Tollywood
-
HPV వ్యాక్సిన్ డ్రైవ్కి మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA).. హెచ్ పీవీ(HPV Vaccine) వ్యాక్సిన్ డ్రైవ్కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ అసోసియేషన్.. ఏడాది మొత్తం హెచ్ పీవీ వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలని అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇతడి అభిమాన సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు.. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!)9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం.. స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమంతో ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం మంచి విషయం అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?) -
బంధువుల పెళ్లిలో విరోష్ జోడీ.. భర్త ఒడిలో కూర్చున్న రష్మిక
విరోష్ జంట ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. విజయ్- రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. తమ బంధువుల పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో విజయ్ తల్లి కూడా ఉన్నారు. ఇక రష్మిక.. విజయ్ ఒడిలో కూర్చుంది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా వివాహ వేడుకలో కనిపించారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. విజయ్- రష్మిక పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే పెళ్లై నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ రష్మిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ టాలీవుడ్ కపుల్ రణబలి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న దురంధర్-2.. తెలుగులో మాత్రం డీలా పడిపోతోంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కేవలం రూ.25 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. అదే సమయంలో గతేడాది రిలీజైన కాంతార-2 తెలుగు వర్షన్లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ దురంధర్-2 విషయానికొస్తే తెలుగు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతగా రావట్లేదని తెలుస్తోంది.తెలుగులో కలెక్షన్స్ డీలా..తెలుగులో కలెక్షన్స్ తగ్గడానికి కారణాలున్నాయి. ఇక్కడ తక్కువ స్క్రీన్స్ కేటాయించడం.. అంతేకాకుండా తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం ప్రధానంగా వసూళ్లపై ప్రభావంపై కనిపిస్తోంది. వీటితో పాటు లాంగ్ రన్టైమ్ 4 గంటల నిడివి వల్ల కొంతమంది ఆడియన్స్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వయొలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దురంధర్-2ను థియేటర్లో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ కారణాల వల్లే తెలుగులో తక్కువ కలెక్షన్స్ వస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. -
'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్'
శర్వానంద్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ బైకర్. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ చిత్రంగా బైకర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లలో దూసుకెళ్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం సందడి చేశారు. బైకర్ మూవీకి తన బైక్పై స్టైలిష్గా కనిపించారు. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డైలాగ్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇది చూసిన శర్వానంద్ ఫుల్ ఖుషీ అయిపోయారు. థ్యాంక్ యూ ప్రభాస్ అన్న.. లవ్ యూ.. నువ్వు ఎప్పుడు నాకు అండగా ఉంటావ్.. మన బంధం ఎప్పటికీ ఇలానే పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాని పోస్ట్ చేశారు. అవును... ట్రైలర్ చూసి కొన్ని నమ్మాల్సిందే అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. Thank you, Prabhas Anna. Love you 🫂You’ve always been there for me. Our bond is something I’ll always cherish.Yes… trailer chusi konni nammeyali 😉Experience 𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐌𝐎𝐓𝐎𝐂𝐑𝐎𝐒𝐒 𝐅𝐈𝐋𝐌 in Dolby Cinema, EPIQ, 4DX and PCX.#Biker Grand release on… pic.twitter.com/R4efg8BUi7— Sharwanand (@ImSharwanand) March 31, 2026 -
‘బ్యాండ్ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్ (ఫొటోలు)
-
అప్పుడే చనిపోయేవాడిని.. తన వల్లే ఇప్పటికీ బతికున్నా..: నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైల్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని బీచ్కు వెళ్లానని తెలిపారు. కానీ అక్కడ ఓ అమ్మాయి తన జీవితాన్ని కాపాడిందని అన్నారు. రెండు కాళ్లు, చేతులు లేని అమ్మాయిని చూసి నా నిర్ణయం మార్చుకున్నాని వెల్లడించారు. రేపు అనేది తెలియని ఆ అమ్మాయి.. వాళ్ల తమ్ముడు బండి తోస్తుంటే బెలూన్స్ అమ్ముతూ బతికినప్పుడు.. నేను ఎందుకు బతకలేనని అనుకున్నానని కోన వెంకట్ తెలిపారు. నా కోసం ఆ దేవుడే ఆ అమ్మాయిని పంపించాడని అనుకుంటానని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ సంఘటన 1997లో జరిగిందని కోన వెంకట్ చెప్పారు. ఒక 50 నిద్రమాత్రలు తీసుకుని.. నా దగ్గర ఉన్న చివరి డబ్బులతో వాటర్ బాటిల్ తీసుకున్నానని తెలిపారు. ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే ఈ రోజు కోన వెంకట్ అనేవాడు లేడన్నారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలకు కథలు రాశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలాసార్లు అమ్మాయి కనిపిస్తుందేమోనని బీచ్లో వెతుక్కుంటూ వెళ్లానని అన్నారు. కానీ ఎక్కడా కూడా మళ్లీ ఆ అమ్మాయి కనిపించలేదన్నారు. బ్యాండ్మేళం థ్యాంక్ యూ మీట్కు హాజరైన కోన వెంకట్ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండు మేళం. ఈ మూవీకి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
దసరాకి వృషకర్మ?
హీరో నాగచైతన్య జైపూర్ వెళ్లారట. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు స్పర్‡్ష శ్రీవాస్తవ విలన్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ రాజస్తాన్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్ కోసం నాగచైతన్య అండ్ టీమ్ హైదరాబాద్ నుంచి జైపూర్కు ప్రయాణం అయ్యారని సమాచారం.రాజస్తాన్లో జరిగే ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుందట. మే కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి, త్వరితగతిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసి, ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్ బి. లోక్నాథ్. -
డబుల్ ట్రీట్
అభిమాన హీరోలు స్క్రీన్పై ఒక గెటప్లో కనిపిస్తేనే వారి ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్స్ మారు మోగిపోతాయి. అలాంటిది ఒకే టికెట్పై ఒక బొమ్మలో తమ అభిమాన హీరోను రెండు గెటప్స్, రెండు క్యారెక్టరైజేషన్స్తో చూసినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఇలా ప్రేక్షకులను అలరించేందుకు కొందరు తెలుగు హీరోలు ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాలు చేస్తున్నారు. వెండితెరపై డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హీరోలపై ఓ లుక్ వేయండి.. మరోసారి డబుల్ ధమాకా ‘విక్రమార్కుడు, దరువు, పవర్’ వంటి చిత్రాల్లో రవితేజ ద్విపాత్రాభినయం చేసి ఆడియన్స్ని మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ మళ్లీ ‘ఇరుముడి’ సినిమాలో డబుల్ రోల్లో కనిపించనున్నట్లుగా తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ థ్రిల్లర్ సినిమాలో ఒక పాత్రలో తండ్రిగా, మరో పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ కనిపిస్తారట. ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీశంకర్, కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.రుద్ర... రాముడు మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు నటిస్తున్నారు. అలాగే రాముడి పాత్రలోనూ కనిపించనున్నారు. ‘వారణాసి’ సినిమాలో రుద్ర, రాముడిగా... ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా ఇటీవల మహేశ్బాబు ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే... సమ్మర్ సమయం కనుక వేసవి తాకిడికి కాస్త దూరంగా ఉండాలని మహేశ్బాబు అండ్ టీమ్ భావిస్తున్నారట.ఇందులో భాగంలో ఈ వేసవి సమయంలో మహేశ్బాబు ఓ వెకేషన్ను ప్లాన్ చేసుకున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. మేలో మళ్లీ షూటింగ్ను స్టార్ట్ చేస్తారు. జూన్లో ‘వారణాసి’ సినిమా యూనిట్ అంటార్కిటికా లొకేషన్స్లో చిత్రీకరకణను ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఈ ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకోబోయే తొలి తెలుగు చిత్రంగా ‘వారణాసి’ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ షెడ్యూల్లో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రాతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఓ పాట చిత్రీ కరణ కూడా ఉంటుందట. అలాగే రాముడి పాత్రలో మహేశ్బాబు కనిపించే సీక్వెన్స్ దాదాపు అరగంట పాటు ఉంటుందని తెలిసింది.ఇంకా ‘వారణాసి’ సినిమాను తొలుత రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక భాగంగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా రాజమౌళి ఇటీవల ఓ సందర్భంగా చెప్పా రు. కానీ ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘ధురంధర్’ రెండు భాగాలుగా విడుదలై, బంపర్ బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. పైగా ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలుగా తీసిన అనుభవం రాజమౌళికి ఉంది. మరి... ‘వారణాసి’ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మహేశ్బాబు చైల్డ్ ఆర్టిస్టుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో సూపర్స్టార్ కృష్ణ హీరోగా నటించగా, విజయశాంతి హీరోయిన్గా నటించారు.డ్రాగన్లో డ్యూయల్ రోల్? ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమా చిత్రీకరణ స్టార్టింగ్లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా కనిపించారు. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత లీన్ లుక్లోకి వచ్చేశారు. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏమైనా ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అనిల్ కపూర్, కాజోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని భోగట్టా. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రీకొడుకు దేవ, వర పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదలైంది. మలి భాగం చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ‘దేవర’ సినిమాను నిర్మిస్తున్నారు.పెద్ది ఆట రామ్ చరణ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం రామ్ చరణ్ క్రికెటర్గా, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించారు. ఇటీవల ‘పెద్ది పహిల్వాన్’ అంటూ ‘పెద్ది’ సినిమా నుంచి ఓ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో క్రికెటర్గా ఉన్న రామ్చరణ్, కుస్తీ చాలెంజ్ను స్వీకరించినట్లుగా కనిపిస్తోంది.కానీ క్రికెటర్ నుంచి రామ్ చరణ్ కుస్తీ వైపు అడుగులు వేయడానికి బలమైన కారణం ఉందని, తన తండ్రి కోసమే రామ్ చరణ్ అలా మారతారని ఫిల్మ్నగర్ భోగట్టా. అయితే ఈ తండ్రి పాత్రలోనూ రామ్ చరణే కనిపిస్తారట. అలా తండ్రీకొడుకులుగా ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాకపోతే... ఈ సినిమా రిలీజ్ డేట్లో మార్పు ఉండొచ్చని, ‘పెద్ది’ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కావడం లేదని, జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రోడక్షన్స్ వర్క్స్ విషయంలో టీమ్ హడావిడి చేయకుండా క్వాలిటీ కోసం టైమ్ కేటాయించాల్సి రావడం, ఇటీవల రామ్ చరణ్ కంటికి చిన్న గాయం కావడం వంటి అంశాలు ‘పెద్ది’ సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణమై ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బ్రదర్స్గా... కెరీర్లో ఇప్పటి వరకు 21 సినిమాలను పూర్తి చేశారు అల్లు అర్జున్. కానీ వెండితెరపై అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి బ్రదర్స్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే ఇటీవలి కాలంలో రెండు డిఫరెంట్ లుక్స్లో అల్లు అర్జున్ కనిపించారు.దీంతో అల్లు అర్జున్లోని ఈ డిఫరెంట్ మేకోవర్ అట్లీ సినిమా కోసమే అనే ప్రచారానికి బలం చేకూరి నట్లయింది. ఈ నెల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ భోర్సే... వంటి హీరోయిన్స్ కూడా భాగం కానున్నారని, త్వరలోనే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిసింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.అయితే తన వంతు షూటింగ్ను మాత్రం అల్లు అర్జున్ త్వరితగతిన పూర్తి చేసి, లోకేశ్ కనగరాజ్తో చేయాల్సిన సినిమా షూటింగ్లో పాల్గొంటారు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రానికి భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో పోస్ట్ ప్రోడక్షన్స్ కోసం ఈ మూవీ టీమ్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేయడం సాధ్యపడదట.తొలిసారిగా..! ఈ మధ్య ‘ఎక్స్ట్రా, రాబిన్హుడ్’ వంటి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన ‘తమ్ముడు’ వంటి యాక్షన్ డ్రామా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు నితిన్. తాజాగా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ సైన్ చేశారని సమాచారం. ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా, ఒక్క క్షణం, ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనింగ్ మూవీలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. 30 సినిమాలకుపైగా చేసిన నితిన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న చిత్రం ఇది. కామ్రేడ్ కల్యాణ్ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘కామ్రేడ్ కల్యాణ్’. 1992 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను బట్టి ఈ చిత్రంలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కామ్రేడ్ కల్యాణ్గా, గ్రామంలోని ఓ చురుకైన వ్యక్తిగా శ్రీ విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నాగబంధం విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో విరాట్ కర్ణ కనిపించనున్నట్లుగా ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది. ఇందులో లార్డ్ శివగా, ఓ మాములు మోడ్రన్ అబ్బాయిగా విరాట్ కర్ణ కనిపిస్తున్నారు. సో... ‘నాగబంధం’లో విరాట్కర్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఊహించవచ్చు మరి... ఈ సినిమాలో విరాట్ కర్ణ రోల్ ఎలా ఉండబోతుంది అనేది జూన్ 3న తెలిసిపోతుంది. ఎందుకంటే.. ఈ సినిమాను ఆ రోజే రిలీజ్ చేస్తున్నారు. ‘‘భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ‘నాగబంధం’ సినిమా కథనం సాగుతుంది. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఈ సినిమా స్టోరీ సాగుతుంది’’ అని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో రిషబ్ సాహ్ని, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ తరహా కథలను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.– ముసిమి శివాంజనేయులు -
10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?
హాలీవుడ్ సినిమాలు సరైన కంటెంట్తో రావాలే గానీ మన దేశంలోనూ మంచి కలెక్షన్స్ వస్తాయి. అలా లేటెస్ట్గా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లో వారం క్రితమే థియేటర్లలో రిలీజై అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. గత వీకెండ్ మన దేశంలోని విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? వసూళ్లు ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)మన దగ్గర ప్రస్తుతం 'ధురంధర్ 2' హవా నడుస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' గురించి సినీ ప్రేమికులు తెగ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పేస్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజ్ కాగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.2800 కోట్ల మేర వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. మరింతగా పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.భారత్లో చాలావరకు ఈ సినిమాని మల్టీప్లెక్స్ల్లో మాత్రమే స్క్రీనింగ్ చేస్తున్నారు. అయినా సరే నాలురు రోజుల్లో రూ.18 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా కొన్నిచోట్ల హౌస్పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి గతంలో వచ్చిన ఇంగ్లీష్ చిత్రాలతో పోలిస్తే దీనికి బాగానే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ విజువల్స్ అదిరిపోయాయని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!) -
అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!
అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరకొచ్చేసింది. దీంతో అట్లీతో చేస్తున్న మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే స్పెషల్ పోస్టర్తో పాటు టైటిల్ ప్రకటన ఉంటుందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు బయటపెట్టారు. ఇదొచ్చిందని ఆనందించేలోపు మూవీ టీమ్కి ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఎదురైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుని.. తర్వాత దుబాయిలో కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ యుద్ధ ప్రభావం ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలపై బలంగా ఉంది. మరీ ముఖ్యంగా దుబాయిలో ఎప్పటికప్పుడు ఏదో బాంబు పేలుతూనే ఉన్నట్లు ఎప్పటికప్పుడు వార్తలొస్తున్నాయి. దీంతో దుబాయి షెడ్యూల్ని రద్దు చేశారట. మరి వేరే దేశానికి ఏమైనా దీన్ని షిఫ్ట్ చేస్తారా? లేదంటే పరిస్థితులు సద్దుమణిగాక దుబాయిలోనే చిత్రీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు అయితే ముంబైలోనే వేసిన సెట్స్లో అల్లు అర్జున్, దీపికా పదుకొణెలపై చాలావరకు సీన్స్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా, థియేటర్లలోకి రావొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు షూటింగ్ రద్దవడం లాంటి వార్తలు చూస్తుంటే.. థియేటర్లలోకి రావడం మరింత ఆలస్యమవుతుందా అనిపిస్తుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో) -
ఆ సినిమా నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో
తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇందులో మలయాళ హీరో టొవినో థామస్.. విలన్గా నటిస్తున్నాడనే రూమర్స్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. ఇప్పుడు టొవినో హీరోగా నటించిన 'పల్లి చట్టంబి' మూవీ తెలుగులోనూ విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ తారక్-నీల్ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')'తెలుగ చిత్రాల్లో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ మలయాళ వర్కింగ్ కల్చర్తో పోలిస్తే టాలీవుడ్లో భిన్నంగా ఉంటుంది. మేం తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తిచేసేస్తాం. తెలుగులో షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ. పైగా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు ఇష్టముండదు. ఒకటి పూర్తయ్యాకే మరొకటి చేస్తుంటా. ఒకవేళ తెలుగులో పెద్ద సినిమాలో నటిస్తే.. నేను ఒప్పుకొన్నా మూడు-నాలుగు మలయాళ చిత్రాలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే తెలుగులో నటించలేకపోతున్నా. డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ మూవీ(ఎన్టీఆర్-నీల్) చేయట్లేదు' అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా చాలా సినిమాలు చేసిన టొవినో థామస్.. గత పదేళ్లుగా మాత్రం హీరోగా మూవీస్ చేస్తున్నాడు. మిన్నల్ మురళి, 2018 తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఇతడు పరిచితమే. అలాంటిది ఇప్పుడు ఇతడు, ఎన్టీఆర్-నీల్ మూవీలో లేడని తెలిసింది. మరి ఇతడి బదులు వేరే ఎవరిని తీసుకున్నారో చూడాలి?(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ) -
రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)
-
మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై రాకాస అనే మూవీని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. -
ఆ క్షణం చనిపోవాలని అనిపించింది: హేమ
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతేడాది ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత ఆమెను కోర్ట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వహించా ఈ సందర్భంగా ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా మానసికంగా కలచివేశాయని తెలిపింది. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు అంతలా నన్ను మానసికంగా కుంగిదీసిందని వెల్లడించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేసింది. నాపై వచ్చిన తప్పుడు వార్తల వల్ల తన కుటుంబం చాలా బాధపడిందన్నారు.మీట్ ది ప్రెస్లో హేమ మాట్లాడుతూ....'డ్రగ్స్ కేసులో కొందరు తనపై నిరాధార ఆరోపణలు చేశారు. వాటితో తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ఆ సమయంలో చాలా సఫర్ అయ్యా. అది నాకు చాలా కఠినమైన కాలం. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలనిపించింది' అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. -
‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పెద్ది రిలీజ్ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్కేఎన్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రెజ్లర్ లుక్లో కనిపించిన ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్పై టాలీవుడ్లో మాత్రం పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. మరోసారి వాయిదా పడనుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు.చెన్నై లవ్ స్టోరీ సాంగ్ ఈవెంట్లో మా సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చించుకున్నామని ఎస్కేఎన్ తెలిపారు. అదే సందర్భంలో జూన్ 25న పెద్ది రిలీజ్ అవుతుందేమోనని సాయి రాజేశ్ అన్నారు. కానీ అక్కడ గందరగోళంలో పెద్ది రిలీజ్ అనౌన్స్ చేశారమో అనుకున్నానని వెల్లడించారు. నేను తప్పుగా అర్థం చేసుకుని అలా చెప్పా.. అంతేకానీ పెద్ది మూవీ రిలీజ్ వాయిదా అనేది అఫీషియల్గా రాలేదని చెప్పారు. నా కామెంట్స్ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఇలా అయినందుకు మీ అందరికీ సారీ అంటూ నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు.కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Producer @SKNonline clarification regarding #Peddi release date which he announced at #ChennaiLoveStory song launch Event #KiranAbbavaram #SKN #Ramcharan pic.twitter.com/uDCbkinMbJ— Milagro Movies (@MilagroMovies) March 30, 2026 -
కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా జీతం రూ.2700.. ఆల్టో కారు మాత్రమే తెలుసు: టాలీవుడ్ నిర్మాత
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లైఫ్ నా ఎదుగుదలకు సహకరించిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాకు వెంటవెంటనే సినిమాలు చేయడం అలవాటు లేదన్నారు. 2012లో ఈ రోజుల్లో మూవీ, 2018లో టాక్సీవాలా, 2023లో బేబీ చేశానని తెలిపారు. నిర్మాత ఎక్కువ సినిమాలు చేయాలంటే నాకు భయమని వెల్లడించారు.నా కెరీర్ ప్రారంభంలో కేవలం రూ.2700 జీతానికి పని చేశానని ఎస్కేఎన్ తెలిపారు. నన్ను నిర్మాతగా తీర్చిదిద్దింది డైరెక్టర్ మారుతీ అని వెల్లడించారు. మారుతీ, స్వివ్ట్, ఆల్టో వంటి కార్లు తప్ప వేరే కార్ తెలీని నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్ సాయి రాజేశ్ అని అన్నారు. వాడు లేకుండా నేను ఏది చేయను అని చెప్పే వాళ్లలో నా తమ్ముడు లాంటి వ్యక్తి రవి నంబూరి అని తెలిపారు. వీళ్లందరి సహకారం వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. లేదంటే ఇలాంటి సినిమా థియేటర్లో టికెట్ కొనాలంటే కూడా ఆలోచించే కుటుంబం మాది అని అన్నారు. బేబీ సూపర్ హిట్ తర్వాత మరో సినిమాతో మీ ముందుకొస్తున్నామన్నారు. తాజాగా నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడారు.కాగా.. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్స్టోరీ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయిరాజేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని గుర్తుందా...అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను డాల్బీ ఫార్మాట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. -
ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది: కిరణ్
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్స్టోరీ సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయిరాజేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘గుర్తుందా...’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను డాల్బీ ఫార్మాట్లో చేస్తుండటం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఈ సినిమా కోసం ఏడు పాటలను కంపోజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.‘‘ఈ మూవీ డిస్కషన్స్ లో బ్రహ్మాండమైన ట్యూన్స్ కుదిరాయి’’ అని చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ.‘‘ఈ సినిమా కోసం వంద రోజులు షూటింగ్ చేస్తున్నాం. మణిశర్మగారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు రవి నంబూరి. ‘‘బేబీ’ సినిమాను ఐదు గంటలు తీశాను. కానీ, ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా నిడివిని కుదించడంలో రవి నంబూరి నాకు హెల్ప్ చేశాడు. సినిమాలో కొంత భాగం చూసి, కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నేను ప్రోడ్యూసర్గా మణిశర్మగారితో సినిమా చేయడం కంటే ఇంకేం కోరుకోను’’ అన్నారు సాయిరాజేష్.‘‘ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం అని చెప్పినప్పుడు అల్లుఅర్జున్ గారు కూడా ప్రోత్సహించారు’’ అన్నారు ఎస్కేఎన్ . ‘‘బేబి’ సినిమా కంటే పదిరెట్ల విజయాన్ని ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా సాధిస్తుంది. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు ఈ చిత్ర సహ–నిర్మాత ధీరజ్ మొగిలినేని. హీరోయిన్ శ్రీగౌరి ప్రియ, కెమెరామేన్ విశ్వాస్ డేనియల్, ఎడిటర్స్ సంతోష్ నాయుడు, విప్లవ్, నటుడు మహేందర్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకీ మాట్లాడారు. -
ప్రస్తుతం కోలీవుడ్.. ఊహించని డైరెక్టర్తో ఐకాన్ స్టార్..!
