breaking news
Tollywood
-
సన్నీ డియోల్ , బాబీ డియోల్తో గొడవలు.. పిన్ని రియాక్షన్
దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) మరణం తర్వాత కుటుంబంలో గొడవలు వచ్చాయని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా సన్నీ డియోల్ , బాబీ డియోల్ , అజీతా డియోల్ , విజేతా డియోల్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య హేమా మాలిని ద్వారా ఈషా డియోల్ , అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, ధర్మేంద్ర మరణం తర్వాత ఆస్తి విషయంలో విభేదాలు వచ్చినట్లు బాలీవుడ్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నటి హేమా మాలిని స్పందించారు.ధర్మేంద్ర మరణం తర్వాత కూడా సన్నీ డియోల్ , బాబీ డియోల్ సోదరులు కలిసి ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్లో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, తమ పిన్ని హేమ మాలినితో పాటు తన కుమార్తెలు ఇద్దరు హాజరు కాలేదు. అయితే, అదే రోజు హేమ మాలిని తన ఇంట్లో గీతోపదేశం ఏర్పాటు చేసుకుంది. రెండు వారాల తర్వాత, హేమ మాలిని ఢిల్లీలో ప్రత్యేకంగా ధర్మేంద్ర సంతాప సమావేశాన్ని నిర్వహించింది. ఇలాంటి ఘటనల తర్వాత వారి కుటుంబంలో గొడవలు వచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి.వివరణ ఇచ్చిన హేమ మాలినిహేమ మాలిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవలకు సంబంధించి మాట్లాడారు. తాము ఎల్లప్పుడూ బాగున్నామని క్లారిటీ ఇచ్చారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చాలా స్నేహపూర్వకంగానే ఉన్నామన్నారు. కానీ, ప్రజలు ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఎప్పుడూ గాసిప్ వార్తలనే కోరుకుంటున్నారని తెలుస్తోంది. 'అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి..? వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా..? ఇది నా జీవితం. నా వ్యక్తిగత జీవితం, మా వ్యక్తిగత జీవితం. మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాము. ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాము. అంతే.. అవసరంలేని విషయాలను మా కుటుంబంలోకి తీసుకురాకండి. దీని గురించి నేను ఇంకేమీ చెప్పలేను. నెటిజన్లు ఎలాంటి కథనాలు అల్లుతున్నారో నాకు తెలియదు. ఇతరులకు సంబంధించిన బాధను ఉపయోగించుకుని కొన్ని వ్యాసాలు రాయడం చాలా బాధాకరం. అందుకే నేను అలాంటి ఊహాగానాలకు సమాధానం చెప్పను" అని హేమ మాలిని అన్నారు.ఢిల్లీలో సంతాప కార్యక్రమం జరపడానికి ప్రధాన కారణం తాను రాజకీయాల్లో ఉండటమేనని హేమ మాలిని అన్నారు. ఆ రంగానికి చెందిన తన స్నేహితుల కోసం మాత్రమే అక్కడ సమావేశం నిర్వహించానని తెలిపారు. ఆపై మధుర తన నియోజకవర్గం కావడంతో వారితో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. జనపథ్లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ధర్మేంద్ర సంతాప సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, ఓం బిర్లాతో పాటు కంగనా రనౌత్, రంజిత్, అనిల్ శర్మ వంటి ఇతర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ డే.. భారీ కలెక్షన్స్
చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత చిరుకు భారీ హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.'మన శంకరవరప్రసాద్ గారు' ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 84కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' నిలబడింది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రానికి మొదటిరోజు రూ. 85 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఖైదీ నంబర్ 150'కి (రూ. 51 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 49.10 కోట్లు), గాడ్ ఫాదర్ (రూ. 32.70 కోట్లు), ఆచార్య ( రూ. 52 కోట్లు), భోళా శంకర్ (రూ. 28 కోట్లు) వచ్చాయి. మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026 -
భాషతో సంబంధం లేదు.. నచ్చితే ఓకే చెప్తా: కల్యాణి ప్రియదర్శన్
ఇటీవల 'లోకా: ఛాప్టర్ 1 - చంద్ర' చిత్రంతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న నటి 'కల్యాణి ప్రియదర్శన్'. అందులో సూపర్ హీరో పాత్రలో నటించి మలయాళంతో పాటు, తమిళం తెలుగు, ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా మాతృభాషతో పాటూ తెలుగు, తమిళం భాషల్లో కథానాయికిగా నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ లోకా చిత్రం తరువాత తనకు పలు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే మంచి పాత్ర అని అనిపిస్తే నటించడానికి సిద్ధమని పేర్కొన్నారు. మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలను తాను ఎప్పుడు వేర్వేరుగా చూడనన్నారు. కథ చెప్పడం అన్నది ప్రపంచ భావోద్వేగం అన్నారు. ఒక మంచి కథలో నటించే అవకాశం వస్తే పూర్తి సమయాన్ని కేటాయించి, మనసుపెట్టి నటించడానికి తాను ఎప్పుడు సిద్ధమే అన్నారు. కాగా ఈమె రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం కార్తీ కి జంటగా మార్షల్ చిత్రంలో నటిస్తున్నారు. మరిన్ని చిత్రాలు తన కోసం ఎదురుచూస్తున్నట్లు తను∙స్వయంగా చెప్పారు. అదేవిధంగా తనకు సూపర్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన లోకా చిత్రానికి పార్ట్ –2 కూడా ఉంది. ఇందులో కూడా ఆమె నాయకగా నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
'మన శంకర వర ప్రసాద్గారు' ఓల్డ్ సాంగ్స్ ఖర్చు ఎంతో తెలుసా?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో 1980 కాలం నాటి పాటలను ఉపయోగిస్తున్నారు. అందులో ఎక్కువగా ఇళయరాజా పాటలు తీసుకోవడం విశేషం. ఈ జనరేషన్ సినీ ఫ్యాన్స్కు ఆ సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి కూడా.. అందుకే దర్శకులు కూడా వాటిపై మక్కువ చూపుతున్నారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం మూవీ 'కే ర్యాంప్' కోసం హీరో రాజశేఖర్ నటించిన పాత సినిమా పాటను 'ఇదేమిటమ్మ మాయా..' తీసుకున్నారు. సినిమాకు కూడా బాగా కలిసొచ్చింది కూడా.. ఆ సమయంలో నెట్టింట భారీగా వైరల్ అయింది. అయతే, సంక్రాంతి రేసులో ఉన్న 'మన శంకర వర ప్రసాద్గారు' సినిమాలో కూడా పాత పాటలను ఉపయోగించి క్రేజ్ తెచ్చారు.చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా 'మన శంకర వర ప్రసాద్గారు'లో సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కోసం ఈ సాంగ్ను మూడు భాషల నుంచి తీసుకున్నారు. 'దళపతి' సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా విడుదలైంది. అయితే, చిరు సినిమా కోసం అన్ని భాషలకు సంబంధించిన ట్యూన్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై సినిమాలో అక్కడక్కడ మరికొన్ని పాత పాటలను దర్శకుడు వాడారు. దీంతో ఈ పాటల రైట్స్ కోసం అడియో కంపెనీలకు భారీగానే డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. మన శంకర వర ప్రసాద్గారులో ఉపయోగించిన పాత పాటల అన్నింటికి కలిపి సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అది కూడా కేవలం ట్యూన్స్ వరకు మాత్రమే అనుమతి తీసుకున్నట్లు టాక్.. అయితే, 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాకు ఆ పాత పాటలకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ ట్యూన్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. చిరంజీవి పాట 'రామ్మా చిలకమ్మ'కు వెంకీ డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు చేసిన గోల మామూలుగా ఉండదు. ఆపై 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పాటకు చిరు స్టెప్పులు వేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. ఇలా అన్ని పాటలకు కోటి రూపాయలు ఖర్చు చేసినప్పటికీ మూవీ లవర్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. -
'టాక్సిక్' సినిమా దర్శకురాలిపై ఫిర్యాదు
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. వారం క్రితం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్ సీన్ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది. తాజాగా చిత్ర నిర్మాత, దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీజర్ బాగుందని అందులో యశ్ లుక్ అదిరిపోయిందని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా.., కారులో యశ్తో పాటు మరో యువతిల మధ్య ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై పలు అభ్యంతరాలు వస్తున్నాయి.కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా విభాగం ఈ టీజర్పై భగ్గుమంది. దీంతో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీజర్లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మహిళలు, పిల్లలతో పాటు సాంస్కృతిక విలువలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపై చర్యలు తీసుకోవాలన్నారు.విమర్శలరు రావడంతో టీజర్పై దర్శకురాలు గీతూ మోహన్దాస్ స్పందించారు. అయితే, ఆమె చాలా వ్యంగ్య ధోరణిలో కామెంట్ చేశారు. నేటి సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నా అన్నారు. ఆ సీన్ను శృంగార దృశ్యంగా చూడకిండి అంటూ హితవు పలికారు. మహిళల అనుభవాలతో పాటు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని గీతూ మోహన్దాస్ చెప్పారు. టాక్సిక్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. -
'పరాశక్తి' తర్వాత యంగ్ హీరోతో సుధ కొంగర చిత్రం
ఆమె చేసిందే తక్కువ చిత్రాలు.., కానీ, దర్శకురాలు సుధా కొంగర మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కెరీర్ ప్రారంభించింది తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఉన్నత స్థాయికి చేరింది తమిళ పరిశ్రమలో.. ఆంధ్ర అందగాడు చిత్రం ద్వారా 2008లో దర్శకురాలిగా పరిచయం అయిన ఈమె తరువాత ద్రోహి, ఇరుదు చుట్రు, తెలుగులో గురు , సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పరాశక్తి. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా అధర్వ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా నటి శ్రీ లీల కథానాయకిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గత 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్తో ప్రదర్శింపబడుతోంది. దీంతో దసరాలో సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు బదులు కూడా సమాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. యువ నటుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్న చిత్రానికి సుధాకర్ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారంలో సారాంశం. ఈమె ఇంతకుముందే నటుడు ధృవ్ విక్రమ్కు కథను చెప్పినట్లు, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. అయితే చిత్రాల విషయంలో నిదానమే ప్రధానం అని భావించే మహిళా దర్శకురాలు సుధా కొంగర తన నూతన చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల బైసన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు విక్రమ్ తదుపరి నటించే చిత్రం పైన ఆసక్తి నెలకొంది. -
బిజీ బిజీ
హీరో ప్రభాస్ ఫుల్ బిజీ బిజీ కాబోతున్నారు. ఆయన హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. 2024 జూన్ 27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘కల్కి 2’ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని ఫిబ్రవరి నుంచి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట నాగ్ అశ్విన్. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ప్రభాస్. వచ్చే నెలలో ఆయన ఇండియాకు తిరిగి వచ్చినవెంటనే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణలో పాల్గొంటారు.ఈ షెడ్యూల్లో కమల్హాసన్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా ‘ఫౌజి’, ‘స్పిరిట్’ చిత్రాలు కూడా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలనుకుంటున్నారట. ఇలా బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు మూడు రోజుల్లోనే రూ.183 కోట్లు వచ్చాయని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఆంధ్రావాలా వస్తున్నాడు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలను మరోసారి రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలు రీ రిలీజ్లోనూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మంచి వసూళ్లతో సత్తా చాటుతుండటం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’(Andhrawala) సినిమా రీ రిలీజ్కు ముస్తాబవుతోంది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. రక్షిత హీరోయిన్. భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా ఈ నెల 26న రీ రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత గిరి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ ప్రస్తుం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) షూట్లో పాల్గొంటున్నారు. -
రాజాసాబ్ 'బాడీ డబుల్' ఎఫెక్ట్.. ప్రభాస్పై ట్రోలింగ్
‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే. -
'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. మూడో సాంగ్ రిలీజ్తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్. 'నాలోన సోకులున్నయ్, సొంపులున్నయ్ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్ సీపన, సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ శాన్వి మేఘన నవీన్ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: బాస్ చింపేశాడు.. మెగాస్టార్పై అల్లు అరవింద్ ప్రశంసలు -
ఓవర్ టూ గ్రౌండ్.. సినీతారల క్రికెట్ లీగ్ వచ్చేస్తోంది
ప్రతి ఏటా సినిమాలతో మాత్రమే కాదు.. క్రీడలతోనూ అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తెరపై అలరించిన స్టార్స్ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. సినీ హీరోస్ అంతా అలరించే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మళ్లీ వచ్చేస్తోంది. ఈ ఏడాది సీజన్తో అభిమానులను అలరించనున్నారు.ఈ ఏడాది సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచ్లను జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సీజన్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. వైజాగ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ సీజన్లో తెలుగు వారియర్స్ తన తొలి మ్యాచ్ భోజ్పురి దబాంగ్స్తో తలపడనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. C-C-L- 2-0-2-6 @ccl @TeluguWarriors1 It’s time for Some Cricket 🏏 VIZAG - 16th JAN 6.30 PM VIZAG - 17th JAN 6.30 PM #Vizag #cricket #thaman #Teluguwarriors #Ccl2026 pic.twitter.com/2doMxidzFD— thaman S (@MusicThaman) January 10, 2026 The countdown begins as the Celebrity Cricket League 2026 takes centre stage from January 16th 🔥🏏Eight teams. Big rivalries. Unmatched Sportainment.🎟️ Book your tickets now and be there from ball one!https://t.co/zCQUwXWpBvhttps://t.co/CnNrNFcwm9@Karbulldozers… pic.twitter.com/r1IQFbK4LO— CCL (@ccl) January 12, 2026 -
బాస్ చింపేశాడు.. చిరంజీవిపై అల్లు అరవింద్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్బస్టర్ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది. వింటేజ్ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'మన శంకర వరప్రసాద్గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.బాస్ ఈజ్ బాస్అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. బాస్ చింపేశాడు. బాస్ ఈజ్ బాస్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్ మూవీ అని ప్రశంసలు కురిపించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కూతురి ఫస్ట్ బర్త్డే.. బిగ్బాస్ జంట ఎమోషనల్
బుల్లితెర జంట, బిగ్బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం- రోహిత్ సాహ్ని గతేడాది పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఎనిమిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయి జన్మించింది. తనకు టియారా అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితం పరిపూర్ణంఈ సందర్భంగా టియారా రాకతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెరీనా మాట్లాడుతూ.. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ప్రపంచమే మారిపోయింది. నన్ను మరింత స్ట్రాంగ్గా, అలాగే సాఫ్ట్గా, పరిపూర్ణంగా మార్చేశావు. మా జీవితాలను ఎంతో అద్భుతంగా మార్చావు. నా ప్రపంచమే నువ్వయిపోయావు అని పేర్కొంది.లవ్యూ టియారా: రోహిత్'టియారా.. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చాక నిన్ను చూసిన మొదటిరోజు ఇంకా నా కళ్ల ముందే ఉంది. భగవంతుడు ఎంతో అందమైన బహుమతిని నీ రూపంలో ఇచ్చాడు. మమ్మల్ని నీ పేరెంట్స్గా ఎంచుకున్నందుకు థాంక్యూ.. వి లవ్యూ టియారా' అని రోహిత్ ఎమోషనలయ్యాడు.సీరియల్, సినిమాఅమెరికా అమ్మాయి సీరియల్తో ఆకట్టుకుంది. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఓ సినిమా సమయంలో రోహిత్తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో జంటగా పార్టిసిపేట్ చేసింది. మెరీనా మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్ మాత్రం ఫైనల్స్ వరకు వెళ్లాడు. సీరియల్స్కు దూరమైన వీరిద్దరూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉన్నారు. రోహిత్ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) చదవండి: భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్ -
సంక్రాంతి స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 12 సినిమాలు
మరోవారం వచ్చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లు థియేటర్లలోకి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా వచ్చేసింది. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. వీటితో పాటు పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దండోరా, కాలంకావల్, గుర్రం పాపిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి రేపుతుండగా.. స్ట్రేంజర్ థింగ్స్ 5 మేకింగ్ వీడియో, తస్కరీ సిరీస్లు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ అందుబాటులోకి రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 12 నుంచి 18వ వరకు)అమెజాన్ ప్రైమ్బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 12దండోరా (తెలుగు మూవీ) - జనవరి 14నెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ 5 (మేకింగ్ వీడియో) - జనవరి 12తస్కరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 14సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 15ద రిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16హాట్స్టార్ఇండస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12సోనీ లివ్కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16 -
మన శంకరవరప్రసాద్ గారు మూవీ పబ్లిక్ టాక్
-
40 ప్లస్లో నయనతార క్రేజ్.. 'టాక్సిక్' మూవీకి భారీ రెమ్యునరేషన్
తమిళసినిమా: కొందరికి వయసే తెలియదు 40ల్లోనూ 20ల్లాగానే కనిపిస్తారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో నయనతార ఒకరు. పాన్ ఇండియా కథానాయకిగా అవతరించిన మాలీవుడ్ బ్యూటీ ఈమె. అయితే నయనతార అదృష్టం మామూలుగా లేదు. కోలీవుడ్లో అడుగు పెట్టడంతోనే శరత్ కుమార్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని పొందారు. ఆ చిత్ర విజయం ఈమెను కథానాయకిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. ఆ వెంటనే రజినీకాంత్ సరసన చంద్రముఖి, సూర్యతో కలిసి గజిని వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి. మంచి చిత్రాలు నటించిన నయనతార టాలీవుడ్ ఆహ్వానించింది ఆ తర్వాత మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తున్న నయనతార జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ రంగప్రవేశం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 41 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉండడం విశేషం. ఈమె తెలుగులో చిరంజీవి సరసన నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా సోమవారం తెరపైకి వచ్చేసింది. కాగా కన్నడంలో యాష్ కథానాయకుడు నటించిన టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో పెట్రియడ్, డియర్ స్టూడెంట్ చిత్రాలు నటిస్తున్నారు. ఇక తమిళంలో ఈమె టైటిల్ పాత్రలో నటిస్తున్న మన్నాంగట్టి సీన్స్ 1960, హాయ్, రాక్కాయి , మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా ఒక చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా నాలుగు భాషలు నటిస్తూ బిజీగా ఉన్న నయనతార పారితోíÙకం విషయంలోనూ తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఈమె కన్నడంలో నడుస్తున్న టాక్సిక్ చిత్రం కోసం రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లు, చివరికి రూ.15 కోట్లకు సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. -
యాక్టింగ్ వదిలేద్దామనుకున్నాను: మీనాక్షీ చౌదరి
‘‘మన జీవితాల్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నా జీవితాన్ని మా అమ్మ, మా టీచర్స్ ఎంతో ప్రభావితం చేశారు. ఇప్పుడు హీరోయిన్లకు బలమైనపాత్రలు లభిస్తుండటం సంతోషంగా ఉంది. నేను కూడా బలమైనపాత్రలే చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ల మధ్యపోటీ గురించి ఆలోచించను.పోటీ అనేది ప్రతిచోటా ఉంటుంది. నా వరకు క్రమశిక్షణతో కష్టపడుతుంటాను. నా స్కూల్, కాలేజీ, మిస్ ఇండియా కాంపిటీషన్.. ఇలా ప్రతిచోట నేనుపోటీ చూశాను’’ అని చెప్పారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన సినిమా ‘అనగనగా ఒకరాజు’. మారి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’, 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’తో ఆడియ న్స్ ముందుకు వస్తున్నాను. అయితే నేను ఏదీప్లాన్ చేయలేదు. ‘అనగనగా ఒకరాజు’ చిత్రంలో సంపన్న కుటుంబంలో పుట్టిన చారులత అనేపాత్రలో నటించాను. నవీన్గారితో వర్క్ చేయడం అనేది సినిమా టీచింగ్ స్కూల్లా ఉంది.‘గుంటూరు కారం, లక్కీభాస్కర్’ తర్వాత ఇప్పుడు ‘అనగనగా ఒకరాజు’ సినిమాలు సితార బ్యానర్లో చేశాను. మారి మంచి ప్రతిభగల దర్శకుడు. ఇండస్ట్రీలో నటిగా సెటిల్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు నూతన నటీనటులు వస్తూనే ఉంటారు. దీంతో ప్రతి రోజూ పరుగే. నటిగా ‘ఔట్ ఆఫ్ లవ్’ అనేది నా తొలి సిరీస్ (టీవీ సిరీస్). ఈ షూట్లోపాల్గొన్న తొలిరోజే నాకు ఇబ్బందిగా అనిపించి, నా మేనేజర్కి కాల్ చేసి, ‘యాక్టింగ్ వద్దు. సినిమాలు వదిలేద్దామనుకున్నాను’ అని చెప్పాను. మనం కాంట్రాక్ట్ సైన్ చేశామని చెప్పి నన్ను కన్వి న్స్ చేశారు. ఆ తర్వాత యాక్టర్గా నేను మెరుగై రాణిస్తున్నాను. ఇక సోషల్ మీడియా ట్రోల్స్ నన్ను బాధపెట్టాయి. నాకు పుస్తకాలు రాయడం ఇష్టం. నాగచైతన్యగారితో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ప్రేమపై నాకు నమ్మకం ఉంది!
మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకపాటల్లో తనదైన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారామె. మహేశ్బాబు ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే..’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక...’పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్తో 1998లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మలైకా. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. అర్జున్ కపూర్తో ప్రేమలో ఉండటం వల్లే అర్బాజ్ ఖాన్కి మలైకా విడాకులిచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత అర్జున్ కపూర్– మలైకా అరోరా కూడా రిలేషన్ షిప్కి బ్రేకప్ చెప్పారు. తాజాగా తన విడాకులు, రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు మలైకా అరోరా. ‘‘నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత విడిపోయాను. అనంతరం రిలేషన్షిప్లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనేది తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నా విషయంలో సెట్ కాలేదు అంతే. అయినప్పటికీ ప్రేమ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అనేది నాకు చాలా ఇష్టం. అది దక్కాలంటే అదృష్టం ఉండాలి’’ అని పేర్కొన్నారు మలైకా ఆరోరా. -
ఓటీటీలో '120 బహదూర్'.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన కొత్త సినిమా ‘120 బహదూర్’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్ (రాజీ ఫేమ్) దర్శకత్వం వహించారు. పరమ వీర చక్ర అవార్డ్ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీలక పాత్రలో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.‘120 బహదూర్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్ మరోసారి బయోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్టైటిల్స్తో చూడొచ్చు.'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్లో ఎలాంటి యుద్ధం చేశాడు. మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి. -
ప్రభాస్కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్ సినిమా టైటిల్ ముందు The అనేది యాడ్ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్ కొనసాగినట్లే కనిపిస్తోంది...R అక్షరం వల్లే..ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన మూవీ ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా టైటిల్ రాజాసాబ్ ఆర్ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. నెగెటివ్ టాక్ప్రభాస్ నటించిన సెకండ్ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్ అని భారీ బడ్జెట్ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్ చేశాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది.సాహసం చేస్తాడా?ఇలా ఆర్ లెటర్తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్ తీసుకుంటాడా? అన్నది చూడాలి! -
సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు
-
థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి
-
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు.. పుట్టినందుకు థాంక్స్
ట్రోలింగ్ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్ చూశాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.నాలుగు సార్లు రిపీట్హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎనలేని గౌరవంపుష్పకు సీక్వెల్గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.నా జీవితాన్ని మార్చేసిన రోజు హ్యాపీ బర్త్డే డార్లింగ్.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్ సుకుమార్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. Happy Birthday, darling.It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar Puttinandhuku thanks!!! 🖤(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026 చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్ రావిపూడి -
ఏజెంట్ మూవీ నాకు చాలా స్పెషల్
-
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
దాసరి మా తాత.. ఇన్నాళ్లు అందుకే బయటపెట్టలేదు
ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఒకటి. రవితేజ హీరోగా నటించాడు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేశారు. వీళ్లలో డింపుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. చాన్నాళ్లుగా సినిమాలైతే చేస్తోంది గానీ సరైన బ్రేక్ రావట్లేదు. ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావుతో బంధుత్వం గురించి బయటపెట్టింది.దాసరి నారాయణరావు గారు నాకు తాత అవుతారు. మా తాతకు ఆయన కజిన్. అయితే ఈ విషయం చాలామందికి తెలీదు. ఇన్నాళ్లు ఎందుకనో పెద్దగా చెప్పుకోలేదు. మా నానమ్మ పేరు ప్రభ. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తోనూ అప్పట్లో 'దానవీర శూరకర్ణ'లో నటించారు. అలానే మా అమ్మ, వాళ్ల అక్కచెల్లెళ్లు అందరూ నటులే. తెలుగుతో పాటు మలయాళంలోనూ మూవీస్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ పెద్దమ్మ ఆ మాట అన్నారనే రేవంత్రెడ్డి కక్ష.. హరీశ్రావు సంచలన కామెంట్)నానమ్మ ప్రభ.. 'కిక్' సినిమాలో రవితేజకు తల్లి పాత్ర చేసింది. ఆ టైంలోనే నా ఫొటోని దర్శకుడు సురేందర్ రెడ్డికి చూపించడంతో ఇలియానా చెల్లి పాత్ర కోసం అడిగారు. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. ఇప్పుడే యాక్టింగ్ ఎందుకు? అని ఇంట్లో వాళ్ల వద్దనేశారు. తర్వాత చాలా బాధపడ్డారు. రవితేజతో 'ఖిలాడి' చేస్తున్నప్పుడు ఆయనకు కూడా ఈ విషయం చెప్పాను అని డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది.విజయవాడకు చెందిన ఈమె హైదరాబాద్లో పెరిగింది. 'గల్ఫ్' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పలు మూవీస్, స్పెషల్ సాంగ్స్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈమె నానమ్మ ప్రభ విషయానికొస్తే.. అప్పట్లో తెలుగులో భూమి కోసం, దానవీర శూరకర్ణ, జగన్మోహిని, లక్ష్మీ కళ్యాణం, కిక్ తదితర మూవీస్ చేశారు. రాఘవేంద్ర, రెబల్ చిత్రాల్లో ప్రభాస్ తల్లిగానూ ప్రభ నటించారు. అయితే ప్రభ, దాసరి నారాయణరావులతో బంధుత్వం ఉందని డింపుల్ ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. -
జై జై నాయిక..!
ఒకవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలూ చేస్తున్నారు కొందరు కథానాయికలు. సందేశాత్మక చిత్రాలే కాదు.. ఫుల్ యాక్షన్స్ చిత్రాలకూ సై అంటున్నారు. మరి.. ఏ హీరోయిన్స్ ఏ సినిమా చేస్తున్నారు? తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.మా ఇంటి బంగారం‘ఓ.. బేబీ’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరోయిన్స్ సమంత, దర్శకురాలు నందినీరెడ్డి కాంబినేషన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇటీవల ఈ సినిమా టీజర్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంత ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు..ఈ చిత్రంలో సమంత క్యారెక్టరైజేషన్స్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత పాత్ర వివాహం చేసుకుని, అత్తగారిఇంటికి వెళ్లడం, ఆమె ఊహించుకున్న కొన్ని పరిస్థితులు, అంచనాలు తలకిందులు కావడం, మరోవైపు సడన్స్ గా సమంత ఫైట్స్ చేయడం వంటి విజువల్స్ కూడా కనిపించాయి. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజూషా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాన్స్ ్క దువ్వూరు ‘మా ఇంటి బంగారం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది. మరోవైపు 2023లో విజయ్దేవరకొండ, సమంత కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన మరో మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా గత ఏడాది మేలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. మరి..సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ ఏడాది థియేటర్స్లో విడుదలైతే, కొంతగ్యాప్ తర్వాత సమంతను ఓ ఫుల్ లెంగ్త్ రోల్లో ఆడియన్స్, ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారని ఊహించవచ్చు. పవర్ఫుల్ మైసారష్మికా మందన్నా నటించిన తొలి ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’ గత ఏడాది విడుదలై, సూపర్హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు..ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ జోష్లో ‘మైసా’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక. ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్స్ ఎంటర్టైనర్ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. అన్స్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం రష్మికా మందన్నా అద్భుతంగా మేకోవర్ అయ్యారు. గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా ఇందులో నటిస్తున్నారు రష్మిక. తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో ‘మైసా’ చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు సిల్వర్స్క్రీన్స్ పై రష్మిక మందన్నా ఎక్కువగా రొటీన్స్ గ్లామర్ రోల్స్, కాలేజీ అమ్మాయి, గృహిణి.. వంటి పాత్రలు చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక మందన్నా తొలిసారి ఓ పూర్తి స్థాయి యాక్షన్స్ సినిమా చేస్తుండటంతో, ‘మైసా’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.ది బ్లాక్గోల్డ్‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించు కున్నారు హీరోయిన్స్ సంయుక్త. ఈ సక్సెస్లతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ బ్యూటీ తొలిసారిగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్స్ జానర్లో ఎంట్రీ ఇచ్చి, ‘ది బ్లాక్గోల్డ్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలోపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు సంయుక్త. యోగేష్ కేఎమ్సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్పై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుత సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తూ, ‘ది బ్లాక్గోల్డ్’ను తెరకెక్కిస్తున్నారట యోగేష్. సంయుక్త పూర్తిస్థాయి యాక్షన్స్ చేస్తున్న ఈ ‘ది బ్లాక్గోల్డ్’ సినిమాపై ఆడియన్స్్సలో అంచనాలు ఉన్నాయి.భార్యాభర్తల గొడవలుభార్యాభర్తల గొడవలు, వారి అనుబంధాలు, గిల్లికజ్జాలు, విడాకులు... వంటి అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ‘సతీ లీలావతి’. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో దేవ్ మోహన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో దేవ్, లావణ్య భార్యాభర్తలు నటించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్ఎంఎస్’ (శివ మనసులో శృతి) చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుందని తెలిసింది.సస్పెన్స్ థ్రిల్లర్హీరోయిన్స్ శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్ర చేసిన సినిమా ‘చీకటిలో..’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై డి.సురేష్బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సంధ్య అనే పాత్రలో నటించారు శోభిత. సంధ్య వద్ద శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చని΄ోతాడు. ఈ మరణం గురించి సంధ్యకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవి ఏంటి? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.క్రేజీ కల్యాణంపెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రంలో అనుపమా పరమే శ్వరన్స్ లీడ్ రోల్ చేస్తుండగా, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మెహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్స్ చేస్తున్నారు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ‘పరదా’ అనే ఉమెన్స్ సెంట్రిక్ సినిమా చేశారు అనుపమా పరమేశ్వరన్స్ . ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.గరివిడి లక్ష్మిఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ జానపద గాయని, కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి వస్తోంది. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్తో ఆమె బయోపిక్ తెరకెక్కుతోంది. హీరోయిన్స్ ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు.1990 నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇలా ఈ కోవలో మరికొన్ని ఉమెన్స్ సెంట్రిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి.. జై జై నాయిక అంటూ ప్రేక్షకులు, హీరోయిన్ల అభిమానులు ఈ తరహా చిత్రాలను ఈ ఏడాదిలో ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి.⇒ లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు మొదలైనట్లుగా తెలిసింది. నిర్మాత రాక్లైన్స్ వెంకటేశ్ ఈ బయోపిక్కు సంబంధిన పనులపై వర్క్ చేస్తున్నారని, ఈ సినిమా నిర్మాణంలో తాను అసోసియేట్ అవుతానన్నట్లుగా ఇటీవల ‘ఈషా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ రకంగా ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలైనట్లుగా తెలుస్తోంది.అయితే ఈ బయోపిక్లో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ఎవరు నటించనున్నారు? అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. హీరోయిన్స్ సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి పేరు తెరపైకి వచ్చింది. మరి.. వెండితెరపై ఎంఎస్ సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి నటిస్తారా? లేక మరోక హీరోయిన్స్ ఎవరైనా ఈ పాత్రను చేస్తారా? అన్న అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.⇒ వరుస సినిమాలతో టాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు హీరోయిన్స్ శ్రీలీల. అయితే ఈ యంగ్ బ్యూటీ ఇప్పటì æవరకు ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లో సినిమా చేయలేదు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్స్ లో సూపర్హిట్ ఫిల్మ్ ‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్ రానుందని, ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్స్ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే అనుష్కా శెట్టి నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘అరుంధతి’ హిందీలో రీమేక్ కానుందని, ఈ చిత్రంలో శ్రీలీల నటించనున్నానే ప్రచారం సాగింది. అయితే ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.⇒ రవితేజ ‘మిస్టర్ బచ్చన్స్ ’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు హీరోయిన్స్ భాగ్యశ్రీ బోర్సే. కాగా తాజాగా ఉమెన్స్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట ఈ హీరోయిన్స్ . ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా రానుందని, ఈ చిత్రంలో భాగ్యశ్రీ మెయిన్స్ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాను రమేష్ అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మద్యపాన నిషేధం నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. స్వప్న సినిమా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
నాతో నేను పోటీ పడుతుంటాను: సంయుక్త
‘‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏంజెట్, అఖండ 2’.. ఇలా నా కెరీర్లో నటిగా నేను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలే చేస్తున్నాను. భవిష్యత్లో బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవల హిందీలో ‘హక్’ (యామీ గౌతమ్ నటించారు) అనే సినిమా చూశాను. కొన్ని సన్నివేశాలకు భావోద్వేగానికి గురై ఏడ్చాను.ఈ తరహా పాత్రలూ చేయాలని ఉంది’’ అని చెప్పారు హీరోయిన్స్ సంయుక్త. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో దియా అనే పాత్రలో నటించాను.తోటియాక్టర్స్తో పోలిక పెట్టుకోను. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నాతో నేను పోటీ పడుతుంటాను. శర్వాగారి నుంచి మంచి కామిక్ టైమ్ను నేర్చుకున్నాను. సాక్షితో మంచి అనుబంధం ఏర్పడింది. రామ్గారు క్లారిటీ ఉన్న డైరెక్టర్. అనిల్గారు ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్. పూరి జగన్నాథ్–విజయ్ సేతుపతిగార్ల సినిమాలో నటించాను. నేను మెయిన్స్ లీడ్లో ‘ది బ్లాక్గోల్డ్’ మూవీ చేస్తున్నాను’’ అని తెలిపారు. -
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్బస్టర్ మీట్లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్లో ప్రభాస్ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్లో షో సరైన టైమ్లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్తో నేను సింపుల్గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్లో ఉన్న ప్రభాస్ను టీజర్, పోస్టర్స్లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు. THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026 -
'మన శంకర వరప్రసాద్' యూనివర్స్పై అనిల్ రావిపూడి క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్గా మారిన విషయం తెలిసిందే. అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో వెంకటేశ్తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్ను సృష్టిస్తానని ఆయన చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. -
ఏపీలో 'రవితేజ, నవీన్' సినిమాలకు టికెట్ ధరలు పెంపు
సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్. మన శంకరవర ప్రసాద్ గారు చిత్రాలకు ప్రీమియర్ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా సింగిల్ స్క్రీన్స్లలో రూ. 50, మల్టీఫ్లెక్స్లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. -
'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్
సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నట్లు నిర్మాతలు తరచూ అంటుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాలో ఒకే సమయంలో విడుదలైనప్పుడు వారి అభిమానులు ఇలాంటి ఫేక్ రివ్యూలతో రంగంలోకి దిగుతారు. దీంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇప్పుడు అలాంటి ఫేక్ రివ్యూలకు కోర్టు ఆర్డర్తో చెక్ పడింది. ఈ ట్రెండ్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతోనే ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు సంబంధించి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్లు , రివ్యూలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 'బుక్ మై షో' తమ పోర్టల్లో పేర్కొంది. సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు కొందరు బాట్లను ఉపయోగించి నకిలీ రేటింగ్లు ఇస్తున్నట్లు గుర్తించారు. దీనిని కట్టడి చేసేందుకు 'BlockBIGG' & 'Aiplex' సంస్థలు రంగంలోకి దిగాయి. ఇక నుంచి బాట్స్ ఉపయోగించి ఆన్లైన్ పోర్టల్లో ఎవరూ ఫేక్ రివ్యూలు ఇవ్వడం కుదరదు. అలా ఎవరైన ప్రయత్నం చేసినా నేరం అవుతుందని పేర్కొంది.తెలుగు సినీ పరిశ్రమలో ఇది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సినిమాలపై కుట్రపూరితంగా జరిగే నెగెటివ్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలకు ఇక నుంచి చెక్ పడనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీకి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్లో రివ్యూలు, రేటింగ్స్ చట్టబద్ధంగా నిలిపివేయబడ్డాయి. -
తండ్రితో బిగ్బాస్ 'తనూజ'.. ఫోటో గిఫ్ట్తో సర్ప్రైజ్
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో తనూజ, కల్యాణ్ పడాల జోడీకి అభిమానులు భారీగానే ఉన్నారు. అందుకే వారిద్దరూ మరోసారి ఏదైనా ఒక వేదికపై కనిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా స్టార్మా ఒక ఈవెంట్ను ప్లాన్ చేసింది. 'మా సంక్రాంతి వేడుక' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సందడి చేశారు. జనవరి 14న మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. తాజాగా ఈవెంట్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.తనూజకు ఫోటో గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్'ముద్దమందారం' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదని, అందుకే తన తండ్రి పెద్దగా మాట్లాడరని ఆమె బాధ పడింది. బిగ్బాస్ ఫైనల్ వేదికపై కూడా తన తండ్రి వస్తారని ఆశించింది. కానీ, ఆయన రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, తన తండ్రి ఫోటోను ఆమె ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ, ఆమె ఫ్యాన్స్ AI ఫోటోతో సర్ప్రైజ్ చేశారు. తనూజ తన తండ్రి పుట్టస్వామితో ఉన్న ఫోటోను చక్కగా ఫ్రేమ్ చేసి గిఫ్ట్గా ఫ్యాన్స్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. -
సడెన్గా సంక్రాంతి రేసులోకి వచ్చేసిన 'కార్తీ' సినిమా
కోలీవుడ్లో సడెన్గా హీరో కార్తీ సినిమా రేసులోకి వచ్చేసింది. విజయ్ మూవీ జన నాయగన్ వాయిదా పడటంతో పొంగల్ రేసులో పెద్దగా సినిమాలు లేవు. తమిళనాట ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ మాత్రమే ఉంది. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన మేకర్స్ సడెన్గా 'అన్నగారు వస్తారు' విడుదల తేదీని ప్రకటించారు. వాస్తవంగా ఈ మూవీ కూడా డిసెంబరు 12న విడుదల కావాల్సి ఉంది. పలు ఆర్థిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఆ సమస్యలన్నీ పూర్తి కావడం వల్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో జనవరి 14న ‘వా వాతియార్’(అన్నగారు వస్తారు)ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, తెలుగు వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలదే. ఇక్కడ థియేటర్స్ దొరకడం కష్టం కాబట్టి సంక్రాంతి తర్వాత తెలుగులో విడుదల కావచ్చు. దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. కామెడీతో పాటు యాక్షన్ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు.ఎందుకు వాయిదా పడింది..?అన్నగారు వస్తారు మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ, ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. ఈ విషయంలో కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్కి మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ సమస్య లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
'మన శంకర వరప్రసాద్గారి'పై హైకోర్టులో పిటిషన్
తెలంగాణలో మన 'శంకర వర ప్రసాద్గారు' చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా దానిని తప్పుబడుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సినిమా టికెట్ ధరల పెంపు అంశాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. కానీ, తను వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు పక్కనపెట్టింది. న్యాయస్థానం పనివేళల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చయాలని కోరింది. దీంతో సంక్రాంతి తర్వాత జనవరి 19న మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
'ది రాజా సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అధికారిక ప్రకటన
ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ గత సినిమాల కంటే కాస్త తక్కువగానే కలెక్షన్స్ వచ్చాయి. రాజా సాబ్ సినిమా విషయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాలో చూపించలేదంటూనే.. అవసరం లేకున్నా సరే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజా సాబ్ సక్సెస్మీట్లో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 112 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ల బుకింగ్ భారీగా జరుగుతుందన్నారు. చాలామంది తమ కుటుంబంతో పాటుగా థియేటర్కు వెళ్తున్నారని గుర్తుచేశారు. హరర్, ఫాంటసీ చిత్రాలకు సంబంధించి ఫస్ట్ డే ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. -
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి
'రాజాసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదు. ట్రైలర్లో ప్రభాస్ను ఓల్డ్ గెటప్లో చూపించాం. థియేర్లో ఆ సీన్స్ ఎక్కడ? అని వెతికే క్రమంలో కథ ఎవరికీ ఎక్కలేదు' అన్నాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్ ప్రభాస్ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. బ్లాక్బస్టర్ సక్సెస్ మీట్థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. 'రాజాసాబ్.. కింగ్ సైజ్ బ్లాక్బస్టర్' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్ థియేటర్లో ప్రీమియర్స్ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. సారీమారుతి మాట్లాడుతూ.. విమల్ థియేటర్ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్.మూడేళ్ల కష్టంనెక్స్ట్.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దుఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.రియల్ రాజాసాబ్ట్రైలర్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించాం. సినిమాలో ఆ సీన్స్ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్లో ఆ సీన్స్ జత చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం నుంచి రియల్ రాజాసాబ్ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.చదవండి: మాట మీద నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి -
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. వరుణవి కోసం..
చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు. ఎలిమినేషన్ అనేది లేకుండా గ్రాండ్ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.మాటిచ్చిన మెగాస్టార్ఈ షోకి సుధీర్ యాంకర్గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్ రావిపూడి, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, సింగర్ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.మాట నిలబెట్టుకున్న చిరంజీవిఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు తెలిపింది.చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్కు ఏకంగా చెప్పు చూపించాడా? -
తెలుగు సినిమాలకు 'ప్రీమియర్ షోలు' అవసరమా?
టాలీవుడ్లో గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిన్నా పెద్దా సంబంధం లేదు. దాదాపు ప్రతి సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. వీటి వల్ల చిన్న సినిమాలకు కాస్త ప్లస్ అవుతోంది గానీ పెద్ద చిత్రాలకు మాత్రం మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే ఊహించని దానికంటే మైనస్ అవుతుంది. ఏ చిత్రమైనా సరే ప్రీమియర్ షోలు వేయడం నిజంగా అవసరమా?పది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలోనూ ఒకటో రెండో థియేటర్లు ఉండేవి. ప్రతివారం చిన్నా పెద్దా సినిమాలు అందులో రిలీజయ్యేవి. టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉండేది కాదు. స్టార్ హీరోల మూవీస్ అయినా చిన్న హీరోల చిత్రాలైనా ఒకటే రూల్. కాకపోతే పేరున్న హీరోల సినిమాలకు కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చేవి. అప్పట్లో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు లాంటి హంగామా ఉండేది కాదు. అంతా ప్రశాంతం. అప్పట్లో కథలు కూడా ప్రేక్షకులు తమని తాము సినిమాల్లోని ఆయా పాత్రలతో పోల్చి చూసుకునేలా ఉండేవి.కానీ ఇప్పుడు నగరాల్లో తప్ప ఊళ్లలో థియేటర్లు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. సిటీల్లో అయినా గ్రామాల్లో అయినా వీకెండ్ వస్తేనే చాలా తక్కువ మంది ప్రేక్షకులు.. థియేటర్ వైపు చూస్తున్నారు. మరీ బాగుంది అనిపిస్తే తప్పితే సినిమాకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. టికెట్ ధరల్లోనూ చిన్న పెద్ద సినిమాలకు బోలెడంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రి లేదంటే వేకువజామున షోలు వేస్తున్నారు. వీటి వల్ల బోలెడంత నెగిటివిటీ ఏర్పడుతోంది.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')మనసు ప్రశాంతంగా ఉంటేనే సినిమాని ఆస్వాదించగలం. రాత్రివేళల్లో దాదాపు అందరూ నిద్రపోయే సమయాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. థియేటర్కి వచ్చి చూసే ప్రేక్షకుల్లోనూ చాలామందికి అది నిద్రపోయే టైమ్ అయ్యిండొచ్చు. వాళ్లు మూవీని నిద్ర మబ్బుతో చూడటం, సినిమాలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, రివ్యూలు చెప్పడం వల్ల మరింత చేటు జరుగుతోంది. అదే రిలీజ్ రోజు ఉదయాన్నే సినిమా చూస్తే బాగలేకపోయినా మూవీ కూడా పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అని అనిపించే అవకాశముంది.కానీ గత కొన్నాళ్ల నుంచి తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టిన బడ్జెట్ ఎలాగైనా రాబట్టేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్నారు. వందల వందల రూపాయల టికెట్ ధరలకు అదనంగా పెంచేస్తున్నారు. దీనివల్ల సినిమాలు రెగ్యులర్గా చూసే ప్రేక్షకుడు.. థియేటర్కి వెళ్తాడేమో గానీ సగటు మధ్య తరగతి ప్రేక్షకుడు.. ఇంతింత ఖర్చు చేసి ఇప్పుడు వెళ్లడం అవసరమా? ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాంలే అని తనలో తానే అనుకుంటున్నాడు. ఇదేదో ఒకటి రెండుసార్లు జరిగితే పర్లేదు. అలవాటు అయిపోతే మాత్రం అలాంటి ప్రేక్షకుడిని తిరిగి థియేటర్కి తిరిగి రప్పించడం కష్టం. ప్రస్తుతం అలానే చాలామంది థియేటర్లకు దూరమైపోయారు. ప్రీమియర్ షోలే ఇలాంటి వాటికి ప్రధాన కారణమవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రీమియర్ షోలు వేయాలి, టికెట్ ధరలు పెంచేయాలని అనుకుంటున్నారు తప్పితే సరైన కంటెంట్తో వద్దాం. సాధారణ ధరలకే టికెట్స్ అమ్ముదాం అని మాత్రం ఆలోచించట్లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్) -
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్ కాపీ కొట్టి.. ఒరిజినల్ కంపోజర్కే దొరికిపోయాడు. తమన్ లేటెస్ట్గా ది రాజాసాబ్ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్తో కలిసి స్టెప్పులేశాడు.కాపీ కొట్టాడా?అయితే ఈ పాట ఒరిజినల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్.. తన ఒరిజినల్ సాంగ్ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజాసాబ్ రిలీజ్ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Vidojean (@vidojean) చదవండి: నావాడిని కలిసానోచ్.. రోహిణి -
నావాడిని కలిసానోచ్.. ఫోటో షేర్ చేసిన రోహిణి!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. నావాడిని కలిశా..మత్తు వదలరా, బలగం, హను-మాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్) వెబ్సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది. షాకయ్యారా?ఇంతమంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.నిజమైతే బాగుండు యాంకర్ అరియానా అయితే సీరియస్గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) చదవండి: అది సవాల్గా అనిపించింది: ఆషికా రంగనాథ్ -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన.. ఆషికా, డింపుల్ (ఫొటోలు)
-
మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్
-
'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)
-
జనవరి 10.. టాలీవుడ్ భయపడుతోందా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు పక్కాగా అనుసరిస్తుంటారు. హిట్ అయితే దాన్ని తెగ నమ్ముతారు. నెగిటివ్ అనే ముద్రపడితే ఆ వైపు చూసే సాహసం కూడా చేయరు. జనవరి 10న కూడా అలాంటి ఓ నమ్మకం ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది. నిజంగా ఈ తేదీని చూసి టాలీవుడ్ భయపడుతోందా?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమాలు)టాలీవుడ్లో జనవరి 10కి గతంలో ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. కానీ పదేళ్లలో చూసుకుంటే మాత్రం ఎందుకో ఫ్లాప్స్ తప్ప హిట్ అనేది కనిపించదు. 2014లో మహేశ్ బాబు 'వన్: నేనొక్కడినే' ఇదే తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫలితం అందుకుంది. 2015లో వెంకటేశ్-పవన్ కల్యాణ్ 'గోపాల గోపాల' వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. 2018లో పవన్ 'అజ్ఞాతవాసి' వచ్చింది. దీని ఫలితం ఏంటనేది ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు.2018లో పవన్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్లో డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి జనవరి 10న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు. 2018 తర్వాత సంక్రాంతి పండగకు ఇప్పటివరకు దాదాపు 27 మూవీస్ రిలీజయ్యాయి. కాకపోతే మరే చిత్రం కూడా ఇదే తేదీన రాలేదు. గతేడాది మాత్రం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10వ తేదీనే థియేటర్లలోకి వచ్చాడు. ఇది కూడా ఫ్లాప్ అయింది.(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)చూస్తుంటే జనవరి 10 అనేది టాలీవుడ్ కి నెగిటివ్ సెంటిమెంట్లా మారినట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాల్ని ఆ తేదీన రిలీజ్ చేయట్లేదా అనిపిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి సెలవులు.. 9,10 తేదీ నాటికి మొదలైపోతాయి. ఈ టైంలో మూవీస్ రిలీజ్ చేస్తే పండగ టైంకి పీక్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈసారి అలా 'రాజాసాబ్' 9వ తేదీన వచ్చాడు. కాకపోతే మిక్స్డ్ టాక్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తోంది. ఈసారి 10వ తేదీన కొత్త చిత్రం ఏం రిలీజ్ కావట్లేదు.ఈసారి 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15న శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ అయ్యేది ఎవరు? ప్రేక్షకుల మనసు గెలుచుకుని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకునేది ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!) -
పెళ్లి తరువాత అభిమానులకు సమంత గుడ్ న్యూస్
-
ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈవారం చాలానే తెలుగు సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో అఖండ 2, జిగ్రీస్, అందెల రవమిది లాంటి స్ట్రెయిట్ మూవీస్ ఉండగా.. అలానే అయలాన్, వెపన్స్ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. పరభాషా సినిమాలు అయినప్పటికీ అంగమ్మళ్, మాస్క్.. ఉన్నంతలో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వీటితో తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్ మూవీస్ కూడా సైలెంట్గా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)గతేడాది నవంబరు చివరలో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ 'నాట్ ఆల్ ద మూవీస్ ఆర్ సేమ్: డ్యూయల్'. సురేశ్ సాగిరాజు దర్శకత్వం వహించారు. అదృష్టం తెచ్చే దురాశ, దాని వెనుక దాగి ఉన్న భయంకరమైన పరిణామాల నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. రెగ్యులర్గా భయపెట్టే శబ్దాలు కాకుండా, మైండ్ గేమ్స్తో భయపెట్టే సైకలాజికల్ థ్రిల్లర్గా దీన్ని తీయడం విశేషం. ప్రస్తుతం ఇది లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.2024 వేసవిలో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'తో పాటు రిలీజైన ఓ చిన్న సినిమా 'బహుముఖం'. మొత్తం అమెరికాలోనే తీసిన సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ఇది. హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి దర్శకత్వం కూడా చేశాడు. తన తల్లి కలని తన కలగా మార్చుకుని నటన అంటే విపరీతమైన ఇష్టం పెంచుకున్న ఓ అబ్బాయి.. అనుకోకుండా సైకోలా మారితే ఏంటి పరిస్థితి అనే పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం బుక్ మై షో స్ట్రీమింగ్లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లోకి గతంలోనే వచ్చినప్పటికీ మన దేశంలో అయితే చూసే వెసులుబాటు లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'కాలమ్కావల్' రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. డిసెంబరు 5న థియేటర్లలో రిలీజై హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా 'కాలమ్కావల్' జనవరి 16న సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. జితిన్ కె.జోసే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన జాబితాలో ఈ చిత్రం టాప్-5లో ఉంది.'కాలమ్కావల్' విషయానికొస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కేరళ - తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో మహిళలు వరుసగా హత్యలకు గురౌతుంటారు. ఒకప్పుడు సంచలనంగా మారిన ఈ కేసు సినిమాతో మరోసారి వెలుగులోకి వచ్చింది. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు. -
హోటల్లో 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్ ఆర్యన్ డేటింగ్ గురించి బాలీవుడ్లో బిగ్ న్యూస్ వైరల్ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అతను సోషల్మీడియాలో ఆమెను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది.35ఏళ్ల కార్తిక్ ఆర్యన్ టీనేజ్ అమ్మాయితో గోవా బీచ్లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం. సోషల్మీడియాలో వారు షేర్ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్ అమ్మాయితో డేటింగ్ చేయడం ఏంటి అంటూ కార్తిక్ ఆర్యన్కు మెసేజ్లు పెడుతున్నారు.బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది. కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు కామెంట్స్ను ఆపేసింది. కానీ, కార్తిక్ ఆర్యన్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. -
రెండు ఓటీటీలో 'జిగ్రీస్' సునామీ.. అన్-లిమిటెడ్ నవ్వుల జాతర
ఓటీటీలో 'జిగ్రీస్' సినిమా ట్రెండింగ్లో కొనసాగుతుంది. థియేటర్స్లో చూడాలనుకుని వెళ్లలేని వారందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈ మూవీని చూస్తున్నారు. టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్ సినిమా ట్రైలర్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. దీంతో మూవీకి బజ్ వచ్చింది.ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ వీకెండ్లో ఈ క్లీన్ ఎంటర్టైనర్ని అస్సలు మిస్ అవ్వకండి! -
ఆసక్తికరంగా 'పురుష:' టీజర్
భార్యాభర్తల కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ కథతో తీసిన సినిమా 'పురుష:' పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ప్రాముఖ్యం ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారు. బత్తుల కోటేశ్వరరావు కోటేశ్వరరావు నిర్మించారు. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. వీరు వులవల దర్శకుడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ వదిలారు. 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే అంశానికి కామెడీ జోడించి ఈ సినిమాని తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతోంది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ తదితర కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
యశ్తో 'టాక్సిక్' బ్యూటీ.. ఎవరో తెలుసా?
