయారు. మరి 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వంటకాలేమిటో ఇప్పుడు చూద్దాం.చాక్లెట్ పాస్తాఇన్స్టాగ్రామ్లో ఇటాలియన్ పాస్తాకు కొత్త ట్విస్ట్ ఇస్తూ, నూతన వంటకం ప్రత్యక్షమయ్యింది. దీనిని కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి తయారు చేశారు. ఈ స్నికర్స్ పాస్తా రిసిపీని చూసి జనాలు షాక్ అయ్యారు.చాక్లెట్ గ్రీన్ పీస్ఇన్స్టాగ్రామ్లో ఫుడ్మేకేస్కల్హ్యాపీ అనే పేజీలో చాక్లెట్ కొత్తగా, ఎప్పుడూ చూడని గ్రీన్ పీస్ రెసిపీ దర్శనమిచ్చింది. ఇందులో ఆ ఫుడ్ బ్లాగర్ ఒక చాక్లెట్ను మైక్రోవేవ్ బౌల్లో ఉంచిన తర్వాత, దానికి బఠానీలను జోడించి, కొన్ని నిమిషాలు మైక్రోవేవ్లో ఉంచి, తరువాత ఆనందంగా తిన్నాడు.మటన్ కీమా కేక్ఇప్పటి వరకు మీరు చాక్లెట్, పైనాపిల్, బటర్స్కాచ్ వంటి కేక్లను తినే ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బేకర్.. మటన్ కీమా కేక్ని తయారు చేశారు. ఇందుకోసం మటన్ మిన్స్ను తయారు చేశాడు. దానిని స్పాంజ్ కేక్పై స్ప్రెడ్ చేసి, దానిని అలంకరించేందుకు ఫ్రెష్క్రీమ్తో పాటు మటన్ మిన్స్ను ఉంచి రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అలంకరించాడు. దీనిని చూసినవారంతా ఇదేందిది అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.గుడ్డు హల్వాసోషల్ మీడియాలో హల్చల్ చేసిన కోడిగుడ్డు హల్వాను చూసిన జనానికి మతిపోయింది. ఈ రెసిపీలో ఒక గిన్నెలో గుడ్లు గిలక్కొట్టి, దానిలో చక్కెర, పాలపొడి వేసి, దానిని ఎలక్ట్రిక్ బ్లెండర్ వేసి మెత్తగా చేశారు. తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, స్టవ్పై పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి సన్నని మంటపై ఉడికించారు.గులాబ్ జామున్ చాట్చాట్- గులాబ్ జామూన్.. ఈ రెండు విభిన్న వంటకాలు ఒకటి తీపి వంటకం. మరొకటి స్పైసీ వంటకం. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గులాబ్ జామూన్ చాట్ తయారు చేశాడు. దానిపై పెరుగు, చింతపండు చట్నీ వేసి వినియోగదారునికి అందించాడు. దీనిని చూసి నెటిజన్లకు దిమ్మతిరిగిపోయింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణులు వద్ద సమాచారం
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది: కుటుంబ సభ్యులు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం: Govardhanreddy
-
YS Jagan: గోరుముద్ద అటకెక్కింది...అమ్మ ఒడి గాలికెగిరింది
-
YSRCP సోషల్ మీడియా సైన్యానికి అంబటి భరోసా
-
తాడేపల్లిలో నాగిరెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
సోషల్ మీడియా కార్యకర్తలకు YSRCP ໑໐໕ జగన్ కీలక ఆదేశాలు
-
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
వామ్మో.. ఇది కూడా కూలరేనా?
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..ఇన్స్టాగ్రామ్లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.ఈ కూలర్ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. View this post on Instagram A post shared by Sharp Fact Mind (@sharpfactmind) -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్ను కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు.► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్లోని సంతోష్ నగర్ దరాబ్జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.పత్రికల ‘పచ్చ’కామెర్లు► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
'లంచం అడిగిన ఆర్ఐ..' సోషల్ మీడియాలో వాయిస్ వైరల్!
ఖమ్మం: వ్యవసాయ క్షేత్రంలో బోరు బావి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయడానికి దమ్మపేట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు చేసిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మండలంలోని మందలపల్లికి చెందిన మడిపల్లి వెంకటేశ్వరరావు మల్లారంలోని మట్టా ధనదుర్గకు చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో పాత బోరు బావి ఉండగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు ఆర్ఐ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్ఐకు ఇరవై రోజుల కిందట వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకోగా రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు అంత డబ్బు ఇవ్వలేనని బదులివ్వగా రూ.6 వేలైనా ఇవ్వాలని సూచించాడు. ఇదంతా ఫోన్లో రికార్డు చేయడంతోపాటు వీడియో చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం ఆర్ఐ ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి ఆడియో, వీడియోలు తొలగించాలని కోరాడు. ఈ విషయమై ఆర్ఐని వివరణ కోరగా వాయిస్ రికార్డు చేస్తారని అనుకోలేదని, ఏదో అలా జరిగిపోయిందంటూ బదులివ్వడం గమనార్హం. ఇక తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ మాట్లాడుతూ ఆర్ఐ డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసిందని, రైతు నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇవి చదవండి: వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శవపేటిక! -
అలాంటి వాటిని నమ్మొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి - ఆర్బీఐ
రుణమాఫీకి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని, వీటి వల్ల వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు ఒక (డిసెంబర్ 11) ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' జారీ చేయడానికి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. లోన్ తీసుకుంటే అవన్నీ మాఫీ అవుతాయనే వార్త వాస్తవం కాదని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని ఆర్బీఐ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తలు ఆర్ధిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందేశాలు మీకు వచ్చినట్లయితే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వెల్లడించింది. -
‘ట్రోలింగ్’ వెనుక ఎవరున్నారు?
సాక్షి, హైదరాబాద్: వివిధ సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలే లక్ష్యంగా ‘ట్రోలింగ్’సాగడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తిచూపుతూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో వివిధ రకాల మీమ్స్, సందేశాలు ప్రచారం చేస్తుండటాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పరోక్షంగా బీజేపీ ఇమేజీ కూడా దెబ్బతింటోందని అంటున్నారు. పార్టీని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్య మాల్లో పెడుతున్న పోస్టులను చూసి ముఖ్యనేతలు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటివల్ల అంతిమంగా పార్టీకే నష్టం జరగనున్నందున ట్రోలింగ్ అంశంపై నాయకత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రతికూల ప్రచా రం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు అప్రమత్తమై అలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు షేరింగ్లు చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పార్టీలో అంతర్గత సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇలాంటి అభ్యంతరకర పోస్టులను తిప్పికొడుతూ పోస్టింగ్లు కూడా పెట్టాలని సూచించినట్టు తెలిసింది. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ లోని కొందరు నేతలు సొంతంగా సోషల్ మీడి యా టీమ్లను ఏర్పాటు చేసుకుని తమ ప్రచా రాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీని, నేతలను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్లు, కొందరు నేతలను టార్గెట్ చేస్తూ పనిగట్టుకుని ట్రోలింగ్ చేయడం వెనక పార్టీలోని వారే ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్త మతున్నాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆయా నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అందుకు కారణాలు ఏమిటన్న దానిపై రాష్ట్ర పార్టీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
'స్మార్ట్గా సోషల్ వార్..' రాజకీయ పార్టీల ప్రచారం..!
సాక్షి, నిజామాబాద్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్మార్ట్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ప్రజల నుంచి సైతం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువ ఆసక్తి కనిపించడం విశేషం. దీంతో గతానికి భిన్నంగా విచ్చలవిడిగా కరపత్రాలు పంచడం, ప్రెస్మీట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు తగ్గించారు. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ అపరిమితంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డుల వారీగా, కులాలు, సంఘాల వారీగా, యువజన సంఘాల పేరిట ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి మరీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం చేసినా ఆయా ప్రచారం అన్ని గ్రూపుల్లో వచ్చేవిధంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఫేస్బుక్ లైవ్లు, యూట్యూబ్ లైవ్లు సైతం పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు. పార్టీల మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రచారం చేస్తూనే స్థానిక అంశాలనూ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. కరపత్రాలను పరిమిత సంఖ్యలో ముద్రించి, వాటిని పీడీఎఫ్ ఫైల్ తయారు చేయించి వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీగా వైరల్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్లకు సైతం మరింత ప్రాధాన్యత పెరగడం గమనార్హం. వ్యక్తుల వాట్సాప్ స్టేటస్లను బట్టి సదరు వ్యక్తి ఆలోచనలను అంచనా వేసుకుంటూ అందుకు అనుగుణంగా అలాంటి వ్యక్తులను కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 'కొందరు యువకులు మాత్రం జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైఫల్యాలు, అపరిష్కృత సమస్యలు, పోటీ పరీక్షల విషయమై ప్రభుత్వం వైఫల్యాలు, పేపర్ లీక్లు తదితర అంశాలను వైరల్ చేస్తుండగా, స్థానిక సమస్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నందిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ధ్వంసమైన రోడ్ల గురించి ఎమ్మెల్యేను విమర్శిస్తూ సైటెరికల్గా చేసిన వీడియో వైరల్ అయింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో అధికార పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆర్మూర్కు చెందిన యువకులు చేసిన వీడియోలు బాగా వైరల్అయ్యాయి. ఇలా సోషల్ వార్ మరింత విస్తరిస్తోంది.' -
ఆ కంటెంట్ తొలగించకుంటే చర్యలే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి. లేదా డిజెబుల్ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్ఖాన్కు నాలుగో భార్యనవుతా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్ అనే టిక్టాకర్ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ’’ అంటూ ఆ వీడియోలో జియా ఖాన్ కొంటెగా చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
చావు చిల్లర
రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్మెంట్లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్మెంట్ దిగేస్తాడు. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది. ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి. వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు. మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి. ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి. కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం. బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం. -
నకిలీల తనిఖీ పేరుతో పెత్తనం?
డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్సైట్లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది. ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది! సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మధ్యవర్తులు ఆన్లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం. ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు. శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది. ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది. ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది. ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది. వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు. అపర్ గుప్తా వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
ఎవరి ‘గోడ’ వారిదే!
మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి. సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది. అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది. ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు. సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది. అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది. సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది. తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్! -
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆర్థిక కష్టాలతో ట్విటర్ను గట్టెక్కించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్ నుంచి ట్విటర్ బాస్గా మస్క్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో నాటి నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు సుమారు 500 కంపెనీలు ట్విటర్కు ఇచ్చే యాడ్స్ను నిలిపివేసినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ఆఫీస్ 1,36,250 డాలర్ల అద్దె చెల్లింపుల్లో జాప్యం జరగడంతో అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. శాలరీ పెంచాలని డిమాండ్ చేసిన పారిశుధ్య కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఆఫీస్ను శుభ్రం చేయకపోవడంతో వాష్ రూమ్ల నుంచి వెదజల్లుతున్న కంపు భరించలేమంటూ ట్విటర్ ఉద్యోగులు వాపోయినట్లు న్యూయార్స్ టైమ్స్ హైలెట్ చేసింది ఈ తరుణంలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ తీసుకొస్తున్నామని వెల్లడించారు. తాజాగా, ట్విటర్ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ట్విటర్లో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తుంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆ యాడ్స్ ఇకపై కనిపించవు. ఇది కార్యరూపం దాలిస్తే ట్విటర్ ఆదాయం పెరగవచ్చనే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. -
బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..