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ . ఈ చిత్రం తర్వాత మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తారాయన. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మలయాళ దర్శకుడు, నటుడు బసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఇటీవల జరిగిన అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహంలో బాసిల్ జోసెఫ్ కనిపించారు. దీంతో అల్లు అర్జున్ –బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లు అయింది. బాసిల్తో అల్లు అర్జున్ చేయబోయేది ఓ సూపర్ హీరో మూవీ అని, అల్లు అర్జున్ కెరీర్లో ఇది 25వ సినిమాగా ఉంటుందని టాక్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
'పెద్ది' మళ్లీ వాయిదా నిజమే.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరోసారి వాయిదా పడింది. మీరు విన్నది నిజమే. గత కొన్నిరోజుల నుంచి ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ మౌనవ్రతం పాటిస్తుండగా.. అభిమానుల మాత్రం అలాంటిదేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఏం చెప్పనప్పటికీ.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్, సోమవారం సాయంత్రం జరిగిన ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ 'పెద్ది' కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు.(ఇదీ చదవండి: తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?)మార్చి 27న చరణ్ పుట్టినరోజున 'పెద్ది' రిలీజ్ చేస్తామని తొలుత అనౌన్స్ చేశారు. తీరా డేట్ దగ్గరపడేసరికి ఏప్రిల్ 30న వస్తామని అన్నారు. కానీ ఐటమ్ సాంగ్తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్లో ఉండటం, ఈ మధ్యే చరణ్ కంటికి గాయం కావడం తదితర అంశాలతో చెప్పిన తేదీకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే లీకులు వచ్చేస్తున్నాయి.జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది రిలీజ్ అవుతుందని అఖిల్ 'లెనిన్'ని జూన్ 26కి వాయిదా వేశారు. మరి 'పెద్ది' తప్పుకొంది కాబట్టి 'లెనిన్'.. ముందే చెప్పినట్లు మే 1న థియేటర్లలోకి వస్తాడా లేదంటే మరో తేదీ చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' తప్పుకొంటే అదే తేదీకి వచ్చేయాలని నిఖిల్ 'స్వయంభు' సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అదే టైంలో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర'తో పాటు పలు చిత్రాలు లైనులో ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని అదే తేదీని టార్గెట్ చేసుకుంటాయో చూడాలి? ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఇప్పుడు 'పెద్ది' కూడా తప్పుకొంది. దీంతో ఈసారి కూడా స్టార్స్ లేకుండానే సమ్మర్ ఉండబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?
ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు అనుకోని విధంగా ఓ జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కారణం. ఈ చిత్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు వార్తలొస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే కథాంశం ఇందులో ఉండటమే ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. బాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన 'ధురంధర్', త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' కూడా ఈ తరహా కాన్సెప్ట్లతోనే తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యుద్ధ నేపథ్యంలో ఉండే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే సాధారణంగా విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్తుంటాయి కానీ పెద్దగా ప్రచారం లేని ఓ తెలుగు మూవీ ఈ రేంజ్లో హైలైట్ కావడంతో.. అందులో కంటెంట్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్లో ఇలా ఓ సినిమా.. జియో పొలిటకల్ వివాదంలో ఇరుక్కోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామానా? లేక భారతదేశం- ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య సంబంధాలను ఏమైనా టచ్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కథే ఉందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చే క్లియరెన్స్పై ఈ చిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
హీరో వెంకట్ 'హరుడు' రిలీజ్ ఎప్పుడంటే?
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు తదితర సినిమాలతో అప్పట్లో సక్సెస్ అందుకున్న హీరో వెంకట్.. తర్వాత అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది రిలీజైన 'ఓజీ'లోనూ పవన్ కల్యాణ్కి అన్నగా నటించాడు. ఇతడు హీరోగా చేసిన 'హరుడు' సినిమా విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాక్టర్.దిక్కల లక్ష్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మే 8న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హెబ్బా పటేల్ , సలోని , నటషా , అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు) -
సంగీత రంగంలో కొత్త ప్రభంజనం 'కార్మేని సెల్వం'
అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వం వహించిన ద్విభాషా సినిమా 'కార్మేని సెల్వం'. సముద్రఖని, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే ఈ మూవీకి సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన 'అరెరె' పాట ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా థియేటర్లలోకి రానున్న సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలని పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)సినిమాకు సంగీతమందించిన ఘనత ఒక్క వ్యక్తికి కాకుండా, ఓ సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో 'Musicloud Studio & Technology'ని ప్రారంభించాను. ప్రస్తుతం 'కార్మేని సెల్వం' ప్రాజెక్టు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.ఇందులో భాగంగా సౌండ్ ఇంజనీర్లు, వాయిద్య కారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేం సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాం. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. తెలుగులో హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. కార్మేని సెల్వం.. హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
ఇండస్ట్రీలో ఆయన లేని లోటు కనిపిస్తోంది.. హేమ ఆవేదన
టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తన గురించి తెలిసి కూడా అలా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో తనకు పాజిటివ్ అని రాకుండానే.. వచ్చిందని ప్రచారం చేశారని ఆరోపించింది. ఇదంతూ చూస్తుంటే ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగానని.. నేను మీ అందరికీ తెలుసు కదా అని ప్రశ్నించింది. నాకు కూడా ఫ్యామిలీ ఉందని.. మా బాధలు అర్థం చేసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఏదైనా నిర్ధారణ అయ్యాకే రాయాలని హేమ సూచించింది. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరని అన్నారు. సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. మరి అదే కేసును కోర్టు కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని తెలిపింది. -
గ్రీన్ అవుట్ఫిట్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)
-
అప్పుడు శ్రీ రాముడు.. ఇప్పుడు హనుమాన్.. వైరల్ అవుతోన్న చెర్రీ లుక్స్
-
నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు.ప్రకాశ్ రాజ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడకు చెందిన ప్రకాశ్ రాజ్ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. విలక్షణమైన పాత్రలతో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. -
విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్ షూటింగ్ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. బీచ్లో విషాదంఅది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు.ఇండస్ట్రీకి తీరని లోటుహీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సినిమారాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.చదవండి: ఓపక్క షూటింగ్.. మరోపక్క భార్య కోసం ఆరాటం -
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు.. ఆ రెండు మాత్రమే స్పెషల్
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనకు కాస్తా రిలీఫ్ ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అలా మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడ్ సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ శుక్రవారం ఎంటర్టైన్ చేసేందుకు శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాస, సముద్రఖని కార్మేని సెల్వంతో పాటు లెజెండ్ శరవణన్ హీరోగా వస్తోన్న లీడర్ కూడా గ్రాండ్ రిలీజ్ కానుంది. వీటిలో బైకర్, రాకాస, కార్మేని సెల్వం చిత్రాలపై బజ్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. టాలీవుడ్ నుంచి సుహాస్ మూవీ హే బల్వంంత్, శ్రీ విష్ణు థ్రిల్లర్ మృత్యుంజయ్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్, వధ్-2 లాంటి మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లోకి రానున్నాయి. ఓవరాల్గా చూస్తే దాదాపు 16 మూవీస్, సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..రిపుల్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 31హ్యాపీ పటేల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 01జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 02మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04జియో హాట్స్టార్..సెండ్ హెల్ప్(హాలీవుడ్ హారర్ మూవీ)- మార్చి 31ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..హే బల్వంత్(తెలుగు సినిమా)- మార్చి 31బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుజ్ మూవీ)-ఏప్రిల్ 03 -
మిరాకిల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది
‘‘కుమారి 21ఎఫ్, ఈడో రకం–ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్’ వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్లో ఉన్నప్పటికీ ‘మిరాకిల్’ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అని హెబ్బా పటేల్ అన్నారు. రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాకిల్’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తుండగా, సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన కొండమడుగులో పూర్తయింది. ‘‘ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కొండమడుగు గ్రామ ప్రజల సహకారాన్ని మా యూనిట్ మర్చిపోదు’’ అన్నారు. ‘‘90 శాతం షూట్ పూర్తయింది. త్వరలో చివరి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ శ్రీకాంత్ తెలిపారు. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
పెద్ది పహిల్వాన్ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.ఈ గ్లింప్స్లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్ కఠినంగా డైట్ తీసుకున్నారు. పహిల్వాన్లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.కఠినమైన డైట్..పహిల్వాన్ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్నెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
వెంకీ మామ స్టైలే వేరు.. సింపుల్గా హోటల్కు వెళ్లి..!
వెంకీమామ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అలరించారు. మెగాస్టార్ హీరోగా వచ్చిన మనశంకర వరప్రసాద్గారు మూవీతో అభిమానులను మెప్పించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా కనిపించింది. గతేడాది అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సైతం బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది.తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ కాంబో రిపీట్ కానుంది. అయితే ఈసారి తన తొలి సినిమా హీరో కల్యాణ్రామ్ కూడా తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురి క్రేజీ కాంబోలో రానున్న చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే క్లారిటీ రానుంది.ఇక సినిమా సంగతి పక్కనపెడితే విక్టరీ వెంకటేశ్ తాజాగా ఓ హోటల్లో సందడి చేశారు. సామాన్యుడిలాగే హోటల్కు వెళ్లి టిఫిన్ చేశారు. బెంగళూరులోని విద్యార్థి భవన్ అనే హోటల్కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వెంకీమామ సింప్లీసిటీని తెగ మెచ్చుకుంటున్నారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 2026 -
'డోర్ తీసి చీర మార్చుకో'.. ఆ స్టార్ నిర్మాతను కాలితో తన్నా: నటి
భయం తన బ్లడ్డులోనే లేదంటోంది నటి రాధా ప్రశాంతి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమెను టైగర్, ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 125 సినిమాలు చేసిన ఆమె చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ఏకరువు పెట్టింది.అర్ధరాత్రి రాద్ధాంతంరాధా ప్రశాంతి మాట్లాడుతూ.. 'నేనుంటున్న ఫ్లాట్ 2005లో బిల్డర్ దగ్గర కొనుక్కున్నాను. మొదట్లో దాన్ని అద్దెకిచ్చాము. అక్కడేం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. 2012లో మేము ఆ ఫ్లాట్కు షిఫ్ట్ అయ్యాం. ఆ అపార్ట్మెంట్లో అక్రమ కార్యకలాపాల ఆఫీసులు నడిపిస్తున్నారని తెలిసింది. వాళ్లు తాగి వచ్చి అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టేవారు. ముఖ్యంగా వాచ్మెన్ కుటుంబంతోనే నాకు ప్రాణభయం ఉంది.నా ఇంటిని తగలపెట్టారునా ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతోంది. 2014లో పోలీసులు రైడ్ చేసి ఆ బిల్డింగ్ను సీజ్ చేశారు. కొంతకాలానికి మళ్లీ ఆ దందా మొదలుపెట్టారు. వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. వాళ్ల దందాకు అడ్డొస్తున్నాననే కరోనా సమయంలో ఓ నిర్మాత నా ఇంటిని కావాలని తగలపెట్టాడు. నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టాలని దాడులు చేయించారు.నిజాలు మాట్లాడితే నిందలా?నాకు మానసిక పరిస్థితి సరిగా లేదు, పిచ్చి అని ప్రచారం చేసి నన్ను పంపించేయాలని చూశారు. నిజాలు మాట్లాడేవారిపై ఇలాంటి నిందలేస్తారా? కొన్నేళ్లుగా నా ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నాను. గతంలో కూడా నాపై ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. ఓసారి టచప్ బాయ్ నా ఇంట్లో నుంచి 15 తులాల బంగారం దొంగతనం చేశాడు. కానీ రివర్స్లో నేను అతడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది పేపర్లో వచ్చింది. నేను అతడిపై చేయి చేసుకోలేదు. దీంతో ఆ వార్త రాసిన వ్యక్తిని అమీర్పేట చౌరస్తాలో కాలర్ పట్టుకుని కొట్టాను. నాపై ఇలాంటి మచ్చ వేస్తే మా జీవితం ఏం కావాలి?కాలర్ పట్టుకుని..షూటింగ్స్లో కూడా ఒకటీరెండుసార్లు చేయి చేసుకున్నాను. ఒక ప్రొడక్షన్ మేనేజర్.. ఇప్పుడు ఆయన పెద్ద నిర్మాతయ్యాడనుకోండి.. నేను గదిలో దుస్తులు మార్చుకుంటుంటే డోర్ తీశాడు. నేను వెంటనే వెళ్లి డోర్ లాక్ చేశాను. క్షణం ఆగకుండా తలుపు తడుతూనే ఉన్నాడు. ఏంటని డోర్ తీశాను. అతడు నవ్వుతూ.. ఔట్ డోర్ షూటింగ్లో చెట్టు పక్కనే చీర మార్చుకుంటారు.. నేనిక్కడే ఉంటా.. చీర మార్చుకో అన్నాడు. కోపంతో తన్నాను. కాలర్ పట్టుకుని కొడుతూ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాను' అని గుర్తు చేసుకుంది.ఏఎన్నార్ సలహా'సినిమాలో అన్నిరకాల మనుషులుంటారు. ఎవరేమన్నా సరే సెట్లో యాక్ట్ చేయడం నేర్చుకో.. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో.. సర్దుకుని వెళ్లు, అలాగని తప్పు చేయమని చెప్పడం లేదు, సున్నితంగా తప్పించుకుని వెళ్లు అని ఏఎన్నార్ సలహా ఇచ్చారు. కానీ నాకు నిజ జీవితంలో యాక్టింగ్ చేయడం రాలేదు' అని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చింది. కాగా ఈమె.. పరువు ప్రతిష్ట, శ్రీదేవి నర్సింగ్హోం, పెళ్లి పందిరి, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం రా, మధ్యతరగతి మహాభారతం.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. బుల్లితెరపై సీరియల్స్ కూడా చేసింది.చదవండి: పెళ్లయితే సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
ఓటీటీలో ఉస్తాద్ భగత్సింగ్..!
పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వైరల్ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ పేర్కొంది. ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ధురంధర్-2 హిట్ కావడంతో చాలా స్క్రీన్స్ నుంచి ఉస్తాద్ భగత్సింగ్ చిత్రాన్ని తొలగించారు.‘ఉస్తాద్ భగత్సింగ్’ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో పాటుగా ధురంధర్-2 దెబ్బ కూడా గట్టిగానే ప్రభావం చూపింది. దీంతో థియేట్రికల్ రన్లో బోల్తా పడింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఏప్రిల్ 17న నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్కు తీసుకురావాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ 24న తప్పకుండా ఉస్తాద్ ఓటీటీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. థియేటర్స్లో మెప్పించలేని ఈ మూవీ కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా మంచి రెస్పాన్స్ సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎమోషనల్ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్ చూశారా?
విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అనకాపల్లి. ఈ సినిమాకు తమ్మినేని ఖగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కథ అందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన అనకాపల్లి టీజర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నారేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవ్జాండ్ సంగీతమందిస్తున్నారు. -
మహాకాళిలో ప్రభాస్..!