సుమారు నాలుగేళ్ల తర్వాత కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ వద్దకు రానున్నాడు. తన కొత్త సినిమా టాక్సిక్ నుంచి యశ్ను పరిచయం చేస్తూ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఒక శ్మశానంలో శత్రువులకు చుక్కలు చూపించేలా తన ఎంట్రీ ఉంటుంది. అయితే, కారులో ఒక నటితో యశ్ ఇంటిమేట్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్గా ఎలా తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, యశ్తో రొమాన్స్ చేసిన నటి ఎవరు అంటూ సోషల్మీడియాలో నెటిజన్లు వెతుకుతున్నారు.ఈ టీజర్లో యశ్తో కలిసి సన్నిహిత సీన్లో కనిపించింది హాలీవుడ్ నటి 'నటాలియా గుస్లిస్టాయా' (Natalia Guslistaya).. తన అసలు పేరు నటాలి బర్న్ (Natalie Burn). ఉక్రెయిన్కు చెందిన ఈ బ్యూటీ అమెరికాకు వెళ్లి, నటనలో కెరీర్ ప్రారంభించింది. నటనతో పాటు మోడల్, స్క్రీన్రైటర్, నిర్మాతగా కూడా విజయం అందుకుంది. ది ఎక్స్పెండబుల్స్ 3 చిత్రంతో పాటు హాలీవుడ్లో సుమారు 20కి పైగా సినిమాల్లో నటించింది. నిర్మాతగా 5 భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తన నెట్ వర్త్ కూడా సుమారు రూ. 150 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తనను తక్కువ అంచనా వేశారో పప్పులో కాలేసినట్లే..అమెరికన్ పౌరసత్వం పొందిన తరువాత, ఆమె పలు స్టూడియోస్లలో కూడా భాగస్వామిగా ఉంది. హాలీవుడ్లో యాక్షన్ సినిమాలతో పాటు థ్రిల్లర్ మూవీస్తో పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అయితే, టాక్సిక్ సినిమాతో ఆమె ఇండియన్ స్క్రీన్పై కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యశ్తో బోల్డ్ సీన్లో నటించడంతో ఒక్కసారిగా నెట్టింట తన పేరు వైరల్ అవుతుంది. -
టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'రాజాసాబ్' జనవరి 9న విడుదలైంది. అయితే, తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పబట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు ప్రశ్నించింది.టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాశంగా మారింది.తెలంగాణలో ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు. జనవరి 9 నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, 12 నుంచి 18వ తేదీ వరకు ఆ ధరలను సడలించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ల్లో రూ.89 పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపింది. -
18 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఇన్నాళ్లకు మెగా సక్సెస్
ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం. కొరియోగ్రాఫర్ ఆట సందీప్కు కావాల్సినంత టాలెంట్ ఉంది. కానీ విజయం మాత్రం ఆవగింజంత కూడా లేదు. చాలాఏళ్లుగా ఆ సక్సెస్ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలం క్రితం డ్యాన్స్ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్కు డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కిందట కెరీర్ మొదలుపెట్టిన సందీప్కు ఎట్టకేలకు సక్సెస్ దొరికింది. రోషన్ 'ఛాంపియన్' మూవీలో 'గిరగిర గింగిరానివే..', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్'లో 'హుక్ స్టెప్' పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అతడి జర్నీ ఓసారి చూసేద్దాం..సోషల్ మీడియాలో ఫేమస్ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్లో పాల్గొని విన్నర్గా నిలిచాడు సందీప్. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్గా స్థిరపడింది. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేశాడు. సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్స్ మాస్టరే.. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రీల్స్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ జంట టాలెంట్కు బోలెడన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులు అభిప్రాయపడ్డారు.గిరగిర గింగిరానివే.. పాటతో క్లిక్సందీప్.. కొరియోగ్రాఫర్గా కొన్ని సినిమాలు చేశాడు కానీ మంచి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆమధ్య హీరోగా లవ్ యూ టూ అని ఓ మూవీ కూడా చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇక సందీప్ డ్యాన్స్ రీల్ చూసి ఛాంపియన్ మూవీ నిర్మాత స్వప్నదత్ ఓసారి అతడికి కాల్ చేసింది. తన సినిమాలో కొరియోగ్రఫీ చేయమని అడిగింది. అలా అతడి హిట్ లిస్ట్లో మొదటి పాటగా గిరగిర గింగిరానివే.. వచ్చి చేరింది. సందీప్ దంపతుల టాలెంట్ చిరంజీవికి కూడా తెలిసింది. వెంటనే ఆయన వీరిని ఇంటికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.ఫేవరెట్ హీరోకి కొరియోగ్రఫీమన శంకర వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్ చేయమని వరం ప్రసాదించాడు. అసలే సందీప్ ఫేవరెట్ హీరో ఆయన.. అలాంటిది పిలిచి మరీ అవకాశం ఇచ్చాక నిరూపించుకోకుండా ఉంటాడా? సింపుల్గా ఉంటూనే గ్రేస్ కనిపించేలా స్టెప్స్ క్రియేట్ చేశాడు. చిరు కూడా.. అంతే గ్రేస్గా, స్టైలిష్గా స్టెప్పులేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో సందీప్కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత ఇంత మంచి విజయం రావడంతో.. ఇన్నేళ్లుగా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాడు. అనుకున్నది సాధించానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి అతడికి మున్ముందు కూడా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: ది రాజాసాబ్లో ఆ సీన్స్ డిలీట్ -
డ్రగ్స్ కేసులో 'నవదీప్'.. ఫైనల్ తీర్పు వెల్లడించిన హైకోర్టు
టాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేసిన డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్కు రిలీఫ్ దక్కింది. అతనికి మాదకద్రవ్యాల ముఠాతో సంబంధం ఉన్నట్టు సుమారు మూడేళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే, తాజాగా నవదీప్పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని న్యాయవాది వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించి తీర్పు వెళ్లడించింది. కేవలం ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరును చేర్చారని ఆయన పేర్కొన్నారు.మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు 12మందిని అరెస్టు చేశారు. నవదీప్ను కూడా విచారించేందుకు పోలీసులు నోటీసులు పంపారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రాంచందర్తో నవదీప్కు పరిచయాలు ఉన్నాయని నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని 39వ నిందితుడిగా చేర్చారు. అయితే, ఈ కేసులో నవదీప్కు వ్యతిరేఖంగా పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదు. దీంతో తాజాగా ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్
ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్ టీమ్.. ప్రభాస్ను మోస్ట్ హ్యాండ్సమ్ లుక్లో చూపించారు. సినిమాలో డార్లింగ్ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.అటు వింటేజ్ లుక్.. ఇటు ఓల్జ్ ఏజ్ లుక్టీజర్, ట్రైలర్లో ప్రభాస్ను ఓల్డ్ ఏజ్ లుక్లో చూపించారు. సినిమాకు హైప్ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్ లుక్, ఇటు ఓల్జ్ ఏజ్ లుక్లో ప్రభాస్ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది. సినిమాఅయితే ఈ సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaab https://t.co/EZYyncCc8R— Abhi063 (@Ab0612ish) January 9, 2026 View this post on Instagram A post shared by Movie Mirchi (@movie_mirchi___) First scam in 2026This look 😭😭pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
మా ఇంటి బంగారం టీజర్: అదరగొట్టేసిన సామ్
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ ఇది. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తోంది. శుక్రవారం (జనవరి 9న) మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ రిలీజ్'ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం...' అన్న సామ్ డైలాగ్తో వీడియో మొదలవుతుంది. అత్తగారిల్లిది.. ఇంకోసారి ఆలోచించుకో అంటే 'అందరూ ఎంతో మంచోల్లలాగా ఉండారు. నాకు చూస్తాంటే ఎప్పటినుంచో తెలిసినట్లుంది. నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్లుగా కలిసిపోతాం..' అని సామ్ అత్తారింట్లో అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తుంది. అటు క్లాస్, ఇటు మాస్చీర కట్టు, బొట్టుతో సింపుల్గా అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. ముఖ్యంగా బస్లో, ఏకంగా అత్తగారింట్లో సమంత ఫైట్ సీన్స్ చేసినట్లు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. సామ్ అటు క్లాస్, ఇటు మాస్ లుక్లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి కథ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. -
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్
-
నన్ను ముద్దు చేస్తున్నాడనుకున్నా.. కోరికలు తీర్చుకున్నాడు!
సీరియల్ నటి సమీరా షెరిఫ్ బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సమీరా మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మా ఎదురింట్లో ఉన్న ఆంటీ వాళ్లింటికి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్ లాంటి అన్న కూడా వచ్చేవాడు. అంటే ఆయన వయసు కొంచెం పెద్దది. ఆయన నా బుగ్గలు పట్టుకుని ఎక్కువ ముద్దు చేసేవాడు.దాగుడుమూతలుఆ వయసులో నాకర్థం కాలేదు. మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్లం. ఆ బిల్డింగ్లో పైన టెర్రస్కు వెళ్లే మెట్ల దగ్గరకు మాత్రం ఎవరూ ఎక్కువగా రారు. ఆయన మనం దాగుడుమూతలు ఆడుకుందాం అనేవారు. అప్పుడది చాలా ఫన్గా అనిపించేది. పిల్లలందరం కలిసి ఆడేవాళ్లం. మాతోపాటు ఈ అన్న కూడా జాయిన్ అయ్యేవాడు. కోరికలు తీర్చుకున్నాడుమనం ఇక్కడ దాక్కుందాం అని నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లేవాడు. అక్కడ దాక్కున్నాక నాకు ముద్దులు పెట్టేవాడు. ఒకానొక సందర్భంలో నాకు అసౌకర్యంగా అనిపించేది. కాస్త వయసు వచ్చాక నాకు అర్థమైందేంటంటే.. ఆయన నన్ను ముద్దుచేసేవాడు కాదు, తన కోరికలు నాపై తీర్చుకున్నాడు అని! చెప్పాలంటే ఇది కూడా పిల్లలపై జరిగే లైంగిక దాడిలాంటిదే! ఆ సమయంలో మనకు అంత అవగాహన లేదు.భయంతో చెప్పలేదుపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి, వాళ్లకు తెలియాలి అని మా తల్లిదండ్రులు అనుకోలేదు. ఒకవేళ ఇలా జరిగిందని నేను వెళ్లి చెప్పినా ముందు నన్నే ప్రశ్నిస్తారు.. అసలు నువ్వు అక్కడికెందుకు వెళ్లావ్? అని తిడతారు. మన పిల్లలకు అలాంటివి జరిగితే నీకు నేనున్నా.. అని ధైర్యం చెప్పాలి.. అలా కాకుండా తిట్టేస్తే వాళ్లు ఏదీ బయటకు చెప్పరు. నేనూ భయంతో చెప్పలేదు. చాలామంది జీవితంలో..ఇలాంటి సంఘటన నాకే కాదు చాలామందికి జరిగింది. వాళ్లు పిల్లలపై ప్రేమ చూపించడం లేదు, కోరిక తీర్చుకుంటున్నారు అని సమీరా చెప్పుకొచ్చింది. సమీరా.. జీవితం, అభిషేకం, భార్యామణి, మనసు మమత, ఆడపిల్ల వంటి పలు సీరియల్స్లో నటించింది. నటి సన కుమారుడు అన్వర్ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో స్థిరపడింది. తనకు ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) చదవండి: త్వరలో బిగ్ న్యూస్ చెప్తానంటున్న చిన్నారి పెళ్లికూతురు -
నగరంలో హీరోయిన్ డింపుల్ హయతీ సందడి (ఫొటోలు)
-
రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
ట్రెండింగ్లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
-
అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)
-
ప్రభాస్ కటవుట్ కి ఫ్యాన్స్ పాలాభిషేకం
-
కాశీలో రుద్ర తాండవం
‘వారణాసి’లో ప్రత్యర్థుల బెండు తీస్తున్నారట రుద్ర. ఈ రుద్ర తాండవం ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్ చూసేందుకు కొంత సమయం ఉంది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రపాత్రలో మహేశ్బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఓ కీలకపాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు.ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. ముందు మహేశ్బాబు, ప్రకాశ్రాజ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారట. ప్రస్తుతం మహేశ్బాబు పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కోసం కాశీ నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. కేఎల్. నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. -
ఏప్రిల్లో రాకాస
సంగీత్ శోభన్ హీరోగా మానసా శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ను ఖరారు చేశారు. నయన సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ను గురువారం విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘ఇదొక ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఒకపాట, నాలుగు రోజుల టాకీపార్ట్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్. -
చాదస్తం అంటే ఏంటో అడగండి!
‘చాదస్తం అంటే ఏంటో అడగండి... చాట్ జీపీటీ వీడి పేరే చెబుతుందండీ..., పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి’ అంటూ సాగుతుంది ‘దేఖో విష్ణు విన్యాసం’పాట. శ్రీవిష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ చిత్రంలోని పాట ఇది. హేమ, షాలిని సమర్పణలో యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు .జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. గురువారం ఈ సినిమాలోని ‘దేఖో విష్ణు విన్యాసం’పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణపాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు. -
ది రాజాసాబ్ మేకర్స్కు బిగ్ షాక్..!
ది రాజాసాబ్ మూవీ మేకర్స్కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. కాగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. -
సంక్రాంతి బాక్సాఫీస్: సర్ప్రైజ్ హిట్ కోసం ఎదురుచూపులు
సంక్రాంతి పండగ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఉత్సాహం. అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు పండగకి వారి సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడతారు. గతంలో శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, హనుమాన్ వంటి సినిమాలు తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది కూడా అలాంటి సర్ప్రైజ్ హిట్ ఏదైనా వస్తుందా అనే ఆసక్తి పెరిగింది. రాజాసాబ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో థియేటర్లలోకి వచ్చి మంచి హైప్ సృష్టిస్తోంది. మన శంకరవరప్రసాద్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా. అనగనగా ఒక రాజు మోస్తరు అంచనాలతో వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు. శర్వానంద్ కెరీర్లో శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా మాత్రమే కాదు, ఒకే ఒక జీవితం కూడా సైలెంట్గా వచ్చి విజయాన్ని సాధించింది. అందుకే నారీ నారీ నడుమ మురారి సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదు. రవితేజ వరుస ఫ్లాపుల కారణంగా ఈసారి అంచనాలు తగ్గాయి. అయినప్పటికీ సంక్రాంతి బరిలో ఆయన సినిమా ఏదైనా మేజిక్ చేస్తుందేమో అనే ఆసక్తి ఉంది. ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు, మూడు మిడ్ రేంజ్ సినిమాలు కలిపి బాక్సాఫీస్ను రంజుగా మార్చాయి. రాజాసాబ్తో సంక్రాంతి సినిమా పండగ మొదలైంది. ఇంకో వారం రోజుల్లో ఎవరు నిజమైన సంక్రాంతి హీరో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తానికి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ప్రేక్షకులకు భలే ఆసక్తికరంగా మారింది. ఒక వైపు పెద్ద సినిమాలు తమ స్థాయిలో పోటీ పడుతుంటే, మరోవైపు చిన్న సినిమాలు సర్ప్రైజ్ హిట్ ఇవ్వగలవా అనే ఉత్కంఠను ప్రేక్షకులకు రేపాయి. -
తెలంగాణలో 'ది రాజాసాబ్' ఫ్యాన్స్కు నిరాశ..
తెలంగాణలో 'ది రాజా సాబ్' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్ బాధతో థియేటర్స్ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు.'ది రాజా సాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్ ధరల పెంపునకు ఛాన్స్ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్ మొదలు కాలేదు. కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఓటీటీలో 'ఫరియా' డార్క్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ప్రకటన
గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. డార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదల అయింది. అయితే, సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయిపోయింది.గుర్రం పాపిరెడ్డి(Gurram Paapi Reddy ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16న జీ5(Zee5) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ నటించారు.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ. -
విజయవాడ సెంటర్లో 'కృష్ణ' విగ్రహావిష్కరణ
సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ అయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనవరి 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ మనవుడు 'జై కృష్ణ' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.అగ్ని పర్వతం సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారని చెప్పారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే31వ తేదీన సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహేష్ బాబు, కృష్ణ లాగా తను కూడా అభిమానులను సంపాదించుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ సినిమా థియేటర్స్ యజమానులతో పాటు నగర ప్రజలతో కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.సినిమా టికెట్ ధరలపై సూచనటాలీవుడ్లో సినిమా టికెట్ ధరల పెంపు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. ఈ అంశంపై తాజాగా ఆదిశేషగిరిరావు స్పందించారు. నిర్మాతలతో పాటు ప్రేక్షకుల కోణంలో ఆయన మాట్లాడారు. ఒక సినిమాకు బడ్జెట్ పెరిగిందనే సాకు చూపించి టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ పద్ధతి కాదని అయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచడంతో చిన్న సినిమాలు భారీగా దెబ్బతింటున్నాయన్నారు. ఆపై టికెట్ ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెద్ద సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్ భారీ ధరలు ఉంటాయని, ఆ మూడు రోజుల అయిపోగానే ఎటూ రేట్లు తగ్గుతాయన్నారు. టికెట్ ధరలు అందుబాటులోకి థియేటర్కు వెళ్లాలని ప్రేక్షకులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆదిశేషగిరిరావు తెలిపారు. -
మైనర్లతో చెత్త వీడియోలు.. ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
మైనర్లతో ఇంటర్వ్యూలు చేసిన ఏపీ యూట్యూబర్ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'వైరల్ హబ్ 007' పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో చాలారోజులుగా ఆయన పలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయితే, అందులో మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 అక్టోబరు 16న తన ఛానల్లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు.ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి రన్ చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా అసభ్యకరమైన రీతులోనే ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఉంటాయని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 15 నుంచి 17ఏళ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇదంతా తన ఛానల్లో వ్యూస్ పెంచుకోవడానికి ఆయన ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా బాలికను ప్రేరేపించడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనను హైదరాబాద్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఇతడు బాలల రక్షణ చట్టాలతో పాటు సైబర్ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడని పోలీసులు తెలిపారు. సైబర్ ఏసీపీ శివమారుతి టీమ్, ఎస్ఐ సురేశ్తో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. డిజిటల్ ఎవిడెన్స్తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Deccan Chronicle (@deccanchronicle_official) -
అతనెవరో నాకు తెలియదు.. అనసూయ అదిరిపోయే కౌంటర్
నటడు శివాజీ ఒక వేదికపై మాట్లాడుతూ హీరోయిన్ల దుస్తుల గురించి కామెంట్ చేశారు. అవి సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు కౌంటర్గా యాంకర్, నటి అనసూయ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏమీ చిన్నపిల్లలం కాదని తెలిపారు. తమ పరిధితో పాటు హక్కులు కూడా తెలుసన్నారు. 'మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి.' అంటూ శివాజీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆమెపై నెట్టింటి భారీ ట్రోలింగ్ జరిగింది. బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గలేదు. తిరిగి అదే రేంజ్లో సమాధానం చెప్పారు.కొద్దిరోజులుగా అనసూయ అభిమాన సంఘం పేరుతో కొందరు మీడియా వేదికగా డిబెట్లలో పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఆమె వివరణ ఇచ్చారు. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు ఆమై లైవ్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ చెప్పుకునే వ్యక్తిపై కామెంట్ చేశారు. ఫ్యాన్స్ అనే పదం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నా పేరుతో కొన్ని సోషల్మీడియా పేజీలు, సంఘాలు ఉన్నా.. వారు నన్ను కలిసినప్పుడు మంచిగానే మాట్లాడుతాను. నిజాయితీగా ఉన్నవారితో టచ్లో కూడా ఉంటాను. నాపై కొందరు చాలా కష్టపడి రీల్స్ చేస్తారు.. వాటిని నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాపేరు చెప్పుకుని తెరపైకి వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మాటలను నేను ఏకీభవించను. అతను ఎలా వచ్చారో నాకు తెలియదు. ఈ చర్చలో పాల్గొన్న వారు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్లు ఎప్పుడూ కూడా నన్ను కలవలేదు. నా పేరు ఉపయోగించుకుని వారు బతుకుతున్నారు.' అంటూ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ డిబేట్స్లలో పాల్గొంటున్న వ్యక్తిపై ఆమె కామెంట్ చేశారు. -
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే.. తర్వాత టాక్ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువఅయితే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్లోకి లాగుతున్నారు. సందీప్ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్ రెడ్డితో బ్లాక్బస్టర్ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.ఆర్ఆర్ఆర్ నుంచి..ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో, కింగ్డమ్ అప్పుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో, శివ రీరిలీజ్ సమయంలో రాంగోపాల్ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్ నాన్న రిలీజ్ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్ హీరోహీరోయిన్లు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లను ఇంటర్వ్యూ చేశాడు. బుల్లెట్ పాయింట్ ప్రశ్నలుఅందరూ సందీప్నే యాంకర్గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్ పాయింట్స్లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్ అవడం మరో విశేషం. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి బాలీవుడ్లోనూ బజ్ క్రియేట్ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం! చదవండి: 23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే -
హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ!
నేచురల్ యాక్టింగ్తో పక్కింటి కుర్రాడు అనిపించుకున్నాడు హీరో తరుణ్. వరుసగా హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఇతడికి తిరుగులేదు.. నెక్స్ట్ స్టార్ హీరో ఇతడే అనుకున్న తరుణంలో సడన్గా కనిపించకుండా పోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. అవేంటో అభిమానులకు కూడా సరిగ్గా తెలీని పరిస్థితి! ఈరోజు (జనవరి 8న) తరుణ్ బర్త్డే.. ఈ సందర్భంగా తరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..తల్లిదండ్రుల అడుగుజాడల్లో..సీనియర్ నటి రోజా రమణి, నటుడు సుశాంత్ చక్రపాణిల కుమారుడే తరుణ్. చిన్న వయసులోనే తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచాడు. నాయకుడు, అగ్ని నక్షత్రం, అంజలి, మనసు మమత, ఆదిత్య 369, పిల్లలు దిద్దిన కాపురం, తేజ వంటి సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. అంజలి మూవీకిగానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్'నువ్వే కావాలి' మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ మూవీ వందరోజులకు పైగా ఆడటంతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కొల్లగొట్టింది. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నవ వసంతం.. ఇలా ఎన్నో హిట్స్ అందుకోవడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్కి గుడ్బైదీంతో తమిళంలో అవకాశాలు రాగా అక్కడ కూడా రెండు సినిమాలు చేశాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడేసరికి కోలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. తరుణ్ను తెలుగులోనూ వరుస ఫ్లాపులు వెంటాడాయి. కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో మళ్లీ పరాజయాలే చూశాడు. 2018లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ మూవీలో చివరిసారిగా కనిపించాడు. ఇది డిజాస్టర్ అయ్యేసరికి సినిమాలే వదిలేశాడు.రీ ఎంట్రీ ఆలస్యం!అయితే 2023లో రోజా రమణి.. తరుణ్ రీఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఒక సినిమాతోపాటు ఒక వెబ్సిరీస్కు కూడా సంతకం చేశాడంది. కానీ, ఇంతవరకు వాటి గురించి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. లేటుగా వచ్చినా పర్లేదు కానీ మంచి కంటెంట్తో రీఎంట్రీ ఇస్తే అంతే చాలని కోరుకుంటున్నారు తరుణ్ అభిమానులు. తరుణ్ను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
కన్నడ 'మార్క్'తో సెన్సేషన్..క్వీన్ ఆఫ్ ‘మార్క్’గా దీప్శిఖ చంద్రన్ (ఫొటోలు)
-
Yash Birthday : యశ్ అసలు పేరేంటో తెలుసా? (ఫోటోలు)
-
ఏజెంట్ సమయంలో మాటిచ్చి నిలబెట్టుకున్నారు!
