Tollywood
-
'రూ. 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని హీరోకు రూ. 13 కోట్లు ఇచ్చారు'
తెలుగు రాష్ట్రాల్లో సినిమా బంద్ అంశంపై నూతనంగా ఎన్నికైన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శి శ్రీధర్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలు తమకు దేవుళ్లు లాంటి వారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు కలిసి పెద్ద వివాధంగా మార్చారని, త్వరలోనే వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. థియేటర్స్ బంద్ అనేది తమ నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రకటన ఫిల్మ్ ఛాంబర్ చేయలేదన్నారు.పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని శ్రీధర్ వాపోయారు. ప్రస్తుతం ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్ థియేటర్ల పరిస్థితి మనుగడ కష్టంగా తయారైందని ఆయన అన్నారు. హీరోలందరికీ స్టార్ హోదా రావడానికి కారణం ఎవరు..? వారు ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక రకంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హీరోలు కూడా అని ఆయన అన్నారు.రూ.10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమా కోసం రూ.30 లక్షలు నిర్మాతలు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఒక సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ రూ. 2కోట్లు. కానీ, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని ఆయన వాపోయారు. అయితే, శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు 'జాక్' సినిమా గురించి అంటూ నెటిజన్లు ఆపాదిస్తున్నారు. ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ రూ. 13 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని, సినిమా డిజాస్టర్ కావడంతో ఆ చిత్ర నిర్మాతకు కొంత తిరిగిచ్చేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సినిమా పేరు చెప్పకపోవడంతో నెటిజన్లు మాత్రం వరుణ్ తేజ్, నితిన్ అంటూ ఎవరికితోచిన పేరు వారు చెప్పుకుంటూ పోతున్నారు.అయితే, అధ్యక్షుడు సునీల్ నారంగ్.. హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు తమకు లేదని చెప్పుకొచ్చారు. కానీ, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేది తమ కోరిక అంటూ పేర్కొన్నారు. థియేటర్ల బంద్ వార్త విన్న తర్వాత తాను కూడా ఆశ్చర్యానికి లోనయ్యా అన్నారు. థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనే వారు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలామంది ఓనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. సింగిల్ థియటర్స్ యాజమాన్యం కోరుతున్న పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందని సునీల్ నారంగ్ చెప్పారు. -
అమెరికా నుంచి భారత్కు వచ్చి తుదిశ్వాస విడిచిన నటి
అలనాటి నటి విజయభాను (68) ఇక లేరు. అమెరికాలో స్థిరపడిన ఆమె ఏప్రిల్ నెలలో భారత్కు వచ్చారు. అయితే, అదే నెల 24న తీవ్రమైన ఎండల వల్ల ఆమెకు వడదెబ్బ సోకడంతో మరణించారు. ఆమె ఆకస్మిక మృతి పట్ల జయప్రద, సుమన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా నటి విజయభాను(Vijaya Bhanu) గురించి తన సోదరి డా. సింధూరి అమెరికా నుంచే పలు విషయాలను పంచుకున్నారు. ' మా అక్క ప్రేరణ వల్ల నేను కూడా అమెరికా వచ్చి స్థిరపడ్డాను. చాలామందికి ఆమె సాయం చేశారు. ఆమె జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆమె జీవితంపై ఒక పుస్తకం రచించాలని కోరుకుంటున్నాను. జయప్రద అంటే మా అక్కకు చాలా ఇష్టం. చెన్నైలో జరిగిన మా అక్క దశదినకర్మకు కూడా ఆమె హాజరయ్యారు. భారత గడ్డపైనే తనువు చాలించాలని మా అక్కకు ఉన్న చివరి కోరిక.. ఇలా అనుకోకుండానే ఆమె ఆకాంక్ష తీరింది. కానీ, ఆమె లేని లోటు మాకు ఎవరూ పూడ్చలేరు.' అని ఆమె చెప్పుకొచ్చారు.అనంతపురం జిల్లాకు చెందిన విజయభాను సినిమా ఛాన్సుల కోసం చెన్నైకి వెళ్లి తన సత్తా చాటారు. 70వ దశకంలో అప్పటి టాప్ హీరోల సినిమాల్లో నటించారు. ఆరోజుల్లో రాజబాబు - విజయభాను జంటకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించిన విజయభాను కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే ఒక అమెరికన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాఓ స్థిరపడ్డారు. లాస్ ఏంజెల్స్ లో 'శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్' పేరుతో నృత్య కళాశాల స్థ్థాపించిన ఆమె వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. అమెరికాలో ఏదైనా సాయం కోసం వెళ్లిన తెలుగు వారికి ఆమె ఎంతో అండగా నిలబడ్డారని చెప్పుకుంటారు.1979లో విడుదలైన 'ఇది కథ కాదు' సినిమాకు గాను ఆమెకు నంది అవార్డు దక్కింది. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కలిసి పోటీపడి ఆమె నటించారు. కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో నటించిన జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కగా.. ఉత్తమ సహాయ నటిగా విజయభానుకు దక్కింది. ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలో కూడా ఆమె మెప్పించారు. -
తెలుగు బ్యూటీ న్యూ బిగినింగ్స్.. పెళ్లికి రెడీ అన్న ఐశ్వర్య
దుబాయ్లోనే చిల్ అవుతున్న సమంత... నక్షత్రాలను అందుకుంటానంటూ పోస్ట్ఫుట్బాల్ గ్రౌండ్లో జెనీలియా దేశ్ముఖ్న్యూ బిగినింగ్స్ అంటూ గుడికి వెళ్లిన ఫోటోలు షేర్ చేసిన గౌరీప్రియడోసు పెంచిన రాశీ ఖన్నారెడ్ మిర్చిలా 3 రోజెస్ బ్యూటీ రాశీ సింగ్ పెళ్లికి రెడీ అంటున్న ఐశ్వర్య.. కాకపోతే ఎవరో పెళ్లో గెస్ చేయమన్న బ్యూటీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Aishwarya pisse__Official (@aishwarya_pisse_) -
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
హిందీ బిగ్ బాస్ 18 ఫేమ్ ఎడిన్ రోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నానంటూ షాక్ ఇచ్చింది. మోడల్గా కెరీర్ను ప్రారంభించిన ఎడిన్ రోజ్ హిందీలో రెండు సినిమాలు చేసింది. ఆపై తెలుగులో రవితేజ నటించిన 'రావణాసుర' చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం నయనతార నిర్మిస్తున్న కొత్త సినిమా LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అయితే, తాజాగా ఫిల్మిగ్యాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ 18తో భారీగా పాపులారిటీ తెచ్చుకున్న ఎడిన్ రోజ్, క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్తో తనకున్న అనుబంధాన్ని ఇలా చెప్పుకొచ్చింది. 'నా మనసులో, నేను ఇప్పటికే అతనిని ( శ్రేయాస్ అయ్యర్) వివాహం చేసుకున్నాను. నేను అతని పిల్లలకు తల్లిని అని నేను నమ్ముతున్నాను. అతను నాకు నచ్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అతను మంచి హైట్తో పాటు చామని ఛాయ రంగులో ఉంటాడు. ఎప్పుడూ తను గడ్డంతో కనిపిస్తూ మంచి కండలతో ఉంటాడు.భవిష్యత్లో భారత జట్టుకు కెప్టెన్ తప్పకుండా అవుతాడు. నా తండ్రిలాగే శ్రేయాస్ కూడా దక్షిణ భారతీయుడు.' అంటూ సంతోషంతో చెప్పుకొచ్చింది. తన తండ్రి ఒక తమిళయన్ అని చెప్పిన ఈ బ్యూటీ.. శ్రేయాస్ అయ్యర్ కూడా తమిళయన్ అంటూ పేర్కొంది. అయితే, ప్రస్తుతం వారు ముంబైలో స్థిరపడ్డారని చెప్పుకొచ్చింది. అయితే, ఇలా మనుసులో అనేసుకుంటే పెళ్లిళ్లు కావంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట అంటే తనకు చాలా ఇష్టమని ఎడిన్ రోజ్ చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఆదర్శ దంపతులు అంటూ పేర్కొంది. 'వారు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తారు. వారు చాలా పరిపూర్ణ జంట, చాలా అందంగా ఉండాలని కోరుకుంటాను. వారికి ఎప్పుడూ చెడు జరగకూడదని నేను ఆశిస్తున్నాను. వారు ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.' అని కోరుకుంది. View this post on Instagram A post shared by Edin Rose (@itsedinrose) -
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కన్నప్ప'కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్డిస్క్ మాయం కావడంతో మూవీ టీమ్ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా 'కన్నప్ప' మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని వారు ఆరోపిస్తున్నారు.కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, గుంటూరులో నేడు (శనివారం) జరగనున్న కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం.' అని శ్రీధర్ హెచ్చరించారు.ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించారు. -
'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు
సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో 'ఢీ: కొట్టి చూడు' ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా, జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ మూవీ 2007లో వచ్చింది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఢీ మూవీ(Dhee Movie)ని నిన్న (జూన్ 6) రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే ఢీని మాత్రం పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఆడియన్స్ లేక థియేటర్లు ఖాళీగా దర్శనిమస్తున్నాయి.నా బర్త్డే రోజు ఫస్ట్ షోఅయితే ఢీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విష్ణు. కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రమోషన్స్లో విష్ణు మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య మనమంతా ఎక్స్ట్రార్డినరీ అనుకున్న సినిమాలు ఆడియన్స్కు రీచ్ అవకపోవచ్చు. కొన్నేమో రివర్స్లో జరుగుతాయి. 2006లో నా పుట్టినరోజైన నవంబర్ 23న ప్రసాద్ ల్యాబ్లో ఢీ ఫస్ట్ షో పడింది. తర్వాత అది 2007, ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది.ఆడటం కష్టమే..ఈ మధ్యలో దాదాపు వంద షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడ్డాయి. దిల్రాజు సహా ఎంతోమంది.. ఈ సినిమా యావరేజ్, పెద్దగా ఆడదు.. కష్టం! అని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చివర్లో నాన్న ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. తర్వాత మూవీ హిట్టయిన విషయం మీకు తెలిసిందే! అని విష్ణు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఢీ మూవీని మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించగా చక్రి సంగీతం అందించాడు.చదవండి: 90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో తల్లి! -
'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్ కోసం మరో సినిమా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్లోనే సూపర్హిట్ చిత్రంగా నిలిచిన 'తొలిప్రేమ' (Tholiprema) 1998 జూన్ 24న విడుదలైంది. ఇప్పుడు మరోసారి రిలీజ్ కానుంది. ఈమేరకు ఒక పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించగా ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. జీవీజీ రాజు నిర్మాత. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్రాజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు రీరిలీజ్ అయింది. 'తొలిప్రేమ' విడుదలై 25 ఏళ్లు సందర్భంగా 2023లో చివరిసారిగా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ నటించిన కొత్త సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందడంతో తెరపైకి తొలిప్రేమ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 14న తొలిప్రేమ రీరిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ అవుతుంది. దానిని నిర్మాత ఎస్కేఎన్ కూడా షేర్ చేశారు. -
ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్ విడుదల
అందమైన ప్రేమకథతో వస్తున్న చిత్రం '8 వసంతాలు'.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్ను విడుదల చేశారు. మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. -
గత కొన్నిరోజులగా తెలుగు సినీ పరిశ్రమలో విభేదాలు
-
'గుండమ్మ కథ'కు 62ఏళ్లు.. వీడియో విడుదల, ఈ విషయాలు తెలుసా?
చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. అందులో కొన్ని క్లాసిక్స్ సినిమాలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు..? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా..? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలైంది ఇదే రోజు.. తాజాగా ఈ మూవీ 62 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు విశేషాలను గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.వారిద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.గుండమ్మ పాత్ర ఎంపిక కోసం..సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
పాన్ వరల్డ్ హీరోయిన్ రీఎంట్రీ..
మలయాళంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అదే ఏడాదిలో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
సినీ ఇండస్ట్రీలో సమస్యలు: 30 మందితో కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వెలవెలబోతున్న థియేటర్లు, నెలరోజుల్లోనే ఓటీటీ (OTT)లోకి సినిమాలు, సినిమా రిలీజ్ కష్టాలు.. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్.. అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విభాగాల నుంచి పది మంది చొప్పున సభ్యులుగా తీసుకుంది. మొత్తం 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నారు.ఏ విభాగంలో ఎవరున్నారంటే?నిర్మాతల విభాగం: దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియడిస్ట్రిబ్యూటర్ విభాగం: భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరిఎగ్జిబిటర్ విభాగం: రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా! -
బన్నీ సరసన దీపికా పదుకొణె.. వారియర్ తరహా పాత్రలో (ఫొటోలు)
-
అల్లు అర్జున్, అట్లీ కొత్త మూవీ.. హీరోయిన్ ఎవరంటే ?
-
చుక్కల చీర.. జడలో మల్లెపూలతో మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
ఘనంగా అఖిల్, జైనబ్ వివాహం ఎవరీ జైనబ్..?
-
'మై లవ్' ఆల్బమ్ సాంగ్ లాంచ్లో 'బిగ్బాస్' స్టార్స్ (ఫొటోలు)
-
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'సూర్య'
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, సూర్య కథానాయకుడిగా వాడివాసల్ చిత్రం చేయడానికి చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లోనే సూర్య బిజీగా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. అయితే, వెట్రిమారన్ తన తర్వాతి సినిమాను హీరో శింబుతో తెరకెక్కించాలనే ప్లాన్లో ఉన్నారట.కోలీవుడ్ హీరో శింబు గత రెండేళ్లకు పైగా ఎలాంటి చిత్రంలో నటించలేదు. తాజాగా కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్లైఫ్ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్ చిత్రం రాంకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్ అయినట్లు తెలిసింది. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్న్స్ సంస్థ నిర్మించనుందని టాక్.. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
'దీపికా పడుకోణె'కు గోల్డెన్ ఛాన్స్!
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సినిమా (AA22) నుంచి జూన్ 7న ఒక అప్డేట్ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్ట్ పంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు చేశారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 700 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తోంది. అయితే, శనివారం ఉదయం 11గంటలకు ఒక ఆప్డేట్ ఇస్తామని పోస్టర్ను రిలీజ్ చేసింది. బహుశా హీరోయిన్ గురించి ప్రకటన చేస్తారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ 'దీపికా పడుకోణె'( Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్ ఉంది. తనకు సంబంధించిన అప్డేట్ శనివారం అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. ఇదే ప్రాజెక్ట్లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారిద్దరి గురించి అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. దాదాపు జూన్ 7న మాత్రం దీపిక ప్రకటన ఉంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. (AA22) పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఐకాన్, సూపర్హీరో అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.When Elegance meets Magic! ✨ Revealing Tomorrow 11 AM❤️🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/AlG9DwRQSR— Sun Pictures (@sunpictures) June 6, 2025 -
కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగార్జున
టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) శుక్రవారం తెల్లవారుజామున వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నాగార్జున ఒక పోస్ట్ షేర్ చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జూన్ 8న రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.అఖిల్ వివాహ వేడుక ఫొటోలను అభిమానులతో నాగార్జున పంచుకున్నారు. తన ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు. 'మా ప్రియమైన కుమారుడు తనకు ఇష్టమైన జైనాబ్ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు. అమలతో పాటు నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రదేశం మా హృదయాలకు ఎంతో దగ్గరైంది. ఇక్కడ వారు కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ప్రేమ, కృతజ్ఞతతో అంటూ..' నాగార్జున పోస్ట్ చేశారు.అఖిల్ సతీమణి జైనబ్ రవ్జీ హైదరాబాద్కు చెందిన అమ్మాయినే.. అయితే, ముంబయిలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్లో అఖిల్-జైనబ్ కలుసుకున్నారని తెలుస్తోంది. అలా వీళ్లిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025 -
మొదలైన 'బ్యాచిలర్స్ ప్రేమకథలు'
యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీనటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "బ్యాచిలర్స్ ప్రేమ కథలు". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు.చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. 'ఇంతకుముందు నేను తీసిన "కాలం రాసిన కథలు" సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్గా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి ఇదే ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.' అని అన్నారు. -
నార్నే నితిన్ ఫస్ట్ సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' రివ్యూ
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో ఆయనకంటూ గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru). జూన్ 6న థియేటర్స్లోకి వచ్చేసింది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. అయితే, తాజాగా విడుదలైన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల వరకు తన కుమారుడు సిగరెట్ ముట్టడని, ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమాకు ప్రధాన బలం నార్నే నితిన్, దర్శకుడు సతీశ్ వేగేశ్న అని చెప్పవచ్చు. నార్నే నితిన్ కెరీర్లో మొదటి చిత్రంగా విడుదల కావాల్సిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు తన నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 'తీవండి' మూవీనే దర్శకుడు తెలుగులో రీమేక్ చేశారు. కథలో హీరో పుట్టగానే సిగరెట్ పొగ వల్ల ప్రాణాలు పోసుకున్నట్లు చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆత్రేయపురం బ్యాక్డ్రాప్ అదిరిపోతుంది. కానీ, దానిని తెరపై చూపించడంలో దర్శకుడు అక్కడక్కడ కాస్త ఇబ్బందిపడ్డాడు అని చెప్పవచ్చు. ఈ కథలో హీరో పాత్ర చాలా బలంగా రాసుకున్న దర్శకుడు.. మిగిలిన పాత్రలపై అంతగా శ్రద్ద పెట్టలేదని తెలుస్తోంది. అయితే, కేవలం హీరో పాత్రకే ఎక్కువ సమయం ఇవ్వడంతో కాస్త బోర్గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ కథ కూడా చాలా రొటీన్గానే ఉంటుంది. ఈ కథ చాలా సినిమాలలో చూసిందే కూడా.. అయితే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది. దీంతో సెకండాఫ్ అదిరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ, అంతగా మెప్పించలేదని చెప్పవచ్చు. ఇరు కుటుంబాలతో పాటు హీరో, హీరోయిన్ పడే సంఘర్షణ ఫర్వాలేదనిపించినప్పటికీ... ప్రతి సీన్ మనం ముందే అంచనా వేయవచ్చు. ప్రీక్లైమాక్స్లో ఫ్యామిలీ ట్రాక్లోకి కథ వెళ్తుంది. తండ్రి సవాల్ కోసం హీరో తీసుకున్న నిర్ణయం.. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకూడదని కృష్ణమూర్తి పడే పాట్లు కొన్ని మెప్పిస్తాయి. ఫనల్గా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేని సినిమాగా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మిగిలిపోతుంది.ఎవరెలా చేశారంటే..నార్నే నితిన్కు ఇదే మొదటి సినిమా.. ఆపై కథలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయినప్పటికీ రాజా పాత్రలో బాగానే మెప్పించాడు. గత మూడు సినిమాల్లో అతనిలోని కామెడీ యాంగిల్ చూసి ఉంటారు. ఇందులో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను సులువుగా పండించాడు. హీరోయిన్గా సంపద చాలా అందంగా కనిపిస్తుంది. తన పాత్రమేరకు పెద్దగా స్కోప్ లేకున్నా ఉన్నంతలో న్యాయం చేసింది. రావు రమేశ్, నరేశ్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరూ అదరగొట్టేశారు. కైలాస్ మేనన్ అందించిన సంగీతం అక్కడక్కడ సౌండ్ చేస్తుంది. పెద్దగా ప్రభావం చూపించలేదు. కెమెరామెన్ పల్లెటూరి అందాల్ని తెరపై బాగానే చూపించారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. -