బిడ్డలపై కన్నతల్లికి ఎంత ప్రేమ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లితల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం ఉందని తెలిస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. తన బిడ్డపై దాడి చేస్తున్న ఆవు దాడి నుంచి కుమారుడిని కాపాడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న లక్ష్మినారాయణ సొసైటీ పరిధిలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వస్తోంది. ఇంతలో అక్కడే ఉన్న ఓ ఆవు.. వారి మీద దాడి చేసేందుకు అటుగా వచ్చింది. అది గమనించిన తల్లి.. వెంటనే తన బిడ్డను పక్కకు లాగేసింది. అయినా.. ఆవు మాత్రం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో, ఆమె.. ఆవు దాడిని ప్రతిఘటించింది. ఇంతలో అక్కడున్నవారు వచ్చి ఆవును తరిమేశారు. ఇక, ఈ దాడి ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యానికి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. મોરબી:- ગાયે માતા અને બાળકને ચગદી નાખવાનો પ્રયાસ કર્યો, લોકો એકઠા થઈ જતાં માંડ માંડ જીવ બચ્યો#Morbi #Cow #StrayCattle #Animal #AnimalAttack #CowAttack #MorbiNews #Gujarat #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/N69YlldXnt — ConnectGujarat (@ConnectGujarat) October 22, 2022 -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
లక్కీ ఫెలో.. అనకొండ దాడిలో జస్ట్ మిస్ అయ్యాడు
పామును చూస్తేనే ఒక్కసారిగి భయాందోళనకు గురవుతుంటాము. అలాంటిది ఏకంగా భారీ అనకొండ నుంచి ప్రాణాలకు కాపాడుకోవడమంటే మాములు విషయం కాదు. కాగా, ఓ వ్యక్తి అదృష్టవశాత్తు అనకొండ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. బ్రెజిల్కు చెందిన గైడ్ జోవో సెవెరినో(38).. అనకొండ దాడిలో తన ప్రాణాలను కోల్పోకుండా తృటిలో తప్పించుకున్నాడు. కాగా, జోవో సెరియన్.. అరగుయా నదిలో పర్యాటకుల బృందంతో విహారయాత్రలో ఉన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు చుట్టుప్రక్కల ప్రాంతాలను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సెవెరినోకు నదిలోని నీటిలో ఉన్న గ్రీన్ అనకొండ కనిపించడంతో సరదాగా వీడియో తీశాడు. అదే సమయంలో అదును చూసి అనకొండ అతడిపై దాడి చేసే క్రమంలో కాటు వేసింది. ఈ క్రమంలో తృటిలో పాము నుంచి అతను తప్పించుకున్నారు. దీంతో పడవలో ఉన్న ప్రయాణీకులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక, గ్రీన్ అనకొండ.. 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. కాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, మగ గ్రీన్ అనకొండ కంటే.. ఆడ అనకొండలు చాలా పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా ఇవి.. చిత్తడి నేలలు, నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. View this post on Instagram A post shared by João Severino (@lavaginha_) ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. వీడియో వైరల్ -
అర్ధరాత్రి వైన్స్ వద్ద ఉద్రిక్తత.. మహిళలపై దాడి
అర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగడంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు.కాగా, ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు. ఫుల్ ఫైర్లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని 10 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. देवली रेजिडेंशियल ऐरिया में अवैध शराब के ठेके का विरोध कर रही महिलाओं को शराब माफिया ने बाहर के गुंडों को बुलाकर उनको बुरी तरह से पिटवाया। दिल्ली सरकार की नई लीकर पॉलिसी के करण जगह-जगह यही मौहोल बनता जा रहा है केजरीवाल जी आप से निवेदन इस तरह दिल्ली को बर्बाद न करें। pic.twitter.com/7I7lSkWAnO — Siddharthan (@siddharthanbjp) June 24, 2022 ఇది కూడా చదవండి: ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు -
బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా?
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఈజీగా టోల్ పేమెంట్ చేయోచ్చు. అయితే ఇప్పుడీ ఫాస్టాగ్ పేమెంట్ విషయంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో తన చేతికి ఉన్నవాచ్ను..ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికులు సదరు బాలుడ్ని " ఏం చేస్తున్నావు. ఇటు రా అంటూ" పిలుస్తారు. దీంతో కారు అద్దం తుడుస్తున్న బాలుడు..కారు యజమానికి దగ్గరికి రాగా..ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అని ఆ వాచ్ గురించి అడగ్గా.. బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు. A video is spreading misinformation about Paytm FASTag that incorrectly shows a smartwatch scanning FASTag. As per NETC guidelines, FASTag payments can be initiated only by authorised merchants, onboarded after multiple rounds of testing. Paytm FASTag is completely safe & secure. pic.twitter.com/BmXhq07HrS — Paytm (@Paytm) June 25, 2022 ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికుడు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో వెంబడించిన వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్ స్కామ్, ఆ బాలుడిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ స్మార్ట్ వాచ్తో ఫాస్టాగ్ ద్వారా డ్రైవర్లు, యజమానుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారని ఆరోపిస్తాడు. ఫాస్టాగ్ అనేది ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ సర్వీస్. దీంతో కారు డ్రైవర్లు లేదా, యజమానులు టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్ పేమెంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. టోల్ గేట్ల వద్ద కారు ముందు అద్దానికి దగ్గరలో అంటించిన స్కానర్పై ట్యాప్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో సదరు ఫాస్టాగ్ అకౌంట్లో నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు డిడక్ట్ అవుతాయి. ఇప్పుడీ బాలుడు కూడా ఆ స్కానర్పై వాచ్తో ట్యాప్ చేశాడని, అలా చేయడం వల్ల డబ్బులు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అయితే ఇది నిజమా? కాదా? అని ప్రశ్నిస్తూ ఐఏఎస్ అధికారి అవానిష్ శరాణ్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా..ఫాస్టాగ్ సర్వీసుల్ని అందిస్తున్న పేటీఎం ఆ వీడియోపై స్పందించింది. స్పందించిన పేటీఎం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టి పారేసింది.నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రకారం(ఎన్ఈటీసీ)..ఫాస్టాగ్ చెల్లింపులు చాలా సురక్షితం. ఫాస్టాగ్ లావా దేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చంట్లు మాత్రమే స్కాన్ చేసుకోవచ్చు. మినహాయించి ఎవరు చేసినా ఆ బార్ కోడ్లు స్కాన్ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది. -
చైనాలో మరో అద్భుతం.. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్
Giant Sinkhole in China.. ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిని కనుగొనే ప్రయత్నంలో అద్భుతాలను చూసి ఆశ్యర్యపోతుంటాం. ఇలాంటివి నిజంగానే ఉంటాయా అని షాక్ అవుతుంటాం. తాజాగా చైనాలో మరో అద్బుతం జరిగింది. భూమిలోపల దట్టమైన పురాతన అడవిని అన్వేషకులు ఇటీవల కనుగొన్నారు. ఈ అడవి ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి.. చైనా అధికారిక మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ ప్రాంతంలో ఒక భారీ సింక్ హోల్ బయటపడింది. అందులో అద్భుతమైన పురాతన అటవీ ప్రాంతం కూడా ఉన్నట్టు అన్వేషకులు గుర్తించారు. మే 6వ తేదీన లేయ్ కౌంటీలోని సింక్హోల్ గుహను వారు కనుగొన్నారు. ఈ సింక్హోల్ అడుగున 40 మీటర్ల ఎత్తైన చెట్లున్నాయి. దీని లోపలి ప్రాంతం మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్హోల్ పైవరకూ ఉన్నాయి. సింక్హోల్ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పు, 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది. దానిలో చెట్లు 131 అడుగుల ఎత్తులో ఉన్నాయని తెలిపారు. కాగా, తాజాగా కనుగొన్న దానితో కలిసి చైనాలో గుర్తించిన సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్హోల్లో ఇదే పెద్దది అని అన్వేషకులు చెబుతున్నారు. ఈ సందర్బంగా గ్వాంగ్జీ అన్వేషణ బృందానికి నాయకత్వం వహించిన చెన్ లిక్సిన్ మాట్లాడుతూ.. సింక్హోల్లో ఉన్న పురాతన చెట్లు దాదాపు 40 మీటర్ల ఎత్తు (131 అడుగులు), దట్టంగా అళ్లుకుని ఉన్నారు. ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపించే అవకాశం ఉందన్నారు. పరిశోధకులు సింక్హోల్ దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు. 30th giant karst sinkhole discovered in south China's Guangxi pic.twitter.com/52ZxFnyuWF — CGTN (@CGTNOfficial) May 11, 2022 -
పెళ్లి వేడుకలో వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు.. వీడియో వైరల్
లక్నో: ప్రతీరోజు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అందులో పెళ్లికి సంబంధించిన కపుల్స్ ఫన్నీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని అందరూ ఎంతో సంతోషంగా ఉండగా.. వరుడికి వధువు షాకిస్తూ అందరి ముందే చెంపచెళ్లుమనిపించింది. దీంతో వరుడికి దిమ్మతిరింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది. దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. అనంతరం ఆమె పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. ● A #video has surfaced in which a bride can be seen slapping the groom in #Hamirpur ● As per reports, the groom was in a drunken state that's why the bride took this step pic.twitter.com/C5Cg5zjQSj — Taaza TV (@taazatv) April 18, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. వధువుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట్విట్టర్ యూజర్ తెలుపగా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇది చదవండి: ఏపీలో టూరిస్ట్ స్పాట్గా ఉబ్బలమడుగు.. బ్రిటిష్ కాలంలో ఎంతో ఫేమస్ -
ఫుడ్ డెలివరీ బాయ్ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్
భోపాల్: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్పూర్ జిల్లాలోని రసల్చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్పై వెళ్తుండగా ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె బైక్ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్ రూట్లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్ డెలివరీ బాయ్ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్ ప్లేస్లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్కు తరలించారు. అనంతరం రాంగ్రూట్లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్ డెలివరీ బాయ్కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు. -
సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి షాకైన శశి.. తరువాత ‘ఇదే నిజం’ అంటూ..