'నారీ నారీ నడుమ మురారి' సినిమా కథ విన్నప్పుడు మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందనిపించి, వెంటనే అంగీకరించాను. అంతేకానీ.. ఈ మూవీలో నా క్యారెక్టర్కు ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది? నాతో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను ఆలోచించలేదు. ఈ సినిమాకు స్టోరీ ఈజ్ కింగ్. మంచి వినోదాత్మక చిత్రం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని తెలిపింది హీరోయిన్ సాక్షి వైద్య.కామెడీ టైమింగ్ అద్భుతంశర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అమాయకంగా, చాలా నిజాయితీగా ఉండే నిత్య పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్గానూ రిలేట్ అవుతుంది. శర్వాగారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. సంయుక్తతో నాకు మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నారుతెలుగులో డైలాగ్స్ చెప్పడంలో దర్శకుడు రామ్గారు నాకు సాయపడ్డారు. నాకు మరోసారి అవకాశం కల్పిస్తానని ఏజెంట్ మూవీ సమయంలోనే నిర్మాత అనిల్ సుంకర గారు చెప్పారు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. అనూప్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదు. సంక్రాంతిని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఉత్తరాదితో సంక్రాంతి సెలబ్రేషన్స్ హడావుడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ కష్టం తనకు అవసరమే లేదు: కూతురిపై చిరంజీవి ప్రశంసలు -
'మన శంకర వరప్రసాద్గారు' ప్రీరిలీజ్లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)
-
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నాడు. పెద్ద కూతురు సుష్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, తండ్రికి స్టైలిస్ట్గా పని చేస్తోంది. అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి నిర్మాతగానూ మారింది. చిరు ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకర వరప్రసాద్గారు' మూవీని సాహు గారపాటితో పాటు మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూతురిపై ప్రశంసలు కురిపించాడు చిరంజీవి.ఇదంతా అవసరమా?'నా బిడ్డ సుష్మిత సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమ కచ్చితంగా ఆదరిస్తుందని చెప్పాను. మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారన్నాను. నేనయితే కష్టాలు చిన్నప్పుడే చూశాను. కానీ, నా కూతురు కష్టపడుతుంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా? అనిపించేది. తను మాత్రం ఒక బిడ్డగా మా నాన్నను ఇంప్రెస్ చేయాలి, నిర్మాతగా హీరోకు ది బెస్ట్ ఇవ్వాలి అని మామూలు టెక్నీషియన్లా ప్రయత్నించింది.నన్ను ఆదర్శంగా తీసుకునితనకు అన్నిరకాలుగా కంఫర్ట్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. కానీ తను అలా ఆలోచించలేదు, ఏదో సాధించాలనుకుంది. నువ్వు సాధించి చూపించావ్.. ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తాం అని ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలాగో హిట్టవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాను నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు తనెంతో సంతోషపడుతుందని నాకు తెలుసు.థాంక్యూ పాపఈ పరిశ్రమలో నాకు చేదోడువాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా అండదండలందిస్తూ.. ఇంటికి పెద్దదైనందుకు పెద్దరికాన్ని సొంతం చేసుకుంటూ తోడుగా ఉన్నందుకు థాంక్యూ పాప.. అన్నాడు. ఆయన స్పీచ్ విని సుష్మిత వెంటనే తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ మూవీ జనవరి 12న విడుదల కానుంది.చదవండి: హుక్ స్టెప్.. వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ -
చిరంజీవి సినిమాలూ ఆగిపోయాయి.. ఇది ఎంతమందికి తెలుసు
చిరంజీవిది నాలుగు దశాబ్దాల కెరీర్. ఎన్నో హిట్స్, బ్లాక్బస్టర్స్ చూశారు. ఫ్లాప్స్, ఘోరమైన డిజాస్టర్స్ కూడా అందుకున్నారు. అయినా సరే నిలబడ్డారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈయన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం చిరు చాలా ఆశలు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్)సరే ఈ సంగతి అలా పక్కనబెడితే చిరంజీవి కెరీర్లోనూ ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రకటించిన తర్వాత రద్దయితే.. మరికొన్ని షూటింగ్ చేసిన తర్వాత ఆగిపోయాయి. కారణాలు ఏమైనా సరే చిరు కెరీర్లో పదికి పైగా మూవీస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎందుకు ఆగిపోయాయనేది ఇప్పుడు చూద్దాం.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చిరంజీవి హీరోగా 'వినాలని ఉంది' పేరుతో ఓ సినిమా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ వర్మ.. పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా కావడంతో ఇది ఆగిపోయింది. ఇందులో ఊర్మిళ, టబు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం కోసం తీసిన పాటలని తర్వాత 'చూడాలని ఉంది' మూవీ కోసం ఉపయోగించుకున్నారు.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. 'భూలోక వీరుడు' పేరుతో ఓ మూవీ ప్లాన్ చేశారు. చిరంజీవి హీరోగా అశ్వనీదత్ నిర్మాతగా ఫిక్స్ అయ్యారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. కానీ షూటింగ్ మొదలుపెట్టకముందే ఇది ఆగిపోయింది. తర్వాత ఈ టైటిల్ని కాస్త మార్చి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'గా ఉపయోగించుకున్నారనే ఇండస్ట్రీలో టాక్.ఒకానొక టైంలో తెలుగులో దొంగ అనే పేరు టైటిల్లో ఉండేలా చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవివి కూడా వీటిలో చాలానే ఉన్నాయి. అయితే సురేశ్ కృష్ణ దర్శకుడిగా చిరుతో 'బాగ్దాద్ గజదొంగ' అని ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. షూటింగ్కి ముందే ఓ వివాదం తలెత్తేసరికి ఆగిపోయింది. అలానే చిరంజీవికి చాలా హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా 'వజ్రాల దొంగ' అనే మూవీ అనుకున్నారు. హీరోయిన్గా శ్రీదేవిని తీసుకుని పాట కూడా తీశారు. కానీ తర్వాత ఇది కూడా మధ్యలోనే ఆపేశారు. ఇదే దర్శకుడితో ఇద్దరు పెళ్లాల స్టోరీతో ఓ మూవీ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ టైంలోనే సమస్యలు రావడంతో ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్టు కూడా రద్దయిపోయింది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)వీటితో పాటు శాంతి నివాసం, వడ్డీ కాసుల వాడు, పెద్దపులి చిన్నపులి తదితర సినిమాలు కూడా చిరంజీవితో అనుకుని రకరకాల కారణాలతో సెట్స్పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. దర్శకుడు వీఎన్ ఆదిత్య, ఎస్వీ కృష్ణారెడ్డిలతోనూ చిరు సినిమాలు చేయాలనుకున్నారు. ప్రకటన, పూజా కార్యక్రమాల వరకే ఇవి పరిమితమయ్యాయుచిరంజీవి తన రీఎంట్రీ సినిమాని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఆటో జానీ' అనే స్టోరీతో తీద్దామనుకున్నారు. ఇది మాటల వరకే పరిమితమైపోయింది. రీసెంట్ టైంలో అయితే చిరు హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల- నిర్మాత డీవీవీ దానయ్య ఓ ప్రాజెక్టుని ప్రకటించారు. కారణమేంటో తెలీదు గానీ ఇదీ ఆగిపోయింది. 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరు ఓ మూవీ చేయాల్సింది గానీ దీన్ని పక్కనబెట్టేశారు. చేస్తారో లేదో సందేహమే. ఇలా రకరకాల కారణాలతో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?) -
'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం
చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన అంటే సోమవారం నుంచి థియేటర్లలోకి రానుంది. అయితే ఈయన గత చిత్రం 'భోళా శంకర్'.. దాదాపు రెండున్నరేళ్ల క్రితం రిలీజైంది. ఇది చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)'భోళా శంకర్ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యింది ఏంటంటే.. సోషల్ మీడియాలో కొందరు డెకాయిట్లు ఉంటారు కొందరు. వీళ్లు ఏంటంటే టైమ్ చూసి దెబ్బ కొట్టారు. ముందే మీమ్స్ తయారు చేసుకున్నారు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. చేసినోడే నాకు ఇదంతా చెప్పాడు. చివరకు ఏమైంది ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తున్నారు' అని అనిల్ సుంకర అన్నారు.ఫ్లాప్ అవ్వడానికి ఇతర కారణాలు కూడా చెబుతూ.. 'మొదటగా అది రీమేక్. కొవిడ్ కంటే ముందే మొదలుపెట్టాం. కానీ కొవిడ్ టైంలో ఒరిజినల్ సినిమాని అందరూ చూసేశారు. ఏదైతే బిగ్గెస్ట్ పాయింట్ అనుకున్నామో అది రిలీజ్ టైంకి వచ్చేసరికి మైనస్ అయింది. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే చిరంజీవి ఒకేసారి మూడు మూవీస్ మొదలుపెట్టారు. వాటిలో మాది చివరగా రిలీజైంది. లాస్ట్ అయ్యేసరికి ఈలోపు ఒరిజినల్ అందరూ చూసేశారు. ఆ ప్రభావం కూడా ఫలితంపై పడింది. అలానే విడుదలకు ముందే ఫ్లాప్ అనేది ముందే క్రియేట్ చేశారు' అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్)'భోళా శంకర్' విషయానికొస్తే.. తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం' రీమేక్గా దీన్ని తీశారు. చిరంజీవి హీరోగా, చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. అయితే తొలిరోజు తొలి ఆటకే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి థియేటర్లలో జనాలు కనిపించలేదు.ఇకపోతే అనిల్ సుంకర్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా నటించగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. జనవరి 14న ప్రీమియర్లతో ఇది థియేటర్లలోకి వస్తోంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే 'భోళా శంకర్' ఫ్లాప్ గురించి అనిల్ సుంకర స్పందించారు. (ఇదీ చదవండి: హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట) -
చాలాకాలంగా సీక్రెట్గా ఉంచా.. మాటలు రావట్లేదు!
తక్కువకాలంలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. క్యూట్ ఫేస్తో, అమాయకపు చిరునవ్వుతో అందరినీ బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటించిన 'పరాశక్తి' మూవీ సంక్రాంతి పండక్కి (జనవరి 10న) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.మాటలు రావుతను ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న విషయం గురించి తొలిసారి స్పందించింది. శ్రీలీల మాట్లాడుతూ.. పిల్లల ప్రస్తావన వస్తే నాకు మాటలు రావు. వాళ్లు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాతో కలిసుండకపోయినా నేను వారిని బాగా చూసుకుంటున్నాను. కిస్ (2019) అనే కన్నడ మూవీ సమయంలో దర్శకుడు నన్ను ఓ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడే ఈ పిల్లలు ఉండేవారు. రహస్యంగానే..మేము ఫోన్లో మాట్లాడేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లేదాన్ని. కానీ, ఈ విషయాన్ని నేను చాలాకాలం రహస్యంగా ఉంచాను. అయితే ఆ ఆశ్రమం వాళ్లు దీన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు బయటకు చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురైనా ముందుకొస్తారు అన్నారు. నిజమే కదా అనిపించింది. నేనేదో గొప్ప చేశానని చెప్పడం లేదు కానీ జనాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది.అమ్మ ప్రేమ పంచుతున్నా..అయితే ఈ జనరేషన్కు నాలాంటివాళ్లు నచ్చకపోవచ్చు. నేను మంచి గర్ల్ఫ్రెండ్ కాకపోవచ్చేమో! అయినా సరే.. నా తల్లి నన్నెంతగా ప్రేమిస్తుందో.. అదే ప్రేమను ఆ పిల్లలకు పంచుతున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రీలీల 2022లో గురు, శోభిత అని ఇద్దరు దివ్యాంగులను దత్తత తీసుకుంది. 2025లో తన బర్త్డేకు ముందు ఓ పసిపాపను దత్తత తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ చిన్నారి తన మేనకోడలు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది.చదవండి: చావు తప్ప మరో దారి లేదు: బాలీవుడ్ నటి -
‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్ అంబాసిడర్గా మృణాల్ (ఫొటోలు)
-
తెలంగాణ హైకోర్టుకు చిరంజీవి, ప్రభాస్
-
రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఆఫర్లు కూడా పోయాయి!
హీరో ఫ్రెండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మధునందన్. నిన్నే ఇష్టపడ్డాను, సై, ఇష్క్, గీతాంజలి, గుండెజారి గల్లంతయ్యిందే, రభస, లై, వినయ విధేయ రామ.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తాజాగా 'శంబాల' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరవగా అనేక విషయాలు పంచుకున్నాడు.మధునందన్ మాట్లాడుతూ.. గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. అయితే రెండు సినిమాల షూటింగ్ కోసం వరుసగా ఆరునెలలు అమెరికాలోనే ఉండిపోయాను. దాంతో చాలామంది ఏమనుకున్నారంటే.. ఇంకా ఉద్యోగం చేస్తూ యాక్టింగ్ చేస్తున్నాననుకున్నారు. ఉద్యోగం వల్ల సరైన టైం ఇవ్వలేననుకున్నారు. దానివల్ల 10-15 సినిమా అవకాశాలు పోయాయి. కానీ అప్పటికే నేను జాబ్ మానేసి చాలాకాలమైంది.మోసపోయా..నా పక్కనే ఉంటూ నా క్యారెక్టర్లు కొట్టేసిన వ్యక్తితో ఇప్పటికీ స్నేహం చేస్తున్నాను. కాకపోతే జాగ్రత్తగా ఉంటాను. వాళ్లలా ఒకరిని తొక్కి ఎదగడం నాకు చేతకాదు. అలాంటివాళ్లను పెద్దగా పట్టించుకోను. నా వరకు వస్తే ఓకే, కానీ నన్ను దాటి కుటుంబం జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను.కెరీర్ మొదట్లో ఉద్యోగం, సినిమాలు రెండూ చేశాను. ఓపక్క ఉద్యోగం, మరో పక్క సినిమాలు చేస్తూ రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. అలా నాలుగేళ్లపాటు కష్టపడి సంపాదించిన రూ.25 లక్షలు బిజినెస్లో పెట్టాను. అప్పుడు ఓ వ్యక్తి నన్ను నిండా ముంచేశాడు. ఉన్న డబ్బంతా పోయింది అని మధునందన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే? -
తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)
-
కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)
-
ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
'కానిస్టేబుల్ కనకం 2' సీజన్ 2 ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వయసు గురించి ఆలోచించనంటున్న చందమామ
అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటోంది.ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది. -
తానున్న చోటే వేడుక...
‘‘అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి... సౌభాగ్య లక్ష్మిపోలిక.., అబ్బాయి మాటకారి... మోహనాంగుడే మరి... తానున్న చోటే వేడుక’’ అంటూ సాగుతుంది ‘భల్లే భల్లే’ పాట. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలోని పాట ఇది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘భల్లే భల్లే’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక... మాయే చేసిందిలే... మంత్రం వేసిందిలే’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హరిచరణ్ పాడారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘‘కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన పాట ఇది. ఈ పాటలో శర్వా, సాక్షిల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హీరో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్య, సునీల్, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
ఆదికి శంబాల మంచి బ్రేక్ ఇచ్చింది: నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా మార్పు తీసుకొచ్చింది. నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ల నాన్న సాయి కుమార్లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపనను మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్గారు తన కొడుకుతో పాటు ‘శంబాల’ టీమ్ మొత్తానికి బ్యాక్బోన్లా నిలిచి, ఈ సినిమా విజయంలో భాగమయ్యారు. ‘శంబాల’ ప్రోమో చూసినప్పుడే ఈ చిత్రం సక్సెస్ అవుతుందని చెప్పాను. అది నిజమైంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శంబాల’.యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. తమ సినిమా మంచి విజయం సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శంబాల’ సినిమాకు పబ్లిక్లో మంచి టాక్ వచ్చి, సక్సెస్ కావడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి, క్రిస్మస్ విన్నర్గా నిలిచింది. ఆది కెరీర్లో ‘శంబాల’ 25వ చిత్రం. ఈ మూవీతో తనకి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే మొత్తం యూనిట్కి శుభాకాంక్షలు’’ అని అన్నారు.‘‘మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని ‘శంబాల’ చిత్రం నిరూపించింది. సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జనవరి 9న ఈ సినిమా హిందీలో రిలీజ్ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను’’ అని చెప్పారు సాయి కుమార్. ‘‘ఇకపై కెరీర్ను బాగా ప్లాన్ చేసుకుని, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు ఆది సాయికుమార్. ‘‘ఆదిగారు లేకుండా ఈ సినిమా లేదు. కొన్ని థియేటర్స్లో మా ‘శంబాల’ సినిమా కంటిన్యూస్గా 11 రోజులు హౌస్ఫుల్తో ప్రదర్శితమైంది’’ అని అన్నారు యుగంధర్ ముని. ‘‘మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చెప్పారు మహిధర్ రెడ్డి, రాజశేఖర్. అనంతరం ‘శంబాల’ సినిమా సక్సెస్లో భాగమైన ప్రతి ఒక్కరికీ మెమొంటోలను అందజేశారు ‘దిల్’ రాజు. -
శ్రీరామ నవమికి వారణాసి?
శ్రీరామ నవమి పండగ సందర్భంగా ‘వారణాసి’ సినిమా థియేటర్స్లోకి రానుందట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ యాక్షన్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని 2027 వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు సంగీతదర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇటీవల జరిగిన ‘వారణాసి గ్లోబ్ట్రోటర్’ ఈవెంట్లో పేర్కొన్నారు. కానీ విడుదల తేదీపై మాత్రం సరైన స్పష్టత రాలేదు.అయితే ఉగాది, శ్రీరామ నవమి పండగల సందర్భంగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ‘వారణాసి’ మూవీలో మహేశ్బాబు కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపించనున్నారు. దీంతో శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘వారణాసి’ టైటిల్ టీజర్ను ప్యారిస్లోని ప్రముఖ రే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ థియేటర్లో రజనీ కాంత్ ‘కబాలి’, ప్రభాస్ ‘బాహుబలి: ది కన్క్లూజన్’, ‘సాహో’ వంటి చిత్రాలను ప్రదర్శించారు. అయితే విడుదలకు ముందే ఓ సినిమా గ్లింప్స్ తరహా టీజర్ను ఈ థియేటర్లో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ రికార్డ్ను ‘వారణాసి’ దక్కించుకుంది. -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ని నేడు గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్బస్టర్గా నిలిచాయి. శర్వానంద్కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ప్రమోషన్స్లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
హనీమూన్ ట్రిప్లో రాహుల్ సిప్లిగంజ్.. నీకసలు సభ్యత సంస్కారం ఉందా?