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి.. ఇదే సినిమాటిక్లో వచ్చిన హనుమాన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటింస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది.మహాకాళి చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆయన తన పాత్ర చిత్రీకరణను కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర ఎలా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించి కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్ (PVCU)లో భాగంగా ‘అధీర’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. -
స్టార్ దర్శకులను మెప్పించిన సినిమా.. ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నీలిర'.. తమిళ్ వర్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు వర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన తమిళ దర్శకుడు సోమిధరన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 1988నాటి శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. అప్పటి భయానక పరిస్థితుల మధ్య సామాన్యుల ఇబ్బందులు కళ్లకు కట్టేలా ఈ మూవీలో చూపించనున్నారు.నీలిర చిత్రాన్ని ఇప్పటికే వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, ఏఆర్ మురుగదాస్ వంటి క్రియేటివ్ దర్శకులు చూశారు. ఈ మూవీ కథ, తెరకెక్కించిన తీరుపై వారు ప్రశంసలు కురిపించారు. యుద్ధం వెనుక దాగి ఉన్న సామాన్యుల కన్నీటి గాథలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాజాగా ట్రైలర్ను చూస్తే దర్శకుడు సోమీధరన్ ఈ సున్నితమైన అంశాన్ని అత్యంత సహజంగా, డాక్యుమెంటరీ స్టైల్ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.శ్రీలంకలో అంతర్యుద్ధం1988లో శ్రీలంకలో జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయ మార్పులకు దారితీశాయి. ప్రేమదాసా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో శ్రీలంకలో సివిల్ వార్ మరింత తీవ్రతరం కావడానికి కారణమైంది. శ్రీలంకలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ అయిన జనతా విముక్తి పెరమున (JVP) తిరుగుబాటు వల్ల దక్షిణ ప్రాంతంలో అలజడి రేగింది. దీంతో ప్రజలపై హింసాత్మక దాడులు జరిగాయి. ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలు అయింది. ఆపై ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో LTTE (Liberation Tigers of Tamil Eelam) తిరుగుబాటు కొనసాగింది. ఈ రెండు తిరుగుబాట్ల కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు మరణించారు. ఎంతోమందిపై హింసాత్మక దాడులు జరిగాయి. దీంతో అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. తర్వాత దేశంలో పరిపాలన మార్పులు జరిగాయి. -
అజయ్ దేవగన్పై ఫిర్యాదు.. కోర్టుకెక్కిన కార్తీ 'ఖైదీ' నిర్మాతలు
అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో, నటించి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'భోలా' (2023).. తమిళ హిట్ చిత్రం 'ఖైదీ'కి రీమేక్గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, భోలా చిత్ర నిర్మాతలు రీమేక్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం ఖైదీ సినిమా హక్కులకు సంబంధించిన పూర్తి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఖైదీ సినిమా పూర్తి హక్కులు తమకే ఉన్నాయని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పేర్కొంది. హిందీ రీమేక్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆ నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే, కొంత మొత్తంలో మాత్రమే డబ్బు చెల్లించారని తమకు ఇంకా రూ. 4కోట్లు బకాయి పడ్డారని భోలా చిత్ర నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, కోర్టుకు అధికార పరిధి ఉందా లేదా అనే విషయంపై తీర్పును రిజర్వ్ చేసింది.ఖైదీ సినిమా నచ్చడంతో హిందీలో భోలా పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అజయ్ దేవగన్ చిత్ర నిర్మాణ సంస్థ, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే, ఖైదీ నిర్మాతలతో రీమేక్ హక్కులకు సంబంధించి కుదుర్చుకున్న ఢీల్ ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించలేదని తెలుస్తోంది. 2023లో విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. -
చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..?
‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమా భారీ విజయంతో ఈ ఏడాదిని చిరంజీవి ప్రారంభించారు. అయితే, కాస్త విరామం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ రెడీ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే.చిరంజీవి- బాబీ సినిమా షూటింగ్ ఏప్రిల్ మూడో వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ కాన్సెప్ట్ కథతో బాబీ సిద్ధం అయ్యారట. ఈ చిత్రంలో ఫుల్ మాస్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారని టాక్. అయితే, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. చిరు సరసన భార్యగా ప్రియమణి, కూతురి పాత్రలో ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు టాక్ ఉంది. ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు.వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’ విడుదల గురించి ప్రకటన రాలేదు. 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. -
మరోసారి...
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ సాగుతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా వన్స్ మోర్ అంటూ ఆ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్పై చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గత చిత్రాలను 4కె క్వాలిటీతో సరికొత్తగా అందిస్తుండటంతో ప్రేక్షకులు కూడా సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేశ్బాబు ‘అతిథి’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా, ఊసరవెల్లి’, రవితేజ ‘కృష్ణ’, సిద్ధార్థ్ ‘ఓయ్’, శింబు ‘వల్లభ’ వంటి అరడజను పైగా సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆయా చిత్రాల వివరాలేంటో ఓ లుక్ వేద్దాం... పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో రవితేజ ఈ వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ’ చిత్రం మే నెలలో రీ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ’. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ముకుల్ దేవ్, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, వేణు మాధవ్, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ శిండే, సత్యం రాజేశ్ ఇతర పాత్రలు పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ విజువల్స్పై బి. కాశీ విశ్వనాథం నిర్మించారు.రవితేజ మాస్ ఇమేజ్, వినాయక్ మాస్ క్రేజ్ ఈ మూవీకి ప్లస్ అయింది. రవితేజ, త్రిష, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చక్రి అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో తన వంతు పాత్ర పోషించింది అనడం అతిశయోక్తి కాదు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల తర్వాత మే 8న ‘కృష్ణ’ మూవీ రీ రిలీజ్ అవుతోంది.ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. దేవుడా... ‘రేసు గుర్రం’ సినిమాలో దేవుడా అంటూ ఓ మేనరిజమ్తో హీరో అల్లు అర్జున్ పలికిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. మరోసారి ఆ మేనరిజాన్ని ప్రేక్షకులు చూడనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేసు గుర్రం’. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, అలీ, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రవి కిషన్, శ్యామ్, పవిత్రా లోకేష్, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ్రపొడక్షన్స్పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.మాస్, యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి అల్లు అర్జున్–శ్రుతీహాసన్ ఎనర్జిటిక్ డ్యాన్సులు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రుతీహాసన్ అమాయకత్వం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇన్స్పెక్టర్ కిల్బిల్ పాండేగా బ్రహ్మానందం ఏ స్థాయిలో ఆడియన్స్కి నవ్వులు పంచారో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘రేసు గుర్రం’ మూవీని ఆయన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న రీ రిలీజ్ చేస్తున్నారు. క్రౌన్ మూవీస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ని కూడా విడుదల చేశారు.తమ అభిమాన హీరో (అల్లు అర్జున్) పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే... ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అతిథి వస్తున్నాడు ఈ వేసవికి మహేశ్ బాబు ‘అతిథి’ గా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా రావ్ హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, నాజర్, మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అజయ్, వేణుమాధవ్, రాజీవ్ కనకాల, ప్రగతి ఇతర పాత్రలు పోషించారు. ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2007 అక్టోబరు 18న విడుదలైంది. మహేశ్ బాబు మేకోవర్, స్టైలిష్ లుక్స్, యాక్షన్... వంటివన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబును దర్శకుడు సురేందర్ రెడ్డి అల్ట్రా మోడ్రన్ లుక్లో ప్రజెంట్ చేశారు. లాంగ్ హెయిర్, ట్రెండీ కాస్ట్యూమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో మహేశ్ బాబు ప్రేక్షకులను కట్టిపడేశారు.ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ‘అతిథి’ సినిమాకు అతి పెద్ద బలం అని చెపొ్పచ్చు. అదే విధంగా మహేశ్ బాబు–అమృతా రావ్ మధ్య సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాను 4కె వెర్షన్న్లో రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న ‘అతిథి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘అతిథి’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన వారణాసి సెట్లో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 9న విడుదల కానున్న ‘వారణాసి’పై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. డబుల్ ధమాకా హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘ఊసరవెల్లి’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ మూవీలో రక్షిత హీరోయిన్గా నటించారు. రమాప్రభ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్, షాయాజీ శిండే, రాహుల్ దేవ్, బెనర్జీ, నాజర్, సంఘవి ఇతర పాత్రలు పోషించారు.భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రి అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఎన్టీఆర్, రక్షిత డ్యాన్స్లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటిపోయింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రావాలా’ని రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత గిరి. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రకాశ్రాజ్, తనికెళ్ల భరణి, విద్యుత్ జమాల్, షాయాజీ శిండే, మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, జీవీ సుధాకర్ నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం అందించారు. సుమారు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధం అవుతోంది.మే 20న ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమా రీ రిలీజ్కి ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఓయ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారాయన. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ (2006) మూవీతో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రాల్లో ‘ఓయ్’ ఒకటి. ఆనంద్రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించారు.సునీల్, అలీ, కృష్ణుడు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, నెపోలియన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. 2009 జూలై 3న విడుదలైన ఈ సినిమా యూత్ని బాగా ఆకట్టుకుంది. ప్రత్యేకించి యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీ హిట్ అయ్యింది. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఓయ్’ ఏప్రిల్ 17న రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. వల్లభ సిద్ధం శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘వల్లవన్’. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, రీమా సేన్, సంధ్య, సంతానం, ప్రేమ్జీ, సత్యన్ ప్రధాన పాత్రలు పోషించారు. పీఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో 2026 అక్టోబరు 21న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వల్లభ’ పేరుతో అనువదించి, రిలీజ్ చేశారు. 2006 నంబరు 11న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నయనతార టీచర్గా, శింబు స్టూడెంట్గా నటించారు. టీచర్–స్టూడెంట్ మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి యువతని భారీగా ఈ మూవీ థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ‘వల్లభ’ సినిమా మే 9న విడుదలవుతోంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే
హీరోయిన్గా అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు చేసిన రాధిక.. ప్రస్తుతం టీవీ షోలు, అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్న ఈమె.. రీసెంట్గా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. బన్నీకి డ్యాన్స్ నేర్పింది నేనే అని అనేసరికి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలో రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్)ఆట డ్యాన్స్ షోలో ప్రీతి అనే కంటెస్టెంట్.. 'పుష్ప 2'లోని జాతర పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే సదరు కంటెస్టెంట్ని పొగిడిన జడ్జి రాధిక.. అల్లు అర్జున్ ఇంత గొప్ప డ్యాన్సర్ కావడానికి నేనే కారణం అని చమత్కరించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో గతంలో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తుచేసుకుంది. అలానే సమయానికి చిన్న పిల్లాడు ఎవరూ లేకపోవడంతో బన్నీ తనతో పాటు ఓ సీన్లో కలిసి నటించాడని, ఇందులో భాగంగా అల్లు అర్జున్ని ఎత్తుకుని రైల్వే ట్రాక్పై పరుగెత్తిన విషయాన్ని రాధిక గుర్తుచేసుకుంది. ఈ విషయాలన్నీ రాధిక చెబుతున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.రాధిక ఈ కామెంట్స్ ఫన్నీగానే చేశారు. నెటిజన్లు కూడా అంతే సరదాగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా అని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇతడి స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్లతో మూవీస్ చేస్తున్నాడు. వీటిపై బోలెడంత బజ్ ఉంది. (ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?) -
'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్
'ధురంధర్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో వచ్చిన తొలి భాగంలో హీరోని డామినేట్ చేసిన విలన్గా అక్షయ్ ఖన్నా అదరగొట్టేశాడు. రహమాన్ డకాయిట్ అనే పాత్రలో జీవించేశాడు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.(ఇదీ చదవండి: మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్కి అర్థం కావట్లేదు!)హిందీలో గతంలోనే హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అక్షయ్ ఖన్నాకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ 'ఛావా', 'ధురంధర్' చిత్రాలు ఇతడికి ఓవర్నైట్ స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఇవి చేస్తున్నప్పుడే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని 'మహాకాళి' మూవీలో శుక్రచార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలు కాగా.. ప్రశాంత్ వర్మ షో రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఇప్పుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. ప్రతిభకు సౌండ్ అక్కర్లేదు. మీతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, అలానే టాక్ బట్టి తెలుస్తోంది ఏంటంటే అక్షయ్ ఖన్నా షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే మిగతా కూడా అయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కన్నడ నటి భూమి శెట్టి.. 'మహాకాళి'లో లీడ్ రోల్ చేస్తోంది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)Happy Birthday #AkshayeKhanna sir, a true actor who proves that real talent doesn't need noise. Effortless screen presence, powerful performances, and unmatched class always stand out 🎭🎬Its an absolute honour working with you. Can’t wait to show the world what we’ve created… pic.twitter.com/xiblaH8voc— Prasanth Varma (@PrasanthVarma) March 28, 2026 -
బరిలో వరుణ్ తేజ్.. ఫస్ట్ వీడియో చూశారా?
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బరి నుంచి పోస్టర్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై నిర్మిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమంతో మొదలైన ఈ మూవీ నుంచి తాజాగా ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ (The World Of Bhari) పేరుతో పవర్ఫుల్ వీడియోను పంచుకున్నారు. 2027 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. -
అదిరిపోయిన వారణాసి సెట్స్.. సడన్ సర్ ప్రైజ్ ఇస్తున్న జక్కన్న
-
స్టార్ హీరోయిన్ను అన్ఫాలో చేసిన రిషబ్ శెట్టి
కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కింది. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్తో బంధం తెంచుకున్నారని వార్తలు వచ్చాయి. సోషల్మీడియా చిత్ర నిర్మాణ సంస్థ అధికార ఖాతాను అన్ఫాలో చేయడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా తనతో పాటు నటించిన వారిని కూడా తన ఇన్స్టాలో అన్ఫాలో చేయడం కన్నడ పరిశ్రమలో వైరల్ అవుతుంది.కాంతార మూవీలో తనతో పాటు నటించిన రుక్మిణి వసంత్ను కూడా రిషబ్ శెట్టి అన్ఫాలో చేశారు. ఆపై తన ఆప్త మిత్రుడైన రాజ్.బి.శెట్టిలను కూడా సోషల్ మీడియాలో ఫాల్ కావడం ఆపేశాడు. రెండురోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేయడంతో కాంతార టీమ్తో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అనుమానం మొదలైంది. అయితే, హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే, రోజుల వ్యవధిలోనే ఇలా మూడు ముఖ్యమైన అకౌంట్లను రిషబ్ అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం గురించి రిషబ్ శెట్టితో పాటు నిర్మాణసంస్థ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ప్రస్తుతం రిషబ్ తన తదుపరి మూవీ జై హనుమాన్ పనిలో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించనున్నారు. -
అన్నయ్య కోసం 'బరి'లోకి దిగిన చెల్లెలు
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి బరి అనే టైటిల్ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆపై ‘బరి’ మూవీకి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యదు వంశీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించారు. నేడు పూజా కార్యక్రమం జరిగింది. కుటుంబ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.Power Star #PawanKalyan garu at our Mega Prince @IAmVarunTej 's New movie #Bhari Opening ceremony#VarunTej #NiharikaKonidela pic.twitter.com/fXPOmdT3SS— Milagro Movies (@MilagroMovies) March 28, 2026 -
ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. అండర్ కవర్ ఏజెంట్గా ఎంట్రీ
రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ధురంధర్-2.. గతేడాది విడుదలైన పార్ట్-1కు సీక్వెల్గా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ గౌతమ్ తాజాగా ఈ మూవీని చూశారు. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన సోదరితో రహస్యంగా ప్రేక్షకులతో పాటుగా మూవీని చూశారు.గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో భారీగా పాపులర్ అయింది. దర్శకుడు ఆదిత్య ధర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 'ఉరి' మూవీ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.ధురంధర్-2లో యామీ గౌతమ్ నర్స్ కమ్ అండర్ కవర్ ఏజెంట్ 'షాజియా బానో'గా నటించారు. తెరపై ఆమె కనిపించగానే కాస్త సిగ్గుగా చూస్తూ, చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉండమని తన సోదరి సురిలీ గౌతమ్ని సైగ చేసింది. ఈ ముచ్చటైన క్షణాన్ని సురిలీ కెమెరాతో వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్లో "మూవీ టైమ్" అనే క్యాప్షన్తో అప్లోడ్ చేసింది. ఆ క్లిప్లో 'ధురందర్ 2'లో నర్సుగా యామీ చేసిన అతిథి పాత్రను చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కెమెరాను ఆ నటి వైపు తిప్పుతుంది. థియేటర్లో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యామీ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత ఆమె తన సోదరిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. Yami Gautam blushing watching herself on *Dhurandhar* screen , how cute!❤️❤️❤️Yami Gautam Dhar ☆ Aditya Dhar #Dhurandhar2TheRevenge https://t.co/L0Zoy6GQ9K pic.twitter.com/mEh2vvlgtl— JyotiKarma🚩🇮🇳 (@JyotiKarma7) March 27, 2026Spotted! ❤️ Yami Gautam enjoying #Dhurandhar2 like a true fan in a packed theatre—supporting hubby Aditya Dhar & even cheering her own cameo! 🔥 #DhurandharTheRevenge pic.twitter.com/2b0sXIGRnk— Smita Patil (@patil45802) March 27, 2026 -
హైదరాబాద్ : ‘టీచ్ ఫర్ చేంజ్’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
అనుష్కపై ఆగని ట్రోలింగ్స్
సెలబ్రిటీలకు రాజభోగం ఆరు, వదంతుల తలనొప్పి 12 అన్నంతగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పవచ్చు. మొదట్లో ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని, ఎంతో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకున్న వారికి వివిధ రూపాల్లో వచ్చే వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయా అంటే కచ్చితంగా అవుననే బదులే వస్తోంది. ముఖ్యంగా సినీ నటీమణులను ఇలాంటి వదంతులు చుట్టుముట్టి అశాంతికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి వదంతులను చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక్కోసారి వ్యక్తి గత విషయాలపై అవాస్తవాలు ప్రచారం అయినప్పుడు అలాంటి వాటిని ఖండించాల్సి వస్తుంది. అనుష్క పరిస్థితి ఇలాంటిదే. ఈ బెంగళూరు భామ నటనలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారనే చెప్పాలి. మొదట్లో అందాలారబోతతో యువతను అలరించినా, సరైన పాత్ర వేస్తే తన తడాఖా చూపిస్తానని అరుంధతి చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ మధ్య సైజ్ జీరో అనే చిత్రంలోని పాత్ర కోసం బరువు భారీగా పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ఏ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. దీంతో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఈమె వ్యక్తి గత జీవితంపై ట్రోలింగ్స్ వైరల్ అవడం, ముఖ్యంగా అనుష్క పెళ్లి వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఈమె చాలా సార్లు ఖండించారు. వయసును ప్రస్తావించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అనుష్క గురించి ఏదో ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనుష్కకు పెళ్లి నిశ్చితార్థం జరిగిందని, ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ ఫొటో 2016లో జరిగిన ఒక ఫ్యాషన్ కార్యక్రమానికి చెందింది. ఇలా వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజమో ? ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి నెలకొంటోంది. -
ప్రియదర్శి సస్పెన్స్ థ్రిల్లర్ సుయోధన.. ఆడియన్స్ను మెప్పించిందా?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా 'సుయోధన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు. ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ మూవీతో ప్రియదర్శి మరో హిట్ కొట్టాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.ఈ మూవీ కథేంటంటే..వరుణ్ (ప్రియదర్శి) ఒక 'ఫోలే' (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్కి చిన్నప్పటి నుంచి 'సుయోధన' అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో.. ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. అప్పుడే సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా.. వరుణ్కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాశే వరుణ్కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. ఆ తర్వాత వరుణ్ తండ్రి హత్యకు గురవుతాడు. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? హత్యలో ఏదైనా రాజకీయ కోణం ఏంటి? సుయోధన అనే శబ్దం వరుణ్కే ఎందుకు వినిపిస్తోంది? అసలు ఈ సినిమాలో సుయోధన ఎవరు? అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తే అయినప్పటికీ.. గతంలో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ టాలీవుడ్ ప్రేక్షకులకు 'ఫోలే' ఆర్టిస్ట్ అనేది కొత్త యాంగిల్ నచ్చిందనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అనే విషయం సుయోధన ద్వారా ప్రేక్షకులకు అర్థమైంది. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు ఆడియన్స్ను మెప్పిస్తాయి.సినిమా ప్రారంభం నుంచే డైరక్టర్ సస్పెన్స్ క్రియేట్ చేయడంలోచాలా వరకు సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుల్లో వాట్ నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఈ కథలో 'సౌండ్' కీ రోల్ ప్లే చేసింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే అక్కడక్కడ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం కాస్తా ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరింత ఆసక్తిగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండానే తెరకెక్కించాడు. ఈ కథ సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కవుట్ అయింది. ఓవరాల్గా ఆడియన్స్కు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సుయోధన. రొటీన్కు భిన్నంగా.. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్ను చూడాలనుకుంటే 'సుయోధన' ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి మరోసారి తన పాత్రలో అదరగొట్టేశాడు. సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. ఆయన డైలాగ్స్, నటనతో ఈ సినిమాకు ప్లస్. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ద్రిశికా చందర్ తన గ్లామర్తో అలరించింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. సాంకేతికపరంగా చూస్తే సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. జై క్రిష్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నతంగా బాగున్నాయి. -
శ్రీరామనవమి స్పెషల్.. ఆయనకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనవమి పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములవారి విశిష్టతను జపాన్కు చెందిన ప్రముఖ గీక్ పిక్చర్స్ సీఈవో టోమట్సు కోసానోకు వివరించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం' చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఈ వీడియోను అల్లు అర్జున్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ఐకాన్ స్టార్ బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ డైరక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిపారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. A reflection of his love for Indian culture and traditions. 🤍Icon Star @AlluArjun presented a Sita Rama Kalyanam painting to Geek Pictures CEO Mr. Tomatsu Kosano, explaining the historical and spiritual essence of the Ramayana.🙏A beautiful moment of cultural exchange… pic.twitter.com/T4dOeoBqxc— Team Allu Arjun (@TeamAAOfficial) March 27, 2026 -
మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్కి అర్థం కావట్లేదు!