కాలేజీ కి బయల్దేరుతూ ఫోన్ తీసుకొని, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లు చూస్తోంది శశి (పేరు మార్చడమైనది). సోషల్ మీడియాలో ‘ఒకబ్బాయి కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలు’ అని ట్యాగ్లైన్తో ఉన్న వీడియో చూసి షాకయ్యింది. ఆ వీడియోలో ఉన్నది తనే. ఆ వీడియోను ఇంట్లో అమ్మనాన్నలు చూశారు. వారికి అసలు విషయం తెలియజేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రితం రోజు రాత్రి షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి బయల్దేరేసరికి పది దాటింది. హడావిడిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న శశికి రోడ్డు పక్కన ఓ అబ్బాయి అమ్మాయితో గొడవపడటం చూసింది. ముందు ‘నాకెందుకులే’ అనుకుంది. కానీ, అక్కడ అమ్మాయి సమస్య అనేసరికి ఉండలేక వారి దగ్గరకెళ్లింది. అబ్బాయి ఆ అమ్మాయిపై చేయి చేసుకోవడంతో శశి ఆ అబ్బాయిని కొట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని కోప్పడి, తను ఇంటికి వచ్చేసింది. ఎవరు వీడియో తీశారో కానీ, అమ్మాయిలిద్దరూ గొడవపడుతున్న సన్నివేశం, పక్కన అబ్బాయి ఉండటంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపైన రకరకాల కామెంట్లు. తట్టుకోలేకపోయింది శశి. అయితే, మధ్యాహ్నానికి ఈ అమ్మాయి పరువు తీస్తున్నారు ‘ఇదే నిజం’ అంటూ వచ్చిన మరో వీడియో చూసి ఊపిరి పీల్చుకుంది. శశి పరువు తీసేలా ప్రవర్తించిన వ్యక్తి పోస్ట్కి నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో అంతా నిజం అనదగినవి ఏమీ లేవు. సోషల్ మీడియాలో ఉన్న రిపుటేషన్ బట్టి జీవితాలు మారిపోతున్న రోజులివి. ప్రెగ్నెన్సీ, బ్రేకప్స్, విడాకులు, న్యూ రిలేషన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్.. అన్నీ సోషల్ మీడియాలో ఉంటున్నాయి. వీటికి మంచి, చెడు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సెలబ్రిటీలకు సంబంధించినవైతే ఇక లెక్కే ఉండవు. కొన్ని వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవి ఉంటే సంస్థల వైపు మరోవిధంగా ఉంటున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఏ వస్తువు కొనాలన్నా, ఏ రెస్టారెంట్కు వెళ్లాలన్నా.. వాటికి సంబంధించిన మంచి–చెడులను కామెంట్స్, రివ్యూల రూపంలో పెట్టేస్తున్నారు. పుకార్లు, అబద్దాలు, చెడు సమీక్షలు.. రకరకాల పోస్ట్ల్లో కనిపిస్తే.. ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో ఉండేవారికి తప్పక తెలుసుండాలి. ప్రతిష్ట ఎలా దెబ్బతింటుంది? ►ఆన్లైన్లో వచ్చిన రకరకాల వార్తాకథనాలు సరైనవే అని నమ్ముతుంటారు. ఇవి, ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలకు, సంస్థలకు సంబంధించినవి ఉంటాయి. ►ఇతరులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో లీక్ చేయడం. బ్లాగుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం. ►కస్టమర్ల రివ్యూల ఆధారంగా వినియోగదారులకు మార్గదర్శకం చేసే రివ్యూ సైట్లు. ►గాసిప్లను వ్యాప్తి చేయడం, పబ్లిక్ వ్యక్తులను విమర్శించడం వంటివి. లిజనింగ్ టూల్స్ తప్పనిసరి.. మనకు సంబంధించిన మంచి చెడులను తీసుకొని, మనకు ఇన్ఫార్మ్ చేస్తుంటాయి లిజనింగ్టూల్స్. ప్రతి ఒక్కరూ తమ సోషల్ నెట్వర్క్లలో సానుకూల కామెంట్లు, రివ్యూలను ఆశించే పోస్ట్లు పెడుతుంటారు. దీనికి ప్రతికూల అభిప్రాయం వస్తే సోషల్ మీడియాలో మీ కీర్తి దెబ్బతింటుంది. సంస్థలు అయితే తమ వ్యాపారంలో నష్టాన్ని చూడాల్సి రావచ్చు. తమ బ్రాండ్ లేదా తమ వ్యక్తిత్వం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోషల్ లిజనింగ్, మానిటరింగ్ సాధనాలు వాడటం చాలా ముఖ్యం. కొన్ని ప్రముఖ సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్ సైట్స్ ఇవి. ► https://www.falcon.io/ ► https://wwww.brand24.com/ ► https://www.digimind.com/ ► https://youscan.io/ ► https://brandmentions.com/ ► https://buzzsumo.com/ షెడ్యూలింగ్ టూల్స్ కంటెంట్ ముందుగా సిద్ధం చేసిపెట్టుకొని, సమయానుకూలంగా పోస్ట్ అవ్వాలని ఆప్షన్ పెట్టుకుంటే దానికి అనుగుణంగా పోస్ట్ చేస్తుంది ఈ యాప్. ఇవి మీ సోషల్ మీడియా ఖాతాల మొత్తం నిర్వహణలో సహాయపడతాయి. సరైన కంటెంట్ను సృష్టించడానికి, నిజమైన కనెక్షన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ► https://sproutsocial.com/ ► https://coschedule.com/ ► https://feedly.com/ ► https://www.airtable.com/ ► https://planable.io/ ► https://skedsocial.com/ ఆన్లైన్లో మంచి పేరు సంపాదించుకోవాలంటే సరైన కంటెంట్ను పోస్ట్ చేయాలి. లైక్లు, ఫాలోవర్లకు బదులు రివ్యూలపై దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా వచ్చే ఫీడ్బ్యాక్లపై దృష్టిపెట్టాలి. మన ప్రతిష్టను ప్రభావితం చేసే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్, షెడ్యూలింగ్ టూల్స్ తప్పక ఉపయోగించాలి. ఆఫ్లైన్లో ఎలాంటి ప్రతిష్టను కోరుకుంటారో, ఆన్లైన్లోనూ అలాంటి రిప్యుటేషన్ ను పొందాలనుకోవడం ముఖ్యం. -
జూనియర్ సమంత వెనకున్న ఆ హీరో ఎవరో తెలుసా !
జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న అషు రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాతో తెచ్చుకున్న పాపులారిటీతో బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టి స్టార్గా ఎదిగింది. ఆ తర్వాత హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతేకాకుండా ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వైరల్ అవడమే కాకుండా ఆమెకు 'బోల్డ్ బ్యూటీ' అనే పేరును తెచ్చిపెట్టింది. తాను చేసే పోస్ట్లకు యాప్ట్ అయ్యేలా ట్యాగ్లైన్ రాస్తూ కూడా రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవల కూడా 'మీ కళ్లల్లోనే వేడి ఉంది' అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్లే కాకుండా అప్పుడప్పుడు టూర్లకు కూడా వెళ్తూ ఉంటుంది అషు. ఇటీవల వెకేషన్ నిమిత్తం దుబాయ్ వెళ్లిన అషు 'మేడమ్ టూసాడ్స్' మ్యూజియంను సందర్శించింది. ఈ మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పలు ఫొటోలు దిగిన ఈ భామ తాను అభిమానించే బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ మైనపు బొమ్మతో ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేస్తూ 'సారీ అలియా భట్' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే..
Top 7 Social Media Stars In 2021: కరోనా మహమ్మారి రాకతో లాక్డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో థియేటర్లన్ని మూతపడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నామని డీలా పడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా, ఓటీటీలపై పడ్డారు సినీ ప్రేక్షకులు. దీంతో సోషల్ మీడియా, ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. భారీ సినిమాలు రాకపోవడంతో యూట్యూబ్, ఓటీటీల్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోయింది. అయితే ఈ ఏడాది వెబ్ సిరీస్ల హవా కొనసాగింది. దీంతో యూట్యూబ్, ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిసింది. అలాగే కరోనా పుణ్యమా అని వెబ్ సిరీస్ ద్వారా పరిచమయైన చిన్న చిన్న నటులు తెగ క్రేజ్ సంపాందించుకున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా.. 1. షణ్ముఖ్ జస్వంత్ (సూర్య) సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో మంచి పేరు తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్. ప్రస్తుతం బిగ్బాస్ రియాల్టీ షో 5వ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 2. మౌనిక రెడ్డి (సూర్య) సూర్య వెబ్ సిరీస్తో అనేక అభిమానులను సంపాదించుకుంది మౌనిక రెడ్డి. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది. తెలివైన అమాయకపు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య వెబ్ సిరీస్తో అత్యంత పాపులారిటీ సంపాందించుకుంది మౌనిక రెడ్డి. 3. అనన్య (30 వెడ్స్ 21) సోషల్ మీడియాలో అత్యధికంగా క్రేజ్ సంపాదించుకుంది అనన్య. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటనతో, ఎక్స్ప్రెషన్స్తో అనన్య కుర్రాళ్ల రాకుమారిగా మారిపోయింది. 30 ఏళ్ల బ్యాచిలర్కు 21 ఏళ్ల అమ్మాయికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనేదే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్తో అబ్బాయిలకు క్రష్గా మారింది అనన్య. 4. చైతన్య రావు (30 వెడ్స్ 21) 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు. నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్తో సూపర్ హిట్ అందుకున్నాడు చైతన్య. 5. సిరి హనుమంతు రామ్ లీలా, గంధరగోళం, లాక్డౌన్ లవ్ వంటి వెబ్ సిరీస్లతో యూట్యూబ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ సిరి హనుమంతు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు బిగ్బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్గా రాణిస్తోంది. 6. శ్రీహాన్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీహాన్. అయితే అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ 5 కంటెంస్టెట్ సిరి హన్మంత్ ప్రియుడిగానూ మరింత పాపులర్ అయ్యాడు శ్రీహాన్. వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్లలో నటించారు. 7. అనిల్ గీలా (మై విలేజ్ షో) మై విలేజ్ షోతో ప్రేక్షకులకు చేరువైన మరో నటుడు అనిల్ గీలా. మంచి ఉపాధ్యాయుడిగా రాణిస్తూనే యూట్యూబ్లోని తన సత్తా చాటాడు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానెల్ నిర్వహిస్తున్నాడు. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించాడు అనిల్. -
ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్బుక్పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!
యూజర్ల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందంటూ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ పెట్టిన చిచ్చు ఫేస్ బుక్ను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ఆరోపణలే ఫేస్బుక్ పేరు సైతం మార్చే దిశగా జుకర్ బెర్గ్ ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 మిలియన్ల జరిమానా విధించే యోచనలో ఉందని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా సంస్థలకు 10 మిలియన్ల వరకు జరిమాన విధించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. అదే జరిగితే ముందుగా ఫేస్బుక్ జరిమానా కట్టాల్సి ఉంటుందనే అనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా చట్టాల్ని మరింత కఠిన తరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ మైఖేలియా క్యాష్ మాట్లాడుతూ.. సోషల్ ఫోరమ్ సైట్ రెడ్డిట్తో పాటు బంబుల్ వంటి డేటింగ్ యాప్లను నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీలు యూజర్ల వయస్సును నిర్ధారించడానికి డేటాను సేకరిస్తున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. ముసాయిదా చట్టం ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి, చట్టాల్ని ఉల్లంఘించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు 10 మిలియన్ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యం,ఆత్మహత్యల నివారణపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి డేవిడ్ కోల్మాన్ మాట్లాడుతూ..ఫేస్బుక్ యువతీ యువకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ''ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ప్రతినిధులు సోషల్ మీడియా సంస్థల చట్టాల ఉల్లంఘనపై విచారణ, జరిమానా విధించే అధికారం ఉందని తెలిపారు. విచారణలో ఉల్లంఘన నిజమైతే 10మిలియన్లు లేదా సంస్థల వార్షిక టర్నోవర్లో 10శాతం, ఆర్ధిక ప్రయోజనం కోసం ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!
Facebook Name Change Says Verge: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకోనుందా? ఫేస్బుక్ పేరు మారబోతోందా? ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్ అవుననే అంటోంది. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నాడంటూ తాజాగా తన వెబ్సైట్లో వెర్జ్ ఓ కథనం ప్రచురించింది. అక్టోబర్ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్బుక్ పేరు మార్చే అంశంపై జుకర్ బెర్గ్ స్పందించనున్నట్లు ది వెర్జ్ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్స్ట్రాగ్రామ్, వాట్సాప్, ఓకులస్లను తదితర ఫేస్బుక్ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్ కంపెనీ(ఫేస్బుక్ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్బుక్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్నెస్ ఉంటుందని జుకర్బర్గ్ అండ్ కో భావిస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది. అయితే కొత్త పేరు ఏంటన్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్బుక్ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ పేరెంట్ కంపెనీ) నుంచి గూగుల్ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ అధినేత ఉక్కిరి బిక్కిరి గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు మార్క్ జుకర్ బెర్గ్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్ హాగెన్ ఆరోపణలు, అక్టోబర్ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ విధించడం..ఆ ఫైన్ కట్టేందుకు జుకర్ బెర్గ్ ఒప్పుకోవడం, ఫేస్బుక్ సీఈఓగా మార్క్ జుకర్ బెర్గ్ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్ బెర్గ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్బుక్ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్బెర్గ్ ఫేస్బుక్ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. ఫేస్బుక్ పేరు మార్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చనేది మరి కొందరి వాదన. అయితే ఫేస్బుక్ పేరు మారిస్తే..ఫేస్బుక్కు పెట్టబోయే కొత్త పేరేంటీ? పేరు మార్పును ఎప్పుడు ప్రకటిస్తారని అంశంపై కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. వాట్ నెక్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లతో బిజీగా ఉన్న జుకర్ బెర్గ్..భవిష్యత్ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇటీవల ఫేస్బుక్, వర్క్ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్లను ఫేస్బుక్ రూపొందిస్తోంది. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్బుక్ పెట్టుబడిగా కేటాయించింది. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్ -
విషాద గాథ: కాపాడినోడి చేతిలోనే కన్నుమూసింది
Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్బుక్ మీద ఆరోపణల తర్వాత సోషల్ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla). 2019లో తన తోటి గొరిల్లా ఎన్డెజెతో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది. View this post on Instagram A post shared by Virunga National Park (@virunganationalpark) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. This picture of two gorillas 🦍 posing for a selfie is one of the best things I’ve seen this week! 😭😭 pic.twitter.com/ftj2k3s1DF — A̶l̶h̶a̶j̶i̶ 𝔻𝕣𝕦𝕟𝕜𝕒𝕣𝕕 (@The_Nifemi) April 19, 2019 కాంగో విరుంగ నేషనల్ పార్క్లో సెన్వెక్వే సెంటర్లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్ పార్క్లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది. Sharing again, selfie of the century, a ranger and friends at Virunga National Park in DR Congo. On #WorldRangerDay pic.twitter.com/Kp3BCkCHCS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 31, 2020 చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు -
ఐఫోన్ లవర్స్కు శుభవార్త
ఐఫోన్ లవర్స్కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది' అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది. చదవండి : ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్ -
కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఆ వీడియో భయానకం కాబూల్ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనలు పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భీతిల్లిన పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానల్ ప్రసారం చేసింది. ఒకరిద్దరు సాయుధులైన తాలిబన్లు గాల్లోకి బదులుగా ఎదురుగా ఉన్న జనంవైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు 169 మంది అమెరికన్ల ఎయిర్లిఫ్ట్ అమెరికన్లతో పాటుగా, తాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి అండగా ఉన్న అఫ్గాన్లను సురక్షిత దేశాలకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన హామీ ఎందరో అఫ్గాన్లలో ఆశలు కల్పించింది. తాలిబన్ల నుంచి తమకు రక్షణ దొరుకుతుందన్న ఆనందంలో వారు కట్టు బట్టలతో విమానాశ్రయానికి తరలివస్తున్నారు. తాత్కాలికంగానైనా అఫ్గాన్లకు తాము ఆతిథ్యమిస్తామంటూ ఇప్పటివరకు 13 దేశాలు ముందుకు వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బారన్ హోటల్లో చిక్కుకుపోయిన 169 మంది అమెరికన్లని హెలికాప్టర్ల ద్వారా లిఫ్ట్ చేసి మరీ తీసుకువెళ్లారు. విమానాశ్రయం దగ్గరకు రావొద్దు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్ విమానాశ్రయం చుట్టుపక్కలకి కూడా రావొద్దని అఫ్గాన్లో అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరుల్ని హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఎవరి ప్రాణాలకు భద్రత లేదని దౌత్య కార్యాలయం తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అమెరికన్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ నెల 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. Now - Another morning, another gunshot with struggle for escape. Kabul international airport. pic.twitter.com/eScU7ERM5V — Muslim Shirzad (@MuslimShirzad) August 19, 2021 -
రద్దు చేసిన సెక్షన్ కింద కేసులా?