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది (నవంబర్ 27న) గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్.. మ్యారేజ్ తర్వాత ఫుల్గా చిల్ అవుతున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.అయితే సింగర్ రాహుల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెట్టింట రచ్చ మొదలైంది. కొంచెం డబ్బులు రాగానే బట్టలన్నీ విప్పేసి ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ చూపించుకోవడమేంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఈ రోజు మీకు ఇది ఫ్యాషన్ అవ్వొచ్చు కానీ.. రాబోయే రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు పడతారని అంటున్నారు. మీకంటూ సభ్యత సంస్కారం ఉందా తమ్ముడు అంటూ రాహుల్పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. మీ హనీమూన్ ఫోటోలు మేము చూసి ఎంజాయ్ చేయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిప్లిగంజ్కు చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి.. ఇలాంటి పనులు కోసం కాదని రాహుల్కు సూచిస్తున్నారు.రాహుల్ సిప్లిగంజ్ నేపథ్యం..రాహుల్ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
హైకోర్టుని ఆశ్రయించిన 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్' నిర్మాతలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి. గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఏ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు లేదని తేల్చేశారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్లపై హైకోర్టులో బుధవారం (డిసెంబరు 07) విచారణ జరగనుంది.ఇకపోతే 'రాజాసాజ్' నిర్మాతలు.. తెలంగాణ ప్రభుత్వాని టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల గురించి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రీమియర్ల కోసం మల్టీప్లెక్స్ల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800కు విక్రయించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్-మల్టీప్లెక్స్ల్లో ప్రీమియర్ల కోసం రూ.600 ధరకు విక్రయించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంలో అటు హైకోర్టు, ఆపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! ) -
చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ
సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాల సందడి ఉంది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే ప్రశ్నలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశం గురించి ఆ చిత్ర నిర్మాతలు వివరణ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు ఇలా అన్నారు. 'ఈ చిత్ర టికెట్స్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్ షోల గురించి రెండు ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం రాగానే ప్లాన్ చేస్తాం. దాదాపు తెలంగాణలో కూడా ప్రీమియర్స్ ఉంటాయి.' అని పేర్కొన్నారు. -
'అఖండ-2' ఫ్యాన్స్కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్ఫ్లిక్స్'
బాలకృష్ణ- బోయపాటి శ్రీను సినిమా 'అఖండ2: తాండవం'.. డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. సంక్రాంతి కానుకగా నెట్ఫ్లిక్స్లో జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు యాప్లో పేర్కొంది. అప్కమింగ్ చిత్రాల జాబితాలో కూడా పోస్టర్తో పేర్కొంది. దీంతో ఈ పండుగనాడు సినిమాను మరోసారి చూడొచ్చని బాలయ్య ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే, తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విస్ట్ ఇచ్చింది.'అఖండ2: తాండవం' నెట్ఫ్లిక్స్లో జనవరి 9న స్ట్రీమింగ్కు వస్తుందని యాప్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పోస్టర్ను కూడా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ (యాప్) అప్కమింగ్ చిత్రాల విభాగంలో కనిపించింది. కానీ, ఇప్పుడు దానిని తొలగించారు. మూవీ లింక్ను కూడా తప్పించారు. అయితే, సోషల్మీడియాలో మాత్రం ఇప్పటివరకు అఖండ-2 స్ట్రీమింగ్ వివరాలను నెట్ఫ్లిక్స్ ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా మరో కొత్త తేదీని ఎంపిక చేసుకుని వివరాలు తెలిపే ఛాన్స్ ఉంది.'అఖండ 2' నిర్మాతలకు భారీనష్టాలే తెచ్చిపెట్టిందని బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది. -
ఎ.ఆర్. రెహమాన్ బర్త్డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
-
'దిల్రాజు'తో మా అక్క పెళ్లి.. మొదట ఒప్పుకోలేదు: తరుణ్
ప్రముఖ నిర్మాత దిల్రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. తన మొదటి భార్య అనిత మరణం తర్వాత దిల్రాజు 2020లో తేజస్వినితో కలిసి ఏడడుగులు వేశారు. అయితే, వారి పెళ్లి తర్వాత సోషల్మీడియాలో కొన్ని విమర్శలు వచ్చాయి. కేవలం ఆస్తి కోసమే దిల్రాజును ఆమె పెళ్లి చేసుకుందని కామెంట్లు చేశారు. ఆపై వారిద్దరి వయసు గురించి కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయం గురించి ఈ దంపతులు ఎక్కడా కూడా వివరణ ఇవ్వలేదు. అయితే, తాజాగా తేజస్విని తమ్ముడు డాక్టర్ తరుణ్ ఉండవల్లి పలు విషయాలు పంచుకున్నారు.మేము బ్రాహ్మిణ్'మా బావగారు రెడ్డి సామాజిక వర్గం అని అందరికీ తెలిసిందే.. కానీ, మేము బ్రాహ్మిణ్. మా అక్క ఒక ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్ధలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేది.. అందరూ అనుకున్నట్లు ఆమె ఎయిర్హోస్ట్ కాదు. ఆమె చదువుకున్నది అంతా మెడికల్ విభాగం. కానీ, అనుకోకుండా కొద్దిరోజులు ఎయిర్లైన్స్లో పనిచేసింది. బావ (దిల్రాజు)తో అక్కడే పరిచయం ఏర్పడింది. తను తరుచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అలా పెళ్లి వరకు వెళ్లారు. అయితే, మొదట మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ముఖ్యంగా మా అమ్మమ్మను ఒప్పించడం చాలా కష్టమైంది. ఆమె పాతకాలం మనిషి కాబట్టి ఒప్పించేందుకు కొంచెం టైమ్ పట్టింది. మా అక్క కోసమే ముందుకు అడుగువేశాం. అయితే, మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. అక్కను ఒక మహారాణిలా మా బావగారు చూసుకుంటారు. ఆయన నోటి నుంచి ఒక తప్పడు మాట రాదు. చివరకు తన దగ్గర పనిచేసే వాళ్లను కూడా తిట్టరు. మా బావ బంగారమని చెబుతాం. అయితే, కొందరు తన ఆస్తి కోసమే మా అక్క పెళ్లి చేసుకుంది అంటారు. అందులో నిజం లేదు. మా కుటుంబంలో అందరం బాగా చదువుకున్నవాళ్లమే.. నేను డాక్టర్, మా అమ్మ, తమ్ముడు ఇద్దరూ హైకోర్టులో వర్క్ చేస్తారు. మా నాన్నకు వ్యాపారాలు ఉన్నాయి. డబ్బు పరంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఇలాంటి మాటలు మేము పట్టించుకోము. వారిద్దరినీ ఒక డెస్టినీనే కలిపింది అనుకుంటాను. మా అక్కతో నాకు చాలా అనుబంధం ఎక్కువ. ఆమె సంతోషంగా ఉండటమే మాకు కావాలి. మేము అనుకున్నదానికంటే తనను మా బావాగారు చాలా ఎక్కువగానే చూసుకుంటున్నారు.' అంటూ తరుణ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by shiva studios (@shiva_studios9) -
'ఏజెంట్' సినిమాతో వాళ్ల కెరీర్ పోయింది: నిర్మాత
అఖిల్ అక్కినేని సినిమా ఏజెంట్ నష్టాల గురించి నిర్మాత అనిల్ సుంకర మరోసారి రియాక్ట్ అయ్యారు. శర్వానంద్ (Sharwanand) హీరోగా అనిల్ సుంకర నిర్మించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఆరోజు సాయింత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ మూవీకి సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్లో భాగంగా అనిల్ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాతో పాటు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడారు.'ఏజెంట్ సినిమా వల్ల మేము అందరం నష్టపోయాం. ముఖ్యంగా అఖిల్, దర్శకుడు సురేంద్ర రెడ్డి కెరీర్ పరంగా బాగా నష్టపోయారు. మూడేళ్లుగా వారికి సినిమాలు లేవు. నేను డబ్బుల పరంగా నష్టాలు ఎదుర్కొన్నాను. ఈ దెబ్బ బయ్యర్ల మీద కూడా పడింది. అయితే, అఖిల్కు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. నేను డబ్బులు మాత్రమే కోల్పోయాను. కానీ, అఖిల్ కెరీర్ ఏజెంట్ సినిమాతో దెబ్బతినింది. అదొక్కటే బాధ నాలో ఉంది. నాతో ఇప్పటికీ అఖిల్ టచ్లోనే ఉన్నాడు. తనతో ఒక సినిమా తీయాలని నేను చాలా కథలను పంపుతూనే ఉన్నాను. అయితే, భారీ బడ్జెట్తో వద్దని ఏదైనా తక్కువ బడ్జెట్తో ప్లాన్ చేయమని తను సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి మరోసారి సాహసం వద్దని సూచిస్తున్నాడు. తను చాలా మంచి వ్యక్తి. తప్పకుండా ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాం.' అని ఆయన అన్నారు. 'ఏజెంట్' మూవీ ఫ్లాప్ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ తీసుకున్న అఖిల్.. చాలా సైలెంట్గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్కు మంచి ఆదరణ దక్కింది. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తుంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది. -
ఓటీటీలో కొత్త సినిమా స్ట్రీమింగ్.. సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్ సినిమా ట్రైలర్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. దీంతో మూవీకి బజ్ వచ్చింది.'జిగ్రీస్' సినిమా సన్నెక్ట్స్(Sun Nxt)లో జనవరి 6నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో పెద్దగా మెప్పించని ఈ మూవీలో చాలామంది కొత్తవారు నటించడంతో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు హాజరు కావడంతో ప్రేక్షకులకు రీచ్ అయింది.కథేంటి..జిగ్రీస్ అనే టైటిల్కు తగ్గట్లుగా కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్గా మద్యం సేవించి ఉండగా మారుతీ 800 కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మద్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా..? రాత్రికిరాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు..? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.. అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే. -
గత ఏడాది ఆశాజనకంగా లేదు కానీ..: త్రిష
పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు విజయవంతం కావాలనే కోరుకుంటారు. అందుకోసమే శ్రమిస్తుంటారు. అయితే జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఒక్కోసారి బాగున్న కథా చిత్రాలు కూడా ప్రజాదరణకు నోచుకోవడంలో విఫలం అవుతుంటాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. నటి త్రిష విషయానికే వస్తే కథానాయకిగా స్వర్ణోత్సవానికి చేరువవుతున్నారు. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం,హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మధ్యలో నటిగా కాస్త స్ట్రగుల్ పడి అవకాశాలకు దూరం అయ్యారు. అలాంటి తరుణంలో మణిరత్నం రూపంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం వరించి సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆ తరువాత విజయ్, అజిత్, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు. అదే విధంగా మలమాళంలో మోహన్లాల్, తెలుగులో చిరంజీవి వంటి ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే గత ఏడాది త్రిష నటించిన చిత్రాల్లో అజిత్తో జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మినహా ఇతర చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా అజిత్కు జంటగా నటించిన మరో చిత్రం విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థగ్ లైఫ్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. కాగా ప్రస్తుతం త్రిష మార్కెట్ డల్గా ఉందని చెప్పక తప్పదు. కాగా ఈమె సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవి సరసన నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం కూడా మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా మలయాళంలో మోహన్లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. దీంతో త్రిష కొత్తగా ఒప్పుకున్న చిత్రాలు లేవు. అయితే ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. నాలుగు పదుల వయసు దాటిన ఈ పెళ్లి కాని నటికి తాజాగా మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని, వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట అందుకే త్రిష కూడా గతేడాది తనకు ఏమంతగా ఆశాజనకంగా లేదని చెప్పుకొస్తుందట. అయితే, 2026లో తను నటించిన భారీ సినిమాలు రెండు విడుదల కానున్నాయి. -
క్లోజ్ ఫ్రెండ్తో సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత హీరోయిన్ సమంత ఫుల్గా చిల్ అవుతోంది. గతేడాది క్రిస్మస్ వేడుకలు చేసుకున్న సామ్.. ఇటీవల భర్తతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.అయితే తాజాగా సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సామ్తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడనేది మాత్రం సామ్ రివీల్ చేయలేదు.కాగా.. సామ్ - తమన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించిన అల్లుడు శీనులో తమన్నా స్పెషల్ సాంగ్లో మెరిసింది. మరోవైపు సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మా ఇంటి బంగారంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో కేవలం స్పెషల్ సాంగ్స్లో మాత్రమే కనిపిస్తోంది. -
మెగా హీరో స్పెషల్ బిర్యానీ పార్టీ.. అట్రాక్షన్గా ఉపాసన..!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరికింది. దీంతో మన మెగా హీరో చెర్రీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు.తాజాగా హైదరాబాద్లోని తన నివాసంలో మెగా హీరో రామ్ చరణ్ స్పెషల్గా పార్టీ చేసుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన ప్రముఖ చెఫ్ ఒసావా టకమసా తయారు చేసిన బిర్యానీ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఈ పార్టీలో కనిపించారు. ఇంట్లోనే జపాన్ చెఫ్ వండిన బిర్యానీ తింటూ కనిపించారు. ఈ పార్టీలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించిన ఉపాసన.. బేబీ బంప్తో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.@ #RamCharan 🏦 pic.twitter.com/0AsYvJiJwm— Trends RamCharan ™ (@TweetRamCharan) January 5, 2026 -
హైదరాబాద్లో భోగి
హైదరాబాద్లో భోగి ఆరంభమైంది. అదేంటీ... భోగి పండగ ఈ నెల 14న కదా.. అప్పుడే ఆరంభం కావడం ఏంటి? అని ఆశ్చర్యం కలగడం సహజం. అయితే హైదరాబాద్లో ఆరంభమైనది భోగి పండగ కాదు... ‘భోగి’ సినిమా. శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లు.లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘‘1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా ‘భోగి’. హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ను సోమవారం ప్రారంభించాం.ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్ని చిత్రీకరించనున్నాం. ఈ మూవీలో శర్వా సరికొత్తగా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్. -
ముగ్గురు భామలతో నాచే.. నాచే...
‘నాచే నాచే...’ అంటూ ముగ్గురు భామలతో ఆడి పాడుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాచే నాచే...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్ని ముంబైలో నిర్వహించారు. ఈ పాటలో నిధి, మాళవిక, రిద్దీలతో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ, జాట్, మిరాయ్’ వంటి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్గారితో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమా నిర్మించాం’’ అని తెలిపారు.‘‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చె΄్పాను’’ అన్నారు రిద్దీ కుమార్. ‘‘పెద్దలతో పాటు పిల్లలకు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు మాళవికా మోహనన్. ‘‘రాజా సాబ్’లో వీఎఫ్ఎక్స్ సహజంగా ఉంటాయి. స్క్రీన్ మీద సన్నివేశాలు చూస్తుంటే నిజమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిధీ అగర్వాల్ పేర్కొన్నారు. నటీనటులు జరీనా వాహబ్, బొమన్ ఇరానీ మాట్లాడారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ను పంచుకునా్నరు మేకర్స్.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రేపు(బుధవారం) గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది.ముఖ్యంగా రవితేజ ఇద్దరు భామల (ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి) మధ్య నలిగిపోయే లవ్ ట్రయాంగిల్ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. భీమ్స్ సంగీతం మా సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో...’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. రవితేజ మేనరిజమ్స్, స్టెప్పులు ఈ పాటను హిట్గా మార్చేశాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
టాలీవుడ్లో ఒకేరోజు ఈవెంట్ల జాతర
పండగ సీజన్కి టాలీవుడ్లో సినిమాల వరద కురుస్తోంది. ఒకేసారి అయిదు సినిమాలు రిలీజ్కి సిద్ధమవుతుండగా, వాటి ప్రమోషన్లలోనూ పోటీ వాతావరణం నెలకొంది. జనవరి 7న ప్రత్యేక హంగామా జరగనుంది. అదే రోజు రెండు ట్రయిలర్లు, రెండు ప్రీరిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజాసాబ్, శంకర ప్రసాద్ ట్రయిలర్లు విడుదలయ్యాయి. ఇక నవీన్ పోలిశెట్టి రాజుగారు, రవితేజ భక్త మహాశయులు ట్రయిలర్లు జనవరి 7న విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఒక ట్రయిలర్, సాయంత్రం 6 గంటలకు మరో చిత్రం ట్రయిలర్ రానున్నాయి. అదే రోజు మెగాస్టార్ శంకర ప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘రాజాసాబ్’ కోసం ప్రత్యేక ఈవెంట్ సెట్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ ట్రయిలర్ మాత్రం 7న వస్తుందా లేక 8న వస్తుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇక జనవరి 9 నుంచి సినిమాల హడావుడి మొదలవుతుంది. అందుకే మొత్తం కంటెంట్ను ఆ లోపే విడుదల చేయాలని మూవీ టీమ్లు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఒకేరోజు టాలీవుడ్లో ఒకవైపు ట్రయిలర్లు, మరోవైపు ఈవెంట్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ డోస్ అందనుంది. -
ఆ సినిమాలో చిన్మయి పాట కట్.. తేల్చేసిన దర్శకుడు
ఎప్పుడో ఏదో వివాదంతో చర్చనీయాంశమయ్యే సెలబ్రిటీ అనగానే చిన్మయి గుర్తొస్తుంది. స్వతహాగా సింగర్ అయినప్పటికీ ఫెమినిజం విషయమై నెటిజన్లకు ఈమెకు మధ్య మాటల పంచాయతీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యే శివాజీ వ్యాఖ్యలకు కూడా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. అంతకు ముందు ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పడంతోనూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ సమస్యపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.తమిళంలో ఆరేళ్ల క్రితం 'ద్రౌపది' అనే మూవీ వచ్చింది. దర్శకుడు మోహన్ జీ తీసిన ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు ఈ చిత్రంపై నిరసన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా, మహిళలని కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లలో సింగర్ చిన్మయి కూడా ఉంది. అప్పట్లో మోహన్ vs చిన్మయి కౌంటర్స్ వేసుకున్నారు. అక్కడితో అది అయిపోయింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీశారు.(ఇదీ చదవండి: 'ఖైదీ' పాప ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా?)'ద్రౌపది 2' పేరుతో తీసిన ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇందులోనే చిన్మయి తనకు తెలియకుండానే ఓ పాట పాడింది. దీని గురించి నెల క్రితం చిన్నపాటి వివాదం నడిచింది. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుడు జిబ్రాన్ అడగడంతో 'ఏమొకే' అనే పాట పాడానని.. అయితే ఏ సినిమా కోసమని అడగలేదని, ఒకవేళ ఈ మూవీ కోసమే అయితే అస్సలు పాడేదాన్ని కాదని అంటూ క్షమాపణ చెప్పింది. దర్శకుడు మోహన్ భావజాలం, సిద్ధాంతాలు నా దానికి పూర్తి వ్యతిరేకం అని ఏకంగా ట్వీట్ చేసింది.దీంతో ఆగ్రహం తెచ్చుకున్న దర్శకుడు మోహన్ జీ.. చిన్మయి, తన సినిమాకు కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుందని అప్పట్లో ఆరోపించారు. థియేటర్లలోకి సినిమా మరికొద్ది రోజుల్లో రాబోతున్న క్రమంలో సదరు పాటపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. చిన్మయి బదులు మరో గాయనితో పాడించిన వెర్షన్ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా ఈ సమస్య పరిష్కారమైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
ఒక్క సినిమాతో ఫేమస్.. సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోద్దేమో?