ఏ సినిమా గానీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అని రిలీజైన రోజే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మొదట్లోనే సీన్ అర్థమైపోతే మరికొందరికి మాత్రం ఎప్పటికి అర్థం అవుతుందో అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో గతవారం పలకరించిన దర్శకుడు హరీశ్ శంకర్.. మూవీ ఫ్లాప్ అయినా సరే విడిచిపెట్టట్లేదు. తాను తీసింది సూపర్ హిట్ అనే రేంజులో ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కి ఇచ్చిన సమాధానమైతే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ మొత్తం డిస్కషన్ ఈయన గురించే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)గతంలో పవన్తో 'గబ్బర్ సింగ్' అనే రీమేక్ తీసి హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వచ్చాడు. దాదాపు అప్పటి తరహా టెంప్లేట్ స్టోరీ కావడం, మూసగా ఉందనే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచి నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ప్రతి మూవీకి కలెక్షన్స్ ప్రకటించే వీళ్లు.. 'ఉస్తాద్' విషయంలో మౌనం పాటించారు. అందరికీ అప్పుడే ఫలితం అర్థమైపోయింది. దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం తాను తీసింది హిట్ అనే రేంజులో ఇంటర్వ్యూలు, మీటప్స్ పెడుతూ బిజీ అయిపోయాడు. అందులో ఈయన, హీరోయిన్లు తప్పితే మరో టెక్నీషియన్ కనిపించలేదు.రెండు నెలల క్రితం అంటే సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' రిలీజ్కి ముందు దర్శకుడు మారుతి కూడా ఇలానే చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. తీరా థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత విషయం అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. అభిమానులు ఎంతలా ట్రోల్ చేసినా సరే అవన్నీ భరిస్తూ వచ్చాడు తప్పితే ఏది పడితే అది మాట్లాడలేదు. హరీశ్ శంకర్ మాత్రం సినిమాలో తప్పుల్ని కూడా సమర్థించుకుంటున్నాడు. పవన్ ఎంట్రీ సీన్పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. మాస్టర్ తీసింది, తాను తీసింది నచ్చడంతోనే రెండుషాట్స్ పెట్టానని చెప్పేసరికి నెటిజన్ల మతిపోతోంది. హిట్ అయిన సినిమా గురించి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది గానీ ఫ్లాప్ అయిన మూవీ గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఈ విషయం హరీశ్ శంకర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్) -
'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్
ఈ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచిన సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర ట్రైలర్స్ చూసి, దర్శకుడు మారుతి మాటల్ని నమ్మి.. అభిమానులు హైప్ పెంచేసుకున్నారు. తీరా చూస్తే వాళ్లని దారుణంగా మోసం చేశారు! కంటెంట్ ఓ మాదిరిగా ఉండగా.. విజువల్ ఎఫెక్ట్స్, హెడ్ మార్పింగ్ లాంటివి మరీ ఎక్కువగా ఉండేసరికి చాలామంది ఇప్పటికీ మారుతిని విమర్శిస్తూనే ఉన్నారు. అలా గత కొన్నేళ్లుగా బయట కనిపించని మారుతి.. చాన్నాళ్లకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన కొత్త మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన దర్శకుడు మారుతి.. ప్రతి ప్రయాణం ఓ అనుభవమే అని 'రాజాసాబ్' ఫెయిల్యూర్ని గుర్తుచేసుకున్నాడు. తన కొత్త మూవీ స్క్రిప్ట్ చివరి దశలో ఉందని, దీనిపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తనకు అండగా నిలబడిన మీడియా, సన్నిహితులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.చూస్తుంటే 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి మారుతి కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అయితే ఇతడి తర్వాతి సినిమాకు 'హ్యాపీ పొంగళ్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు, మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇవి నిజమా కాదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ చిత్రంతో మారుతి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి. లేదంటే మాత్రం కష్టమే!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)Every journey is a learning experience. On this auspicious occasion of #SriRamaNavami, I’m grateful to be giving final touches to my next script with His blessings 🙏A heartfelt thank you to all my audience, well-wishers and the media for constantly supporting me and sharing… pic.twitter.com/TXGf0rpGSk— Director Maruthi (@DirectorMaruthi) March 27, 2026 -
ఆదిత్య ధర్కు పాకిస్తాన్ ప్రజల వింత డిమాండ్
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబినేషన్ సినిమా ‘ధురంధర్2’ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన ‘ధురంధర్-1’ సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్ గురించి పాక్స్తాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్ అవుతుంది.ధురంధర్-2 కలెక్షన్స్పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla— Chota Don (@choga_don) March 27, 2026 -
ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?
తెలుగులోని ప్రామిసింగ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న ఇతడు.. తర్వాత మూవీస్ అయితే చేశాడు గానీ ఎనిమిదేళ్లుగా హిట్ అనేది అందుకోలేకపోయాడు. చివరగా 2023లో' రంగబలి' చిత్రంతో వస్తే ఘోరమైన డిజాస్టర్ అయింది. తర్వాత నుంచి ఎక్కుడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనంతగా మాయమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఈ మేరకు విడుదల తేదీ ప్రకటించారు.(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. విధి యాదవ్ హీరోయిన్. రామ్ దేశిన దర్శకుడు. గతేడాది ఇదే టైంకి షూటింగ్ పూర్తయినప్పటికీ ఎందుకనో రిలీజ్ చేయకుండా నాన్చుతూ వచ్చారు. మధ్యలో ఒకటి రెండు పాటలు వదిలినప్పటికీ అవేం ఇంప్రెస్ చేయలేదు. ఇప్పుడు సడన్గా శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ ఏప్రిల్ 17న తమ చిత్రం థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.హరీశ్ జయరాజ్ సంగీతమందించిన ఈ సినిమాలో సాయికుమార్, సముద్రఖని లాంటి సీనియర్స్ నటించారు. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో రొటీన్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కట్లేదు. మరి మూడేళ్ల తర్వాత వస్తున్న నాగశౌర్య.. ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి? హిట్, ఫ్లాప్ సంగతి పక్కనబెడితే రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికే హీరోలకు సరైన మార్కెట్ ఉండట్లేదు. అలాంటి మూడేళ్లుగా కనిపించని నాగశౌర్య ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
తిరుపతిలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో
ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే వేరే ఊరికి వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం అనమాట. గత నెలలో ఇలానే హీరో విజయ్ దేవరకొండ-రష్మిక.. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వెళ్లి అక్కడ గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి హడావుడి ఏం లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.(ఇదీ చదవండి: ‘యూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఈ నెల ప్రారంభంలో కావ్య అనే అమ్మాయి తన జీవితంలో ఉందని చెప్పి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యేసరికి ఇదేదో ఎంగేజ్మెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం కుటుంబాల కలిసిన సందర్భం అని సదరు హీరో చెప్పుకొచ్చాడు. త్వరలో శుభవార్త గురించి, పెళ్లి డేట్ బయటపెడతానని అన్నాడు. ఇప్పుడు ఆ తేదీల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.వచ్చే నెల 5వ తేదీన బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య.. హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకోనున్నారు. వచ్చే నెల 29న తిరుపతిలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకోనున్నారు. మే 01న హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
పెళ్లి తర్వాత తొలి వెకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్
-
నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు. Honourable Sirs @TelanganaCMO @PMOIndia,Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026 -
పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్
-
రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
చిరుత బర్త్డే.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తాను దాచుకున్న మధురమైన ఫోటోలను షేర్ చేశారు. చరణ్ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు నాటి ఫోటోను అభిమానులతో మెగాస్టార్ పంచుకున్నారు. ఈ సందర్భంగా చరణ్పై తనకున్న ప్రేమను సోషల్మీడియా ద్వారా తెలిపారు.చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ప్రత్యేకంగా చిరు ఇలా అన్నారు. 'చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుండి ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడం వరకు నీ ఎదుగుదల చూస్తుంటే నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునే విధానం, కుటుంబం పట్ల నీవు చూపించే బాధ్యత, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు... ఇవన్నీ నేను చూసిన ప్రతిసారీ నీపై నా ప్రేమ, అభిమానం మరింత బలపడుతూనే ఉన్నాయి. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన నా చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.' అని చిరు షేర్ చేశారు.Charan Babu…❤️❤️❤️From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my… pic.twitter.com/MMg5fYYo3k— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026 -
పదిరోజుల్లోనే ఓటీటీకి హెబ్బా పటేల్ సినిమా
హెబ్బా పటేల్, చైతన్య రావు నటించిన కొత్త సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'.. ఆసక్తికరమైన టైటిల్తో మార్చి 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించారు. ఇందులో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.హెబ్బా పటేల్, చైతన్య రావు ఇదివరకు హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాతో మెప్పించారు. ఈ క్రమంలో వారిద్దరూ మరోసారి 'రేపు ఉదయం 10 గంటలకు'(Repu Udayam 10 Gantalaku) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించారు. థియేటర్స్లో పెద్దగా ఈ మూవీ మెప్పించలేదు. దీంతో కేవలం పదిరోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. -
అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)
-
పెళ్లిపై ఆలోచన లేదు: సాయి పల్లవి
ప్రయత్నం ఎన్నటికీ వృథా కాదు.. వెంటనే కాకున్నా, కొద్ది కాలం తరువాత అయినా దాని ఫలితం ఉంటుంది. నటి సాయి పల్లవి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ కోయంబత్తూరు భామకు సినిమాల్లో నటించాలన్నది చిన్నప్పటి నుంచి ఆశ. అయితే వెంటనే తన ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ముందు చదువుపై దృష్టి సారించి డాక్టర్ కూడా అయ్యారు. ఆ తరువాత కూడా నటనపై తన ఆసక్తి తగ్గాక పోవడంతో డాన్స్ లో శిక్షణ పొందారు. ఆపై తనలోని నటిని చూపేందుకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అలా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రేమలులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతేకాదు అందులో టీచర్ పాత్రకు పెద్ద పేరు వస్తుందని సాయి పల్లవి కూడా ఊహించి ఉండరు. ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన పోయారు. చాలా మంది గ్లామర్ క్రేజ్తోపాటు, అవకాశాలను తెచ్చి పెడుతుందని భావిస్తారు. అందులో నిజం లేకపోయినప్పటికీ, సాయి పల్లవి మొదటి నుంచి సహజత్వానికి ప్రాధాన్యత నటిస్తున్నారు. అదే ఆమెకు ప్లస్ అయ్యింది కూడా. సాయి పల్లవి నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఈమె నటుడు శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయం సాధించింది, ఆ తరువాత తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన తండేల్ చిత్రం విజయాన్ని సాధించింది. ఇటివల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ సాయి పల్లవి, అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ కలిసి నటించిన ఏక్ దిన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో రూపొందుతున్న రామాయణ 1,2 భాగాల్లో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ధనుష్కు జంటగా మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా చాలా బిజీగా ఉన్న సాయి పల్లవి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని కచ్చితంగా చెప్పారు. ప్రస్తుతానికి తాను సింగిల్ అని కూడా చెప్పారు .కాగా ఈ 33 ఏళ్ల భామ చెల్లెలు పూజా కన్నన్ రెండేళ్ల ముందే పెళ్లి చేసుకున్నారు. మరి సాయి పల్లవికి పెళ్లి ఘడియలు ఎప్పుడు వస్తాయో ఏమో! -
శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి టీమ్ ప్రత్యేక పోస్టర్
రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్ టచ్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI 🫶శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹✨Starring MASS MAHARAJA @RaviTeja_offlA @gvprakash musical 🎺🎼@priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/CNZuTYRLKB— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026 -
'ఆయనను గురువులా భావిస్తా'.. సైన్ లాంగ్వేజ్లో అభినయ స్పీచ్ వైరల్
టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది. ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. టాలీవుడ్లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది. సైన్ లాంగ్వేజ్ లో నటి అభినయ స్పీచ్...నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని గారుసముద్రఖని గారు మంచి దర్శకులు అలాగే అంతకు మించి మంచి నటుడు: అభినయ#Abhinaya #CarmeniSelvam #Samuthirakani pic.twitter.com/lukFHtLVFJ— Filmy Focus (@FilmyFocus) March 26, 2026 -
దగ్గుబాటి కుటుంబ కేసు.. ఆ విషయంలో జాగ్రత్త..!
దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేశారని దగ్గుబాటి కుటుంబం లీగల్ టీమ్ తెలిపింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చేసిందని వెల్లడించింది.అయితే విచారణ సమయంలో నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు,కొన్ని వర్గాలు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవని తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది.అసలు కేసు ఏంటంటే..?గతంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ రోడ్డునెంబర్–1లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేష్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.2022 నవంబర్లో దక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. నందకుమార్కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
నాగబంధం విడుదలపై ప్రకటన
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం.. తాజాగా ఈ మూవీ విడుదలను మేకర్స్ ప్రకటించారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ చిత్ర యూనిట్ గుడ్న్యూస్ చెప్పింది. జులై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుందని ప్రకటించారు.కొద్దిరోజుల క్రితం టీజర్ విడుదల తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసమే రూ. 20 కోట్లు ఖర్చు చేశారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు. -
ఓటీటీలో రెండు థ్రిల్లింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ప్రకటన
మలయాళ ప్రేక్షకులను మెప్పించిన మస్తిష్క మరణం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీని దర్శకుడు కృషంద్ ఆర్కే తెరకెక్కించారు. కృష్ణంద్ ఫిల్మ్స్ సహకారంతో అజిత్ వినాయక ఫిల్మ్స్ బ్యానర్పై వినాయక అజిత్ నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంది.‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam) మార్చి 27 నుంచి నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వర్షన్ గురించి సరైన సమాచారం ప్రస్తుతానికి లేదు. తన బిడ్డను కోల్పోయిన దుఃఖం నుండి బయటపడలేక, గడిచిన క్షణాలను తిరిగి అనుభవించాలనే ప్రయత్నంలో ఒక తండ్రి, అత్యాధునిక వర్చువల్ రియాలిటీ మెమరీ కన్సోల్ను ఆశ్రయిస్తాడు. ఇది ఒక డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ సినిమాగా, సమాజంపై వ్యంగ్య అస్త్రంగా రూపొందింది. 2046లో, ప్రజల జ్ఞాపకాలు , అనుభవాలు డిజిటల్గా రికార్డ్ చేయబడి, వ్యాపారంగా చేయబడతాయి. మనుషులు తమ బాధలను కూడా వైద్య చికిత్స ద్వారా మర్చిపోగలరు. ఈ కాన్సెప్ట్తోనే సినిమాను తెరకెక్కించారు.ఓటీటీలో వధ్-2బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సినిమా ‘వధ్’ (2022).. ఈ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన క్రైమ్ డ్రామా చిత్రం ‘వధ్- 2’ గతేడాది థియేటర్స్లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix)లో వరల్డ్వైడ్గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు జస్పాల్ సింగ్ సంధు తెరకెక్కించారు. థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవాల్లకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. -
జూ.ఎన్టీఆర్ సతీమణి ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటించిన కొత్త చిత్రం 'మర్దానీ 3' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించారు. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.'మర్దానీ 3' మార్చి 27న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇతర రీజనల్ భాషల్లో ఉండదు. ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన పార్ట్-3లో జానకి బోడివాలా, జిషు సేన్గుప్తా, ఇంద్రనీల్ సేన్గుప్తా సహాయ పాత్రలలో నటించారు. ఇందులో రాణి ముఖర్జీ.. శివానీ శివాజీరాయ్ అనే పోలీసు పాత్రలో కనిపించారు.మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ‘మర్దానీ’, ‘మర్దానీ 2’ చిత్రాలు హిట్ సాధించాయి. అయితే, పార్ట్-3లో ఎనిమిది నుంచి పదేళ్ల వయసున్న 93 మంది చిన్నపిల్లల కిడ్నాప్ కేసును ఛేదించడం కనిపిస్తుంది. భయంకరమైన బిచ్చగాళ్ల మాఫియాతో పాటు ఒక ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్పెరిమెంట్ గుట్టును శివాని శివాజీరాయ్ ఎలా ప్రపంచానికి తెలిపారనేది ఈ కథ. -
మేము విడిపోవాలని కోరుకుంటున్నారా.. విడాకులపై ప్రియాంక
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ నాలుగేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి రూమర్స్కు గతంలోనే చెక్ పెట్టిన ఆమె తాజాగా మరోసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తాను సోషల్మీడియాలో ఏదైనా ఫొటోని పంచుకుంటే ఏవేవో ఊహించుకుంటుంటూ కొందరు అదేపనిగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజమౌళి- మహేశ్బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక తాజాగా తన భర్త నిక్ జొనాస్ గురించి మాట్లాడారు.ప్రియాంక చోప్రా.. నిక్ జొనాస్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము ఇద్దరం జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బయటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వమని ఆమె అన్నారు. అయితే, తాము విడాకులు తీసుకుంటున్నామంటూ కొన్ని కథనాలు వచ్చినట్లు తెలిసిందన్నారు. తమ వివాహబంధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారా..? అని ఆమె ప్రశ్నించారు. తరచుగా ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. 'మేము వేర్వేరు దేశాలకు చెందడంతో పాటు వేర్వేరు మతాలు, మా ఇద్దరి మధ్య వయసు తేడా ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎనిమిదేళ్లుగా మేము చాలా సంతోషంగా కలిసే ఉంటున్నాం. నిక్ జొనాస్ పరిచయం అయిన తర్వాత ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. మా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం మానేశాను. నిక్ని కలిశాక.. తానే నా జీవితానికి సరైన జోడీ అనిపించి మరో అడుగు ముందుకువేశాను' అని క్లారిటీ ఇచ్చారు.తన కుటుంబ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రియాంక చోప్రా చెప్పారు. తన కుమార్తె మాల్టి మేరి గురించి చాలా అప్రమత్తంగా ఉంటానని ఆమె అన్నారు. తమ అనుమతి లేకుండా చాలామంది మాల్టి మేరి ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేయడం తనకు నచ్చదని ఆమె తెలిపారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే సెక్యూరిటీని పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, తనతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చని ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ, తన కూతురి ప్రైవసీని కాపాడటం తన బాధ్యతని ప్రియాంక చెప్పుకొచ్చింది. -
అందమే ఆనందం.. జ్యోతిక ఫోటోలు వైరల్
అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం ఆన్నారో మహాకవి. అవును ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఏనాటి వరకైనా జీవితం అందం గురించే పరుగులు తీస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలా అందమైన నగుమోము కలిగిన అతిథులకు వయసు గుర్తుకు రాదని చెప్పడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడికో ఎందుకు మనం నటి జ్యోతికనే తీసుకుంటే 1997లో ఒక హిందీ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసి, ఆ వెంటనే అంటే 1998లో అజిత్ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రమే సంచలన విజయాన్ని సాధించడం, జ్యోతిక నటన ప్రశంసనీయంగా ఉండడంతో ఆ తరువాత ఆమెకు నటిగా ఎదురు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తమిళం, తెలుగు,హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. చంద్రముఖి చిత్రంలో ఈమె నటన రిమార్కబుల్. టైటిల్ రోల్లో అంత అద్భుతంగా నటించారు. అలా రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్ గ్రీన్ నాయకి పేరు తెచ్చుకున్న జ్యోతిక కెరీర్ ప్రారంభంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. వీరి పెళ్లి 2006 జరిగింది. ఆ తరువాత కొంతకాలం సంసార జీవితానికి పూర్తిగా సమయాన్ని కేటాయించారు. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దష్టి పెట్టారు.అయితే తన ఇమేజ్ కు సరిపోయే ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్పై ఎక్కువగా దష్టి పెడుతున్నారు.అలా ఈమె నటుడు అజయ్ దేవగన్తో కలిసి నటించిన సైతాన్ చిత్రం 2024లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్లో నటిస్తున్న జ్యోతిక తన అందాలను పదిల పరచుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తుంటారు. అందుకే 47 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందంగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జ్యోతిక కొత్తగా ఫుల్ ఫిట్ నెస్తో కూడిన తన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
రామ్ చరణ్కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్లో చరణ్ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.We promise everything is safe and on track ❤️Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026 -
షార్ట్ ఫిల్మ్తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి వైఎస్ మాధవ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడిమోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. View this post on Instagram A post shared by DRISHIKA CHANDER (@drishikachander) -
పెళ్లి తర్వాత తొలి వేకేషన్ ట్రిప్.. విరోష్ జంట వీడియో వైరల్..!
టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్లాండ్ ట్రిప్లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని రష్మిక తెలిపారు. ఈ మేరకు ఎయిర్బిఎన్బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ‘ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్లోని ప్రాంతం మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది. ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నా నవ్వు బాగుందని ఆ పాత్ర చేయమన్నారు.. కానీ
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగులోనూ అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రతిసారి.. వీళ్లు తప్పితే మరెవరు నటించినా అస్సలు సూట్ కాదు కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ ఒకటి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రకాశ్ రాజ్, రేలంగి మామయ్యగా జీవించేశాడు. ఇప్పటికీ ఎవరైనా నవ్వుతూ ఉంటే సరదాగా రేలంగి మామయ్య అని ఆటపట్టిస్తుంటారు. అంతలా జనాల్లో వెళ్లిపోయింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్ని తొలుత అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. నా నవ్వు బాగుంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ చేయలేకపోయాను' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చేయనుందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. ఒకవేళ రాజశేఖర్.. రేలంగి మామయ్య పాత్ర చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి!శర్వానంద్ హీరోగా చేసిన 'బైకర్' మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఇది వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ల సందర్భంగానే చాలా విషయాలని రాజశేఖర్ పంచుకుంటున్నారు. అప్పట్లో ఈయన్ని వెతుక్కుంటూ చాలానే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చాయి. కానీ పలు కారణాలతో వాటిని వదులుకున్నారు. ఇప్పుడేమో ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అని ఈయనే టాలీవుడ్ దర్శకనిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు.రాజశేఖర్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని దర్శకులు పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 'బైకర్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోకి తండ్రి, బైక్ రేసింగ్ కోచ్గా కనిపించనున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది) -
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా) -
ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఏప్రిల్ 10న భూత్ బంగ్లా విడుదల కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి.. వీడియో వైరల్
రాజస్థాన్కు చెందిన యువ నటి, ప్రముఖ మోడల్ హర్షిల్ కాలియా (30) రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ డీకొట్టడంతో పల్టీలు కొట్టింది. షిప్రా పాత్ రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే కారు వద్దకు చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదం స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్తో హర్షిల్ కాలియా పాపులర్ అయ్యారు. రాజస్థానీ ప్రాంతీయ సాంగ్స్లో ఆమె డ్యాన్సర్గా పనిచేశారు. ఆపై యాంకర్గా కూడా గుర్తింపు పొందారు.“Shiprapath Road पर दर्दनाक हादसा: 30 वर्षीय मॉडल युवती की मौ*त#Jaipur #CarAccident #HarshilKalia #ShiprapathRoad #TragicNews #RoadAccident #BreakingNews #CCTVFootage #updateindia pic.twitter.com/7FGuqG1Rs8— Update India (@UpdateIndia_TV) March 24, 2026 -
నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్ పేరుతో తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. తన ఇంట్లో వారితో కన్నీళ్లు పెట్టుకున్నా సరే మొదటి సినిమా కావడంతో సర్దుకుపోవాలని సూచించారని మోనాలిసా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ సమయంలో తన వయసు 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదని గుర్తుచేసింది. అందుకే బయటి ప్రపంచానికి చెప్పలేకపోయానని తెలిపింది. ప్రస్తుతం తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలో నివసిస్తున్నానని చెప్పింది. తమకు ప్రాణహాని ఉండటంతో ఆందోళనతో ఉన్నామని తెలిపింది.యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి కూడా గతంలో సనోజ్ మిశ్రాపై లైంగిక ఆరోపణలు చేసింది. సినిమా ఛాన్స్ ఇస్తానని నమ్మించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. జూన్ 18, 2021న తనని ఓ రిసార్ట్లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. అయితే, ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలతో బెదిరించి చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత బెయిల్ ద్వారా విడుదలయ్యారు. అయితే, మోనాలిసా పెళ్లి చేసుకున్న తర్వాత సనోజ్ మిశ్రా సంచలన కామెంట్ చేశాడు. మోనాలిసా సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఆమె సడెన్గా పెళ్లి చేసుకోవడంతో సినిమా ఫలితంపై భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
టొవినో థామస్ సినిమా.. రూ. 14 కోట్ల మోసం అంటూ..
మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ నటిస్తున్న కొత్త చిత్రం 'పల్లి చట్టంబి' వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు డీజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలలో సినిమాపై బజ్ కూడా క్రియేట్ అయింది. ఇందులో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. నౌఫల్, బ్రిజేశ్, సీసీసీ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.మాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం.. దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈ చిత్ర నిర్మాతలైన నౌఫల్ అహ్మద్, బ్రిజేష్ మహమ్మద్లపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సుమారు రూ. 14 కోట్లకు మోసం చేశారని, ఆ నిధులతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు పిటిషన్లో భాగంగా మాత్రమే ఉన్నాయి. కానీ కోర్టులో ఇంకా నిరూపించబడలేదు. హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఆదేశాలు కూడా షెడ్యూల్ చేసింది. అయితే, ఇప్పటివరకు, చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ సినిమా 1950, 60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందుతోంది. -
ప్రభాస్తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి మరోసారి ప్రభాస్పై అభిమానాన్ని చూపించారు. టాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాశి.. బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కలిసి నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చాయి. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి పలు చిత్రాలతో పాటు సీరియల్స్లో కూడా కనిపిస్తుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నటి రాశి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పారు. ప్రభాస్తో కలిసి ఒక్కసినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏళ్లుగా ఉండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఛాన్స్ వచ్చినా తల్లిగా మాత్రం నటించనని క్లారిటీ ఇచ్చారు. ఆపై అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. హీరోయిన్గా నటించే ఛాన్స్ ఎలాగూ ఇవ్వరని తెలిపారు. దీంతో తన కోరిక అలాగే ఉండిపోయిందన్నారు. అయితే, ప్రభాస్ను ఇంతవరకు కలవలేదని రాశి అన్నారు. మిర్చి, రాధేశ్యామ్ వంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 'ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని తన బ్రదర్తో చెప్పానని ఆమె అన్నారు. ప్రభాస్ సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్కి వెళ్తానని రాశి చెప్పడం విశేషం.అడవి రాముడు షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్లోనే తాను కూడా ఉన్నానని రాశి అన్నారు. 'ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే ప్రభాస్ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్కు కాల్ చేసి మాట్లాడా. అయితే ప్రభాస్ సీనియర్స్కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. Nen #Prabhas ki Matram Amma ga cheyanu. Eshwar Trailer chusi I just told my brother that he's going to be a Big Hero ani, Ayana Cinema ki Matrame Theatre ki velta nenu, Chatrapati, BB1&2!(Nenu Intha varaku Prabhas ni kalavale) Industry lo unavale kalavale ante manam, kastamey. pic.twitter.com/G9S1gTJjld— . (@charanvicky_) March 24, 2026 -
రామ్ చరణ్కు గాయం.. షూటింగ్కు బ్రేక్
రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్లో చరణ్కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తోంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్లో చేరతారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే చరణ్తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్ను విడుదల చేస్తారని టాక్..గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. -
అతను నా క్లాస్మేట్.. స్టార్ హీరోపై శృతి హాసన్ కామెంట్
పాన్ ఇండియా కథానాయికల్లో ఒకరు శృతి హాసన్. ఈమె నటుడు కమలహాసన్ వారసురాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న నటి ఈమె. అంతేకాకుండా సంచనాలకు నిలయం శృతి హాసన్(Shruti Haasan) అనే ట్యాగ్లైన్ను కూడా వేసుకున్నారీమె. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే ఈమె ప్రేమ వ్యవహారం కూడా తెలిసిన పుస్తకమే. కాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక బేటిలో శృతిహాసన్ తన పాఠశాల జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కర్ సల్మాన్ తాను బాల్యంలో చెన్నైలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. రెండు ప్రముఖ పాఠశాలల్లో తమ విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆ సమయంలో తాము తరచూ కలుసుకునేవారుమని చెప్పారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. అప్పట్లో పలువురు సహా విద్యార్థులతో కలిసి తాను సోంబి పాటను పాడిన అనుభవం ఉందన్నారు. ఆ తర్వాతనే తనను దుల్కర్ సల్మాన్ సోంబి అని పిలిచే వాడిని పేర్కొన్నారు. అతనితో కలిసి చదివిన విద్యార్థులకు తాను కమలహాసన్ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు అని, తన పేరు తెలియదని చెప్పారు. కాగా తాజాగా ఈ భామ దుల్కర్ సల్మాన్తో కలిసి ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రం లో నటించడం విశేషం. ఈ చిత్రం తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో రూపొందుతోంది. -
వినోదాల సందడి
మార్చి నెల ముగింపుకు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనే చర్చ ఆడియన్స్లో మొదలైంది. వచ్చే నెలలో డిఫరెంట్ జానర్స్లోని సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ జాబితాలో ‘పెద్ది’ వంటి పెద్ద చిత్రం నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి... ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు ఈ విధంగా...పెద్ది పోరాటం వచ్చే నెల చివర్లో థియేటర్స్లోకి రానున్నాడు పెద్ది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ అండ్ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్కు చెందిన టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అయితే ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. తొలుత ‘పెద్ది’ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయా లనుకున్నారు మేకర్స్. కానీ ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ చాలా స్పీడ్గా షూటింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి ఇలా జరగకూడదని పక్కా ప్లాన్తో షూటింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్లో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేస్తారని, ఇదే సాంగ్లో ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ సైతం కాలు కదుపుతారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.అలాగే ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ నుంచి సర్ప్రైజింగ్గా ఓ యాక్షన్ టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. ‘పెద్ది’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో రామ్చరణ్ క్రికెటర్గానే కనిపించారు. కానీ రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా రాబోతున్న యాక్షన్ టీజర్లో చరణ్ కుస్తీ పడుతున్న సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇంకా ‘పెద్ది’ చిత్రంలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.అంతేకాదు... ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఊరిలో నెలకొన్న ఓ సమస్య కోసం హీరో పాత్ర పోరాటం చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎమోషనల్ బైకర్ ఏప్రిల్ 3న థియేటర్స్లోకి దూసుకు రానున్నాడు బైకర్. శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘వాడికి రేసింగ్ అంటే ప్రాణం..’, ‘నువ్వు అందరికంటే ముందు రాలేదు... నీ కంటే అందరూ వెనకాల వచ్చారు.రెండింటికి చాలా తేడా ఉంది’, ‘విక్కీతో కొంచెం మాములుగా ఉండొచ్చు కదా... ఎందుకంత కంట్రోల్ చేస్తావ్..., ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్... నథింగ్ ఈజ్ బిగ్గర్ థేన్ స్పోర్ట్’, ‘నీలాంటి పిరికివాడితో పని చేయడం నాకు తెలియదు రా..’, ‘వాళ్ల నాన్నకు విక్కీ కొడుకు కాదు... రేసర్ అంతే..’, ‘కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రిని ఒక్కర్ని చూపించు’ వంటి డైలాగ్స్ ‘బైకర్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో వికాస్ నారాయణన్ పాత్రలో శర్వానంద్, బుల్లెట్ సునిల్ పాత్రలో రాజశేఖర్ నటించారు. ఇందులో రాజశేఖర్, శర్వానంద్ తండ్రీకొడుకులుగా చేశారు.‘బైకర్’ సినిమాలో రైసింగ్ అంశాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ 1990, 2000... ఇలా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుంది. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ‘బైకర్’ సినిమాను తొలుత గత ఏడాది డిసెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్లో రాజీ పడకూడదని, యూనిట్ ఈ సినిమా రిలీజ్ను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శర్వానంద్ నుంచి రానున్న ‘బైకర్’ చిత్రంపై ఆడియన్స్లో అంచనాలు ఉన్నాయి.మాజీ ప్రేమికుల ప్రయాణం బ్రేకప్ తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమికులు తిరిగి ప్రేమలో పడతారా? ఈ ప్రయాణంలో వారు వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు? అన్న అంశాల నేపథ్యంలో ‘డెకాయిట్’ సినిమా తెరకెక్కిందని తెలిసింది. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర చేశారు. దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు.అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ... ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో వచ్చే ఓ రాబరీ ఎపిసోడ్, అలాగే ‘కన్నె పిట్టరో..’ పాట హైలైట్స్గా ఉంటాయని సమాచారం. షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా వ్యవహరించారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తొలుత ‘డెకాయిట్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి రణ్వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజ్కు షెడ్యూల్ కావడంతో ‘డెకాయిట్’ను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. ఈ నెల 28న ఈ సినిమా నుంచి ‘చిచ్చుబడ్డి’ అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2022లో అడివి శేష్ హీరోగా ‘హిట్: ది సెకండ్ కేసు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం తర్వాత అడివి శేష్ సోలో హీరోగా మరో సినిమా థియేటర్స్కు రాలేదు. మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా అడివి శేష్ నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొని ఉంది. ఇక గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో అడివి శేష్ ఓ అతిథి పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.కాపాడే కవచం నిఖిల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిం చారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. అయితే ‘స్వయంభూ’ సినిమాను తొలుత ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చనే టాక్ తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా ఒకవేళ విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమా విడుదలయ్యేలా ‘స్వయంభూ’ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక ఇటీవల ‘స్వయంభూ’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి, శ్రీరాముడికి అందించిన ఈ సింగోలుకి కూడా అరణ్యవాసమా?’, ‘యుద్ధమా?’, ‘అంతర్యుద్ధం..’, ‘కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా..’, ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా... కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.అమెరికా రిటర్న్స్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ కామెడీ సినిమా ‘రాకాస’. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్కు రైటర్గా, ‘బెంచ్లైఫ్’ సిరీస్కు దర్శకురాలిగా చేసిన మానసా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మానసా శర్మకు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఉమేష్ కుమార్ బన్సల్తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇటీవల ‘రాకాస’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘నరకం నుండి సందేశం వస్తుంది.ఇక సమయం లేదు’, ‘మన ఊరి శాపం ఇది’, ‘మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’, ‘ఐయామ్ వీరూ సార్... అమెరికా రిటర్న్స్’, ‘నేను రైట్ అడ్రస్కు వచ్చిన రాంగ్ పర్స్ని సార్... నాకు, ఈ ఊరికి అస్సలు సంబంధం లేదు సార్...’, ‘ఇది ఆఖరి హెచ్చరిక’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. అయితే టీజర్లోని కంటెంట్, డైలాగ్స్ను బట్టి ‘రాకాస’ కథనం ఓ ఊరు, అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. నేడు (బుధవారం) ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇక ‘మ్యాడ్, మ్యాడ్ 2’ వంటి ఫీచర్ ఫిల్మ్స్లో సంగీత్ శోభన్ ఓ లీడ్ రోల్లో నటించారు. అలాగే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్లో హీరోగా చేశారు. కానీ ‘రాకాస’ చిత్రంలో మాత్రం సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశారు. మరి... ఈ సినిమా సంగీత్ కెరీర్కు ఎంత మైలేజ్ ఇస్తుందన్న విషయం మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ స్నేక్ డ్యాన్స్ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్రనిర్మాత–నటి నిహారిక కొణిదెల గెస్ట్ రోల్ చేశారని తెలిసింది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.తిమ్మరాజుపల్లిలో ఏం జరిగింది? సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పీరియాడికల్ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిం చారు. 1990 కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. తేజ వేల్పుచర్లతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం తిమ్మరాజుపల్లి అనే ఊరి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఆ ఊరి ప్రజలు, హీరో ప్రేమకథ, శివరాత్రి జాగారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు... ఇలాంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట. వంశీకాంత్ రేఖన ఈ చిత్రానికి సంగీతం అందించారు.పాపం ప్రతాప్ ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తిరువీర్. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.పి దుర్గా నరేష్ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ భార్యాభర్తలుగా నటించారు.అనువాద చిత్రాలూ ఉన్నాయికోలీవుడ్లో ఏప్రిల్లో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ‘కర’ ఒకటి. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, మమితా బైజు హీరోయిన్గా నటించారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేష్ ఈ సినిమాను నిర్మించారు. రివెంజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి మమితా బైజు, కేఎస్ రవికుమార్ల ఫస్ట్ లుక్స్ను రిలీజ్ చేశారు.‘కర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పత్య్రేకంగా చె΄్పాల్సిన అవసరం లేదు. ‘లవ్ టుడే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), డ్యూడ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరో పటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే ’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా ఏప్రిల్ 10కి వాయిదా పడిందని టాక్. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. శరవణన్ ‘లీడర్’ చిత్రం కూడా ఏప్రిల్లోనే రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్లో వచ్చే నెల రిలీజ్ కానున్న సినిమా ‘భూత్ బంగ్లా’. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ హారర్ సినిమాలో పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి మంగళవారం ‘తుహీ దిస్దా’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు.అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మరోవైపు మాలీవుడ్లో ఏప్రిల్ 10న ‘పళ్లి చట్టంబి’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. టొవినో థామస్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.1950–1960 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. కన్నడలో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రేమ్ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రామచంద్రన్ ఈ మూవీలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇలా వచ్చే నెల తెలుగులో రిలీజ్ కానున్న మరికొన్ని అనువాద సినిమాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
హీరోయిన్తో ప్రేమలో కాలభైరవ! హింట్ ఇచ్చారా?
టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ పనులతోనే బిజీగా ఉండకుండా కాస్త పర్సనల్ లైఫ్పైనా ఓ కన్నేశారు. జీవితంలో ఓ అడుగు, కాదు కాదు.. ఏడడుగుల బంధంలోకి వెళ్లే ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఆ సినిమా నుంచే లవ్ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సింగర్ కాలభైరవ చేరనున్నట్లు తెలుస్తోంది. బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్రామ్తో అతడు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట! కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కథానాయికగా నటించింది. హింట్ ఇచ్చారా?అలా ఈ మూవీ సెట్లో వీరికి ఏర్పడిన పరిచయం రానురానూ ప్రేమబంధంగా మారిందట! వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చజెండా ఊపారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కావ్య, కాల భైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంటే తాము ప్రేమలో ఉన్నమాని సిగ్నల్స్ ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సినిమాకావ్య కల్యాణ్ రామ్ విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె గంగోత్రి మూవీలో బాలనటిగా యాక్ట్ చేసింది. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, బాలు, బన్నీ, పాండురంగడు.. ఇలా అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించింది. 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్గా మారింది. బలగం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. కాలభైరవ విషయానికి వస్తే.. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. కెరీర్కలర్ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా.. వంటి పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్యా.. పాట సింగర్గా అతడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ మూవీలో రాహుల్ సిప్లిగంజ్తో కలిసి పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ గెల్చుకుంది. అదే చిత్రంలోని కొమురం భీముడో పాటకుగానూ కాలభైరవకు జాతీయ అవార్డు వచ్చింది. Manollani nenu chala sarlu theatres lo, Restaurants lo chusanu naku appude theda kottindhi. Relation lo unnaru ani ardhamaindhi. Finally Book launch event ki kalisi vaccharu. Andhariki Hint ivvadaniki 🥰🥰Chudali e celebrate couple aina life long unte bagundu❤️❤️🥹🥹 pic.twitter.com/ILVGBRQ7pM— Swaasthi (@swaasthi) March 24, 2026 చదవండి: బ్యాండ్మేళం కోసం చిరంజీవినే రిస్క్లో పడేసిన కోన వెంకట్ -
ఉత్తరాంధ్ర జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు.. చూశారా?
తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నల జీలకర్ర మొగ్గ బాగా వైరలయింది. తాజాగా మరో జానపద పాటను వదిలారు.ఉత్తరాంధ్ర జానపదంకోసింది కోయగూర దుబ్బో సందమామ.. వాసనకీ సంపంగి మొగ్గ అంటూ పాట మొదలవుతుంది. ఈ జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు వేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించగా అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము ఆలపించారు. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపదాల నుంచి సేకరించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.ఆనంది కెరీర్ఆనంది విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ జిల్లా తన స్వస్థలం. ఆమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును హాసికగా మార్చుకుంది. అది కలిసిరాకపోయేసరికి ఆనందిగా మారింది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్, ప్రేమంటే, భైరవం సినిమాలు చేసింది. తెలుగులోకన్నా కోలీవుడ్లోనే హీరోయిన్గా మంచి పేరు, అవకాశాలు తెచ్చుకుంది. -
చిరంజీవిని రిస్క్లో పడేసిన కోన వెంకట్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో పేరుమోసిన రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోన వెంకట్. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్, దూకుడు, అల్లుడు శీను, నిన్ను కోరి. ఇలా అనేక హిట్ సినిమాలకు కథారచయితగా పని చేశాడు. అయితే ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కోన వెంకట్ తర్వాత వరుస వైఫల్యాలు చూసేసరికి నెమ్మదిగా సైడ్ అయిపోయాడు. రైటర్గా చాలావరకు సినిమాలు తగ్గించేశాడు.కోన వెంకట్కు బూస్ట్అలాంటి కోన వెంకట్కు 'వాల్తేరు వీరయ్య'తో మళ్లీ ఎనర్జీ వచ్చినట్లయింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ బ్లాక్బస్టర్ మూవీకి కోన రచనా సహకారం అందించాడు. ఇకపోతే వీరి కాంబినేషన్లో మరోసారి రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే! చిరంజీవి-బాబీ సినిమాకు కోన రచనా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.అప్పుడు నాని చాలెంజ్కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్ చిరంజీవి సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఓ ఆసక్తికర ఛాలెంజ్ విసిరాడు. కోర్ట్ సినిమా రిలీజ్కు ముందు నాని ఓ మాటన్నాడు. ఈ మూవీ నచ్చకపోతే ఇంకెప్పుడూ తన సినిమా చూడవద్దన్నాడు. ఆ మాట చెప్పడానికి చాలా గుండెధైర్యం కావాలి. సీరియస్గా చెప్తున్నా..ఇప్పుడు నేనూ చెప్తున్నా.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసే సినిమాలను మీరెవరూ చూడకండి. ఇది నేను సరదాకి చెప్పడం లేదు.. నిజంగానే ఈ మూవీ నచ్చకపోతే నా సినిమాలు చూడకండి. అలాగని రాయడం మానేయను, మీకు నచ్చేంతవరకు కథలు రాస్తూనే ఉంటాను. ఇప్పుడిది చూశారంటే చిరంజీవిగారు కోప్పడతారు. ఎందుకంటే నేను నెక్స్ట్ రాస్తున్న సినిమా ఆయనదే! అన్నాడు. అలా చిరు-బాబీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు తాను రైటర్ అని కోన వెంకట్ వెల్లడించాడు. మొత్తానికి ఈ ఓపెన్ ఛాలెంజ్తో చిరు-బాబీ సినిమాను రిస్కులో పడేశాడు.చదవండి: రామ్చరణ్, మహేశ్బాబుకు అలా.. కానీ,, : బండ్ల గణేశ్ -
విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్ సందడి (ఫొటోలు)
-
కోర్ట్ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు!
కోర్ట్ సినిమాతో హర్ష్ రోషన్, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు మర్చిపోండిఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కాలేజీ డేస్ మిస్ మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్ మిస్ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్ అన్నాడు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్ నిర్మించారు.చదవండి: ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్ -
చిరంజీవితో పని చేయాలని కోరిక: మ్యూజిక్ డైరెక్టర్
దండోరా సినిమాకు నాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా గద్దర్ అవార్డు లభించడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రేక్షకులకు మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను అని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్.గద్దర్ అవార్డుది ఘోస్ట్, మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్, సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దండోరా సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న మార్క్ కె.రాబిన్ విలేకరులతో మాట్లాడుతూ.. నాకు బాల్యం నుంచే సంగీతం అంటే ఇష్టం. కొంతకాలం టీచర్గా పని చేశాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు. నానికి నచ్చడంతో..దర్శకనిర్మాత ప్రశాంత్ వర్మ, కృష్ణకాంత్, నేను తరచూ కలుస్తుండేవాళ్లం. అలా నేను, ప్రశాంత్ కలిసి ఇన్ ది డార్క్ అనే ఇండియా ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం చేశాం. ఆ తర్వాత నానిగారి మజ్ను మూవీ ట్రైలర్కు ఆర్ఆర్ అందించాను. ఈ మ్యూజిక్ నానిగారికి నచ్చడంతో అ..! చిత్రానికి అవకాశం కల్పించారు.అదే నా కోరికఅలా మ్యూజిక్ డైరెక్టర్గా నా ప్రయాణం మొదలైంది. భావోద్వేగంతో నిండిన మనసుతోనే దండోరాకి సంగీతాన్ని అందించాను. చిరంజీవిగారితో సినిమా చేయాలన్నదే నా ఆకాంక్ష. సంగీతం విషయంలో మనం ఇప్పటికీ చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ప్రస్తుతం కథాకళి, రాజాది రాజా సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మగారితో రెండు సినిమాలు చేస్తున్నాను. హిందీలో సైఫ్ అలీఖాన్గారితో ఓ మూవీ చేయాల్సింది కానీ కుదర్లేదు. అదే విధంగా ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు. -
రామ్చరణ్, మహేశ్కు అలా జరిగింది.. కానీ!: బండ్ల గణేశ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈసారి బ్యాండ్మేళం మూవీలో వీరు బావామరదళ్లుగా నటించారు. సతీశ్ జవ్వాజి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం (మార్చి 24న) ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్కు నిర్మాత బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అరడజను మంచి డైరెక్టర్లకు ఛాన్స్ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కోన వెంకట్గారికోసమే ఈ ఈవెంట్కు వచ్చాను. ఇండస్ట్రీ మొత్తం ఒక పక్కనుంటే, కోన ఒక్కడే నీ పక్కనుంటే నువ్వు గెలిచేయొచ్చని వినాయక్ అన్నాడు. అది ఆయనకున్న పవర్.. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలను ఒప్పించి అరడజను మంది దర్శకులకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం అంటే జోక్ కాదు. హీరోలు 100 ప్రశ్నలు వేస్తారు, 200 డౌట్లు పడతారు. చస్తే ఆ పని చేయనుఎందుకంటే వాళ్లకు హిట్టు కావాలి! అలాంటి వాళ్లను ఎలాగోలా మాయ చేసి ఒప్పిస్తున్నారు. బాబీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ శివ నిర్వాణ.. ఇలా ఎంతోమందిని డైరెక్టర్ల ముందడుగు కారణమై సక్సెస్ను ముందుకు తీసుకెళ్లడంలో కోన వెంకట్ ముందుంటాడు. బ్యాండ్మేళం కోసం ఆయన రెండు, మూడు ప్రాపర్టీలు అమ్మేశాడు. నేనయితే ప్రాణం పోయినా ఆ పని చేయను. ఆస్తి తాకట్టు పెట్టి సినిమా తీశారంటే మీకు సినిమా అంటే అంత ప్రేమ.సక్సెస్ మన చేతుల్లో లేదుహీరో హర్ష్ రోషన్ విషయానికి వస్తే.. టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవడం చాలా అరుదు. మహేశ్బాబు, రామ్చరణ్లాంటివారికి జరిగింది. స్టార్ డైరెక్టర్స్.. తమ కుమారులకు వారసత్వంగా ఆస్తినిచ్చారు, కానీ సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. నిజంగా రోషన్ను చూస్తే నా కొడుకుగా పుట్టుంటే బాగుండేదనుకున్నాను. ఈ అబ్బాయి సూపర్స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ కోన వెంకట్గారికోసమైనా సూపర్ హిట్ అవుతుంది అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పాడు.చదవండి: నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి -
ఘనంగా 'బ్యాండ్ మేళం' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
బ్రిటిష్ సైనికుడు
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారు.మార్చి 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీలో శ్రీకాంత్ పోషించిన బ్రిటిష్ పాత్ర పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడిగా శ్రీకాంత్ కనిపించనున్నారు. ఆయన లుక్కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ద్వారా సాయి దుర్గాతేజ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మల్లన్న సేవలో హీరో శ్రీకాంత్ దంపతులు
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్ బర్త్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. Birthday boy #Srikanth in a brand new avatar as BRITISHUUU from #SambaralaYetiGattu 🎉🔥Stylish, fresh & intriguing look—setting the vibe already! 👀✨#SYG #SaiDharamTej #Tollywood #NewLook #BirthdaySpecial @actorsrikanth pic.twitter.com/ePycsIAR6A— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 23, 2026 -
మళ్ళీ ట్రాక్ తప్పుతోన్న ప్రభాస్..
-
రంగస్థలం 2 కి రంగం సిద్ధం
-
మూడు సార్లు రిజెక్ట్ చేశారు.. తొక్కా అనుకున్నా: దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తనకు అమెరికా వీసా మూడు సార్లు తిరిస్కరణకు గురైందని తెలిపారు. కానీ ఆ తర్వాత 2009లో మరో చరిత్ర షూటింగ్ టైమ్లో నాకు వీసా లభించిందని అన్నారు. అప్పుడే తొలిసారి యూఎస్ వెళ్లానని వెల్లడించారు. వీసా రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని యాంకర్ దిల్ రాజును ప్రశ్నించారు.దీనికి దిల్ రాజు బదులిస్తూ.. తొక్కా.. వాళ్లేంటి ఇచ్చేది.. వీసా వచ్చినప్పుడే పోదాం లే అనుకున్నా అని అన్నారు. అప్పటికే నేను ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలను నిర్మించానని దిల్ రాజు తెలిపారు. కాగా.. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్కు నిర్మాత ముఖ్య అతిథిగా దిల్రాజు హాజరయ్యారు. రిలీజ్ డేట్ మారొచ్చు..అనంతరం ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు మాట్లాడారు. వీళ్లు మే 1వ తేదీకి రిలీజ్ చేస్తామని అంటున్నారు. కానీ ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కానుంది. అలాంటి టైమ్లో వీళ్లు వన్ వీక్ వెనక్కి వెళ్లే అవకాశముందని అన్నారు. కాకగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఓ యువకుడి జీవితం ఎలా మారింది? అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో తరుణ్ భాస్కర్కు జంటగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. అప్పట్లో అమెరికా వెళ్దాం అనుకుంటే.. నాకు... 3 సార్లు వీసా రిజెక్ట్ అయ్యింది 'మరో చరిత్ర' షూటింగ్ టైంలో దొరికింది తొక్క... వాళ్ళు ఇచ్చేది ఏంటి.. వచ్చినప్పుడే వెళదామని అనుకున్నాను అప్పటికే నేను 'ఆర్య' 'బొమ్మరిల్లు' సినిమాలు తీసిన నిర్మాతని : దిల్ రాజు#TharunBhascker… pic.twitter.com/1lmiOuwQPu— Filmy Focus (@FilmyFocus) March 23, 2026 -
కోట్లాది రూపాయల స్కామ్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ
సత్యవతి అలియాస్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి ఓ లాయర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా.. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్లో ఏకంగా రూ.150 కోట్ల మేర క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయమై స్వయంగా మంగ్లీనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది)'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్విటేషన్ వివరాలవరకే గానీ, వాళ్ల వ్యక్తిగత వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరుని వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం' 'కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలని, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను' అని మంగ్లీ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్లో మోహన్బాబు
టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ వేడుకకు లక్ష్మి తల్లితో పాటు, సోదరుడు మంచు మనోజ్ భార్యాపిల్లలతో సహా హాజరయ్యాడు. ఎంతో సంబరంగా మేనకోడలిని పల్లకిలో ఎక్కించుకుని మరీ ఊరేగాడు. మరో సోదరుడు విష్ణు, తండ్రి మోహన్బాబు మాత్రం ఫంక్షన్లో ఎక్కడా కనిపించలేదు.మరోసారి ఫంక్షన్దీంతో మంచు కుటుంబంలో విభేదాలు తగ్గలేదా? అన్న అనుమానం మొదలైంది. తాజాగా మరోసారి హాఫ్ శారీ ఫంక్షన్కు సంబంధించిన ఈవెంట్ నిర్వహించడం చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. నిర్వాణ ఓణీల ఫంక్షన్ను మరోసారి ఇంట్లో గ్రాండ్గా నిర్వహించారు. తనకు నలుగుపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హాజరవని విష్ణుఈ వేడుకను మోహన్బాబు దంపతులు దగ్గరుండి చూసుకున్నారు. మనవరాలిని మనసారా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు భార్య విరానిక, వారి పిల్లలు సైతం హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరవలేదు. అలాగే మనోజ్ దంపతులు కూడా ఈ ఫంక్షన్లో కనిపించలేదు. దీంతో విడిపోయిన కుటుంబం కోసం రెండుసార్లు ఈ వేడుక జరిపినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
అరెరే... అరెరే
గాయని – నటి దియా తాజా మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ‘అరెరే... అరెరే..’. క్రాంతీ వర్మ దర్శకత్వంలో నూతన్ చేకూరి నిర్మించిన ఈ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, హీరో ఆకాశ్ పూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, మిమిక్రీ ఆర్టిస్టు–నటుడు శివ, సమీర్, సాగర్... ఈ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలన్నారు.‘‘మంచి కాన్సెప్ట్తో రూపొందిన ఆల్బమ్ ఇది’’ అని చెప్పారు నూతన్ చేకూరి. ‘‘భావోద్వేగాలతో కూడిన విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ఈ ఆల్బమ్ చేశాం’’ అన్నారు క్రాంతీ వర్మ. ఈ ఆల్బమ్ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ మాట్లాడారు. -
పాట కావాలయ్యా..!
సినిమా మొత్తం సీరియస్గా సాగుతోంది... మరోవైపు ఎమోషన్స్ కూడా కంట తడిపెట్టిస్తున్నాయి... ఇలాంటప్పుడే రిలీఫ్ కోసం ఒక పాట కావాలయ్యా అని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకైతే గ్రాండ్ లెవెల్లో స్పెషల్ సాంగ్ కావాలని ఉంటుంది. అందుకే ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. రానున్న కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ తరహా పాటలు ఉన్నాయి. అయితే... ఈ స్పెషల్ సాంగ్స్ గురించి యూనిట్ నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రచారంలో ఉన్న ప్రకారం పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహీ ప్రత్యేక పాటల్లో కనిపించనున్నారట. ఆ పాటలు ఏ సినిమాలోనో తెలుసుకుందాం.హిట్ రిపీట్ అవుతుందా? టాప్ హీరోయిన్ పూజా హెగ్డే వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే చేసిన ‘మోనికా..’ సాంగ్ సూపర్హిట్గా నిలిచింది. రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేసిన ప్రత్యేక పాట ‘జిగేల్ రాణి’, వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 3’లో చేసిన స్పెషల్ సాంగ్ ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాల..’ కూడా చాలా పాపులర్. ఈ పాటల తరహాలోనే మరో హిట్ స్పెషల్ సాంగ్ను చేయనున్నారట పూజా హెగ్డే. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు యూనిట్ ప్రకటించగా, హీరోయిన్స్ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ భోర్సేలు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ కోసం మేకర్స్ పూజా హెగ్డేని సంప్రదించారనే టాక్ తెరపైకి వచ్చింది.మరి... అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తారా? పూజా హెగ్డే గత ప్రత్యేక పాటల సక్సెస్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘అల.. వైకుంఠపుర ములో..’లోని సాంగ్స్ బాగా పాపులర్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. మాస్ సాంగ్ రామ్ చరణ్ నటించిన రూరల్ మాస్ మూవీ ‘రంగస్థలం’లోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళ్లీ రామ్చరణ్ ఈ రూరల్ బ్యాక్డ్రాప్లో మరో సినిమా చేస్తున్నారు. అదే ‘పెద్ది’. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణను ఆరంభిస్తారు. అయితే బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్లో స్పెషల్ కూడా ఒకటి ఉందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్లో ముగ్గురు హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తారనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా మృణాల్ ఠాకూర్ చేయనున్నారని సమాచారం. అది మాత్రమే కాదు... ఈ చిత్రకథానాయిక జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కనిపిస్తారని భోగట్టా. రామ్ చరణ్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్లో రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మాసీ సాంగ్ అంటే మాస్ ఫ్యాన్స్కు విజిల్ మూమెంట్స్ అనే చెప్పవచ్చు. అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని ఊహించ వచ్చు. ఏప్రిల్లో మొదటి వారంలో ఈ పాట చిత్రీకరణ జరగనుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.జైలర్తో సందడి ‘నువ్వు కావాలయ్యా...’ అంటూ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ (2023)లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘జైలర్ 2’లో ఈ తరహా ప్రత్యేక పాట కావాలయ్యా... అంటున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సీక్వెల్లోనూ బ్రహ్మాండమైన స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటకు నోరా ఫతేహీ డ్యాన్స్ చేశారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్–నోరా పాల్గొనగా చెన్నైలో ఎనిమిది రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారని సమాచారం.తొలి భాగానికి పాటలు స్వరపరచిన అనిరుధ్ రవిచందర్ ‘జైలర్ 2’కి కూడా సంగీతం అందించారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్కుమార్ మలి భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సీక్వెల్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారని తెలిసింది. ఇది సౌత్ స్టైల్లో సాగే సాంగ్ అని, చాలా గ్రాండ్గా చిత్రీకరించారని చెన్నై ఫిల్మ్నగర్ అయిన కోడంబాక్కమ్లో ప్రచారమవుతోంది.ఇదిలా ఉంటే... తెలుగు, తమిళ, హిందీ... ఇలా పలు భాషల్లో నోరా ఫతేహీ ఇప్పటివరకూ ఎన్నో ప్రత్యేక పాటలు చేశారు. వాటిలో ఎన్టీఆర్ ‘టెంపర్’లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’, ప్రభాస్ ‘బాహుబలి’లోని ‘మనోహరీ...’ పాటలు కూడా ఉన్నాయి. మరి... ‘జైలర్ 2’లోని పాటకు నోరా ఏ స్థాయిలో డ్యాన్స్ చేశారో జూన్లో తెలిసిపోతుంది. ఆ నెలలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఏడు వారాలు... పది కిలోలు
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకోవర్కైనా ఎన్టీఆర్ సై అంటారు. అందుకు ఉదాహరణలుగా ‘అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. తాజా చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం ఈ చాలెంజ్ను స్వీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభ సమయంలో కాస్త హెవీ బాడీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో చాలా సన్నగా కనిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ కోసమే ఎన్టీఆర్ ఇలా స్లిమ్ లుక్లోకి మారిపోయారని సమాచారం. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట.నిపుణుల సమక్షంలో ప్రతిరోజూ గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్ డైట్ను ఫాలో అవుతూ లీన్ లుక్లోకి మారిపోయారని టాక్. ఇలా సినిమా షూట్ ప్రారంభంలో కాస్త హెవీ బాడీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత లీన్ లుక్లోకి మారారంటే... ‘డ్రాగన్’లో ఈ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, టోవినో థామస్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని టాక్. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్
అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని ఏ దర్శకులు కూడా తీసుకోవట్లేదు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటించిన సినిమా 'బైకర్'. శర్వానంద్ హీరో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే రాజశేఖర్.. తనకు అవకాశాలు ఇవ్వాలని బతిమలాడుకున్నారు.(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)ఒకప్పుడు హీరోగా హిట్స్ కొట్టిన చాలామంది ఇప్పుడు తెరమరుగైపోయారు. మధ్యలో విలన్, సహాయ పాత్రలతో జగపతిబాబు లాంటి వాళ్లు వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే బలంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ 'బైకర్'లో హీరో తండ్రిగా, రేసింగ్ కోచ్గా మంచి నిడివి ఉన్న పాత్రనే చేసినట్లున్నారు. అయితే తనని ఏ దర్శకుడు కూడా సంప్రదించకపోయేసరికి.. స్వయంగా ఈయనే 'ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి' అని రిక్వెస్ట్ చేశారు.సెకండ్ స్టేజీకి వచ్చేశానని ఇన్నాళ్లు అనుకున్నానని.. కానీ అలాంటివేం ఇప్పుడు లేవని తన కూతుళ్లు చెప్పడంతోనే 'బైకర్'లో నటించానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్లో తనని రెండో హీరోలా ట్రీట్ చేశారని, శర్వానంద్ కూడా నేనే హీరోని అన్నట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజశేఖర్ లాంటి నటుడు.. ఇలా అవకాశాల కోసం బతిమలాడుకోవడం వింతగా అనిపించింది. రీసెంట్ టైంలో అయితే గోటీల ఫ్యాక్టరీ అనే మాటతో తెగ వైరల్ అవుతున్నారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?
గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్కి తప్పితే సగటు ఆడియెన్స్కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)ఇప్పుడు పవన్తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!) -
షకీరా భారత్ పర్యటన బ్రేక్
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న ఘర్షణల కారణంగా షకీరా భారత సంగీత కచేరీ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్లో ముంబై, ఢిల్లీలలో జరగాల్సిన ఈ ప్రదర్శనలను "భౌగోళిక రాజకీయ పరిస్థితి, ప్రాంతీయ ఉద్రిక్తతల" కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్టు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తిగా డబ్బు వాపసు ఇవ్వబడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం గురించి నిర్వహాకులు ఇలా ప్రకటించారు. "ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా.. షకీరా పాల్గొనవలసిన 'ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్' మరో తేదీకి వాయిదా వేయబడింది. అభిమానుల రక్షణే మా యూనిట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. టిక్కెట్టు కొనుగోలు చేసిన వారందరికీ పూర్తి వాపసు ఇవ్వబడుతుంది," అని డిస్ట్రిక్ట్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ తమ హ్యాండిల్లో ఒక పోస్ట్ పేర్కొంది.కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. కొలంబియన్ సింగర్ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్లో తొలిసారి ముంబైలో(2007) ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది. -
'నూరేళ్లు కాదు.. 130 ఏళ్లు'.. సుమకు రాజీవ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఆమె భర్త ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ సుమ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తెలుగులో వేద మంత్రాన్ని రాస్తూ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు… కాదు కాదు.. ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నానంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ కనకాల. ఇది చూసిన అభిమానులు సైతం సుమకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కుమారుడు రోషన్ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి పరిచయం సీరియల్స్తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గతంలో ఓ సినిమా ఈవెంట్లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్ హిట్ సీరియల్ 'శాంతి నివాసం' సీరియల్తోనే వారి మధ్య ప్రేమ చిగురిందని అన్నారు.శుభజన్మదినం తుభ్యంశుభజన్మదినం తుభ్యంశుభజన్మదినే తవ హేసకలం సఫలం భూయాత్సకలం చ శుభం భూయాత్నిండూ నూరేళ్లు… కాదు కాదు, ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నాను ✨Happy Birthday @ItsSumaKanakala ❤️ pic.twitter.com/nxYUpFVVKb— Raajeev kanakala (@RajeevCo) March 22, 2026 -
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో అనుష్క
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి(AA 22) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. పుష్ప-2 తర్వాత బాలీవుడ్లో అల్లు అర్జున్కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో తను నటించబోయే సినిమాల్లో హిందీ హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే అట్లీ సినిమా కోసం దీపికా పదుకోణ్ను తీసుకున్నారు. లోకేశ్ కనగరాజ్ మూవీ కోసం శ్రద్ధా కపూర్ పేరు పరిశీలనలో ఉంది. ఇంతలోనే మరో క్రేజ్ హీరోయిన్ పేరు తెరపైకి రావడం విశేషం.అల్లు అర్జున్- అట్లీ మూవీ కోసం అనుష్క శర్మను తీసుకోనున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. కానీ, ఈ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే, అనుష్క ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. క్రికెటర్ కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క కాస్త సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్తో సినిమా కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.AA22 చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సైన్స్ఫిక్షన్ మూవీలో హీరో పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందని టాక్. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణ్తో పాటు అనుష్క శర్మ ఎంట్రీ ఇస్తే ఇదో సంచలనంగా మారడం ఖాయం. -
'మామయ్య ఎల్లప్పుడు నీ వెంటే ఉంటారు'.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మంచువారి ఇంట ఇటీవలే శుభకార్యం జరిగింది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తన కోడలి ఓణీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ ఫంక్షన్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దేవుడు నాకేమిచ్చాడని అడిగితే.. అందులో మా సిస్టర్ కూడా ఒకరని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆమె నాకు ఎల్లప్పుడు ప్రేమను, ఆప్యాయతను, బలాన్ని ఇస్తుందని రాసుకొచ్చాడు.మంచు మనోజ్ తన ఇన్స్టాలో రాస్తూ..' దేవుడు నాకిచ్చిన వాళ్లలో మా సిస్టర్ కూడా ఒకరు. ఆమె నాకు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, బలాన్ని ఇచ్చింది. తనకు కూడా అదే ప్రేమను తిరిగి ఇవ్వాలన్న కోరిక నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నారి విద్యా నిర్వాణ మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు మామగా నా ప్రయాణం మొదలైంది. విద్యా నిర్వాణకు మామగా ఉండటం కేవలం ఒక బిరుదు కాదు.. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. తన రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఊహించనంత ప్రేమను ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా మను మామ, అత్త, ధైరవ్, దేవసేన ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నేను నీకు కనిపించనప్పుడు కూడా సున్నితమైన హృదయంతో ఈ ప్రపంచాన్ని జయించు. నీకు బలంగా, నీకు అండగా, నిశ్శబ్దంగా నీ వెనుక నిలబడతా.. లవ్ యూ నా బంగారు తల్లి ' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
'ధురంధర్' విజయం వెనుక తెలుగు హిట్ సినిమా: ఆదిత్య ధర్
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్- 2: ది రివెంజ్’.. బాక్సాఫీస్ వద్ద మూడురోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయింది. గతేడాదిలో విడుదలైన పార్ట్-1 భారీ విజయం అందుకోవడంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ను డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ తాజాగా తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'ధురంధర్' సినిమా విజయం వెనుక తెలుగు హిట్ సినిమా స్పూర్తి అని ఆయన పంచుకున్నారు.నాగార్జున ఐకానిక్ చిత్రం 'శివ'(1989)పై దర్శకుడు ఆదిత్య ధర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని నేటికీ తప్పక చూడాలని ఆయన అన్నారు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు శివ సినిమా చూసినట్లు గుర్తుచేసుకున్నారు. శివ చిత్రం చాలామంది దర్శకులకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సినిమా ద్వారా టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ స్టైల్లో కొత్త ఒరవడిని RGV సృష్టించారని ఆయన మెచ్చుకున్నారు.శివ సినిమాలోని ఇళయరాజా సంగీతంపై కూడా ఆదిత్య ధర్ ప్రశంసించారు. ఇందులో విప్లవాత్మకమైన సౌండ్ డిజైన్ ఉన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. 'శివ' చిత్రం ఇప్పటికీ తాజాగా, శక్తివంతంగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రం భారతీయ సినిమా భాషను ఎలా మార్చిందో, తరతరాల చిత్రనిర్మాతలకు ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ఆధునిక దర్శకుడి నుండి వచ్చిన ఈ అరుదైన ప్రశంస, నిజమైన క్లాసిక్లు కాలంతో పాటు మసకబారవని నిరూపిస్తుంది. రామ్గోపాల్ వర్మ తన సృజనాత్మక మేకింగ్తో తరతరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారని, ఆదిత్య ధర్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. A 6 year old kid saw #Shiva and today he became #AdityaDhar https://t.co/Y0Fh3GP55Z pic.twitter.com/ARbIY4t2j0— Nag Mama Rocks (@SravanPk4) March 21, 2026 -
కల్కి సీక్వెల్లో స్టార్ నటుడు ఎంట్రీ..!
ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ లేకుండానే ఇప్పటికే కల్కి పార్ట్-2 షూటింగ్ పనులు కొద్దిరోజుల క్రితమే మొదలయ్యాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్తో భాగమైన సీన్స్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీలో మరో స్టార్ నటుడు చేరాడని తెలుస్తోంది.హైదరాబాద్లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్లోకి ప్రముఖ హీరో జె.డి. చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చారని సమాచారం. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలోనే కల్కి సెట్స్లోకి ప్రభాస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నగా.. దీపికా పదుకోన్ స్థానంలో ఒక కొత్త నటి రానుంది. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. -
విరోష్ జంట హనీమూన్.. సోషల్ మీడియాలో ఫోటో లీక్..!
టాలీవుడ్ జంట రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ కొత్త ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లికి కొన్ని రోజుల ముందే తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. వీరిద్దరి పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో విరోష్ జంట సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు.తాజాగా ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. విరోష్ జంట తమ హనీమూన్ కోసం థాయ్లాండ్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్ రొమాంటిక్గా ఉన్న ఈ ఫోటో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ థాయిలాండ్ హనీమూన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలో విరోష్ జంట ఒక మెట్లపై ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రశాంతంగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న 'రణబలి' చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. View this post on Instagram A post shared by ⭐VDFC MAHARASHTRA™⭐ (@vijaydeverakonda_maharashtra) -
కాంట్ అవాయిడ్
‘వయొలెన్స్ ... వయొలెన్స్ ... వయొలెన్స్ ... ఐ డోంట్ లైక్... ఐ అవాయిడ్... బట్.. వయొలెన్స్ లైక్స్ మీ... ఐ కాంట్ అవాయిడ్’ అంటూ ‘కేజీఎఫ్ 2’ సినిమాలో యశ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... ప్రస్తుతం తెరకెక్కుతోన్న సినిమాల్లో అధిక శాతం ‘కాంట్ అవాయిడ్... కథలో వయొలెన్స్ ఉంటే తప్పదు గురూ’ అన్నట్లుగా వయొలెన్స్ డామినేటెడ్ కథల్లో నటిస్తున్నారు కొందరు స్టార్స్. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలు వెండితెరపై వయొలెన్స్ చూపించనున్నారు. ఆ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం...కాన్సెప్ట్ పోస్టర్తోనే అంచనాలు చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన బ్లాక్బస్టర్ అందున్నారు. ఈ మూవీకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘మన శంకర వరప్రసాద్గారు’ తర్వాత తన భుజానికి చిన్న సర్జరీ చేయించుకున్నారు చిరంజీవి. ఈ కారణంగా బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న షూటింగ్ ఆరంభం కాలేదు.ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకున్న ఆయన బాబీ డైరెక్షన్లో రూపొందనున్న మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే... మరో యువ దర్శకుడు, ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లోనూ చిరంజీవి ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ మూవీతో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించి, హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చిరంజీవితో సినిమా చేసే లక్కీ చాన్స్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్. ఈ మూవీలోనూ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు నాని. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది.ఈ చిత్రం విడుదల తర్వాత చిరంజీవి సినిమాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారాయన. చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. చేతి నుంచి రక్తం కారుతున్న ఆ పోస్టర్ ఈ మూవీలో ఏ స్థాయి వయొలెన్స్ ఉండబోతోందో చెప్పింది. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హీరో నాని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనుడంటం విశేషం. 1970–74లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో చిరంజీవి సరికొత్తగా కనిపిస్తారని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ షూటింగ్ని ఆరంభిస్తామని సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. మూడువేల మందితో... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో వయొలెన్స్ , యాక్షన్కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి ‘కేజీఎఫ్ 1, 2 ’ చిత్రాల్లో వయొలెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్, మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. అంతేకాదు.. ఈ మూవీ కోసం జోర్డాన్ లోనూ రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని అలరిస్తాయట.ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సినిమాలో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారు. ఈ సెట్లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట మేకర్స్. ఇలా... ఈ సినిమాలోని ఫైట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ సినిమాకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో... ‘ది రాజా సాబ్’ వంటి హిట్ మూవీ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ లో వైలెన్స్ ని ఏ స్థాయిలో చూపించారో సందీప్ రెడ్డి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ వయొలెన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తన పంథా ఏమాత్రం మార్చుకోకుండా తనదైన శైలిలోనే వెళుతున్నారాయన. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ని కూడా ఫుల్ వయొలెన్స్ గా చూపించనున్నారట ఆయన. తన మార్క్ ఇంటెన్స్, యాక్షన్, ఎమోషన్స్, రా పవర్తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న గ్రాండ్గా విడుదల కానుంది. సలార్ 2లోనూ.... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్ 1–సీజ్ ఫైర్’. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో హైలెట్గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్గా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్లో వయొలెన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయని ఫిల్మ్నగర్ టాక్. ఈ ఎపిసోడ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతాయని తెలిసింది.ఇదిలా ఉంటే... ఈ మూవీపై గత కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ– ‘‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ షూటింగ్ని త్వరలోనే ప్రారంభిస్తాం. మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయ భాగం అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్–నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట ప్రశాంత్ నీల్.అంతకు మించి... ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ మూవీస్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రో డక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ చూస్తే...‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ సినిమాలకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ ‘టాక్సిక్’లో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం యశ్ సరికొత్త ఫిజిక్తో మేకోవర్ అయ్యారు.ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఈ నెల 19న రిలీజ్ కావాల్సి ఉండగా జూన్ 4కి వాయిదా పడింది. ‘‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం నిర్మించాం. ఎంతో అంకితభావం, ఎన్నో ఏళ్ల శ్రమతో తీసిన మా సినిమాని మార్చి 19న రిలీజ్ చేసి మా ఆనందాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాం. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో జూన్ 4న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓవర్సీస్లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం. మా భాగస్వాములు, మా ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా మా సినిమా విడుదలను తిరిగి షెడ్యూల్ చేయడానికి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇలానే మీ ప్రేమ, అభిమానం, సహకారం ఉంటాయని ఆశిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ‘టాక్సిక్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్్సపై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పవర్ఫుల్ కల్ట్విశ్వక్ సేన్ హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర పాత్రలు పోషించారు. తారక్ సినిమాస్ బ్యానర్పై సందీప్ కాకరాల నిర్మించారు.ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే రక్తంతో తడిసిన ఇంటెన్స్ లుక్లో విశ్వక్ సేన్ కనిపించగా, భారీ హైప్ సృష్టించింది. అదే విధంగా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘‘జనాలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను.‘ఫలక్నుమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి’’ అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్ జడల్ ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై రూపొందుతోన్న ఈ సినిమాలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీలో నానీని పవర్ఫుల్ మాస్ పాత్రలో చూపించారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ మూవీ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారు నాని. ‘హిట్ 3’లో నాని వయొలెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ‘ది ప్యారడైజ్’లోని వయొలెన్స్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని మరింత స్పష్టం అవుతోంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లింప్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నానిపై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్...’ని ఇటీవల విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని కూడా యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్... ఇలా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21కి విడుదల వాయిదా వేశారు మేకర్స్. మాస్ రణబాలి హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి ‘రౌడీ జనార్థన, రణబాలి’ వంటి రెండు వయొలెన్స్ సినిమాలు చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఫుల్ వయొలెంట్గా ఉంటుంది. 1980 దశకం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదంటూ నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు కూడా.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతుండటం విశేషం. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. ఒక హీరో నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అలాంటి కథ, కథనాలతో ‘రౌడీ జనార్థన’ మూవీని తెరకెక్కిస్తున్నా. ఫ్యాన్స్ కి పండగే. ఎక్కడా నిరుత్సాహపడరు’’ అంటూ డైరెక్టర్ రవికిరణ్ కోలా స్పష్టం చేశారు. టీజర్తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2018 నవంబరు 17న విడుదలైన ఈ సినిమా హిట్గా నిలిచింది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమించిలి రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ‘రణబాలి’ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ వయొలెన్స్ , యాక్షన్ సన్నివేశాలు మరో లెవల్లో ఉండనున్నాయి. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి పాట ‘ఏందయ్య సామీ...’కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.రగ్డ్ డెకాయిట్ అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీతో కొత్త లుక్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో తన కెరీర్లో ఇప్పటివరకూ కనిపించని మాస్, రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్. ‘‘డెకాయిట్’ ఒక కొత్త జోనర్లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. విడిపోయిన మాజీ ప్రేమికులు, వాళ్ల జర్నీలో ఏం రియలైజ్ అవుతారో ఇందులో చాలా స్పెషల్గా ఉంటుంది. చుట్టూ గన్స్, బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎమోషన్ ఎలా ఉంటుందనేది కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో షూట్ చేశాం. హిందీలో కొన్ని సీన్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మ్యాసీవ్ ఔట్డోర్లో చిత్రీకరించిన ఈ మూవీ క్లైమాక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అంటూ అడివి శేష్ పేర్కొన్నారు. ఎ బ్లడ్ ఫెస్ట్శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనేది ట్యాగ్లైన్గా పెట్టారంటే ఈ మూవీలో ఏ స్థాయిలో వయొలెన్స్ , రక్తపాతం సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్డే సందర్భంగా ‘భోగి’ మూవీ నుంచి విడుదల చేసిన ఆయన ఇంటెన్స్ పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది.గుబురు గడ్డంతో రా అండ్ రెబెలియస్ లుక్లో కనిపించారు శర్వా. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని యాటిట్యూడ్ను మరింత హైలైట్ చేసింది. ‘‘పీరియడ్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ రూపొందుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఈ చిత్రం ఒకటిగా ఉంటుంది. మా సినిమాని రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న హీరోలే కాదు... మరికొంత మంది కథానాయకులు కూడా వయొలెన్స్ , ఫుల్ యాక్షన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ఇప్పుడు ఫైట్... నెక్ట్స్ పాట
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ సెట్లో జరుగుతోందని సమాచారం. రామ్చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. -
'పెద్ది' వాయిదా రూమర్స్.. ఏం జరుగుతోంది?