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ఇంకా కేసులు నమోదు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సెక్షన్ను రద్దు చేస్తూ 2015 మార్చి 24న శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఉద్ఘాటించింది. 66ఏ సెక్షన్ కింద కేసులు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ), హైకోర్టులకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా సమాధానం ఇవ్వాలంది. పీయూసీఎల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. పోలీసు శాఖ రాష్ట్రాల పరిధిలోని అంశమైనా ఈ కేసులో రాష్ట్రాలు, యూటీలనూ ప్రతివాదులుగా చేర్చడమే సరైన మార్గమని అభిప్రాయపడింది. సెక్షన్ 66ఏ సమగ్రమైన ఉత్తర్వు జారీ చేస్తామని, తద్వారా ఈ వ్యవహారంపై వివాదానికి తెరపడుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ సందర్భంగా పీయూసీఎల్ తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసు, న్యాయ శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయని సంజయ్ తెలిపారు. సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. పీయూసీఎల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. సెక్షన్ 66ఏను సవాలు చేస్తూ తొలుత మహారాష్ట్రకు చెందిన న్యాయ విద్యార్థి శ్రేయా సింఘాల్ 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సెక్షన్ను 2015లో కోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ రాష్ట్రాల్లో ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతున్నాయి. అభ్యంతరకరమైన, సమాజంలో అశాంతిని సృష్టించే అవకాశం ఉన్న సందేశాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు సెక్షన్ 66ఏను చేర్చారు. ఇలాంటి సందేశాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు రుజువైతే దోషికి మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. సెక్షన్ 66ఏ కింద దేశవ్యాప్తంగా పోలీసులు వేలాది కేసులు నమోదు చేశారు. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఎలుకలను నంజుకుతిన్న రెండు తలల పాము
పాములు ఏ రకం అయినా కావొచ్చు. ఏ జాతికి చెందినదైనా ఉండొచ్చు. దానిపై మనుషులకు ఉండేది ఒకే ఫీలింగ్. అదే భయం. పామంటే ఉండే వణుకు మనల్ని ఎన్నటికీ వీడదు. పాముల్లో రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా రెండు తలల పాముకు చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలీయరాలేదు కానీ..రెండు తలలు కలిగిన ఓ పాము రెండు ఎలుక పిల్లలను పట్టుకొని ఒక్కో నోటితో ఒక్కో దాన్ని ఎంచక్కా లాగించేసింది. దీనికి సంబంధించిన వీడియోను జంతువుల సాహసం కోసం ప్రపంచాన్ని పర్యటిస్తున్న వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో రెండు తలలున్న బెన్ అండ్ జెర్రీ అనే పాము మాటువేసి ఎలుకను పట్టుకొని అమాంతం మింగేసి ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘రెండు తలల పాము కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందెన్నడూ రెండు తలల పామును నేను చూసిందే లేదు’ అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.! View this post on Instagram A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv) -
ఇక అక్కడ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’!
కాన్బెరా: తమ మాధ్యమాలలో కనిపించే వార్తలకు, వార్తాకథనాలకు సంబంధించి ఆయా ఆస్ట్రేలియన్ వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా కొత్త చట్టం తీసుకువస్తోంది. సంబంధిత బిల్లుపై వచ్చేవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ జరగనుంది. డిసెంబర్ నెలలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఈ బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి, ముసాయిదా బిల్లులో ఎలాంటి మార్పులు అవసరం లేదని శుక్రవారం నివేదిక ఇచ్చింది. ఈ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’ ఆచరణ సాధ్యం కాదన్న గూగుల్, ఫేస్బుక్ల వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తమ ప్లాట్ఫామ్స్పై కనిపించే వార్తలకు సంబంధిత ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది. తమ యూజర్లు ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తలను షేర్ చేసుకోకుండా నిషేధిస్తామని ఫేస్బుక్ కూడా పేర్కొంది. -
రక్తపు వరద : యుగాంతం? వైరల్
జకార్తా : ఇండోనేషియాలో రక్తపు రంగులో వరద అక్కడి జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ‘నెత్తుటి వర్షం..యుగాంతం’ అంటూ సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంది. ఈ వరద బీభత్సానికి సంబంధించి వేలాది ఫోటోలు, వీడియోలు ట్విటర్లో హల్చల్ చేశాయి. ఇండోనేషియా సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఇండోనేషియా గ్రామమైన జెంగ్గోట్లో భారీవర్షాలతో శనివారం వరదలు సంభవించాయి. దీంతో సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆందోళనకు దారి తీసింది. ఈ గందరగోళ వాతావరణం నేపథ్యంలో పెకలొంగన్ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ఎర్రరంగు వరద బాతిక్ డై కారణంగా వచ్చిందని, ఆందోళన అవసరం లేదని విపత్తు నివారణ అధికారి డిమాస్ అర్గా యుధా ప్రకటించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇండోనేషియాలోని పెకలోంగన్ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే రంగులకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బాతిక్ ఫాబ్రిక్ అనే పెయింట్ తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ నదులు వేర్వేరు రంగులను సంతరించుకోవడం మామూలే. గత నెలలో వరద సమయంలో నగరానికి ఉత్తరాన ఉన్న మరో గ్రామాన్ని ప్రకాశవంతమైన ఆకుపచ్చ నీరు చుట్టిముట్టింది. pic.twitter.com/TjtpJIjUKN — Raja Purwa (@Raj4Purwa) February 6, 2021 -
ఫేక్ న్యూస్ : సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆయా సంస్థలనే బాధ్యులుగా చేయాలన్న విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, సంబంధిత వర్గాలకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ను, మీడియా, చానెళ్లు, నెట్వర్క్లపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా మీడియా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలంటూ గతంలో దాఖలైన పిల్తో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. మీడియా, చానెళ్లు, నెట్వర్క్లపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్ను జనవరి 25వ తేదీన విచారించిన ధర్మాసనం.. కేంద్రంతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేసింది. -
కొడుకుతో మహేష్.. మనవడితో బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బీబీ3 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్యకు జోడిగా సయేషా సైగల్ నటించనున్నారు. ఓ వైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య సమయం చిక్కినప్పుడల్లా తన కుటుంబంతో గడుపుతుంటారు. ఈ క్రమంలో బాలయ్య తన ముద్దుల మనవడు ఆర్యవీర్తో సరదాగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో బాలయ్య తన చిన్న కూతురు తేజస్విని కుమారుడితో ఫోటోకు ఫోజిచ్చారు. చదవండి: బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల Adorable pic of NataSimha #NandamuriBalakrishna with his grandson #Aryaveer pic.twitter.com/GJArAZZsFQ — BARaju (@baraju_SuperHit) November 11, 2020 సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్స్కు వెళ్లాడు. ఎయిర్ పోర్ట్ దగ్గరి నుంచి టూర్కు చెందిన ప్రతి ఫోటోను మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం సూపర్స్టార్ తన కొడుకు గౌతమ్తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇప్పుడు అతన్ని హగ్ చేసుకోవడం చాలా కష్టం.. కానీ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం, కారణం కూడా అవసరం లేదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ అభిమానులు ఆకర్షిస్తోంది. చదవండి: విహార యాత్రకు మహేష్ బాబు ఫ్యామిలీ It's a lot more difficult to hug him now ❤️❤️❤️ Never needed a reason or a perfect time. 🤗🤗#TravelDiaries #ItsActionsThatMatter pic.twitter.com/g6JrYfih4d — Mahesh Babu (@urstrulyMahesh) November 11, 2020 చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత అక్కినేని. ప్రస్తుతం సినిమలు తగ్గించిన సామ్ పలు బిజినెస్లతో తన జోరును కొనసాగిస్తున్నారు. సినిమాలు, బిజినెస్, ఫిట్నెస్.. ఇలా అన్నింటిలోనూ చాలా కేరింగ్గా ఉంటున్నారు. తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫిట్నెస్ వీడియోను చూస్తే మీరే వారెవ్వా అంటారు. ఇంటి ముందు గ్రాస్లో ట్రైనర్ సమక్షంలోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సామ్ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. చదవండి: బిగ్బాస్: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా View this post on Instagram May all beings everywhere be happy and free ,and may the thoughts ,words , and actions of my own life contribute in some way to that happiness and to that freedom for all. #day2ofplantbasedtransformation with @krishna__vikas Breaking the myth that one cannot enhance their performance, build lean muscle etc on a plant based diet... Let’s do this 💚 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Nov 9, 2020 at 8:24pm PST నవంబర్ 10న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో క్రిష్కు బర్త్డే విషెస్ తెలిపారు నటుడు పవన్ కల్యాణ్. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్లో పవన్ కల్యాణ్ క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. కాగా క్రిష్. పవన్ కళ్యాణ్తో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోహినూర్ నేపథ్యంలో సాగే చారిత్రాత్మక కథ అయిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ను తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి చేశారు. హీరో నాగచైతన్య విసిరిన ఈ ఛాలెంజ్ను స్వీకరించిన రకుల్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం తమ అభిమానులు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేశారు. Late but finally accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge Thank you @chay_akkineni for nominating me .so I have Planted 3 saplings. Further I want to nominate not actors but all my fans to plant 3 trees each and tag me to continue the chain. pic.twitter.com/QFdsRKWcji — Rakul Singh (@Rakulpreet) November 11, 2020 -
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
‘ప్రముఖ గాయని ఎస్. జానకి లేరు’ అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఈ వార్తను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ప్రియమైన మిత్రులకు... నేను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంని. సోమవారం ఉదయం నుంచి జానకి అమ్మ క్షేమసమాచారాలు అడుగుతూ నాకు దాదాపు 20 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరో సోషల్ మీడియాలో ‘ఆమె ఇక లేరు’ అని ప్రచారం చేశారు. ఏంటీ నాన్సెన్స్. నేను ఆమెతో మాట్లాడాను. చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కళాకారులను బాగా అభిమానించేవారికి ఇలాంటి వార్తలు గుండెపోటు తెప్పిస్తాయి. దయచేసి సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలకు వాడండి. ఇలాంటి నెగటివ్ విషయాలకు కాదు. హాస్యం కోసం సోషల్ మీడియాని వాడొద్దు. ‘లాంగ్ లివ్ జానకి అమ్మా. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సేఫ్గా ఉన్నారు’. జెంటిల్మెన్ ఎందుకిలాంటి వార్తలు ప్రచారం చేçస్తున్నారు? ఇంతకీ మిమ్మల్ని జెంటిల్మెన్ అనాలా? అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘జానకికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు'
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు. చదవండి: గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్ ఆమె బుధవారం రోజున మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్నా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశాము. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుంది. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని సీఐడీ ఎస్పీ సరిత హెచ్చరించారు. చదవండి: బెంగళూరుని బెంబేలెత్తించిన భారీ శబ్ధాలు -
చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్
డిస్పూర్: జనాదరణ పొందిన అస్సామీ ప్రేమ పాట ‘ఈ హాహీ బాల్ లాగే’ పాటను ఓ చిన్నారిపాడుతుంటే, మరో బాలుడు డ్రమ్స్ వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలుడు సొంతంగా తయారు చేసుకున్న డ్రమ్సెట్తో వాయిస్తుంటే, బాలిక తన మృధువైన స్వరంతో పాటను పాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రూపాలి ప్రణమిత ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అమ్మాయి పాటకు తగ్గా, సరైన బీట్స్తో బాలుడు మ్యూజిక్తో అదరగొట్టాడు. ఇక బాలుడు డ్రమ్సెట్ కోసం వినియోగించిన అట్టపెట్టెలు, అరటి చెట్టు కొమ్మలు, మెటల్ ట్రేలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన సమయం నుంచి నాలుగున్నర లక్షల మంది వీక్షించగా, 1800లకు పైగా కామెంట్లు రావడం విశేషం. పిల్లల సంగీత కచేరీ అద్భుతమని వారిద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?