గత కొన్నాళ్ల నుంచి దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ ట్రెండ్ బాగా కనిపించింది. ఇందులో భాగంగా వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ పాపనే తీసుకుంటే అలా ఓ మూవీలో చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోతుందేమోనని సందేహం వస్తోంది. మరి ఈ బాలనటి ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మోనిక. తమిళనాడుకు చెందిన ఈమె.. విజయ్, అజిత్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో బాలనటిగా చేసింది. అయితే 'ఖైదీ'లో హీరో కార్తీ కూతురిగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీసిన ఈ మూవీ 2019లో రిలీజైంది. అప్పటికి ఈమె వయసు 11 ఏళ్లు. తర్వాత లోకేశ్ కనగరాజ్ యూనివర్స్లో భాగంగా వచ్చిన 'విక్రమ్' క్లైమాక్స్లోనూ కాసేపు అలా కనిపించింది.'ఖైదీ 2'లోనూ ఈ పాప పాత్ర కచ్చితంగా ఉండే అవకాశముంది. చూస్తుంటే పాప పెరిగి పెద్దయిపోయింది. మరి ఖైదీ సీక్వెల్ ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందో రాదో ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి. ఒకవేళ తీస్తే మాత్రం ఈ పాపని కాకుండా వెరే వాళ్లని పెట్టి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. చూస్తుంటే లోకేశ్ కనగరాజ్ ఈ సీక్వెల్ తీసేలోపు ఈ బాలనటి.. హీరోయిన్గానూ సినిమాలు చేసేస్తుందేమోనని అనే కౌంటర్స్ పడుతున్నాయి.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ) -
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది. జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన ఈ కొత్త పాట యూట్యూబ్లో ఇప్పటికీ టాప్-3లో కొనసాగుతుంది. అయితే, సోషల్మీడియాలో మంగ్లీపై విమర్శలు వస్తున్నాయి. మరాఠీ నుంచి ఈ సాంగ్ను కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, అసలు విషయం మరోలా ఉంది. మరాఠీకి చెందిన సింగర్స్ యతిన్ వధన్, కాజల్ రావత్యనే మంగ్లీ సాంగ్ను కాపీ కొట్టారు. ఇదే విషయాన్ని వారు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆపై వారు విడుదల చేసిన యూట్యూబ్ ఛానల్లో కూడా మంగ్లీ అనుమతితో ఈ సాంగ్ను తీసుకున్నట్లు క్రెడిట్ కూడా ఇచ్చారు. అయితే, అసలు విషయం తెలియని కొందరు సింగర్ మంగ్లీపై విమర్శలు చేయడం విశేషం.‘బాయిలోనే బల్లిపలికే’ పాటను రాసింది జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్.. ఆయన సొంత గ్రామం మల్లాపూర్ మండలం వీవీరావుపేట.. 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కమల్ ఇస్లావత్.. పోలీస్ కళాబృందంలో ప్రజలను చైతన్య పరిచేందుకు చాలా ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు వెయ్యికిపైగా కళా ప్రదర్శనలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు సుమారు 80 పాటలకుపైగానే లిరిక్స్ అందించారు. -
దీపికా పదుకోణె బర్త్డే.. ఛాన్సులు పోయినా సరే వెనక్కు తగ్గని జీవితం
బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇండియాలోనే పాపులర్ హీరోయిన్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ (రూ. 20 నుంచి 30 కోట్లు) ఒక్కో సినిమాకు అందుకునే నటిగా కొనసాగుతున్నారు. అయితే, నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, సీక్వెల్లో ఆమె నటించలేదు.ఛాన్స్లు పోయినా సరే ఎక్కడా తగ్గన దీపికపని గంటలు విషయంలో ఆమె షరతులు పెట్టారని అందుకే కల్కి-2 నుంచి మేకర్స్ తొలగించారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ నుంచి కూడా చర్చల దశలోనే ఆమెను తప్పించారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. కానీ, తను మాత్రం ఎక్కడా కూడా తిరిగి వారికి కౌంటర్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి 8 గంటలకంటే ఎక్కువగా పనిచేయడం కష్టమని ఆమె పదేపదే అన్నారు. అదే మాటపై కట్టుబడుతానని బహిరంగంగా చెప్పారు. అలా ఒప్పుకున్న వారితోనే కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత తను చేసిన వ్యాఖ్యలను చాలామంది మేకర్స్ సమర్ధించారు కూడా.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమా ఛాన్సులు కూడా పోయాయి. అయినప్పటికీ తను ఎంతమాత్రం తగ్గలేదు. అయితే, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమాలో దీపికా నటిస్తున్నడం విశేషం. నేడు ఆమె బర్త్డే సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్లను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే పాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది.8గంటల పనిపై దీపికా వివరణ‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్. -
బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
'అఖండ-2' ఫైనల్ కలెక్షన్స్.. బిగ్ లాస్
'అఖండ 2' సినిమా భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ లెక్కలను ఎప్పటికప్పుడు ప్రకటించే పలు ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది. బాలకృష్ణ - బోయపాటి శీనుది హిట్ కాంబినేషన్.. వీరిద్దరూ కలిసి గతంలో తెరకెక్కించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అఖండ-2పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. అయితే, సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో ఊహించని రేంజ్లో నష్టాలు తప్పలేదు.రూ. 100 కోట్ల నష్టం'అఖండ 2'కు సినిమా టికెట్ల పెంపునకు ఇరు రాష్ట్రాల్లో ఛాన్స్ దక్కింది. కానీ, లాభాలు రాలేదు. నష్టాలే తెచ్చిపెట్టింది. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 'అఖండ 2' వికీపీడియా ప్రొఫైల్లో కూడా ఇదే ఉంది. అయితే, ప్రస్తుతం అఖండ-2 కలెక్షన్స్ దాదాపు క్లోజింగ్కు వచ్చేసింది. చాలాచోట్ల ఇప్పటికే సినిమాను తొలగించేశారు కూడా... మరో మూడురోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి వుంది కాబట్టి పూర్తిగా అఖండ-2ను తప్పించడం సహజం. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది.సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ రావడంతోనే కలెక్షన్స్పై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, అభిమానులకు విపరీతంగా నచ్చిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ జనాలకు అంతగా కనెక్ట్ అవలేదు.ఆశగా ఎదురుచూస్తున్న బయ్యర్లుఅఖండ 2 సినిమాను బిజినెస్ పరంగా చూడకూడదని దర్శకుడు బోయపాటి కొద్దిరోజుల క్రితం కామెంట్ చేశారు. ఈ మూవీకి డబ్బుల సమస్య లేదంటూనే.. కావాల్సినంత కలెక్షన్స్ ఎప్పుడో వచ్చేసాయని అన్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్ష్ కూడా మా డైరక్టర్ చెప్పారు.. అఖండ -2 డబ్బులు ఎప్పుడో వచ్చేశాయి.. నష్టాలు ఏమీ లేవంటూ సంబరపడుతూ పోస్టులు పెడుతున్నారు. కానీ, బయ్యర్ల పరిస్థితిని తెలుసుకుంటే చాలా దారుణంగా వుంది. అఖండ-2కు సంబంధించి జిఎస్టీలు ఇస్తే కాస్తయినా నష్టాలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదంతులను నమ్మొద్దు.. భారతి రాజా కూతురి ప్రకటన
సీనియర్ సినీ దర్శకుడు భారతీరాజా ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా అంజీకరైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా గురించి గత మూడు రోజులుగా రకరకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో భారతి రాజా గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన కూతురు జనని స్పందించారు. ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన తండ్రి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని చెప్పారు. కాగా దర్శకుడు భారతీరాజా ఆరోగ్య వంతంగా ఇంటికి తిరిగి రావాలని, గీత రచయిత వైరముత్తు, తదితర సినీ ప్రముఖులతో పాటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.భారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
-
యాక్షన్ కు వేళాయె
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని ఫిల్మ్నగర్ సమాచారం. ఎన్టీఆర్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్.ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ΄్లాన్ చేశారట దర్శకుడు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్నారని, ఈ దిశగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘డ్రాగన్ ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. -
చరణ్తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్లో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్ను మొదటగా రామ్ చరణ్కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్కు నాంది పలికినట్టే. -
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.అట్లీ తర్వాత త్రివిక్రమ్తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్నే ఇప్పటి జనరేషన్కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది) -
అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్
ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్లో భాగంగా ఓ మాల్కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది)అల్లు అర్జున్ తన భార్య స్నేహ తో కలిసి హైటెక్ సిటీలోని కేఫ్ నీలోఫర్లో కనిపించారు.#AlluArjun #Sneha #HitechCity #CafeNiloufer #Hyderabad pic.twitter.com/L0n1u8EdgC— Everest News (@Everest_News7) January 4, 2026 -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' టీజర్ విడుదల
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్ చూపుతుంది.ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. 'ఈ మూవీ మంచి కంటెంట్తో పాటు హైలీ ఎంటర్టైన్ అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు. -
2026..! రచ్చ లేపే సినిమాలు ఇవే..!
-
'బిగ్బాస్' చరిత్రలో కంటెస్టెంట్స్ నీచమైన పని.. ఇద్దరిపై రెడ్ కార్డ్
బిగ్బాస్ చరిత్రలో తొలిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకేసారి రెడ్ కార్డ్ జారీ చేశారు. దీంతో తక్షణమే వారు హౌస్ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. తమిళ బిగ్బాస్-9లో జరిగిన ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. హౌస్ట్ విజయ్ సేతుపతి వారిద్దరిపై విరుచుకుపడ్డారు. రెడ్ కార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించగానే ఇతర కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకున్నారు. బిగ్బాస్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బిగ్బాస్ తమిళ్ ఇప్పటికే 90రోజులు పూర్తి చేసుకుంది. మరో వారంలో ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టికెట్ టు ఫినాలే ఏపిసోడ్ జరిగింది. కార్ టాస్క్లో భాగంగా నటి సాండ్రాను బలవంతంగా బయటకు నెట్టినందుకు పార్వతి, కమ్రుదిన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిద్దరూ కలిసి సాండ్రాను కాలితో తన్నారు. దీంతో ఆమె కారు నుంచి దూరంగా పడిపోయింది. ఆ తర్వాత కూడా సాండ్రా కాలు కారు డోర్ మధ్య ఇరుక్కుపోయింది. అప్పుడు కూడా వారు కనికరం చూపలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ దాడి తర్వాత సాండ్ర చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన ఆందోళన తనలో కనిపించింది. దీంతో ప్రేక్షకులు కూడా పార్వతి, కమ్రుదిన్ల తీరుపై విరుచుకుపడ్డారు. ఇక ఇతర హౌస్మెట్స్ అయితే, ఏకంగా వారి మొఖంపై ఉమ్మేసినంత పనిచేశారు. టైటిల్ రేసులో ఉన్న వినోథ్, దివ్యలు కలిసి వారిని కడిగిపారేశారు. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్లో హౌస్ట్ విజయ్ సేతుపతి వారికి రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఏకంగా సంబరాలు జరుపుకున్నారు. కోందరైతే ఏకంగా కేకులు కట్ చేశారు. బిగ్బాస్ షో చాలా భాషలలో టెలికాస్ట్ అవుతుంది. కానీ, ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్ ఎవరూ కూడా రెడ్ కార్డ్ అందుకోలేదు. తొలిసారి పార్వతిపై బిగ్బాస్ జారీ చేశాడు.ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ వారిద్దరికీ సెండాఫ్ ఇవ్వలేదు. హౌస్ట్ విజయ్ సేతుపతి కూడా వారిని స్టేజీపైకి పిలిచి కనీసం ఒక్కమాట కూడా మాట్లడలేదు. హౌస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి పంపించేశారు. బిగ్బాస్ చరిత్రలో ఇంతటి అవమానకరమైన రీతిలో ఎవరూ కూడా ఎదుర్కోలేదు. గేమ్ కోసం ఒక స్త్రీని ఇలా బయటకు లాగి, కాళ్ళతో తన్నడం ఏంటి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బిగ్బాస్ ప్రేక్షకులు మాత్రం వారికి తగినశాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.VIJAY SETHUPATHI GAVE RED CARD 🔥🔥- see the audience reaction 😍😍😍ONE OF THE BEST GOOSEBUMPS SCENE IN BB HISTORY#BiggBossTamil9 #VijaySethupathi pic.twitter.com/JRScBbZidh— RMVA (@LovelyRmva) January 3, 2026Sandra's acting level TOP notch 🙄😳She is still continuing same actingIt was not at all a Big accident ,...How she got these much panic because of What ? that push from the Car ?? Not Possible#biggboss9tamil #biggbosstamil9 #biggbosstamil pic.twitter.com/WE5zROcih8— Crick_info (@Stock_indianse) January 3, 2026Vikram didn’t flinch for more than 20 seconds !! I said this that day itself, everyone utilised this situation. #Scamdra #VJParvathy pic.twitter.com/HYu23K3YQz— Trithi 🕉️ (@scribblynotes_2) January 4, 2026 -
'నారీ నారీ నడుమ మురారి' మూవీలో మరో హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి బరిలో సినిమాలుసంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ 'రాజాసాబ్', విజయ్ 'జననాయగణ్' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి. A special addition, a special announcement! 📢The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️🔥Get ready for laughter overload! 😂🔥Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿Charming Star @ImSharwanand… pic.twitter.com/XrmD6fRh5b— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026 చదవండి: జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ -
సంక్రాంతికి సినిమాల సందడి.. ప్రతి ఏటా అదే సమస్య..!
సంక్రాంతి సినిమాల సందడికి అంతా సిద్ధమైంది. పొంగల్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. సంక్రాంతికి వచ్చే చిత్రాలు ఏడాది ముందే కర్ఛీఫ్ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్లో మన సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.సినిమా రిలీజ్ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా? ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ సినిమాల డేట్స్, థియేటర్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి ఈ సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి పరశక్తి, జన నాయగణ్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఇక్కడే మన తెలుగు ఆడియన్స్తో పాటు నెటిజన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.సంక్రాంతికి థియేటర్ల కొరత..ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా , మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది.డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు?సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగణ్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నస్తున్నారు. మన చిత్రాలకు కోలీవుడ్లో పెద్దగా ఆదరించరని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదని అన్నారు. ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బిగ్ కాంపీటీషన్ ఉండే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మరో యాక్షన్ చిత్రం అఖండ-2. మైథలాజికల్ టచ్తో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసింది. వారం రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే అఖండ మూవీ థియేట్రికల్ రన్టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ ఓటీటీ విషయానికొస్తే రన్ టైమ్ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఓటీటీలో కేవలం రెండు గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల సీన్స్ కోత పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఏయే సీన్స్ కట్ చేశారనేది ఓటీటీలో చూశాకే క్లారిటీ రానుంది. దీనిపై వచ్చే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ కథేంటంటే..చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.📢 Streaming Date 🔒#Akhanda2 🔱 (Telugu) streaming from January 9 on Netflix in Telugu , Tamil, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/UQ6Ldm3DA8— OTT Trackers (@OTT_Trackers) January 4, 2026 -
గడియారం వెనక్కి...
కాలం ముందుకు వెళ్తుంది. 2026కి కూడా వెల్కమ్ చెప్పాం. కానీ తెలుగుతెరపై సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. వెండితెరపై గడియారాన్ని వెనక్కి తిప్పి, కొన్ని కథలను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు హీరోలు. ఇలా ఆడియన్స్ ను ఎంటర్టైన్స్ చేసేందుకు గడియారాన్ని వెనక్కి మళ్లించిన కొంతమంది హీరోల గురించి ఓ లుక్ వేయండి.టైమ్ ట్రోటర్హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్స్ లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో మహేశ్బాబు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు. ప్రధానంగా రుద్ర పాత్రలో మహేశ్బాబు కనిపిస్తే, కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపిస్తారు. మరికొన్ని సన్నివేశాల్లో శివుడుగా కూడా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కథ రీత్యా ఈ సినిమా కథనం విభిన్న మైన కాలమానాల్లో సాగుతుంది.భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి టైమ్ ట్రోటర్, గ్లోబ్ ట్రోటర్ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్స్ , ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ వారణాసి చిత్రం 2027 వేసవిలో రిలీజ్ కానుంది.పుట్టకతోనే యోధుడు‘‘పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువులేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతనో యోధుడు..’’.. ‘ఫౌజి’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్ గురించే ఇదంతా. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. 1940 బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం.. వంటి అంశాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.జయప్రద, అనుపమ్ఖేర్, మిథున్స్ చక్రవర్తి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘ఫౌజి’ సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ సందర్భంగా పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ లోని ‘సలార్’ ఫ్రాంచైజీ సినిమా సెమీ పీరియాడికల్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇంకా నాగ్ అశ్విన్స్ డైరెక్షన్స్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ్రపారంభం కానుందని తెలిసింది.డ్రాగన్స్ రాక ఈ ఏడాదేనా..ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ. 1960 సమయంలో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా, సరిహద్దుల్లో అక్రమ రవాణా వంటి అంశాల నేపథ్యంతో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రం కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో కథ రీత్యా ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు. తాజాగా చిత్రీకరిస్తున్న సన్నివేశాల కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు.ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ గా నటి స్తున్నారు. మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కాజోల్, అనిల్ కపూర్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్స్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్స్ ’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈ ఏడాది జూన్స్ 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ విడుదల తేదీలో కూడా మార్చు ఉండొచ్చనే ఊహాగానాలు ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ‘ఎన్టీఆర్నీల్’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి..‘ఎన్టీఆర్నీల్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.పెద్ది ఆటరామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో జాన్వీకపూర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్వేందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.కథ రీత్యా ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగుతుంది. 1980 టైమ్లైన్స్ తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ ‘పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీలో రామ్చరణ్ పాల్గొనగా, ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు కూడా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది.బ్రిటీషర్లపైపోరాటంమంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘డేవిడ్రెడ్డి’. ఈ హిస్టారికల్ యాక్షన్స్ డ్రామా కథనం 1897–1922 నేపథ్యంతో సాగుతుంది. బ్రిటీషర్లకు ఎదురుతిరిగిన రెబల్ డేవిడ్రెడ్డి పాత్రలో మంచు మనోజ్ కనిపిస్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన డేవిడ్రెడ్డి బ్రిటీషర్లకు ఎలా ఎదురు నిలిచాడు? అనేది సినిమాలో చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలోని డేవిడ్ పాత్ర ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఈ చిత్ర దర్శకుడు హనుమరెడ్డి పేర్కొన్నారు. భరత్, నల్లగంగుళ వెంకట్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఉత్తర తెలంగాణలో భోగిశర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. 1960 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామాకు సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్స్ , డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్ను క్రియేట్ చేశారు మేకర్స్. కేకే రాధామోహన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మరో సినిమా ‘బైకర్’. మూడు తరాల నేపథ్యంతో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కథనం 1990, 2000 టైమ్ పీరియడ్లో సాగుతుంది.ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్లో శర్వానంద్ రేసర్ విక్రమ్ పాత్రలో నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులోనే విడుదల కావాల్సింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, ఆడియన్స్ కు మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు. త్వరలోనే ఈ ‘బైకర్’ సినిమా కొత్త విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.జడల్ జమానా‘దసరా’ పీరియాడికల్ రూరల్ యాక్షన్స్ డ్రామా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్స్ లో వస్తున్న తాజా సినిమా ‘ది ΄్యారడైజ్’. 1980 నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా ఇది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. మోహన్స్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ వర్గం కోసం ఓ నాయకుడు చేసే వీరోచితపోరాటం నేపథ్యంతో ఈ మూవీ స్టోరీ సాగుతుందని తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.రౌడీ జనార్ధన‘కలింగపట్నంలో ఇంటొకకడు రౌడీనని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటి పేర్నే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన’’ అంటూ గంభీరంగా చెబుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి.. ఈ రౌడీ జనార్ధన స్టోరీని ఈ ఏడాది డిసెంబరులో థియేటర్స్లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘రౌడీ జనార్ధన’. కీర్తీసురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈస్ట్ గోదావరి నేపథ్యంతో 1980 కాలమానంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమాలో విజయ్దేవరకొండ గోదావరి యాసలో మాట్లాడతారు. ఈ రూరల్ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేయగా, ఈ ‘రౌడీ జనార్ధన’ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా విజయ్ దేవరకొండ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు ‘టాక్సీ వాలా’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్స్ కాంబినేషన్స్ లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది.ఈ సినిమా ప్రధాన కథాంశం 1854–1878 నేపథ్యంతో సాగుతుంది. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తారని, రష్మికా మందన్నా హీరోయిన్స్ గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ్రపారంభం కానుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారు.ఆకాశంలో ఒకతార‘మహానటి, సీతారామం, కాంత’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్సల్మాన్స్ . ఎంతలా అంటే ఆయన ఏ భాషలో సినిమా చేసినా, ఆ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేంతలా. తాజాగా దుల్కర్సల్మాన్స్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒకతార’. పవన్స్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమాస్ల సమర్పణలో లైట్బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా కథనం ప్రధానంగా ఓ పల్లెటూరి నేపథ్యంతో సాగుతుందని, ఇందులో దుల్కర్ సల్మాన్స్ ఓ రైతు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.స్వాతంత్య్రానికి పూర్వం..నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1905 టైమ్లో జరుగుతుందని తెలిసింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం లండన్స్ ఉన్న కొందరు భారతీయులు ఎలాంటి వ్యూహరచన చేశారు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో నిఖిల్, మరో కీలక పాత్రలో అనుపమ్ఖేర్ నటిస్తున్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు వీర్సవార్కర్ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సినిమాలో చూపిస్తారట మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ మధ్య సెట్స్లో చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అప్పట్లో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అధికా రికంగా మరో అప్డేట్ రావాల్సి ఉంది. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ కోవలో పీరియాడికల్ ఫిల్మ్స్ చేస్తున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. -
'త్రికాల' నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట రిలీజ్
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ... మైథలాజికల్ జానర్లో తీస్తున్న 'త్రికాల' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక శ్రీనివాస్ నిర్మాత. తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' పాటని రిలీజ్ చేశారు.ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. -
సినిమా నచ్చకపోతే మందుబాటిల్ ఇప్పిస్తా: దర్శకుడు
శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించగా వరుణ్రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సక్సెస్ మీట్పాజిటివ్ టాక్తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్ ఆడియన్స్ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు. మందు తాగి లొల్లి పెడదాంకానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. క్వాటర్ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్ ఇప్పిస్తా.. అన్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే? (ఫొటోలు)
-
ప్రియుడికి ఫైమా సర్ప్రైజ్.. 8 ఏళ్లలో తొలిసారి అంటూ!