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
ట్రోలింగ్ భరించలేక ఏడ్చా.. సినిమాలు మానేయాలనుకున్నా
హిట్టు పడితే యాక్టర్స్ను నెత్తిన పెట్టుకునే జనాలు ఫ్లాప్ రాగానే వారిని దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లపై ఈ ట్రోలింగ్ తీవ్రస్థాయిలో ఉంటుంది. కథానాయికలనైతే రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అని ముద్రవేస్తారు. తనకు మరో మూవీ ఛాన్స్ వచ్చిందనగానే అయితే అది ఫ్లాప్ అవడం ఖాయం అని దారుణంగా మాట్లాడుతుంటారు.వరుస ఫ్లాప్స్ఇలాంటి ట్రోలింగ్ను కొన్నేళ్లుగా చవిచూస్తోంది శ్రీలీల. మాస్ జాతర, రాబిన్ హుడ్, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద.. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తమిళంలో చేసిన పరాశక్తి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనను ఈ ఫ్లాప్ ట్యాగ్ నుంచి గట్టెక్కించలేకపోయింది.వెళ్లిపోదామనుకున్నా..అయితే ఈ ట్రోలింగ్ భరించలేక ఎప్పుడో సినిమాలు మానేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే ఈ ట్రోల్స్కు విపరీతంగా భయపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా.. ఇదంతా నావల్ల అవుతుందా? కాలేజీకి తిరిగెళ్లిపోనా? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. కానీ, ఇప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చింది అని పేర్కొంది. అదే భయంమరో హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. నాకు ఇప్పుడే కొంత భయంగా ఉంది. ఎందుకంటే ఇటీవలికాలంలోనే ఈ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఏదో ఒకటి అనేస్తున్నారు. అదే అసలు సమస్య! ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటాం. దాన్ని వాళ్లు చెడగొట్టేస్తున్నారన్న బాధ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా, శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది.చదవండి: ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్ -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
తెలుగు బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ సాహ్ని నటించిన తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ చిన్న సినిమా కావడం, నటీనటులు ఎవరనేది జనాలకు తెలియకపోవడంతో వచ్చినట్లే వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'మిస్టీరియస్' విషయానికొస్తే.. కొండాపూర్ ఎస్సై రాంఖీ(అబిద్ భూషన్) 15 రోజులుగా కనిపించకుండా పోతాడు. దీంతో రాంఖీ మిస్సింగ్ కేసుని ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి)కి అప్పగిస్తారు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్(రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్పుత్)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్కి వీళ్లకు ఉన్న సంబంధమేంటి? విరాట్ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను అక్రమంగా ఓ గన్ ఎందుకు కొన్నాడు? రాంఖీ బతికే ఉన్నాడా? లేదా? ఈ కేసుని ఏసీపీ ఆనంద్ ఎలా ముగించాడు? ఇందులో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు) -
త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే!
ఇప్పటివరకు తేజ సజ్జాను హీరోగానే చూశాం.. కానీ త్వరలో అతడిని ఓ హోస్ట్గానూ చూడబోతున్నాం. బాలీవుడ్లో వచ్చిన ద ట్రైటర్ షో త్వరలోనే తెలుగులోనూ రానుంది. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోకి తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది.మొహమాటం లేదుఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో తేజ సజ్జా పెళ్లి వార్తలపై స్పందించాడు. త్వరలోనే నా పెళ్లి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే చెప్తాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిర్మొహమాటంగా సిల్వర్ జ్యువెలరీ వేసుకుని మరీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇకపోతే ఇక్కడ స్వయంవరం జరగడంలేదు, కాబట్టి నా పెళ్లి గురించి చర్చ వద్దు అని చెప్పాడు.టాలీవుడ్లో పెళ్లి సందడికాగా ఈ ఏడాది ప్రారంభంలోనే పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ సోదరుడు, హీరో శిరీష్ మార్చి 6న పెళ్లి చేసుకున్నాడు. కొంతంకాలంగా ప్రేమలో ఉన్న నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా బిగ్బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇటీవలే తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్బాస్ బ్యూటీ పునర్నవి -
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
బిగ్బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది. సినిమాఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉండేది.చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్ -
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్తో వీడియో మొదలయింది. ఎమోషనల్గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
పెద్ది మళ్ళీ పోస్ట్ పోన్.. ఏప్రిల్ 30 రిలీజ్ లేనట్టే..!
-
చిన్నారిపై విరోష్ జంట ముద్దుల వర్షం
-
ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్సింగ్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. గబ్బర్ సింగ్ మాదిరి పవన్ కెరీర్లోనే గుర్తుండిపోయేలా మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తే.. వారి లెక్కలు తారుమారు అయిపోయాయి. బాక్సాఫీస్ వద్ద రెండురోజుల కలెక్షన్స్ చూస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవని తెలుస్తోంది. తొలిరోజు కాస్త పర్వాలేదనిపించిన కలెక్షన్స్ రెండోరోజు 80శాతం పడిపోయాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇప్పటికీ అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది.ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్ డే దేశవ్యాప్తంగా రూ 34.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. అయితే, రెండోరోజు కేవలం రూ. 9.25 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో రెండురోజుల్లో మొత్తంగా రూ. 44 కోట్ల నెట్ రాబట్టింది. మొదటి రోజుతో పోల్చి చూస్తే.. దాదాపు 80 శాతం వసూళ్లు మరుసటి రోజుకు పడిపోయాయి. ఉగాది, రంజాన్ పండుగలతో లాంగ్ వీకెండ్లోనే ఇలా ఉంటే.. సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఆపై నేడు (మార్చి 21) ధురంధర్-2 తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆదివారం వరకు బుకింగ్స్ 95శాతం పైగానే పూర్తి అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఉస్తాద్ భగత్సింగ్ను తొలగించి ధురంధర్-2 చిత్రాన్ని వేయనున్నారు. ఉదయం ఆటలతో పాటు ఏపీలో టికెట్ రేట్ల పెంచి భారీ సంఖ్యలో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ .. కలెక్షన్స్ పరంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నడంతో ట్రేడ్ వర్గాలను కూడా కలవరపెడుతుంది. -
రూమర్స్కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల
అక్కినేని కుటుంబంలో వారసుడు రాబోతున్నాడు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ కొద్దిరోజుల క్రితం సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్ రావడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో ఎలాంటి వేడుక జరిగినా సతీసమేతంగా నాగచైతన్య వెళ్తాడు. శోభితా ధూళిపాళ్లతో పెళ్లయిన తర్వాత దాదాపు అన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. కానీ, రీసెంట్గా జరిగిన అల్లు శిరీశ్ పెళ్లితో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్లో చైతూ ఒక్కడే కనిపించడంతో శోభిత తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి.శోభిత ప్రెగ్నెన్సీ రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఉగాది నాడు జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకకు భర్తతో కలిసి శోభిత హాజరైంది. అయితే, రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలకు మరో ఛాన్స్ ఇవ్వకుండా పల్చటి చీరతో కనిపించింది. అలా డ్రెస్ సెన్స్తో శోభిత క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో ప్రెగ్నెన్సీ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. 2024 డిసెంబర్లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరిగింది. ఆ తర్వాత చైతూ నటించిన తండేల్ సూపర్ హిట్ కావడం ఇప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోవడంతో శోభితతో పాటు లక్ కూడా తన జీవితంలోకి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒక ఈవెంట్లో నాగార్జున కూడా ఇలాంటి వార్తలపై రియాక్ట్ అయ్యారు తమ కుటుంబంలో ఏవైనా శుభవార్తలు ఉంటే.. తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. -
స్నేక్ డ్యాన్స్ కోసం నిహారిక మాస్ ఎంట్రీ
'రాకాస' సినిమా నుంచి తాజాగా స్నేక్ డ్యాన్స్ సాంగ్ను విడుదల చేశారు. అయితే పాట చివర్లో నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. సంగీత్ శోభన్- నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మానస శర్మ తెరకెక్కించగా.. నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. టీజర్తోనే మెప్పించిన మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే సాంగ్ను విడుదల చేసి అలరించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఇరుముడిలో అయ్యప్ప భక్తులకు ఇష్టమైన పాట రీమిక్స్
భక్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మెప్పించిన మాస్ మహారాజా రవితేజ తర్వాతి సినిమా సెట్స్లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడారు.జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ విడుదల కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమా గురించి ప్రశ్నించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన “ఎక్కినాడు పల్లకి” (అయ్యప్ప స్వామిని కీర్తించే గీతం) పాటను రీమిక్స్ చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఈ పాటను రీమిక్స్ చేయమని ఇప్పటికే చాలామంది తనను అడిగినట్లు జీవీ ప్రకాశ్ తెలిపారు. దీంతో తాను కూడా పలుమార్లు ఆ సాంగ్ విన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం దర్శకుడు, నిర్మాతలదేనని జీవీ ప్రకాష్ తెలిపారు.ఈ చిత్రంలో రవి తేజ అయ్యప్ప స్వామి భక్తునిగా కనిపించనున్నారు. ఇది భక్తి చిత్రం కాదు, బేబీ నక్షత్ర పోషించిన తన కుమార్తెతో అతనికున్న సంబంధం చుట్టూ అల్లుకున్న ఒక ఎమోషనల్ డ్రామా. ఫస్ట్లుక్ పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. -
హీరో పేరు చెప్పకుండానే తాప్సి విమర్శలు
నటి తాప్సి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉత్తరాది భామ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా నటిస్తూ టాప్ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీలో పలు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉన్నారు. కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నటించడానికి పలువురు హీరోలు సంశయిస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా తనకు జరిగిన ఒక విషయం గుర్తు చేస్తూ తనకు ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడిని నిర్మాత సంప్రదించారని, అయితే కథ విన్న ఆయన ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పి నటించడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఈ అమ్మడు తాను నటించిన చిత్రాన్ని ఏ హీరో నిరాకరించారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైర ల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ 38 ఏళ్ల భామ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
ధురంధర్ 2 చూసి షాక్ అయిన టాలీవుడ్ స్టార్స్.. ఏం అన్నారంటే...
-
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్తో చేసిన సిక్స్ ప్యాక్లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ కామాఖ్య. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఓ మిస్టరీ కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధన్రాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జ్ఞాని సంగీతమందిస్తున్నారు. -
మాట నిలబెట్టుకున్న విజయ్.. చిన్నారిని ఇంటికి పిలిచి మరీ..
పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వైభవంగా పెళ్లిదేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్లో మార్చి 4న గ్రాండ్గా రిసెప్షన్ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. లడ్డూలు ఇవ్వొచ్చు కదా!నేను కూడా విజయ్కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! విప్రేమతో ముద్దుల వర్షంరోష్ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్, విరోష్ను కలిశావ్ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్ ఆన్సరిదే! -
'నాన్న బ్రాండ్లోనే విచిత్రమైన నాన్న సార్'.. హ్యాపీరాజ్ ట్రైలర్ చూశారా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్పై జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్ను చూస్తున్నారు.పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్ను భారత్కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్లో ట్రెండింగ్లో నిలిచింది. -
యాక్టింగ్ రాదని ట్రోలింగ్.. : రష్మిక మందన్నా ఎమోషనల్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డ్స్ వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేశారు. 2025లో విడుదలైన సినిమాలకుగానూ అవార్డులు అందించారు. ది గర్ల్ఫ్రెండ్ సినిమాకుగానూ రష్మిక మందన్నా ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, హీరో రామ్చరణ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. రష్మిక మాట్లాడుతూ.. ఒకప్పుడు నాకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు. కానీ, ఈ రోజు నా పర్ఫామెన్స్ మెచ్చి రాష్ట్రస్థాయిలో అవార్డు ఇచ్చారు. అది నాకెంతో గర్వంగా ఉంది.తెలంగాణ కోడలిగా..గర్ల్ఫ్రెండ్ లాంటి సినిమాకు అవార్డు రావడం నిజంగా చాలా స్పెషల్. డైరెక్టర్ రాహుల్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు నేను తెలంగాణ కోడలిగా మీ ముందు నిల్చున్నాను. మీ ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞరాలిని. నా ఫ్యామిలీని బాగా చూసుకోండి అని చెప్పుకొఒచ్చింది. రష్మిక ప్రసంగం వింటూ విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనైంది.చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. ఒప్పుకోలేదు: నటుడు -
ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..
‘ధురంధర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. స్ట్రీ 2, జవాన్, యానిమల్ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి, బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18 నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్స్లోకి వచ్చేసింది. ఫస్ట్ డే ‘ధురంధర్ 2’ కలెక్షన్స్ దుమ్మురేపింది. భారతీయ చిత్ర పరిశ్రమలో 'పుష్ప-2' తర్వాత భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ధురంధర్2 నిలిచింది. గతేడాదిలో విడుదలైన ‘పార్ట్-1’ తొలిరోజు కలెక్షన్లు రూ.28.60 కోట్ల (నెట్) రాబట్టిన విషయం తెలిసిందే.ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 145.55 కోట్లు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో నెట్ కలెక్షన్లలో రూ.100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమాగా ధురంధర్- 2 నిలిచింది. కేవలం హిందీ నుంచే ఈ సినిమాకు రూ.103 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. ఇప్పుడు వరసు సెలవులు ఉండటంతో ఫస్ట్ వారంలోనే రూ. 700 కోట్ల మార్క్ను సులువుగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.‘ధురంధర్: ది రివెంజ్’ ప్రీమియర్స్తోనే హిట్ టాక్ తెచ్చుకోవడం ఆపై ఉగాది, రంజాన్ వంటి పండుగల సెలవులు ఉండటంతో ఈ మూవీకి కలిసిసొస్తుంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీకి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’కు వస్తున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గద్దర్ అవార్డ్స్- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)
-
అమ్మాయిలతో జాగ్రత్త.. యూత్కు హీరోయిన్ సలహా
నటి పూనం బాజ్వాను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ప్రస్తుతం చిత్రాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఈమె తరచూ హల్చల్ చేస్తూనే ఉంటారు. పలు భాషల్లో కథానాయకిగా నటించిన బ్యూటీ తెలుగులో మెదటి సినిమా (2005)లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, పరుగు, బాస్ సినిమాలతో పాపులర్ అయింది. తమిళంలో తేనావట్టు , కచేరి ఆరంభం, సేవల్ , తంబికోట్టై వంటి పలు చిత్రాలు నటించింది. అయితే స్క్రీన్ ప్లే అందాల ఆరబోతలో హద్దులు చెరీపేస్తూ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించిన ఈ అమ్మడు కథానాయకిగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారనే చెప్పాలి. అయితే ఇంటర్నెట్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యువత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇన్ స్ట్రాగామ్లో దాదాపు 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. కాగా ఇటీవల తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నటి పూనం బాజ్వా(Poonam Bajwa) పేర్కొంటూ మీకు స్నేహితురాలుగానో, ప్రేయసి గానో, భార్యగానో కలిసి ప్రయాణించే యువతి ఏ దేశానికి మహారాణి కాక పోవచ్చుగాక, అయినా ఆమెను రాణి మాదిరిగానే భావించాలన్నారు. ఆమె అందాన్ని, ప్రేమను, శక్తిని అభినందించాలన్నారు. అంతేకాకుండా అన్ని మర్చిపోదాం అని చెప్పే యువత మరింత జాగురూకత వహించాలన్నారు. ఎందుకంటే మహిళలు ఏ విషయాన్ని మర్చిపోరని ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఇతర అమ్మాయిలకు సంబంధించిన విషయాలను మర్చిపోరన్నారు. కాబట్టి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని నటి పూనం బాజ్వా పేర్కొన్నారు. ఇవే పేర్కొన్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
స్టోరీతో వస్తే రీల్తో వెళ్లేలా..
సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. కేవలం స్టోరీతో సంప్రదిస్తే సినిమా పూర్తి చేసుకుని రీల్తో వెళ్లే విధంగా వెంట వెంటనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ, ఫార్మా పరిశ్రమకు సమానంగా సినీ పరిశ్రమను గుర్తించామని, చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గురువారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు–2025 ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆ నలుగురు చార్ మినార్ల వంటివారు.. ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఇవ్వడం మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. హైదరాబాద్ అంటే కేవలం ఐటీ హబ్, బిర్యానీ మాత్రమే కాదు.. ఇదొక సినిమా హబ్కు కేరాఫ్ అడ్రస్. భారతీయ సినీ పరిశ్రమకు గమ్యస్థానంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్కు చార్మినార్లోని చార్ మినార్ల లాగా ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ..ఈ నలుగురు సినీ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. రామోజీరావు ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. ప్రభాకర్రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు. ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచి్చనా ముందుండే దాసరి నారాయణరావును కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తమ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. నెట్ ఫ్లిక్స్ వచ్చిందంటే హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టే. గద్దర్ ఒక చైతన్యం.. ఒక స్ఫూర్తి. తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషం. సినిమా అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. సమాజాన్ని చైతన్యపరిచేందుకు దీన్ని సాధనంగా ఉపయోగించుకోవాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమా ద్వారా సందేశం అందించాలి..’అని సీఎం సూచించారు. సందేశాత్మక సినిమాలతో ప్రజల్లో మార్పు: డిప్యూటీ సీఎం ‘తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గద్దర్. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రపంచానికి చెప్పడమే. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. అనేక సందేశాత్మక సినిమాలు ప్రజల్లో మార్పునకు నాంది పలికాయి. అయితే గత పాలకులు 10 ఏళ్ల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదు. కానీ తెలుగు సినిమా తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచానికే తలమానికం కావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి గద్దర్ పేరిట సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించారు..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. -
హైదరాబాద్ అంటే బిర్యానీయే కాదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా, బిర్యానియే కాదు.. దేశస్థాయిలో సినీపరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా రాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. జపాన్, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయని, అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డుల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆ నలుగురే కారణంఈ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్న సినీపరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడానికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కృష్ణ.. ప్రధాన కారణం. సినీ కార్మికులు ఇల్లు కట్టుకునేందుకు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేశారు. సినీపరిశ్రమలో ఏ సంక్షోభం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వాటిని పరిష్కరించి.. శాశ్వతంగా ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో నిలిపేందుకు కృషి చేశారు.సంతోషంబాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప వంటి సినిమాలు జాతీయ స్థాయిలో మన సినీ పరిశ్రమను నిలబెట్టాయి. అలాంటి ఇండస్ట్రీ కోసం ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గతేడాది గద్దర్ పురస్కారాలను ప్రవేశపెట్టాం. వరుసగా రెండోసారి ఈ అవార్డులను అందించాం. ఈ కార్యక్రమానికి ఖుష్బూ, జయసుధ వంటి వారు రావడం సంతోషం. నాగచైతన్య, రష్మిక అందరూ యంగ్స్టర్స్. వీళ్లకు అవార్డులు ఇచ్చేందుకు వచ్చిన సీనియర్స్ అందరినీ అభినందిస్తున్నాను.సూచనహైదరాబాద్లో.. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేవారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తుంది. ఆన్లైన్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతున్నాను. ఇకపోతే గద్దర్ ఒక ప్రజాయుద్ధ నౌక.. ఆయన పేరు కోట్లాదిమందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించింది.సమాజంలోని సమస్యలపై సినిమాఆయన గళం తెలియనివారు దేశంలో లేరు. గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి. అందుకే ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టాం. సినిమా అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సమాజంలోని సమస్యలపై పోరాడేందుకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలి అని రేవంత్రెడ్డి మాట్లాడారు.అవార్డుల వేడుక'గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రాంచరణ్, ఖుష్బూ, నాగచైతన్య, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.