స్టార్ హీరోయిన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముంబైకి చెందిన సిమ్రాన్ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో దీపక్ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అందులో సీరియల్స్తో పాటు పలు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు అధీప్ గ్రాడ్యేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్ ఇలా చెప్పుకొచ్చారు. ' చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.' అని సిమ్రాన్ పేర్కొన్నారు.సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సౌత్లో చిరంజీవి,రజనీకాంత్,కమల్ హాసస్, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా మెప్పించింది. View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
హరిహర వీరమల్లు విడుదల లేనట్లే.. ప్రకటించిన నిర్మాత
జూన్లో రిలీజవుతున్న పెద్ద సినిమాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu Movie) ఒకటి. జూన్ 12న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదని చాలారోజులగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. ఇప్పటికే పలుమార్లు సినిమాను పోస్ట్పోన్ చేసిన చిత్రబృందం తాజాగా మరోసారి మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ఏ.ఎం రత్నం వెల్లడించాడు.వాయిదా తప్పట్లేదుజూన్ 12న సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అది కుదర్లేదని పేర్కొన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పడం లేదన్నాడు. హరిహర వీరమల్లును మరింత గొప్పగా మలచాలన్నదే తమ ప్రయత్నం అని, ప్రతి ఫ్రేమ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని వివవరణ ఇచ్చాడు. దీనికోసమే మరికాస్త సమయం అవసరమవుతుందని, అందరి ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చాడు.ఎప్పటికీ గుర్తుండిపోయేలా..ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నాడు.. త్వరలో ట్రైలర్తోపాటు కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం అని తెలిపాడు. హరిహర వీరమల్లు సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా? -
ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో నీలిరంగు ముసుగుల వెనక ఓ గ్యాంగ్ అందర్నీ నవ్వించేందుకు రెడీగా ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్లో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఉండటం విశేషం.హాలీవుడ్ హీరోతో పనిచేసిన సెన్సేషనల్ బ్యూటీసోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మ్యాడ్నెస్ మొదలైందిఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఫస్ట్లుక్ పోస్టర్తో మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా? -
కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనిపించబోవని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా టాలీవుడ్లో నెలకొన్న సంక్షోభం గురించి ఓ ట్వీట్ చేశాడు.ఈ ట్రెండ్ కొనసాగితే..ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజీ సిస్టం గురించి మాట్లాడుకునేబదులు... ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలా? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి? అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.పెద్ద హీరోలు ఆలోచించాలిఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో సినిమా, మూడేండ్లకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింగిల్ స్క్రీన్స్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అని రాసుకొచ్చాడు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025 చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
-
ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్: హీరో నాగార్జున (Nagarjuna Akkineni) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పాడు. ప్రియురాలు జైనబ్ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరివాళ్లే ఈ వెడ్డింగ్కు హాజరయ్యారు. సెలబ్రిటీల హాజరుమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ, రామ్చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.అఖిల్ ఎంగేజ్మెంట్అఖిల్- జైనబ్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగచైతన్య (Naga Chaitanya)- శోభితల పెళ్లి పనులు మొదలుకావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. చై-శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్లో పుట్టిన జైనబ్ రవ్జీ ఒక ఆర్టిస్ట్. రిఫ్లెక్షన్ పేరుతో హైదరాబాద్లో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్స్ను ప్రదర్శించారట! మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించిందట! ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది. గతంలో పెళ్లి క్యాన్సిల్మరి అఖిల్- జైనబ్లు పెయింటింగ్ ఎగ్జిబిషన్లోనే ఒకరికొకరు పరిచయమయ్యారా? అసలు వీరి ప్రేమకథ ఎలా మొదలైందన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే అఖిల్ గతంలో.. పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్తో ప్రేమలో పడ్డాడు. 2016లో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లితో ఒక్కటి కాబోతారనుకునేలోపే వివాహం రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' అనే సినిమా చేస్తున్నాడు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Director #PrashanthNeel at #AkhilAkkineni's wedding.#NTRNeelpic.twitter.com/D8jMH6gJHx— Milagro Movies (@MilagroMovies) June 6, 2025Yuvasamrat #NagaChaitanya at the baraat ceremony of his brother @AkhilAkkineni8!📸#AkhilAkkineni #Nagarjuna pic.twitter.com/wVUqswOfVV— shiva (@shivshankar68) June 5, 2025#TFNExclusive: Yuvasamrat @chay_akkineni and @sobhitaD snapped at #AkhilAkkineni & #ZainabRavdjee's wedding! 📸😍#NagaChaitanya #SobhitaDhulipala #SoChay #TeluguFilmNagar pic.twitter.com/1uCz8xUcym— Subhodayam Subbarao (@rajasekharaa) June 6, 2025చదవండి: విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే! -
చలో డెహ్రాడూన్
డెహ్రాడూన్ వెళ్తున్నారట చిరంజీవి అండ్ టీమ్. చిరంజీవి హీరోగా అనిల్ రాపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మరో హీరోయిన్ పాత్రలో కేథరిన్, ఓ కీలకమైన అతిథి పాత్రలో వెంకటేశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.చిరంజీవితో పాటు ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ డెహ్రాడూన్, ముస్సోరి లొకేషన్స్లో జరుగుతుందని, అక్కడ ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందట. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
హారర్ ర్ర్ర్ర్ర్ భయం భయం
తెలుగు పరిశ్రమలో హారర్ ట్రెండ్ నడుస్తోందా? అనేలా ప్రస్తుతం ఆ జానర్ సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. జనరల్గా స్టార్ హీరోలు ఈ జానర్ చిత్రాల్లో కనిపించడం తక్కువ. అయితే ప్రభాస్లాంటిపాన్ ఇండియా స్టార్ కూడా ఈ తరహా సినిమాలో నటించడం ఓ విశేషం. ఇక... హారర్ జానర్లో రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. భయపెట్టే రాజాసాబ్ వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో యమా జోరుగా దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. తన కెరీర్లో ఇప్పటివరకూ లవర్ బాయ్గా, యాక్షన్ హీరోగా నటించారాయన. అంతేకాదు... పలు సినిమాల్లో తనదైన శైలిలో భావోద్వేగాలు, వినోదం పంచిన ఆయన తొలిసారి ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని హారర్ జానర్ కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ‘రాజా సాబ్‘ సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మారుతి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ నెల 16న ‘రాజా సాబ్’ టీజర్ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే విడుదల పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్. హారర్ కనకరాజు హీరో వరుణ్ తేజ్ తొలిసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్స్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ హారర్ కామెడీ చిత్రంలో మొదటి సారి ఆడియన్స్ని భయపెట్టనున్నారు వరుణ్ తేజ్.ఈ చిత్రం తొలి షెడ్యూల్ను హైదరాబాద్, ద్వితీయ షెడ్యూల్ను అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురం పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వరుణ్ తేజ్, రితికా నాయక్పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో హైలైట్గా నిలుస్తాయట. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తనదైన శైలిలో వినోదాన్ని జోడించారట మేర్లపాక గాంధీ. హైదరాబాద్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో వరుణ్ తేజ్ పాల్గొనగా ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించారట. ఈ సాంగ్లో ఆయన సరసన దక్షా నగార్కర్ స్టెప్స్ వేశారని టాక్. తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘కొరియన్స్ కనకరాజు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్. రైల్వే కాలనీలో దెయ్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘అల్లరి’ నరేశ్ ఈ మధ్య సీరియస్ కథలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఆడియన్స్ని భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘12 ఏ రైల్వే కాలనీ’. ‘మా ఊరి ΄పొలిమేర, మా ఊరి ΄పొలిమేర 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ ‘12 ఏ రైల్వే కాలనీ’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు షో రన్నర్గా వ్యవహరిస్తున్నారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, సాయికుమార్ కీలక పాత్రలుపోషిస్తున్నారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ‘ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి రా.. అందరికీ ఎందుకు కనిపించవు’ అనే డైలాగ్స్తో మొదలైన ఈ టీజర్ ఉత్కంఠగా సాగింది. ప్రాణాలతో బయటకుపోవుడు అవసరం లేదన్న...!’ అంటూ టీజర్ చివర్లో నరేశ్ చెప్పే డైలాగులు ఆక ట్టుకునేలా ఉన్నాయి. టీజర్ని బట్టి చూస్తే దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తి పాత్రలో నరేశ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కిష్కింధపురిలో... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. ‘రాక్షసుడు’ వంటి చిత్రం తర్వాత హీరో శ్రీనివాస్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్స్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.ఈ సినిమా పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ఉంటుందట. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి దశకు చేరుకుందని టాక్. ‘భైరవం’ ప్రమోషన్స్లో ఉన్న సాయి శ్రీనివాస్ ఆ తర్వాత ‘కిష్కింధ పురి’ చిత్రీకరణలో జాయిన్ కానున్నారట. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయనున్నారట మేకర్స్. ఏ మిస్టిక్ వరల్డ్ ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో ఆది కనిపించనున్నారు. ండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్తో, కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలతో ప్రేక్షకులన్ని సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. అదే విధంగా ఈ చిత్రంలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ΄పొలిమేరలో ట్విస్టులు ‘సత్యం’ రాజేశ్ ప్రధాన పాత్రలో హారర్, చేతబడి నేపథ్యంలో రూపొందిన ‘మా ఊరి ΄పొలిమేర’ (2021), ‘మా ఊరి ΄పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్గా నిలిచాయి. దీంతో ‘΄పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.వంశీ నందిపాటి ఎంటర్టైన్స్ మెంట్ బ్యానర్పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ సినిమా రూపొందిస్తున్నారు. తొలి, మలి భాగాల్లానే హారర్, చేతబడి అంశాలతో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పైగా తొలి రెండు భాగాలతోపోలిస్తే ‘΄పొలిమేర 3’లో ప్రేక్షకులకు ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ మధ్య విడుదలైన ‘΄పొలిమేర 3’ వీడియో గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఎమ్ ఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్లపై సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకు వస్తుందనే కాన్సెప్ట్తో హారర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హారర్ చిత్రాల్లో మా సినిమా విభిన్నంగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారి మీద స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు మేకర్స్. ‘‘ఆ పాట సినిమాకే మెయిన్ హైలెట్గా నిలవడంతో పాటు అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని మేకర్స్ ప్రకటించారు. మదర్ సెంటిమెంట్... హారర్ సుమన్ బాబు ముఖ్య పాత్రపోషించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎర్రచీర– ది బిగినింగ్’. కారుణ్య చౌదరి హీరోయిన్గా నటించగా, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, అయ్యప్ప పి.శర్మ కీలక పాత్రలుపోషించారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్–శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రోడక్షన్స్ పై నిర్మించిన ఈ సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో రూపొం దింది.‘‘ఈ కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్, ఎక్కువ మంది అఘోరాలతో శివుడిని చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ బాగా వచ్చాయి. 45 నిముషాల పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్గా నిలుస్తాయి. ప్రేక్షకులకు ఈ చిత్రం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. హారర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘ఎర్రచీర’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా కన్నడ నటుడు గణేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పినాక’. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో క్షుద్ర, రుద్ర పాత్రల్లో కనిపించనున్నారు గణేశ్. ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. -
సంక్రాంతి బరిలో...
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచారు రవితేజ. ఆయన హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుకతో గురువారం ప్రారంభమైంది.ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ని హైదరాబాద్లో ప్రారంభిస్తామని, రవితేజ కెరీర్లోని ఈ 76వ సినిమాను వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అలాగే ఫ్లయిట్లో రవితేజ స్టైలిష్గా కూర్చుని, ఒక చేతిలో ‘సీ ఇట్ సే ఇన్ స్పానిష్’ పుస్తకం పట్టుకున్నపోస్టర్ని విడుదల చేశారు. ‘‘రవితేజగారి సిగ్నేచర్ స్టైల్, ఎనర్జీ ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
విద్యార్థులకు 'విజయ్' కానుకలు.. రాజకీయాలు వద్దంటూ సూచన
కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా తమిళనాడు విద్యార్థులకు కానుకలు అందించారు. 2026 ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ నినాదాలు హోరెత్తిస్తూనే.. చదువుకునే పిల్లలు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పిన ఆయన తమ గోల్స్ పూర్తి అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని వారించారు. ఇందుకు మహాబలిపురంలో మలివిడతగా జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమం వేదికగా మారింది. పది, ప్లస్టూలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. మలివిడతగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులను సత్కరించి, ప్రోత్సాహాన్ని అందించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి సత్కరించడమే కాకుండా, వారితో గ్రూప్ ఫొటోలను విజయ్ దిగారు. అదే సమయంలో మైక్ అందుకున్న విద్యార్థులు విజయ్ తమలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ రూపంలో మార్పు తథ్యమని నినదించారు. అదే సమయంలో మైక్ అందుకున్న విజయ్ రాజకీయాలు వద్దు, విద్యాపరంగా ముందుకెళ్దామని సూచించారు. విద్యార్థులెవరూ రాజకీయాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర స్థాయిలోని టాపర్లకు బంగారు ఉంగరాలను విజయ్ అందజేశారు. మలి విడతగా ఈనెల 13న మరో 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టాపర్లను విజయ్ సత్కరించేందుకు నిర్ణయించారు. -
అది మాత్రమే మన హక్కు.. ప్రకృతికి రుణపడి ఉంటా: నభా
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh).. ఈ రోజు (జూన్ 5న) ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను... ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్కు రుణపడి ఉంటాను అని రాసుకొచ్చింది.ఇది చూసిన నెటిజన్లు ప్రకృతి గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నభా నటేష్.. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో నాగాభరణం అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగాభరణం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. :హీరో -
నీ మంచితనం నాకు తెలుసు.. తీవ్ర దుఃఖంలో లావణ్య త్రిపాఠి
హీరోయిన్, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తీవ్ర బాధలో ఉంది. ఆమె ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం మరణించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నేను చూసిన శునకాల్లో అన్నింటికంటే నువ్వే ఎంతో మంచిదానివి. నీకు శక్తి ఉండుంటే నాకోసం టీ పెట్టడానికి కూడా వెనకాడవని నా చుట్టూ ఉండేవాళ్లకు ఎప్పుడూ నీ గురించి చెప్తుంటాను. ఎంత మంచిదానివో..నీదెంత మంచిమనసో నాకు తెలుసు. నువ్వు చాలా మంచిదానివి. అలాగే తెలివైనదానివి స్వీటీ అని రాసుకొచ్చింది. తన శునకంతో కలిసున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ కింద సాయిదుర్గ తేజ్ ఓం శాంతి అని కామెంట్ చేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు.. లావణ్యను ధైర్యంగా ఉండమని చెప్తున్నారు.త్వరలోనే తల్లి కాబోతున్న లావణ్యకాగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ 2023లో పెళ్లి చేసుకున్నారు. గత నెలలోనే లావణ్య.. తాను గర్భం దాల్చినట్లు గుడ్న్యూస్ చెప్పింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో సతీ లీలావతి సినిమా ఉంది. View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) చదవండి: నా తల్లికి పుట్టుకతోనే చెవులు వినిపించవు..మోహన్బాబు -