ఫైమా.. లేడీ కమెడియన్గా చాలా పాపులర్. పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్.. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. బిగ్బాస్ హౌస్లో ఉండగా.. అద్దె ఇంట్లో ఉంటున్న తల్లికి ఓ ఇల్లు కట్టివ్వడమే తన లక్ష్యం అని చెప్పింది.ప్రియుడిని పరిచయం చేసిన కమెడియన్అనుకున్నట్లుగానే బిగ్బాస్ నుంచి బయటకు రాగానే తల్లి కోసం ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. కమెడియన్ ప్రవీణ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫైమా.. ఒకానొక సమయంలో తమది స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. 2024లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడి పేరు కూడా ప్రవీణ్ కావడం గమనార్హం. తాజాగా ప్రవీణ్ నాయక్ బర్త్డే సందర్భంగా అతడికో సర్ప్రైజ్ ఇచ్చింది. బర్త్డే సర్ప్రైజ్షాపింగ్ పేరుతో మాల్కు తీసుకెళ్లి అక్కడ అతడిపై బెలూన్ల వర్షం కురిపించింది. ప్రియుడితో కేక్ కట్ చేయించింది. తర్వాత ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చి అతడితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో నేను చేసిన ఫస్ట్ సెలబ్రేషన్.. హ్యాపీ బర్త్డే ప్రవీనూ..' అని క్యాప్షన్ జోడించింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) చదవండి: నాతోపాటు నవ్వారు, ఏడ్చారు: బిగ్బీ ఎమోషనల్ -
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
రజనీకాంత్ కొత్త సినిమా ప్రకటన.. యంగ్ దర్శకుడికి ఛాన్స్
తమిళ నటుడు రజనీకాంత్ కొత్త సినిమాను ప్రకటించారు. తలైవర్ 173 పేరుతో ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ హీరో కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా తెలిపారు. రీసెంట్గా కూలీ సినిమాతో వచ్చిన రజనీ.. త్వరలో జైలర్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత రజనీ నుంచి వచ్చే సినిమా ఇదే కావడం విశేషం.రజనీకాంత్ 173వ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ యంగ్ దర్శకుడు శిబి చక్రవర్తికి దక్కింది. అయితే, ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో ప్రకటన వెలువడింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తికి అవకాశం వరించింది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన డాన్ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్ కోసం అదిరిపోయే కథతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీతో కూడిన ఓ కమర్షియల్ యాక్షన్ సినిమాను రూపొందింస్తున్నట్లు టాక్. ఈ మూవీకి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటన చేశారు.Celebrations begin#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/abzvPfuEf9— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2026 -
బాలకృష్ణ, గోపీచంద్ల కథ కంచికి.. మేకర్స్ కీలక నిర్ణయం
బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ కథను సైడ్ చేశారు. అయితే, మరో కథతో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఈ మూవీ రానుంది. మొదట హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా మేకర్స్ అనుకున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్ అయినా సరే తెరకెక్కించాలని నిర్మాత వెంకట సతీష్ కిలారు పూనుకున్నారు. అందుకోసం నయనతారను హీరోయిన్గా రంగంలోకి దింపారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి.ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించనున్నట్లు మేకర్స్ గతంలోనే చెప్పారు. ఆపై విజువల్ వండర్గా గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. కానీ, సడెన్గా నిర్మాత, హీరో, దర్శకుడు అంతా కలిసి మనసు మార్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ను సైడ్ చేసి మరో కథతో షూటింగ్ ప్రారంభించాలని వారు డిసైడ్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది.ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా నిర్మించాలంటే భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. కనీసం రూ. 150 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అని టాక్.. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి అంత మెరుగ్గాలేదు. పైగా అఖండ-2ను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసినా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆపై ఓటీటీ ఆదాయం కూడా పెద్దగా లేదు. బాలయ్య మార్కెట్ ప్రకారం అంత బడ్జెట్ వర్కౌట్ కాదని తెలిసి మరో కథతో సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్ (ఫొటోలు)
-
'బోర్డర్-2' .. సైనికులకు సెల్యూట్ చేసేలా సాంగ్
సన్నీ డియోల్, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న చిత్రం బోర్డర్-2.. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. 1997లో వచ్చిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని నిర్మించారు. తొలి పార్ట్ను జె.పి. దత్తా తెరకెక్కించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ రూపొందించారు. ‘విజయ్ దివస్’ని పురస్కరించుకుని విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 1997 నాటి బోర్డర్ మూవీలోని ఐకానిక్ సాంగ్ 'సందేశే ఆతే హై'ని రీమేక్ చేశారు. ఆధునిక హంగులతో చాలా చక్కగా రీమేక్ చేశారంటూ ఈ పాటను నెటిజన్లు ప్రశంసించారు. కానీ, వరుణ్ ధావన్ పాత్ర పెద్దగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. -
మణికొండలో సందడి చేసిన నటి దివి వద్త్య (ఫొటోలు)
-
ప్రదీప్ రంగనాథన్ సరసన టాప్ హీరోయిన్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం (కోమాలి)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత తను హీరోగా తెరపైకి వచ్చాడు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్టుడే సినిమా చేశాడు. యూత్ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ తర్వాత డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అయితే, మరోసారి దర్శకుడిగా ఒక భారీ చిత్రాన్ని ప్రదీప్ ప్లాన్ చేస్తున్నాడు.ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు ప్రదీప్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండనుందని టాక్.. ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో సెట్స్పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆది సాయికుమార్ దంపతులు
నటుడు సాయి కుమార్ ఇంట వారసుడు జన్మించాడు. ఆది సాయికుమార్, అరుణ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. సోషల్మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. దీంతో తన సన్నిహితులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారికి ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. అయితే, పాప పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లో వారసుడు జన్మించాడు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. శంబాల సినిమా సక్సెస్తో పాటు కొత్త ఏడాదిలో వారసుడి రాకతో సాయికుమార్ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారట.2014లో అరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ని ఆది పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి అయ్యాడు. జనవరి 2న పండంటి బాబుకు అరుణ జన్మనిచ్చారు. దీంతో ఆదికి ఈ కొత్త ఏడాది శుభవార్తతో ప్రారంభమైంది. శంబాల కలెక్షన్స్..చాలా ఏళ్ల తర్వాత శంబాల మూవీతో ఆది సాయికుమారు భారీ విజయాన్ని అందుకున్నారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆది కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా శంబాల రికార్డ్ క్రియేట్ చేసింది. View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) -
నర్సు నుంచి హీరోయిన్ రేంజ్కు.. పెళ్లి కబురు చెప్పిన బ్యూటీ
మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తమిళ బిగ్బాస్-1 షోలో ఛాన్స్ రావడం అలా మరింత గుర్తింపు పొందారు. బిగ్బాస్ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్ జక్రీమ్ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ బిగ్బాస్ గేమ్ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జూలీ, మహ్మద్ జాక్రీన్ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్లోని సెయింట్ పేట్రిక్ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. View this post on Instagram A post shared by Julie (@mariajuliana_official) -
శంబాల.. వారం రోజుల్లో ఎంతొచ్చిందంటే?
హిట్టు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాడు హీరో ఆది సాయికుమార్. తన కంటే ఎక్కువగా అతడి తండ్రి, నటుడు సాయికుమార్ నిరీక్షిస్తున్నాడు. వీరి ఎదురుచూపులకు తెరదించుతూ 2025 ముగింపులో భారీ విజయం సొంతమైంది. శంబాల సినిమాతో ఆది హిట్టు కొట్టాడు. తండ్రి సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సమయంలో ఈ సక్సెస్ రావడం మరింత విశేషం! వారం రోజుల్లోనే అన్ని కోట్లా?శంబాల విషయానికి వస్తే ఆది హీరోగా, అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. శంబాల సక్సెస్తో ఆదికి మంచి బూస్ట్ దొరికినట్లయింది! #Shambhala pic.twitter.com/Bmc71qEtbb— Aadi Saikumar (@iamaadisaikumar) January 2, 2026 చదవండి: భార్యకు విడాకులు! మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ పట్నాలా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆల్పా రిడంప్షన్. తానే హీరోగా నటిస్తూ పట్నాలా ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 3న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీ కథేంటో అర్థమవుతోంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. మనిషిలోని భావోద్వేగాలను, ప్రాయశ్చిత్తాన్ని చూపే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు భువన్, మార్టిన్ సంగీతమందించారు. -
ఆడదానికే ఎందుకు? మగవాడికి నేర్పించండి: రోహిణి
పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటోంది ప్రముఖ నటి రోహిణి. మనం పాటించే మంచి అలవాట్లను వారు కూడా అనుసరించేలా చూడాలని చెప్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో రోహిణి పాల్గొంది. ఈ సందర్భంగా తనను కన్నది తెలుగు తల్లి అయితే పెంచింది తమిళ తల్లి అని పేర్కొందిం.చిన్నప్పటి నుంచే..ఆమె ఇంకా మాట్లాడుతూ... సమాజం నాకు స్త్రీ పాత్ర ఇచ్చింది. స్త్రీ అంటే మగాడికన్నా తక్కువ.. వాళ్లంత చదవనవసరం లేదు, వాళ్లకున్న హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సమానత్వం లేదని తెలిసింది. చిన్నప్పటినుంచే ఇలా కూర్చోవాలి, వంట చేయాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని చెప్తారు. ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు మా పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు చెప్తుంటారు. కొడుక్కి మాత్రం.. ఈ పని చేయొద్దు, ఆడదే చేస్తుంది అని అమ్మ చెప్తుంది. జీతాల్లేని శ్రామికులంఅలా కాకుండా.. మీ ఇద్దరూ కలిసి పనిచేయాలిరా అని అమ్మ చెప్పి పెంచితే ఎంత బాగుంటుంది. సమాజంలోని ఎన్నో విషయాలను సరిచేసే శక్తి మహిళకు ఉంది. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే ఆడవాళ్ల గురించి పట్టించుకోవాలి. మనం జీతాల్లేని శ్రామికులం. పుట్టుకతోనే శ్రామికులం. అన్నం ఎవరు వండినా ఉడుకుతుంది. ఆడదాని చేత్తో వండితేనే అన్నం అవుతుందా? అబ్బాయిలకు కూడా అన్నీ నేర్పండి. మా అబ్బాయికి కూడా..సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. దీనివల్ల యువత పక్కదారి పడుతుంది. ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. బట్టలు వేసుకునే బయటకు వెళ్లాలి.. ఒంటిపై డ్రెస్ లేకుండా వెళ్లకూడదని పిల్లలకు చిన్నప్పుడే చెబుతున్నాం.. దాన్ని అలవాటు చేశాం. ఇక్కడ ఆడవాళ్లం చీరలు కట్టుకుంటాం. లండన్లో షార్ట్స్, స్కర్ట్స్,గౌన్ వేసుకుంటారు. మన అలవాట్లనే పిల్లలకు నేర్పించి మంచిదోవ పట్టించాలి. మా అబ్బాయికి కూడా అదే చెప్తుంటాను. చెడు అలవాట్ల వల్ల వచ్చే కష్టనష్టాలను చెప్పి దానిజోలికి వెళ్లకుండా చూసుకోవాలి అని రోహిణి చెప్పుకొచ్చింది.చదవండి: కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు లోక ఆఫర్ -
మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది.The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12thMegastar @KChiruTweets Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut— Shine Screens (@Shine_Screens) January 2, 2026 -
పదేళ్ల తర్వాత స్టార్హీరోకు భారీ హిట్.. ఊహించని రేంజ్లో కలెక్షన్స్
మలయాళ సినిమా 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మలయాళం భారీ కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. ఏకంగా పదేళ్ల తర్వాత నటుడు నివిన్ పౌలీకి భారీ హిట్ దక్కింది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్స్ ఉంది.ఈ ఏడాదిలో కొత్త లోక చిత్రం మలయాళం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ దాటింది. 2025 సినిమా కలెక్షన్స్ లిస్ట్లో టాప్లో ఈ చిత్రం ఉంది. అయితే, ఏడాది ముగింపులో విడుదలైన సర్వం మాయ సినిమా కూడా ఇప్పడు జోరు చూపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ. 76 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే, సులువుగా రూ. 150 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.‘సర్వం మాయ’ కథ రొమాంటిక్ కామెడీ-డ్రామాకు కాస్త హారర్ జోడించడం ఆపై ఫాంటసీని కూడా కలపడంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ విజయంలో నివిన్ పాలీ నటన కీలకమైతే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రియా శిబూ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకర్షించింది. ఇందులో ఆమె నటనపై రివ్యూవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రియా శిబూకి సినీ రంగంతో బలమైన అనుబంధం ఉంది. ఆమె నిర్మాతగా కూడా రాణిస్తుంది. గతంలో హీరోయిన్గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వీర ధీర శూరన్ చిత్రాన్ని నిర్మించిన రియా కోలీవుడ్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పంపిణీ చేసింది. -
పెద్ద హీరోల సినిమాలు.. ఓవర్సీస్లో కనిపించని సంక్రాంతి జోరు
సంక్రాంతి సినిమాలకు ఓవర్సీస్లో అనుకున్నంత రేంజ్లో బజ్ లేదని తెలుస్తోంది. చాలా సినిమాలు రేసులో ఉన్నప్పటికీ ప్రీబుకింగ్స్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, జన నాయకన్ ప్రీమియర్స్ అడ్వాన్స్ టికెట్లు ఓపెన్ చేశారు. కానీ, ట్రేడ్ వర్గాలు అంచనా వేసినంత రేంజ్లో ముందస్తు బుకింగ్స్ జరగడం లేదు.జనవరి 8న ది రాజా సాబ్తో పాటు జన నాయకన్ ప్రీమియర్లలో విడుదల కానుంది. ఆపై జనవరి 11న మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్లోకి రానున్నాడు. వీటిలో ది రాజా సాబ్ 342 ప్రదేశాలలో 1,021 స్క్రీన్స్లలో విడుదల కానుంది. అయితే, ఇప్పటికీ కూడా కేవలం 3లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ప్రభాస్ నటించిన మునుపటి చిత్రాలు కల్కి, సలార్ చిత్రాలు వరుసగా 4 మిలియన్లు, 2.5 మిలియన్ల కలెక్షన్స్ ప్రీమియర్ బుకింగ్ల ద్వారానే వచ్చాయి. కానీ, రాజా సాబ్కు అలాంటి పరిస్థితి లేదు. విడుదలకు మరో ఆరురోజులు మాత్రమే వుంది. దీంతో కనీసం 1 మిలియన్ మార్క్ వరకు చేరుకోవడమే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓవర్సీస్లో 119 ప్రదేశాలలో 423 స్క్రీన్స్లకు సంబంధించిన టికెట్లు ఓపెన్ అయ్యాయి. అయితే, ఇప్పటికి లక్ష డాలర్లు మాత్రమే వసూలు చేసి.. 4వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో జన నాయగన్ మూవీతో విజయ్ దూసుకుపోతున్నాడు. తన నటించే చివరి సినిమా కావడంతో ఓవర్సీస్లో ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటింది. కారణాలు ఇవే..సంక్రాంతి సినిమాల అమెరికా ప్రీమియర్ ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణాలు సినిమాలపై మిశ్రమ అంచనాలు ఉండటమేనని చెబుతున్నారు. ఆపై టికెట్ ధరలు పెరగడం, ప్రమోషన్లలో పెద్దగా జోరు చూపించకపోవడం ఆపై పెద్ద స్టార్ సినిమాలు ఉన్నప్పటికీ, ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను బలంగా ఆకర్షించలేకపోయాయి. ఒక్కో టికెట్ ధర 30 డాలర్లకు (2,700) మించే ఉండటంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం మీద, అమెరికాలో సంక్రాంతి సినిమాల ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి మార్కెట్ పరిస్థితులతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా ప్రభావం చూపాయి. -
ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్..!