కార్పొరేట్ దిగ్గజం ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఏదైనా వినూత్న విషయం కంట పడితే చాలు.. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈయన పెట్టే ప్రతి పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. కరోనాను అధిగమించేందుకు ఇటీవల పలు సూచనలు చేసిన ఆయన తాజాగా వాట్సాప్ వండర్ బాక్స్ పేరుతో మరో పోస్ట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్డౌన్ అవులవుతున్న నేపథ్యంలో ఉద్యోగులంతా ఇంటి నుంచి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారి వేషాధారణకు సంబంధించిన ఓ ఫన్నీ మీమ్ను ట్విటర్లో షేర్ చేశారు. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్) ‘ఇది నా వాట్సాప్ వండర్ బాక్స్ నుంచి వచ్చింది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాలలో ఇంటి నుంచి ఆఫీస్ పనులు చేసేపటప్పుడు వీడియో కాల్లో నేను చొక్కా, లుంగీని ధరించేవాడిని. ఎందుకంటే ఆ సమయంలో నిలబడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత కూడా లుంగీ కట్టుకోవాలని నా సహచరులు నాకు సూచిస్తారేమో..’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవ్వడంతో నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. అంతపెద్ద కార్పొరేట్ దిగ్గజం లుంగీ ధరించడంపై షాక్కు గురవుతున్నారు. ‘ఓ మై గాడ్.. మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా’ అంటూ ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ('శ్రీనివాస గౌడకు గోల్డ్ మెడల్ ఇవ్వండి') On a lighter note, this is from my #whatsappwonderbox. And I have a confession to make:On some Video Calls from home, I DID wear a lungi under my shirt. Didn’t have to stand up at any point during the meetings, but I suspect my colleagues may ask me to do so after this tweet! pic.twitter.com/e1IElefNaa — anand mahindra (@anandmahindra) April 5, 2020 -
టీడీపీ కుట్ర; ఇదీ.. అసలు కథ
ఈ క్లిప్పింగ్లో రాయి పట్టుకుని వెళుతున్న యువకుడి పేరు ఎన్ సద్దాం. పుంగనూరుకు చెందిన ఈ వ్యక్తి సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) తరఫున 21, 22 వార్డులకు పోటీ చేస్తున్న వారికి మద్దతుగా నామినేషన్ సెంటర్కు వచ్చారు. నామినేషన్ సెంటర్లో అప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉండడం, వారు వచ్చిన తర్వాత వెళ్లాలని అధికారులు సూచించడంతో సద్దాం అడ్డుతగిలారు. వారు వచ్చేంత వరకూ మేమెందుకు వేచి ఉండాలంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసేందుకు రాయితో వెళుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే ఎల్లో మీడియా అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లు చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నా అడ్డుకునే వారు లేరని ఫోకస్ చేసింది. ఈ క్లిప్పింగ్లో ఉన్న వ్యక్తి పేరు కె.పద్మనాభం అలియాస్ పప్పురాయల్. టీడీపీ వర్గీయుడిగా, రౌడీషీటర్గా తిరుపతి నగరవాసులకు సుపరిచితుడు. సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉండగా అమెకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెల్లడిస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు, బ్యానర్లు సైతం వేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను దూషించారని ‘బరితెగింపు’ పేరుతో టీడీపీ నేత మన్నెం శ్రీనివాసులపై వైఎస్సార్సీపీ నేత దాడి చేసినట్లు ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. వాస్తవానికి పప్పురాయల్, మన్నెం శ్రీనివాసులు ఇరువురు చిన్ననాటి స్నేహితులు. ఇప్పటికీ కలిసిమెలిసే ఉన్నారు. ఫ్యామిలీ ఫొటోలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేను దూషించారంటూ, మన్నెం శ్రీనివాసులపై దాడి చేశారంటూ వండివార్చింది. పప్పుయాదవ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఈ రెండు క్లిప్పింగ్స్ పరిశీలిస్తే ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ, ఎల్లో మీడియా ఎలా కుట్ర చేసిందో ఇట్టే అర్థమవుతుంది. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వార్తలను తమకు అనుకూలంగా వండి వార్చాయి. వాటినే ఎన్నికల అధికారి పరిగణనలోకి స్వీకరించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్ష చర్యలు చేపట్టారని పలువురు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టర్ నారాయణగుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డితో పాటు పలువురు అధికారుల బదిలీల నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. రోజుకొక దుష్ప్రచారం ‘తస్కరించు.. తిరస్కరించు.. బహిష్కరించు.. మూడంచెల కుట్ర’ ప్రజాస్వామ్యానికి పునాది రాయి.. ఇలా రోజుకొక వార్త వండివార్చడం. వాటినే సుమోటోగా రాష్ట్ర ఎన్నికల అధికారి స్వీకరించడం వెనుక కుట్రకోణం బహిర్గతమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వల్ప వివాదాలు సర్వసాధారణం. ఎన్నికలు వాయిదా పడాలనే టీడీపీ సంకల్పానికి ఎల్లో మీడియా అండగా నిలిచింది. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. జిల్లావ్యాప్తంగా దౌర్జన్యకర ఘటనలు తీవ్రంగా ఉన్నట్లు ఫోకస్ చేసింది. (ఎన్నికల వాయిదా; తెర వెనుక ఏం జరిగింది?!) ప్రజాభిమానం లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. అందుకు కారణం గడిచిన ఐదేళ్లలో నియంతృత్వం రాజ్యమేలడం, ఓ వర్గం వారినే సంక్షేమ పథకాలకు అర్హులుగా ఎంపిక చేయడం, రాష్ట్రాభివృద్ధి లేకపోగా టీడీపీ కార్యకర్తల ఉన్నతికి మాత్రమే పనిచేయడం లాంటవని పలువురు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం హోదాలో వైఎస్.జగన్మోహన్రెడ్డి 6నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలతో నిమిత్తం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ వర్తింపజేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 59 శాతం సీట్లు కేటాయించాలని రిజర్వేషన్ రూపొందించారు. 50 శాతానికి మించి సీట్లు ఇవ్వరాదంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్రెడ్డితో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టులో కేసు వేయించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్సీపీ టికెట్ల కేటాయింపులో 34 శాతం బీసీలకు దక్కేలా చర్యలు చేపట్టింది. స్క్రీన్ప్లే, డైరెక్షన్ టీడీపీయే కరోనా వైరస్ స్వైన్ప్లూ, యబోలా, సార్స్ వైరస్ కంటే ప్రమాదకరమైంది కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనాలో 2శాతం కూడా మరణాలు లేవని, యబోలా వైరస్ వల్ల 30శాతం మరణాలు తలెత్తాయని వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకారిగా ప్రచారం చేస్తూ దాని ఆధారంగానే ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తెలుగుదేశం పార్టీయేనని పలువురు వెల్లడిస్తున్నారు. మార్చిలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి దాదాపు రూ.5వేల కోట్లు లభించే అవకాశం ఉంది. ఆ నిధులు రాకుండా ఉండాలనే కుట్రను తెలుగుదేశం పన్నిందని పలువురు మేధావులు భావిస్తున్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాలు వాయిదా వేయడం తదితర నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. (చదవండి: ఆరువారాల కుట్ర!) -
నయా హెయిర్ స్టైల్.. 40 మిలియన్ల వ్యూస్
కురులపైనా శ్రద్ధ కేవలం అమ్మాయిలకే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి అబ్బాయిలు కూడా జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారట. ఉన్న కొంచెం జుట్టు అయినా రకరకాలుగా సోకులు పడుతుంటారు. జుట్టును అటు వేసి.. ఇటు వేసి.. సగం కత్తిరించి వివిధ స్టైల్లో తిప్పుతుంటారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంతమంది ఇంకేదో కొత్తదనం కావాలి అని అనుకుంటారు. అలా అనుకునే వారి కోసమే ఓ హెయిర్ స్టైల్ నిపుణుడు వెరైటీగా ట్రై చేశాడు. తన దగ్గరికి వచ్చన ఓ కస్టమర్కు జుట్టును స్టైల్ చేయడానికి మంటను ఉపయోగించాడు. జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్గా క్రాఫ్ చేశాడు. అయితే కస్టమర్కు మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను మొదటగా టిక్టాక్లో నవంబర్లో ప్రకాశ్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఖచ్చితంగా ఇండియాలోనే జరిగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనిని టిక్టాక్లో 30 మిలియన్ల మంది వీక్షించగా.. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ షేర్ చేస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది చూశారు. కాగా దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాము కూడా ఒక్కసారైనా ఇలాంటి హెయిర్ స్టైయిల్ చేయించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇంట్లో ఇలాంటివి చేయకండంటూ కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. This is an origin story for a hairstyle like mine.pic.twitter.com/gBKrhr1AQH — 𝙹𝚘𝚜𝚑 𝙶𝚛𝚞𝚋𝚋𝚜 (@JoshuaGrubbsPhD) January 27, 2020 -
భయానకం: అలలు అతడిని లాక్కెళ్లాయి!
బలమైన అలలు ఇరవై ఏళ్ల యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలో జరిగింది. సముద్ర తీరాన బండపై నిలుచున్న వ్యక్తిపైకి ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన డిసెంబర్ 20న కాలిఫోర్నియా సముద్ర తీరాన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘యుఎస్ శాంటా క్రజ్ ఫేస్బుక్’ పేజీ నిర్వాహకులు షేర్ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఇక తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
ఆ బాలుడి సంకల్పాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
-
ఆ బాలుడి సంకల్పానికి ఫిదా అవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: మనో నిబ్బరం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు ఈ దివ్యాంగ బాలుడి ఆటే నిదర్శనం. అతని ధైర్యం ముందు వైకల్యం ఓటమితో తల వంచింది. సంకల్ప బలంతో.. మనో నిబ్బరంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. తన మిత్రులతో కలసి వారితో సమానంగా క్రికెట్ ఆడుతూ.. కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల మధ్య అతను చేతులతో చేసే రన్నింగ్ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! ‘అతడి ఆట చూసి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్ను ఇష్టపడేవారు.. ఇష్టం లేనివారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది’ అంటూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. వీడియోని చూసిన నెటిజన్లు అతడి ఆటకు హాట్సాఫ్ చెప్తున్నారు. కాళ్లను నేలపై ఈడ్చుకుంటూ మరో చేతితో బ్యాట్ పట్టుకొని పరిగెత్తడం చూస్తే నిరాశలో ఉన్నవారికి, వైకల్యంతో బాధపడతున్న ఎంతో మందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆ పోస్ట్ నాది కాదు: టీనా దాబీ
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న నేపథ్యంలో.. కొంతమంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేసుబుక్ ఖాతాలు సృష్టించి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మంగళవారం ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. 'ఐఏఎస్ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్మేట్ అయిన కశ్మిరీ ఐఏఎస్ అథర్ ఖాన్ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్లోని భిల్వారాలో పోస్టింగ్ లభించింది. కాగా టీనా భర్త అథర్ సివిల్ సర్వీసెస్లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: సివిల్స్ టాపర్ టీనా దాబి -
కండోమ్ వాడండి.. రేప్లను అంగీకరించండి!
దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ సినీ నిర్మాత మహిళలకు ఇచ్చిన కీచక సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేనియల్ శ్రావణ్ అనే చిత్ర నిర్మాత ‘మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్ను తీసుకెళ్లాలి. పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి’ అంటూ తన ఫేస్బుక్ అకౌంట్లో కీచక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు. అతని పూర్తి పోస్టు ఇది.. ‘18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్లను ఉపయోగించాలి. ఇదోక సాధారణ విషయం. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలి. సమాజం, ప్రభుత్వం నిర్భయ చట్టం, పెప్పర్ స్ప్రేలతో రేపిస్టులను భయపెడుతున్నాయి. పురుషులకు కేవలం తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒక చెడు ఆలోచన రేకెత్తి ఇలాంటి దారుణానికి దారితీస్తుంది .అంతేగానీ బాధితులను చంపాలనే ఆలోచన వారికి ఉండదు.అందుకే మహిళలు అత్యాచారాన్నిఅంగీకరించాలి‘ అని డేనియల్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. -
బిల్గేట్స్ టిప్ ఫొటో ఫేక్
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని తేలింది. అపర కుబేరుడు బిల్గేట్స్.. రెస్టారెంట్ వెయిటర్కు టిప్ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్కట్టర్ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్బుక్లో చాలామంది ఫార్వర్డ్ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్గేట్స్ తండ్రి వుడ్కట్టర్ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్గేట్స్ బ్లాగ్ 'గేట్స్ నోట్స్' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్. గేట్స్ II.. సీటెల్ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్ స్కూల్ టీచర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్గేట్స్ ఒక రెస్టారెంట్కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్కు టిప్ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్ను బిల్.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్గేట్స్ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్ యువర్ బెస్ట్ టీచర్ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది. -
రణుమొండాల్ 2.O వచ్చేసింది!
ముంబై: సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్ ‘ఏక్ ప్యార్కా నగ్మా హై’ అనే ఎవర్గ్రీన్ పాటతో ఒక్కసారిగా రాత్రికిరాత్రే స్టార్ సింగర్గా మారారు. రైల్వే స్టేషల్లో లతా మంగేష్కర్ పాడిన పాటలను రణు పాడుకుంటు ఉండగా ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. అది చూసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు ‘హిమేశ్ రెష్మియా’ రణుకు తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రణు మొండాల్ ఎన్నో పాటలకు కాంట్రాక్టులను దక్కించుకొవడంతో పాటు పలు షోలకు అతిథిగా కూడా హాజరయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. ఆ ఏడుగురి మాట అటుంచింతే.. ప్రస్తుతానికి రణు మొండాల్ను పోలిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గౌహతికి చెందిన ఓ మహిళా.. రణు పాడిన 'తేరి మేరి కహానీ' అనే సూపర్హిట్ పాటను ఆమె పాడడంతో వీడియో వైరల్గా మారింది. ఆ మహిళా అచ్చం రణుమొండాల్ను పోలి ఉండటంతో పాటు హావభావాలు కూడా ఒకేలా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఫన్నీగా రణు మొండాల్ 2 అని అభివర్ణిస్తున్నారు. కాని కొందరు మాత్రం డూప్లికేట్ సింగర్ అని, ఈమెను కూడా స్టార్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram #RanuMondal 2.0 in (Maligaon)Guwahati. #Special Thanks to my friend Tanmoy Dey for shooting and Sharing this vdo. Vdo Rights :- Tanmoy dey #ranumondal #himeshreshammiya A post shared by Dipankar Baishya (@chiragdipofficial) on Nov 22, 2019 at 6:23am PST ఇటీవల రణు ముఖానికి మితిమీరిన మేకప్ వేసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో.. రణును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు నకిలీ ఫోటో సృష్టించారని తెలియడంతో నెటిజన్లు నాలిక కరచుకున్నారు. -
నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే
'నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా' అంటూ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ, హైదారాబాదీ సానియా మీర్జా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన కుమారుడు ఇజ్హాన్ మొదటి పుట్టినరోజు కావడంతో.. సానియా ఇన్స్టాగ్రామ్ను వేదికగా చేసుకుని సంవత్సరం క్రితం నాటి తన కుమారుని ఫోటోను జతచేశారు. View this post on Instagram Exactly one year since you came into this world and became our world .. you smiled the first day you were born and continue to spread smiles everywhere you go .. my truest,purest most amazing boy .. I LOVE YOU and I promise to be by your side until my last breath .. Happy Birthday my little angel 👼🏽 I pray Allah gives you everything you work towards and desire and continue to grow into the most loving and gentle boy that you already are .. InshaAllah .. Thank you for choosing us my little Izhaan ❤️ #HappybirthdayIzhaan A post shared by Sania Mirza (@mirzasaniar) on Oct 29, 2019 at 11:25pm PDT 'నువ్వు ఈ ప్రపంచానికి వచ్చి, నా ప్రపంచంగా మారి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. నీవు పుట్టినప్పుడు ఎలా చిరునవ్వు చిందించావో.. అలానే నువ్వు వెళ్లిన ప్రతిచోటా నవ్వులు పంచుతావని కోరుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటానని నీకు వాగ్దానం ఇస్తున్నాను. నా చిన్ని తండ్రి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు కోరుకునే, చేసే ప్రతి పనిలో నీకు అల్లాహ్ దయ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. మమ్మల్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇజాన్' అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. సానియా చేసిన పోస్టుకు స్పందించిన బాలీవుడ్ తారలు హుమా ఖురేషీ, నేహా ధూపియా ఇజ్హాన్కు బర్త్డే విషెస్ చెప్పారు. -
డేటా... దూకుడు!
ఉదయాన్నే లేస్తూ ఓ సెల్పీ.. వెంటనే దానిని ఫేస్బుక్, వాట్సాప్ల్లో పోస్టింగ్.. కొత్త సాంగ్ వచ్చిందా.. కొత్త స్టెప్పులు నేర్చుకుని వెంటనే టిక్టాక్లో డాన్సింగ్.. ఈసారి నా డబ్స్మాష్ వీడియో యూట్యూబ్లో ఎలాగైనా సరే వైరల్ అవ్వాల్సిందే.. ఇవీ భారతీయుల ఆలోచనలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలో డేటా వినియోగిస్తున్న వారిలో మనమే టాప్లో ఉండేంతలా. ఇదే విషయాన్ని మొబైల్ యాప్స్ల రేటింగ్లను నిర్ధారించే ‘సెన్సర్ టవర్ డేటా’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద మార్కెట్ మన దేశమే. అందుకు సోషల్ మీడియా ఏమీ తీసి పోదు. అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్ఫోన్ ధర లు, ఇంటర్నెట్ డేటా ప్యాకేజీల వల్ల సోషల్ మీడియా వాడకంలో పట్టణాలు, పల్లెల్లోనూ అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ఎంత లా అంటే ప్రపంచ సోషల్మీడియా వాడకంలో మనదే 40% భాగస్వామ్యం ఉండేంతలా. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త యాప్లు వచ్చిన ఇండియాలో వాటికి కొత్త వినియోగదారులు పుట్టుకొస్తూనే ఉన్నారు. టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్లకు సంబంధించి ఇండియన్ల వినియోగం అసాధా రణ స్థాయిలో ఉంది. అమెరికా, యూరప్లను తలదన్ని మనదేశం అగ్రస్థానం దక్కించుకుంది. టిక్టాక్.. కొంతకాలంగా టిక్టాక్ సృష్టిస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. యువత, టీనేజీ, పిల్లలు, వృద్ధులు అంతా దీన్ని తెగవాడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ యాప్ను అధికం(44 శాతం)గా మనమే డౌన్లోడ్ చేసుకున్నాం. ఒక్క సెప్టెంబర్లోనే 6 కోట్ల మంది ఈ యాప్ను కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్ క్రేజ్ ఎంతగా ఉందో. మార్చిలో టిక్టాక్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది డౌన్లోడ్ చేయగా అందులో 8 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. 15 సెకన్లకు ఓ కొత్త వీడియో ఇందులో అప్లోడ్ అవుతోంది. ప్రధాన సోషల్ మీడియా యాప్లైన ఫేస్బుక్, వాట్సాప్లకు ఇది తీవ్ర పోటీనిస్తోంది. వినియోగంలో భారత్ టాప్ప్లేస్లో ఉండగా.. అమెరికా, టర్కీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరికొన్ని విశేషాలు ►టిక్టాక్లో 41 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల వయసులోపు వారే. ►యూజర్లలో 56 శాతం పురుషులు,44 శాతం మహిళలు. ►ప్రతీరోజు సగటు వినియోగదారుడు గడుపుతున్న సమయం 52 నిమిషాలు. ►90 శాతం వినియోగదారులు రోజుకు ఒక్కసారైనా యాప్ ఓపెన్ చేస్తున్నారు. ►ఇంతవరకూ టిక్టాక్ చూసిన వారి సంఖ్య సరాసరిగా 100 కోట్లు. ఫేస్బుక్.. ఫేస్బుక్ యూజర్లు ఇండియా 24.1 కోట్లు అమెరికా 24 కోట్లు ఇండోనేషియా 13 కోట్ల ఫేస్బుక్ విషయానికి వస్తే.. గత నెలలో ఇండియన్లు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ల్లో ఇది రెండోస్థానంలో నిలిచింది. ఈ సెప్టెంబర్లో ఇండియాలో కొత్తగా 5 కోట్ల మంది ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్న 100 శాతంలో భారత్ భాగస్వామ్యం 23 శాతంగా నమోదైంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా భారతీయులు అధికంగా వినియోగిస్తున్న యాప్ల్లో ఫేస్బుక్ కూడా ఒకటి. ఎన్ని యాప్లొచ్చినా దీనికి ఉండే ఆదరణ తగ్గకపోవడం గమనార్హం. ఫేస్బుక్కి అగ్రరాజ్యం అమెరికాలో 24 కోట్ల మంది యూజర్లు ఉండగా.. భారత్లో మాత్రం 24.1 కోట్ల మంది ఉన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఫేస్బుక్ యూజర్ల పెరుగుదల భారత్లో 12 శాతంగా నమోదైంది. యూట్యూబ్ యూజర్లు అమెరికా50 కోట్లు ఇండియా 24 కోట్లు జపాన్12 కోట్లు యూట్యూబ్కు సైతం.. ఇండియాలో ఆదరణ పెరుగు తున్న వాటిలో యూట్యూబ్ కూడా ముందువరసలో ఉంది. మన దేశంలో 26.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 1,200 చానళ్లకు 10 లక్షలకుపైగా సబ్స్క్రై బర్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 2 చానళ్లకు మాత్రమే 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేది. కాలక్రమంలో ఈ చానళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిలో 95 శాతం ప్రాంతీయ భాషలకు చెందినవి కావడం గమనార్హం. నీల్సన్ సర్వే ప్రకారం.. అధికంగా ఆదరణ ఉన్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్, ఇతర విద్యా సంబంధమైన కంటెంట్ ఉంది. -
టిక్టాక్తో యువతకు ఐసిస్ వల
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ (ఐసిస్) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. యువత విశేషంగా వాడుతున్న టిక్టాక్ ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్న టిక్టాక్ను వేదికగా చేసుకుని 16 - 24 సంవత్సరాల వయసున్న యువతకు ఐసిస్ వల వేస్తున్నట్టు వెల్లడైంది. చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసిస్ సంబంధిత అకౌంట్ల నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేసినట్టు గుర్తించిన టిక్టాక్ ఈ ఖాతాలను తొలగించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. సిరియా నుంచి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐసిస్ భావిస్తోంది. ఇందులో భాగంగా యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసేందుకు టిక్టాక్ను వేదికగా వాడుకుని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న రెండు డజన్ల ఖాతాలను గుర్తించి శాశ్వతంగా తొలగించినట్టు టిక్టాక్ ప్రకటించింది. ఐసిస్ సాగిస్తున్న ప్రచారం తమ కంపెనీ నియమాలకు విరుద్ధమని, ఉగ్రవాద వీడియోలను తమ మాధ్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. అయితే అత్యధిక యూజర్లను కలిగియున్న భారత్లోనూ టిక్టాక్ పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైబర్ వేధింపులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిక్టాక్ను కేంద్ర ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించడంతో పాటు కొన్ని వారాలపాటు నిషేధించింది. టిక్టాక్ మాధ్యమంగా #ఆరెస్సెస్, #రామమందిరం, #హిందూ, #బీజేపీ వంటి హాష్ ట్యాగ్లను ఉపయోగించి కొందరు హిందు అతివాదులు విద్వేషపూరిత వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక్క భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ సవాళ్లు ఎదుర్కొంటొంది. ఇరవైకి పైగా దేశాలలో టిక్టాక్ వినియోగదారులు ఉన్నారు. -
రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్
ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్(36) ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్బాయ్ కెన్నెత్ పెర్రీని రహస్య వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఉన్న పేరును 'మిసెస్ పెట్టీ'గా మార్చారు. అంతేకాక సోమవారం ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో.. 'ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19' అనే క్యాప్షన్ను ఇచ్చారు. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేశారు. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీను జత చేశారు. ఇక వీడియోలో మిస్టర్ అండ్ మిసెస్ ఉన్న మగ్లతో పాటు వధూవరులనే అర్థానిచ్చే రెండు బేస్బాల్ క్యాప్లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆమె ఫ్యాన్స్.. ఆ వెంటనే తేరుకొని నిక్కీ మినాజ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మ్యారేజ్ లైసెన్స్ గడువు ముగియనుండడంతో.. ప్రియుడిని ఉన్నపళంగా వివాహం చేసుకొందని.. మళ్లీ రెండోసారి గ్రాండ్గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్మీడియాలో గుప్పుమంటున్నాయి. నిక్కీ తాను పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తను.. జూన్ 21న ఒక రేడియోలో అధికారింగా ప్రకటించారు. అందులో ఆమె.. తన బాయ్ఫ్రెండ్ మ్యారెజ్ లైసెన్స్ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నాని స్పష్టం చేశారు. గతేడాది నుంచి పెట్టీతో డేట్ చేస్తున్న నిక్కీ.. పెట్టీతో ప్రేమలో ఉన్నట్టు తొలిసారిగా గత డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్లో ధృవీకరించారు. లైంగిక ఆరోపణలతో దోషిగా తేలిన కెన్నెత్ పెట్టీను.. నిక్కీ ఏరికోరి వివాహం చేసుకోవడం గమనార్హం. View this post on Instagram 👰🏽🤵🏽😢🙏🏽🎀 Onika Tanya Maraj-Petty 10•21•19 A post shared by Barbie (@nickiminaj) on Oct 21, 2019 at 8:22pm PDT -
ఫేక్ వెడ్డింగ్ కార్డ్పై అలియా స్పందన
-
వైరలవుతున్న అలియా, రణ్బీర్ వెడ్డింగ్ కార్డు!