నా తల్లికి పుట్టుకతోనే చెవులు వినిపించవు.. బాధేసేది: మోహన్బాబు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa Movie). శివుడి కోసం కన్నప్ప తన జీవితాన్నే త్యాగం చేశాడని.. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక కన్నప్ప ఉంటారని ఆ స్టోరీ చెప్పమంటూ కొత్త తరహా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు విష్ణు (Vishnu Manchu). మై కన్నప్ప స్టోరీ అంటూ ముందుగా తనే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన జీవితంలో తండ్రి మోహన్బాబు కన్నప్ప అని.. ఆయన కృషి, త్యాగాల ఫలితంగానే నటుడిగా అందరి ముందు నిలబడ్డానని చెప్పాడు.అమ్మకు చెవులు వినిపించవుతాజాగా మోహన్బాబు తన కన్నప్ప స్టోరీని షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వరుడికి కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు. మన జీవితంలో అమ్మ చెప్పకుండానే మన ఆకలి తీరుస్తుంది. లైఫ్లో ఏది కావాలంటే అది, శక్తికి మించినదైనా సరే అమ్మానాన్న మనకు ఇస్తుంటారు. నా దృష్టిలో మా అమ్మానాన్న నా కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తూ అమ్మకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవు.ఐదుమంది సంతానంఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు. బస్సు దిగి మా ఊరికి నడిచి వెళ్లాలంటే ఏడు కి.మీ. నడిచి వెళ్లాలి. ఆ దారి కూడా సరిగా ఉండేది కాదు. చెవులు వినిపించని నా తల్లి ఐదుమంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్లేదంటే ఎంత కష్టమో ఆలోచించండి. దారిలో ఒక కాలువ, సువర్ణముఖి నది దాటి వెళ్లాలి. మాది ద్వీపంలాంటి ఊరు. అప్పుడప్పుడు ఈ విషయాలు తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.నా మాటలు తల్లికి వినిపిస్తే బాగుండునా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు... నా మాటలు తల్లికి వినిపించుంటే ఎంత బాగుండేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నాకు నా కన్నతల్లే కన్నప్ప అని చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Dr. Mohan Babu Garu reveals the soul and spirit behind #Kannappa🏹. We all have that one moment where we chose heart over everything else — for love, for belief, for something greater than ourselves. What’s your Kannappa moment?#MyKannappaStory #Kannappa27thJune… pic.twitter.com/m7Gy82JUrw— Kannappa The Movie (@kannappamovie) June 5, 2025చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే -
'లక్ష్మీ నరసింహా'లో కొత్త పాట.. రీ రిలీజ్లో ట్రెండ్
బాలకృష్ణ (Balakrishna), అసిన్ నటించిన 'లక్ష్మీ నరసింహా' (Lakshmi Narasimha) చిత్రం సుమారు 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మరో కొత్త సాంగ్ను ఈ చిత్రంలో చేర్చారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా దానిని తాజాగా విడుదల చేశారు. 'మంచినీళ్లు తాగినోడు మామూలోడు' అంటూ సాగే ఈ సాంగ్ను చంద్రబోస్ రచించగా భీమ్స్ సంగీతం అందించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం హిందీలో IPS నరసింహగా డబ్చేశారు. తమిళ చిత్రం సామికి రీమేక్గా తెలుగులో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు. జూన్ 8న ఈ మూవీ 4కె వెర్షన్లో విడుదల కానుంది. -
30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్కు కోర్టు హెచ్చరిక
కోలీవుడ్ హీరో విశాల్, ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)కు మధ్య కొన్నేళ్లుగా డబ్బు విషయంలో విభేదాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో విశాల్కు మద్రాస్ కోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్స్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. న్యాయపరమైన ఖర్చులతో సహా లైకా ప్రొడక్షన్స్ వారికి డబ్బు తిరిగి ఇవ్వాలని కోర్టు తెలిపింది.సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని ఒప్పందం ప్రకారం ఎలాంటి సినిమా చేయలేదని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఆపై డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో 2022 లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలోనే లైకా ప్రొడక్షన్స్కు విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు సూచించింది. తన ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతవరకు ఆయన నటించి, నిర్మించిన ఎలాంటి సినిమాలు థియేటర్స్, ఓటీటీల్లో విడుదల చేయకూడదంటూ స్టే విధించింది. అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని లైకా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆపై విశాల్ మీద కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. దీంతో న్యాయస్థానం విశాల్ను మందలించింది. లైకాకు చెల్లించాల్సిన 21.29 కోట్ల రూపాయలను 30 శాతం వడ్డీ, న్యాయపరమైన ఖర్చులతో సహా చెల్లించాలని మద్రాస్ హైకోర్టు నటుడు విశాల్ను ఆదేశించింది. విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు దాఖలు చేశాడు. తన వద్ద 3 కార్లు, ఒక బైక్తో పాటు రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించారు. తన ఇంటిపై తీసుకున్న రుణానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన అందించారు. -
అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ తహతహలాడటమే కాక ఆయా సినిమాల కథలను కాపీ కొడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇప్పుడు మనల్ని కాపీ కొడుతుంది కానీ ఒకప్పుడు సౌత్ సినిమాకు హిందీ ఇండస్ట్రీయే ఆధారం అంటున్నాడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ. హిందీ సినిమాలను రీమేక్ చేసే సౌత్ హీరోలు స్టార్ స్టేటస్ అందుకున్నారంటున్నాడు.సౌత్లో హిందీ సినిమాల రీమేక్స్తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. మొదట్లో దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమాలు రీమేక్ అయ్యేవి. 70's, 80's కాలంలో రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీ రామారావు, రాజ్కుమార్.. వీళ్లంతా కూడా బిగ్బీ సినిమాల రీమేక్స్లో నటించేవారు. అయితే 1990 తర్వాత బచ్చన్ ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాడు.మసాలా సినిమాలుసరిగ్గా అప్పుడే మ్యూజిక్ కంపెనీలు రంగంలోకి దిగాయి. కేవలం వారి పాటల్ని, సంగీతాన్ని అమ్ముకోవడం కోసం సినిమాలు తీసేవి. మైనే ప్యార్ కియా వంటి సినిమాలు అలా వచ్చినవే.. కానీ సౌత్లో మసాలా సినిమాలు తీయడం మాత్రం ఆగలేదు. వాటిక్కూడా బిగ్బీ చిత్రాలే మూలం. దానివల్లే ఇక్కడున్న హీరోలు అభిమానులకు దేవుడిలా మారిపోయారు. అలా ఆ హీరోల స్టార్డమ్ ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది అని వర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ.. -
స్టార్ హీరోతో 'లోకేష్ కనగరాజ్' కొత్త సినిమా ప్రకటన
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు.ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు. అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్హీరో జానర్లో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని ఆమిర్ ఖాన్ సూచించారు.‘పీకే 2’ సినిమా గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమిర్ ఖాన్ అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే, 'దాదా సాహెబ్ ఫాల్కే'పై సినిమా చేస్తున్నామని, రాజ్ కుమార్ హిరాణీతో చర్చలు జరుగుతున్నాయిని చెప్పారు. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్ అంటూ ఆమిర్ ఖాన్ తెలిపారు. అదొక యజ్ఞంలా చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని ఆమిర్ అన్నారు.ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ మరో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని ఆమిర్ సినిమా చేయనున్నారు. -
కాశ్మీర్లో స్టార్ హీరోయిన్ పేరుతో ఒక గ్రామం.. వైరల్ అవుతున్న ఫోటో
కోలీవుడ్ నటి త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన పేరే ఒక బ్రాండ్ అనే రేంజ్కు ఒక హీరోయిన్గా ఆమె ఎప్పుడో చేరిపోయారు. అయితే అంతకుమించి అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమా కథానాయికలు పదేళ్లు అగ్ర కథానాయికలుగా రాణించడం కష్టతరం. అలాంటిది త్రిష ఏకంగా 20 ఏళ్లకు పైగా క్రేజీ స్టార్గా వెలిగిపోతుండడం విశేషం. పెరగని వయసు, తగ్గని గ్లామర్ త్రిష సొంతం. ఈమె తాజాగా అజిత్ సరసన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు మణితర్నం దర్శకత్వంలో కమలహాసన్ సరసన నటించిన థగ్లైఫ్ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చేసింది. సూర్యకు జోడీగా నటిస్తున్న మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది భాషల్లో తగ్గేదేలే అంటూ తన జోరు సాగిస్తున్నారు. త్రిషకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లోనే మిస్ చైన్నె కిరీటాన్ని గెలుచుకున్న త్రిషను ఇప్పటివరకూ ఒక బ్రాండ్ అనే అనుకున్నాం. అంతకుమించి అని ఇప్పుడు తెలిసింది. ఈ బ్యూటీ పేరుతో ఒక ఊరే ఉండడం విశేషం. అది ఎక్కడో తెలుసా లడక్లో, అవును ఆక్కడ త్రిష పేరుతో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరుతో ఉన్న బోర్డును ఒక అభిమాని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అందులో త్రిష.. మీ పేరుతో లడక్లో ఒక ఊరు ఉంది. మీకు తెలుసా? తెలిస్తే మీరు వెంటనే ఆ ఊరుకు వస్తారు’ అని అతను పేర్కొన్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ప్రతీది రాజకీయమే.. కమల్ 'కన్నడ' వివాదంపై రానా రియాక్షన్
'తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది' అని కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మా భాషను తక్కువ చేసి మాట్లాడతావా? అని ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie)పై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) నిషేధం ప్రకటించింది. అప్పటికీ కమల్ వెనక్కుతగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయాలని కోర్టుకెళ్లాడు. అసలు ఏ ఆధారంతో అటువంటి కామెంట్లు చేశారు? సారీ చెప్తే అయిపోతుందిగా అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.ఏది మాట్లాడినా వివాదమే..అప్పటికీ కమల్ క్షమాపణ చెప్పడం కాదుకదా.. అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. తాజాగా ఈ వ్యవహారం హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)కి వద్ద ప్రస్తావనకు వచ్చింది. రానా నాయుడు- రెండో సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో కమల్- కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ.. అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్ఫామ్గా సోషల్ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రతీది రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఇకపోతే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు రెండో సీజన్ జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.చదవండి: మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్! -
హరిహర వీరమల్లు వాయిదా.. అదే ప్రధాన కారణమా?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానుల బ్యాడ్ న్యూస్. పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్తో పాటు ఆర్థికపరమైన సమస్యల వల్లేనని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అందువల్లే హరిహర వీరమల్లు వాయిదా తప్పేలా కనిపించడం లేదు.అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లోనూ ఎలాంటి బజ్ లేకపోవడంతో భారీ నష్టాలు వచ్చే అవకాశముందని పంపిణీదారులు కూడా వెనకాడుతున్నట్లు సమాచారం. ప్రధాన ఆర్థిక పరమైన సమస్యలతోనే ఈ సినిమాను వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆలస్యం కావడానికి మరో ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వీఎఫ్ఎక్స్తో పాటు స్టూడియోలకు చెల్లింపులు చేసే గడువు కూడా ముగిసిపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల పోస్ట్-ప్రొడక్షన్లో మరింత జాప్యం జరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఒక వారం వాయిదా మాత్రమే ఉండొచ్చని కొందరు భావిస్తున్నప్పటికీ.. దాదాపు నెల రోజులు ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్.. జూన్ 12 వరకే డీల్కు అనుమతించినట్లు సమాచారం. ఆ తేదీ గడువు దాటితే ఒప్పందం డీల్ విలువలో రూ. 20 కోట్ల తగ్గింపు కోరినట్లు సమాచారం. ఇప్పటికే వాయిదాపై పలు ఊహగానాలు వస్తున్నప్పటికీ.. ఆలస్యం గురించి నిర్మాతల నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం కుదరపోతే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తారని సమాచారం. -
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ HD స్టిల్స్
-
నేను పెద్ద అందగాడినేం కాదు.. దేవుడిని ఒక్కటే కోరుకున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మంచు విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలనేది ఆశయమని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నేను పుట్టినప్పటి నుంచి యాక్టర్ కావాలనేది నా ఆశయం. కానీ నా చిన్నప్పుడు నేనేం పెద్ద అందగాన్ని కాదు. ఇప్పుడు కూడా అందగాడినేమి కాదు. దేవుడిని ఒకటే అడిగేవాన్ని. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. దాన్ని నిలబెట్టుకుంటాను చెప్పేవాడిని. దేవుడు నాకు వరమిచ్చాడు.. ఈ జన్మ ఎత్తింతి నేను నటుడిగానే ఉండాలి. మిగతావన్నీ నాన్న ఇచ్చిన బాధ్యతలు. యూనివర్సిటీ నాకు రెస్పాన్సిబిలిటీ. నటనలో ఎలాగైతే ఉంటానో.. యూనివర్సిటీ, స్కూల్ నడపడం నాకు చాలా సులభం. నా తర్వాత కూడా మన యూనివర్సిటీ పేరు నిలిచిపోవాలి. రిలయన్స్, టాటా కంపెనీకి ఎలా బ్రాండ్ ఉందో మనందరికీ తెలుసు. రతన్ టాటా లేకపోయినా ఆ బ్రాండ్కు ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అలా ప్రొఫెషనల్గా ఉండాలి' అని అన్నారు.కాగా.. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్ లా్, అక్షయ్ కుమార్, మెహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నంచి శ్రీకాళహస్తి సాంగ్ను విడుదల చేయగా అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ పాటలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించారు. నేను అందగాడ్ని కాదు.. కానీ నటించడానికే ఈ జన్మ ఎత్తా - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/v49DQe5esw— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2025 -
బతికి ఉన్నంత వరకు అలా మాట్లాడను'.. నటుడు రాజేంద్రప్రసాద్
-
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) వరుసగా నోరు జారుతూనే ఉన్నాడు. ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ను, ఇటీవల కమెడియన్ అలీని తిట్టాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్పైనా నోరు పారేసుకున్నాడు.నాకు ప్రేమలే తెలుసుపదేపదే మాట తూలుతూ రాజేంద్రప్రసాద్ తన పరువు తనే గంగలో కలిపేసుకుంటున్నాడని అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై రాజేంద్రప్రసాద్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్గా ఎలా ఉంటాను?నా చివరి శ్వాస వరకు..కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈ సారి చాలా హర్టయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నాను. నందమూరి తారకరామారావు పిల్లలనుంచి పెద్దలవరకు అందరినీ మీరు అనే సంభోదించేవారు. నేను కూడా ఇకపై అలాగే మాట్లాడతాను. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడూ ఏకవచనంతో మాట్లాడను. కెమెరాలు చూసుకోలేదు..ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే.. వాళ్లందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాతరోజుల్లోలాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు. లిమిట్స్లో ఉండటం బెటర్ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవర్నీ నువ్వు అనను, మీరు అనే అంటాను అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్ -
ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్
ఏదైనా ప్రమోషన్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.పూర్తిగా నమ్ముతున్నా..అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత కొన్ని రోజులుగా ఎన్ఎమ్ఎన్ (నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్) అనే సప్లిమెంట్ను ప్రమోట్ చేసింది. ఇది డీఎన్ఏను రిపేర్ చేసి మన వయసు పెరగనీయకుండా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు ఈ ఎన్ఎమ్ఎన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న గటాకా సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో.. ఈ ట్యాబ్లెట్స్ గురించి వాటి ఫలితాలే చెప్తున్నాయి. నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్కట్స్ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం అని రాసుకొచ్చింది.ఫ్రాడ్.. నమ్మొద్దు: డాక్టర్ఇది చూసిన ద లివర్ డాక్టర్.. సామ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్సు తెలియని నటి అని తిట్టిపోశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్లను ప్రమోట్ చేస్తోందని ఆరోపించాడు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత యాక్టివ్గా ఉన్నట్లు తేలింది.. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదన్నాడు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు.నిజమైన వైద్యుల్ని నమ్మండిమీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యంగ్గా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్ పెట్టమని సూచించాడు. సిగరెట్, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దని.. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే విశ్వసించమని కోరాడు. అసలైన వైద్యులు చెప్పేదే వినండంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా గతంలోనూ సమంత పెట్టిన పలు పోస్టులపై లివర్ డాక్టర్ విమర్శలు గుప్పించాడు. View this post on Instagram A post shared by The Liver Doc (Cyriac Abby Philips) (@theliverdr) చదవండి: టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే! -
తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి
తెలుగు సినిమా ఇండస్ట్రీ.. పైకి కనిపించేంత అందంగా అయితే ఉండదు. ఎప్పటికప్పుడు పలువురు యంగ్ హీరోయిన్లు, యువతులు.. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెడుతుంటారు. శారీరకంగా ఎంతలా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని చెబుతుంటారు. ఇప్పుడు కూడా మోడల్ కమ్ నటి అయిన మౌనీషా చౌదరి.. ఓ తెలుగు దర్శకుడి వల్ల తాను ఇబ్బంది పడిన విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి పంచుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)'టాలీవుడ్కి చెందిన ఓ దర్శకుడు.. నాకు ఫోన్ చేసి ఆయన తీస్తున్న సినిమాలో నటించమని కోరాడు. అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు. నాకు ఆ మూవీలో నటించడం ఇష్టం లేదు. ఇదే ఆయనకు చెప్పినా సరే వినకుండా నా తొడల సైజ్(కొలతల) గురించి అడిగి ఇబ్బంది పెట్టాడు. అసలు సినిమా అవకాశానికి, దానికి సంబంధం ఏంటి? ప్రస్తుతం ఆ దర్శకుడు స్టార్ అయిపోయాడు. పెద్ద పెద్ద యాక్టర్స్తో మూవీస్ చేస్తున్నాడు' అని మౌనీషా చౌదరి చెప్పుకొచ్చింది.మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్గానే అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. అలాంటి ఈమె.. తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. కానీ సదరు దర్శకుడు పేరేంటి అనేది మాత్రం చెప్పలేదు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్) -
మురళీమోహన్, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్.. అసలేం జరిగిందంటే?
నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అంటే అందరికీ ఎనలేని గౌరవం. కానీ ఈమధ్య ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అవతలివారిపై నోరు పారేసుకుంటూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. రాబిన్ హుడ్ సినిమా సమయంలో వార్నర్ను దొంగ నా.. అంటూ తిట్టాడు. ఇటీవల ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో మురళీమోహన్ను సిగ్గుందా? అన్నాడు. ఓ హీరోయిన్ను బాడీ షేమింగ్ చేశాడు. కమెడియన్ అలీ (Comedian Ali)ని బూతు మాట అన్నాడు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది.తప్పుగా మాట్లాడటమేగాక..అలీ స్పందించి రాజేంద్రప్రసాద్.. కూతురు పోయిన బాధలో ఉన్నాడని, ఈ వివాదాన్ని వదిలేయమని కోరాడు. అటు రాజేంద్రప్రసాద్ కూడా తప్పు గ్రహించి క్షమాపణ చెప్పకపోగా తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ అని దబాయించడం గమనార్హం. అయితే ఈ ఈవెంట్లో అసలేం జరిగిందన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. ఈవెంట్ హోస్ట్, ఓ సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్డే కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ మనస్ఫూర్తిగా వచ్చారు. పిలవకముందే స్టేజీపైకి..రాజేంద్రప్రసాద్ ఈవెంట్కు లేటుగా వచ్చారు. నేను ఆయన గురించి ఇంట్రో ఇచ్చాక స్టేజీపైకి రావాలి. కానీ నేను పిలవకముందే తనే స్టేజీపైకి వచ్చి మాట్లాడారు. కాస్త శృతిమించి మాట్లాడారు. ముఖ్యంగా మురళీమోహన్గారిని బుద్ధుందా? అనడంతో అందరూ షాకయ్యారు. అలీపైనా నోరు జారాడు. అలా మాట్లాడటాన్ని ఎవరూ సమర్థించరు. ఆ ఫంక్షన్ కంటే కూడా ఈయన తిట్లే వైరలవడం దురదృష్టకరం. అక్కడున్నవారి చాలామంది ముఖాలు మాడిపోయాయి. చాలామంది ఫోన్లు చేసి బాధపడ్డారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి అయితే ఇంకేం మాట్లాడతాం.. నో కామెంట్ అన్నారు.బాధను మర్చిపోయే క్రమంలో..రాజేంద్రప్రసాద్.. కూతురు కోల్పోయిన బాధలో ఉన్నారు. ఆ బాధను మర్చిపోయే క్రమంలో కాస్త అదుపు తప్పి మాట్లాడుతున్నారు. నటుడిగా రాజేంద్రప్రసాద్ గురించి వంక పెట్టే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. అంత గొప్ప వ్యక్తి. కానీ, ఈ మధ్యకాలంలో సమతుల్యత తగ్గుతోంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: బిగ్ బాస్లోకి యూట్యూబర్లు,ఇన్ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ... -
బిగ్బాస్ ఫేమ్ హీరోగా సోలో బాయ్.. రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సోలో బాయ్'. ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్.వచ్చేనెల 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. బిగ్బాస్తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ హీరోగా అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఈ కథ చాలా కొత్తగా అనిపించి, ఈ సినిమాను నిర్మించినట్లు డైరెక్టర్ నవీన్ అన్నారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందని తెలిపారు. కాగా.. గౌతమ్ కృష్ణ గతంలో ఆకాశవీధుల్లో అనే చిత్రంలో నటించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పడిపోయానే సఖి అనే లిరికల్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, డాక్టర్ భద్రం, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జుడా సంధి సంగీతమందించారు. Not every hero wears a cape.Some just carry silent dreams and heavy hearts. 💔#SoloBoy – a boy, a battle, a beautiful transformation.🎬 In cinemas from 4th JULY!Produced by @SevenhillsSati3Directed by #PNaveenKumarMusic by @judahsandhy@igauthamkrishna @RamyaPasupulet9… pic.twitter.com/gFajsk8eba— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2025 -
'జాక్' ఫ్లాప్.. సగం డబ్బు వెనక్కిచ్చేసిన హీరో!
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda ).. వరుస హిట్లతో స్పీడు మీదున్న ఈ హీరోకు జాక్ మూవీ (Jack Movie)తో సడన్ బ్రేక్ పడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాలేకపోయారు. దీంతో జాక్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.మంచి పని చేసిన సిద్ధుదీంతో నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ.36 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడంతో సిద్ధు ఓ నిర్ణయం తీసుకున్నాడట. జాక్ కోసం తొమ్మిదిన్నర కోట్ల పారితోషికం తీసుకున్న సిద్ధు అందులో సగాన్ని నిర్మాతలకు వెనక్కు ఇచ్చేశాడట! దాదాపు రూ.4.75 కోట్లను బీవీఎస్ఎన్ ప్రసాద్కు తిరిగిచ్చేశాడని తెలుస్తోంది.చూసి నేర్చుకోండిసిద్ధు చేసిన మంచిపనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతల నష్టాల్ని పూడ్చేందుకు సగం రెమ్యునరేషన్ వదులుకున్న టిల్లు మనసు బంగారం అని కొనియాడుతున్నారు. చాలామంది హీరోలు సిద్ధును చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు.. తెలుసుకదా సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు! -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయంపై మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఆ హార్డ్ డిస్క్ ఇంకా తనవద్దకు రాలేదని చెప్పారు.విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప కోసం ముంబయిలో దాదాపు 8 కంపెనీలు వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఆన్లైన్లో కొంత భాగం పంపించారు. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేశారు. ముందు జాగ్రత్త కోసమే వాళ్లు ఓ హార్డ్డిస్క్ కూడా పంపారు. మా ముగ్గురికి సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్న ఇంటిదే ఉంటుంది. అక్కడికి పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళను తీసుకోమని చెప్పారట. ఆమెనే తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే.. వాళ్లిద్దరు మనోజ్ దగ్గర పని చేస్తారో.. లేదో మాకు తెలియదు. అతని వద్దే ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. ఇప్పటివరకైతే హార్డ్డిస్క్ నా చేతికి రాలేదు' అని అన్నారు. -
పుష్ప 2 డేట్ కు రాజాసాబ్.. బ్లాక్ బస్టర్ పక్కా..
-
ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్తో లింక్!
ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి వరల్డ్ కప్ గెలిచినంత సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ గెలవడంతో సినీ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏకంగా డ్యాన్స్ చేస్తూ బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే ఆర్సీబీ విజయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. జియో హాట్స్టార్ తెలుగు తన ట్విటర్ వేదికగా బెంగళూరు విజయంపై ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆర్సీబీ విజయాన్ని.. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ సీన్తో పోల్చింది. రైల్వేస్టేషన్లో పవన్ కల్యాణ్ తన అత్తను చూసి భావోద్వేగానికి గురయ్యే వీడియోను పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఆర్సీబీ టీమ్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇదెక్కడి సింక్రా మావ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. This part of my life, this little part, is called happiness. 🥹😭🏆#EeSaalaCupNamde #RCBvsPBKS #IPLFinal #Victory #JioHotstarTelugu pic.twitter.com/4k3rBcgLQ6— JioHotstar Telugu (@JioHotstarTel_) June 3, 2025 -
మా పేరేంట్స్కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్లోని ఓ పబ్లో వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. కానీ అదే సమయంలో పబ్ సిబ్బందితో గొడవ జరిగింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని వార్తలొచ్చాయి.తాజాగా ఈ అంశంపై నటి కల్పికా గణేశ్ స్పందించింది. తానేలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయలేదని తెలిపింది. బిగ్బాస్ ఛాన్స్ కోసమే మీరు ఇలా చేశారని కొందరు అంటున్నారని ప్రశ్నించగా.. వాళ్లే నన్ను చూడాలనుకుంటున్నారేమో అని సమాధానమిచ్చింది. బర్త్ డే పార్టీలో తాను మందు తాగలేదని వెల్లడించింది. తనకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందని.. ఈ విషయం నా ఫ్రెండ్స్కు, తల్లిదండ్రులకు కూడా తెలుసని పేర్కొంది. గతంలో తాను ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఆల్కహాల్ తీసుకునేదాన్ని తెలిపింది. ప్రస్తుతానికి మందుతాగి దాదాపు రెండు, మూడేళ్లయిందని.. ఆ రోజు కేవలం వార్మ్వాటర్ మాత్రమే తీసుకున్నట్లు కల్పికా గణేశ్ అంటోంది. మరోవైపు కల్పికా కావాలనే ఇదంతా చేసిందని.. కేవలం ఫేమ్ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: హైదరాబాద్ పబ్లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్)కాగా.. రామ్ చరణ్ 'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది. -
పెద్దితో పాట
పెద్దితో స్టెప్పులేశారు జాన్వీ కపూర్. రామ్చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న పీరియాడికల్ అండ్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, జాన్వీతో పాటు ముఖ్య తారాణంగా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
అది నా అదృష్టం: రీతూ వర్మ
‘‘చాలా మంది అమ్మాయిలను చుట్టు పక్కల ఉండేవాళ్లు ‘నువ్వు అది చేయలేవు.. ఇది చేయలేవు’ అంటూ నిరుత్సాహపరుస్తుంటారు. అలాంటి వారికి ‘దేవిక అండ్ డానీ’ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇటువంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు రావడం, నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ రీతూ వర్మ తెలిపారు.శివ కందుకూరి, రీతూ వర్మ, సూర్య వశిష్ఠ్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో బి. కిశోర్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. సుధాకర్ చాగంటి నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 6 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్లో నేను సుబ్బు అనే ఫన్నీ పాత్ర చేశాను’’ అన్నారు.‘‘దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బులాంటి పాత్రలు ఎలా మార్చాయనేది ఈ సిరీస్లో చూడొచ్చు’’ అని పేర్కొన్నారు సూర్య వశిష్ఠ్. ‘‘దేవిక అండ్ డానీ’లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ సహా అన్ని అంశాలున్న సిరీస్ ఇది’’ అని సుధాకర్ చాగంటి తెలిపారు. ‘‘శ్రీకారం’ సినిమా తర్వాత ఈ సిరీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ చూసే ఆడియన్స్ సమయం వృథా కాదు’’ అన్నారు బి. కిశోర్. -
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ .. ఫైర్ థీమ్ రిలీజ్
అడివి శేష్ నటిస్తోన్న తాజా చిత్రం ' డకాయిట్'. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. ఇందులో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫైర్ థీమ్(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) రిలీజ్ చేశారు. ఈ ఫైర్ థీమ్ను భీమ్స్ సిసిరోలియో పవర్ఫుల్గా కంపోజ్ చేశారు. ఇక ఆడియన్స్కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. అన్ని మ్యూజిక్ ఫ్లాట్ఫామ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ క్రిస్మస్ కానుకాగ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. Put on your headphones and enjoy the musical fire 🔥🎧#DACOITFire Glimpse OST now streaming on all platforms ❤🔥▶️ https://t.co/cEqYoQldqu#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas… pic.twitter.com/8DaP6zD1WH— Annapurna Studios (@AnnapurnaStdios) June 3, 2025 -
కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?