ముంబై: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ జనవరి 22న పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వెడ్డింగ్ కార్డు చక్కర్లు కొడుతోంది. గత కొద్ది కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి అవ్వనున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న అలియాను.. వివాహం, వెడ్డింగ్ కార్డుపై వస్తున్న వార్తలను గురించి అడగ్గా 'ఆమె సిగ్గుపడుతూ.. నేను ఏమి చెప్పాలి? పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదంటూ తల అడ్డంగా ఊపింది.' దీంతో వీరి వివాహం జనవరి 22న జోధ్పూర్లోని ఉమేద్ భవన్ ప్యాలెస్లో జరగనుందని వస్తున్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది. వివాహ ఆహ్వాన పత్రికను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న తప్పులు కొట్టొచిన్నట్లు కనిపిస్తున్నాయి. అలియా భట్ తండ్రి పేరు వాస్తవానికి మహేష్ భట్ అయితే, ఆహ్వాన పత్రికలో మాత్రం ముఖేష్ భట్ అని తప్పుగా ఉంది. అంతేకాక అలియా భట్ పేరుతో పాటు తేదిలో కూడా అక్షర దోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలను అలియా చిరునవ్వుతో కొట్టి పారేయడంతో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ఫేక్ అని తేలింది. -
ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అవసరమా?
వినికిడి లోపం గల ఓ తండ్రి తన కుమార్తెతో సైగలతో సంభాషిస్తున్న వీడియోను అమెరికా మాజీ బాస్కెట్బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ ట్విటర్లో తాజాగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్గా మారింది. వినికిడి లోపం గల ఓ తండ్రి అప్పుడే పుట్టిన తన చిన్నారితో సైగలతో మాట్లాడే మాటాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకు భాష లేకపపోతే ఏంటి? తండ్రి తనపై కురిపిస్తున్న ఆత్మీయ స్పర్శ, ప్రేమ చాలు అనేలా.. ఆ చిన్నారి చూస్తున్న చూపులు నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. This hearing-impaired father expressing love to his newborn daughter in sign-language is the definitely Twitter content I’m here for...💪😍😇😊🔥 pic.twitter.com/CEvINcmRaX — Rex Chapman🏇🏼 (@RexChapman) October 18, 2019 వినికిడి లోపం ఉన్న ఆ తండ్రి అప్పుడే పుట్టిన తన బిడ్డతో సైగలతో మాట్లాడుతుంటే.. ఆ పాపాయి తదేకంగా నువ్వు చెప్పే ప్రతీది తనకు అర్థమవుతోంది అన్నట్లు చూస్తోంది. కుమార్తెపై ఈ మూగ తండ్రి కురిపిస్తున్న ప్రేమను చూసిన ప్రతి ఒక్కరికి నిమిషం పాటు.. నోట మాట రాదంటే నమ్మండి. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఆ తండ్రి సైగలకు అర్థాన్ని వెతికే పనిలో పడ్డారు. సంకేత భాషను అర్థం చేసుకున్న కొద్దిమంది నెటిజన్లు.. ఆ తండ్రి తన చిన్నారితో.. ‘హేయ్ నేను మీ డాడీని. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్లు ఆకుపచ్చ రంగులో అద్భుతంగా ఉన్నాయి. నీ అందమైన చిరునవ్వు బావుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెచ్చని దుప్పటిలో ఉన్న ఓ చిన్నదానా..! నేను నిన్ను ప్రేమిస్తున్నానే..' అంటున్నాడని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'ప్రేమ అన్ని భాషలను మించిపోయింది' అని మరోక నెటిజన్ పేర్కొన్నాడు. -
కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో!
మలయాళ నటుడు దిలీప్, అతని భార్య కావ్య మాధవన్ తమ కూతురు మహలక్ష్మీ తొలి ఫోటోను ఇన్స్టాగ్రామ్లో తాజాగా షేర్ చేశారు. తన కుమార్తె మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు కావడంతో.. ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో మహలక్ష్మీ తన తండ్రి దిలీప్, తల్లి కావ్యతో పాటు అక్క (దిలీప్ మొదటి భార్య కూతురు మీనాక్షి), నానమ్మలతో కనిపిస్తుంది. మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు వేడుకలకు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మలయాళ నటిని అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 2017లో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్కు మహలక్ష్మీ రెండో భార్య కూతురు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్తో 17 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ వైవాహిక జీవితానికి 2015లో ముగింపు పలికాడు. ప్రస్తుతం 51ఏళ్ల దిలీప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా శుభరాత్రి అనే చిత్రంలో కనిపించిన ఈ నటుడు, తాజాగా జాక్ డెనియల్తో తెర మీద కనిపించనున్నాడు. -
ప్రధానికి అమూల్ డూడుల్ శుభాకాంక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పాల ఉత్పత్తులలో అగ్రస్థానంలో ఉన్న అమూల్ సంస్థ కూడా ప్రధాని మోదీకి ట్వీటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. అయితే అందరిలాగే అమూల్ కూడా ఏదో ‘హ్యాపీ బర్థ్ డే మోదీ జీ’ అంటూ ట్వీటర్లో పోస్ట్ చేసుంటారులే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే!. అవునండి మీరే చూడండి మరి.. మోదీ కార్టూన్ బొమ్మల డుడూల్ వీడియోను ప్రత్యేకంగా తయారు చేసి పోస్ట్ చేసింది. ‘గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అంటూ క్యాపన్తో పోస్ట్ చేసి అందరికన్నా భిన్నంగా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి ‘అమూల్ అంటే బ్రాండ్ కాదు.. భారత్ ఎమోషన్’ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియోలో మోదీ మొదటి సారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకం నుంచి ఆయన పర్యటించిన అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు విదేశి పర్యటించిప ఫోటోలను ఈ వీడియోలో చూపించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో వైట్ హౌజ్ బయట సమావేశం అయిన ఫొటోతో పాటు, ఇటీవల చంద్రయాన్-2 విఫలం నేపథ్యంలో ఇస్రో చీఫ్ కె. శివన్ను ఓదారుస్తూ ఆయనను హత్తుకున్న యానిమేటెట్ ఫోటో ఈ వీడియోలో చివరలో కనిపిస్తాయి. #Amul wishes the Hon. PM Shri Narendra Modi @narendramodi a very happy 69th birthday! #happybirthdaynarendramodi pic.twitter.com/E039hOXwlT — Amul.coop (@Amul_Coop) September 16, 2019 -
సిలిండర్తో నటుడి వింత చేష్టలు!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో, కండల వీరుడు విద్యుత్ జమాల్ ఫుల్ సిలిండర్తో ఏకంగా వర్కవుట్లు చేయడం మొదలెట్టాడు. సోషల్ మీడియాలో తరచూ తను చేసే వర్కవుట్ సెషన్ వీడియోలు పోస్ట్ చేసే జమాల్, గురువారం తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో అందరిని హడలెత్తిస్తున్నాడు. అంతేకాక తాను ఫుల్ సిలిండర్తో చేసిన విన్యాసాలను మీరూ ట్రై చేయండి అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. విద్యుత్ జమాల్ నటుడిగా మాత్రమే కాక, మార్షల్ ఆర్టిస్ట్గా, స్టంట్స్మాన్గా బాలీవుడ్లో మంచి పేరుంది. ఆయన నటించిన జంగ్లీ, కమాండో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టినా.. తను చేసిన యాక్షన్ సీన్స్కు గాను ప్రతిష్టాత్మకమైన రెండు జాకీచాన్ అవార్డులు వరించాయి. అయితే జమాల్ తాజాగా 'సాకులు చెప్పడం మాని.. ఇలా ఫుల్ సిలిండర్తో కలరియపట్టు ట్రై చేయండి. మీ బాడీ ఇలాంటి వర్కవుట్లు చేయగలదని మీ మెదడుకు తెలియదు' అని అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Ab yeh karke dekho! For the non-believers, THIS is a FULL cylinder. Ur body is ready to train, ur mind just doesn’t know it. Stop the excuses! #ITrainLikeVidyutJammwal #kalaripayattu #desiworkout pic.twitter.com/8hTZPAHWpU — Vidyut Jammwal (@VidyutJammwal) September 5, 2019 వీడియో చూసిన వారిలో కొంతమంది మెచ్చుకొంటుండగా, మరి కొంతమంది మాత్రం జోక్లతో హోరెత్తిస్తున్నారు. ‘ఇలా చేస్తే మమ్మీ చెప్పుతో కొడుతుంది’ అని ఒకరు ఫన్నీగా అంటే, ‘సిలిండర్ బుక్ చేయడం మర్చిపోయా..! గుర్తు చేసింనందుకు థ్యాంక్స్’ అని మరొకరు, అసలు ఇలాంటి వారి వల్లే మాకు అమ్మాయి దొరకడం లేదని వేరొకరు కిర్రాక్ కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది మాత్రం నీకు ఇలా చేయడం వచ్చా..? అని ఛాలెంజ్ విసురుతున్నారు. Ye to koi bhi kar lega , ye kar ke dikhao👇😆🤣 pic.twitter.com/r2kgPst6AK — Bhrustrated (@AnupamUncl) September 5, 2019 -
కుంబీపాకం.. కోడి రక్తం..
ఆవిడెందుకు అలా మొహం పెట్టింది అని అడక్కండి.. ఎందుకంటే.. బతికున్న బురద చేపని తినమంటే.. మీరైనా అలాగే మొహం పెడతారు... అప్పుడే అయిపోలేదు.. వేడివేడి కోడి రక్తం ఇంకా వెయిటింగ్లో ఉంది.. చైనాలోని గ్వియ్జోలో ఉన్న ఓ సేల్స్ కంపెనీ టార్గెట్స్ పూర్తి చేయని ఉద్యోగులకు విధించిన శిక్ష ఇది.. ఇలా దాదాపు పాతిక మందికి ‘అపరిచితుడు’ సినిమాలోని కుంబీపాకం టైపు శిక్షలను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. అటు అధికారులూ ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.. ఇంతకీ దీనిపై వివరణ ఇచ్చిన కంపెనీ ప్రతినిధి ఏమంటాడో తెలుసా? వీళ్లంతా స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట.. అంతేనా.. భవిష్యత్తులో లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇది ప్రేరణగా ఉంటుందని సెలవిచ్చాడు.. ఇలాంటోడ్ని ఏం చేయాలంటారు?? -
వైరల్ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ.. వస్తోన్న ఆమె తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఓ వ్యక్తి కాలిపై తన కాలును పెట్టి ఉన్న పిక్ను పోస్ట్చేసింది. అయితే తాను చేసే ప్రతీ పోస్ట్కు ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చే శ్రీరెడ్డి ఈ సారి మాత్రం ఫోటోను మాత్రమే షేర్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్కు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతనెవరు? అంటూ ప్రశ్నించసాగారు. అతను ప్రేమికుడా? అంటూ అడిగిన నెటిజన్లకు.. స్నేహితుడంటూ సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్పై సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. జనసేనను ఏ పార్టీలోనూ కలపనని చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘పవన్ గారు మీ పార్టీని మరేతర పార్టీలోనూ కలపకండి. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మొత్తం ద్రావణాన్ని పాడు చేస్తుంది. మీరు మాకు వద్దు’ అంటూ పోస్ట్ చేసింది. -
కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!
గర్భం ధరించినప్పటి నుంచి ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకూ సోషల్ మీడియాలో పలు పోస్ట్లు పెట్టి వార్తల్లో నిలిచారు నటి సమీరా రెడ్డి. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో మాతృత్వంపై తన ఆలోచనలను పంచుకున్నారు. శరీరాకృతి ఎలా ఉన్నా దానిని స్వీకరించాలని సమీరా రెడ్డి తన భావాలను వ్యక్తపరచడంతో చాలా మంది భారత మహిళలకు ఆమె ఓ ప్రేరణగా మారారు. ఈ నెల ప్రారంభంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సమీరా, తన కుమార్తెకు 'నైరా' అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకుంటూ.. 'మా గారాలపట్టి నైరాను వర్డే కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాం' అని పేర్కొన్నారు. 'నైరా' అనేది సరస్వతి దేవి పేరని ఆమె తెలిపారు. అంతేకాకుండా హీబ్రూలో 'మొక్క' అని అర్థం వస్తుందని, అమెరికన్ మూలంలో ‘నైట్ బోర్డర్‘ అనే అర్థం కూడా ఉందని ఆమె తెలిపారు. దీంతో ఈ అరుదైన పేరుకి వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. సమీరా షేర్ చేసిన పోస్ట్కు స్పందించిన ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, అనితా డోంగ్రే పేరు చాలా బావుందని ప్రశంసించారు. తన భర్త అక్షయ్ వర్దే, తాను ఓ కుమార్తెను కోరుకున్నామని అనుకున్నట్లే కుమార్తె జన్మించడంతో సంతోషంగా ఉందని గతంలో సమీరా రెడ్డి ఓ పోస్ట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. -
మొసలిని మింగిన కొండచిలువ!
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం... చూసిన వారంతా బాబోయ్! అనకుండ ఉండలేరు. కొండచిలువ మొసలికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి మొసలిపై పైథాన్ గెలుపు సాధించింది. ఆలివ్ పైథాన్ మంచి నీటి మొసలితో పోరాడి చివరకు దానిని పూర్తిగా మింగేసింది. ఈ పోరాట దృశ్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి అందులో కొన్ని ఫోటోలను జీజీ వైల్డ్ లైఫ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెట్టకుండా ఉండలేక పోతున్నారు. ‘ఇంత భయంకరమై కొండచిలువను జూలో కూడా చూడలేదని, ఇలాంటి ఘటనను దగ్గర చూసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదని’ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమంలో సెన్సేషనల్గా మారిన ఈ ఫోటోలకు ఇప్పటివరకు 23 వేల కామెంట్లు, 48 వేల షేర్లు, 23 వేల లైక్లు వచ్చాయి. -
ఆగస్టులో అపరిమిత సెక్స్ ఫెస్టివల్
న్యూయార్క్ : ‘కామి కాలేనివాడు మోక్షగామి కాలేడు’ అన్న భారతీయ వివాదాస్పద సాధువు రజనీష్ సూత్రాన్ని ఆచరించాలనుకున్నారేమోగానీ ‘వంద మంది అమ్మాయిలతో అపరిమిత సెక్స్ ’ అంటూ నిర్వహకులు ఇస్తున్న పిలుపు నేడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్ ఐలాండ్’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్ ఆరువేల డాలర్లు. నాలుగు రోజులపాటు ఈ సెక్స్ వేడుకల్లో టెక్కెట్లు కొనుక్కొని వచ్చే పురుష పుంగవులు ప్రతి రోజు ఇద్దరు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్ అండ్ ఫ్రెండ్లీ వెకేషన్’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట. విషయం తెలిసే కాబోలు, సెక్స్ వేడుకల రోజుల్లో దాడులు నిర్వహిస్తామని, డ్రగ్స్ చట్టాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ‘అమెరికాస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్తోని విదేశీ పర్యాటకులు దొరికినట్లయితే వారిని అదుపులోకి తీసుకొని సమీపంలోని వలసదారుల కేంద్రానికి తరలించి వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అంతేకాదు, సెక్స్కు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినా అసలు వేడుకలే జరగకుండా అడ్డుకుంటామని అమెరికా పోలీసులు కూడా నిర్వాహకులను హెచ్చరించారు. 18 ఏళ్ల ప్రాయంలోని వారిని సెక్స్కు అనుమతిస్తే కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అమెరికాలో పరిమితంగా వ్యభిచారానికి అనుమతించిన ఏకైక రాష్ట్రం నేవడ. అందుకనే నిర్వాహకులు ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. మొదటి సెక్స్ ఫెస్టివల్ గతేడాది కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటు దీవిలో నిర్వహించాలనుకున్నారు. వేడుకలపై గొడవ మొదలవడంతో దక్షిణ అమెరికా ప్రభుత్వం వాటిని అడ్డుకుంది. దాంతో వ్యభిచారం చట్టబద్ధమైన వెనిజులాలోని ఇస్లా మార్గరిటలో జరిగింది. ఈ సారి కూడా ‘ఆర్గ్ హాలీడే’ అనే పొర్న్ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ వారు తెలిపారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్కు కట్టుబడి ఉంటారని తెలిపారు. -
అందరినీ సంతృప్తి పరచలేను!
సినిమా: అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని నటి రకుల్ ప్రీత్సింగ్ అంటోంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నా, ఇటీవల ఈ జాణకు హిట్స్ కరువయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్లో సూర్యతో జతకట్టిన ఎన్జీకే చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రకుల్కు పూర్తిగా నిరాశనే మిగిల్సింది. కోలీవుడ్లో దేవ్ చిత్రం తరువాత ఈమె చవిచూసిన రెండవ అపజయం ఎన్జీకే. ఇక తెలుగులోనూ అర్జెంట్గా ఆ బ్యూటీకి ఒక హిట్ కావాలి. అయితే ప్రస్తుతం నాగార్జునతో మన్మథుడు–2 చిత్రంలో నటిస్తోంది. ఈమెకు ఆశాదీపం ఆ చిత్రమే. ఇకపోతే కోలీవుడ్లో విజయ్ సరసన నటించి అవకాశం ఎదురుచూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని అవకాశాల కోసం రకుల్ప్రీత్సింగ్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది. అందులో భాగంగా గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాకు విడుదల చేస్తూ చర్చల్లో నానుతోంది. తన అవకాశాల మాటెలా ఉన్నా, నెటిజన్లు మాత్రం ఈ అమ్మడిని ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి. కొందరు అభిమానులను ఆ ఫొటోలు ఎంజాయ్మెంట్ను ఇస్తున్నా, మరి కొందరి విమర్శలను రకుల్ప్రీత్సింగ్ ఎదుర్కోకతప్పడం లేదు. అయితే విమర్శలు ఎప్పుడూ రుచించవు. వాటి గురించి రకుల్ప్రీత్సింగ్ కూడా విరుచుకుపడుతోంది. ఈ అమ్మడు ఏం అంటుందో చూద్దాం. సామాజిక మాధ్యమాల్లోని కొందరు పనీ పాటా లేని వారు ఉంటారని అంది. అలాంటి వారికి ఇంకొకరిని విమర్శించడమే పని అని విరుచుకు పడింది. అయినా తన తల్లిదండ్రులు, స్నేహితుల అభిప్రాయాలనే తాను గౌరవిస్తానని ఇతరుల గురించి పట్టించుకోవలసిని అవసరం తనకు లేదని అంది. అంతే కాకుండా అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదనీ రకుల్ప్రీత్సింగ్ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఉత్తరాది భామ కథా ఈ అమ్మడికి ఆ పాటి టెక్ ఉండటం సహజమే. -
వైరల్ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్
అందాల తార స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. జాన్వీ లుక్స్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫస్ట్ మూవీ ఫలితం ఎలాగున్నా బీటౌన్లో జాన్వీ ఫాలోయింగ్ బాగానే ఉంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతూ ఉంది. జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో కెమెరా కళ్లకు చిక్కుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ను సంపాదించుకుంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు ఊరికే ఉంటారా? లైక్లు, కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 3లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్స్
-
సియాచిన్లో భారత సైనికుల తిండితిప్పలు
-
పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!
శ్రీనగర్ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్లో మైనస్ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు. What it is like to save freedom of 1.3 billion people. #IndianArmy Jawans explains one part of it. Enjoy your freedom also be thankful to all our Jawans for making it happen. pic.twitter.com/uFEyoG1vQl — 👁️ INTEL ⚔️ Defence 🌏 OSINT ☢️ Conflict 💬 News (@Ind4Ever) June 8, 2019 -
ఇలా జరగడం లైఫ్లో మొదటిసారి : స్నేహా ఉల్లాల్
ఉల్లాసంగా.. ఉత్సాహంగా, కరెంట్, సింహా చిత్రాలతో ఫేమస్ అయిన స్నేహా ఉల్లాల్.. వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్తో స్నేహా ఉల్లాల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. తాను మొదటిసారిగా ఆసుపత్రిలో చేరారని, ఇలా జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. అంతేకాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అది బోరింగ్ గా ఉంటుంది కదా.. అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు. వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా.. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. View this post on Instagram So i was hospitalised for the first time in my life.I had a very high fever that wasn’t dying down despite multiple treatments.It was scary.BUT. After a while of terrible health , im finally a lil better.I have been asked to rest it out as much as possible.So thats going to be boring.But i have my Netflix and a bunch of very caring #foreverkindofpeople with me to keep me going.Cant wait to get back to work. I wish you all good health. A post shared by Sneha Ullal (@snehaullal) on Jun 2, 2019 at 4:46am PDT