బుల్లితెర నటుడు అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary) వెండితెరపై తన సత్తా చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడి చేతిలో మూడు సినిమాలదాకా ఉన్నాయి. అందులో ఒకటి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి (Chowdary Gari Abbayi tho naidu Gari Ammayi Movie). సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.డ్రెస్సింగ్పై నెగెటివ్ కామెంట్స్ఈ ఈవెంట్కు సురేఖావాణి (Surekha Vani) హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు పొట్టి బట్టలపై వచ్చే కామెంట్ల గురించి ప్రశ్న ఎదురైంది. సినిమాలో పని చేసే ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతుంటారు. వాటిని చూసే జనాలు.. ఆడపిల్ల అయి ఉండి ఇలాంటి దుస్తులు వేసుకుంటారా? అని నెగెటివ్గా కామెంట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మీరెలా ఉండాలని సలహా ఇచ్చేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.నవ్వుకునేవాళ్లందానికి సురేఖావాణి స్పందిస్తూ.. అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించలేవు కదా.. వాడేదో ఆలోచించుకుని, ఏదో అనుకుని ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తాడు. వాటిని ఎంతవరకు తీసుకోవాలన్నది మనకు తెలిసుండాలి. మొదట్లో నేను, నా కూతురు ఆ కామెంట్లు చదువుకుని రియాక్ట్ అయ్యేవాళ్లం. తర్వాత దాన్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవడమే మానేశాం అని చెప్పుకొచ్చింది.చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్ -
నాన్న మాకోసం ఎన్నో త్యాగాలు చేశాడు: విష్ణు
సెలబ్రిటీలకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా మంచు విష్ణుకు కన్నప్ప జీవిత కథను సినిమాగా తీయాలని ఓ ఆశ. అందుకోసం తెర వెనక ఎంతో కష్టపడ్డాడు. అందరికీ తెలిసిన కన్నప్ప గురించి ఎవరికీ తెలియని విషయాలను సైతం సేకరించాడు. చరిత్రను తవ్వి చూశాడు. కన్నప్పను నిశితంగా అర్థం చేసుకున్నాడు.ఈ నెలలోనే రిలీజ్అంతా ఆకళింపు చేసుకున్నాకే కన్నప్ప సినిమా (Kannappa Movie) ను ప్రకటించాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజైనప్పుడు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఎప్పుడైతే శివుడి పాట విడుదలైందో అప్పుడు ఆ నెగెటివిటీ అంతా మట్టిగొట్టుకుపోయింది. మధ్యలో సినిమా రెండుమూడు సార్లు వాయిదా కూడా పడింది. ఆ పరమేశ్వరుడిపై భారం వేస్తూ జూన్ 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.మా కోసం ఎన్నో త్యాగాలుతాజాగా విష్ణు మంచు (Vishnu Manchu) మై కన్నప్ప స్టోరీ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కన్నప్ప.. మహాశివుడికి పెద్ద భక్తుడు. ఓసారి ఆ భగవంతుడు కన్నప్పను పరీక్షించగా అతడు తన రెండు కళ్లను శివయ్యకు అర్పించాడు. తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకోసం సర్వం ధారపోసేవాళ్లున్నారు. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, స్నేహితులు.. ఎలా ఎవరైనా కావచ్చు. నా జీవితంలోనూ ఓ కన్నప్ప ఉన్నారు. ఆయనే మా నాన్న.ఆయనే నా హీరోఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టపడి మాకు ఏ ఇబ్బందీ లేకుండా పెంచాడు. ఈరోజు మీ ముందు నటుడిగా కూర్చుని మాట్లాడుతున్నానంటే అది ఆయన చేసిన త్యాగాల ఫలితమే! మా నాన్న నటుడిగా కష్టపడి నిలదొక్కుకోవడం వల్లే! ఆయనే నా హీరో. మీ జీవితాల్లో ఉన్న హీరో గురించి మీరు చెప్పండి. మీ కన్నప్ప స్టోరీని ప్రపంచానికి తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు. #MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/jHXm2Kp0xG— Vishnu Manchu (@iVishnuManchu) June 3, 2025 చదవండి: ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి -
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గతేడాది నవంబర్లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్ 8న రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే. -
అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ
హారర్ సినిమాలు హిట్టయ్యాయంటే వరుసపెట్టి మరీ అవే తీస్తూ ఉంటారు. అదేవిధంగా యాక్షన్ మూవీ బ్లాక్బస్టర్ అయిందంటే అలాంటివే వరుసగా వదులుతూ ఉంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kahsyap). ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. కేజీఎఫ్, సలార్ సినిమాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరంతా చూశారుగా.. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఒకేలా కనిపించేవి. హింసపై ఫోకస్యానిమల్ విషయానికి వస్తే ఇందులో హింస, రక్తపాతం బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా రూ.900 కోట్లు సంపాదించింది. ఇది చూసిన ఫిలిం మేకర్స్ తమ చిత్రాల్లోనూ రెట్టింపు హింసను ప్రవేశపెట్టారు. కొన్నిసార్లు అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా వాటిని చొప్పించేవారు. వాళ్లు తప్పు దారిలో వెళ్లడం చూసి నాకు భయమేసేది అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడదే ట్రెండ్ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తర్వాత అందరూ బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్పైనే ఫోకస్ చేశారన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడమే ప్రస్తుతమున్న ట్రెండ్ అని, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. తాను కూడా సత్య సినిమాకు మరో రూ.5 కోట్లు ఎక్కువ పెట్టుంటే ఆ మూవీ సర్వనాశనమయ్యేదన్నాడు.బాలీవుడ్కు గుడ్బైబాలీవుడ్లో దర్శకుడిగా, నటుడిగా రాణించిన అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు. హిందీలో ప్రయోగాలు చేయడం కష్టమని, అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, అందుకే బాలీవుడ్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పూర్తిగా దక్షిణాది సినిమాల్లోనే ఉంటానని తెలిపాడు. ఈయన ప్రస్తుతం అడివిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? -
'ది రాజాసాబ్' నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). తాజాగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ వంటి అంశాలను ఒక పోస్టర్తో చిత్ర యూనిట్ తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 16న ఉదయం 10:52గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. రీసెంట్గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్ టీజర్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తిచేశారట. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.తాతా మనవళ్ళుగా ప్రభాస్‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్నగర్ భోగట్టా. వాస్తవంగా ఈ సినిమా విడుదల ఏప్రిల్ 10న రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉండటంతో వాయిదా పడింది. ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా ఉన్నాయట. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్లోను నెలకొంది.ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025 -
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika padukone ) వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఒక భారీ ప్రాజెక్ట్ను వదులుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, పనిగంటలతో పాటు రెమ్యునరేషన్ వంటి అంశాలు కూడా కారణం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయిపోయింది. రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి..? అనే అంశంలో సినిమా నటీనటులైనా ఇందుకు మినహాయింపు కాదని చర్చకు దారితీస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ప్రత్యక్షంగా పరోక్షంగా పలు వేదికలపై మాట్లాడుతున్నారు. తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కూడా ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలోని నటీనటులు ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటామని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని మణిరత్నం అన్నారు. అలాంటి నిర్ణయం సరైనదేనని తాను భావిస్తన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పనిగంటల విషయంలో అలా అడిగే నటీనటులు చిత్రపరిశ్రమలో ఉన్నందుకు తాను సంతోషిస్తున్నట్లు అన్నారు. అలా అడగడంలో తప్పు లేదని ఒక దర్శకుడిగా చెబుతానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మణిరత్నం వ్యాఖ్యలు నటి దీపికా పదుకొణెకు మద్థతుగా ఉన్నాయిని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవ్గణ్ కూడా పనిగంటల విషయంపై మాట్లాడారు. ‘మా’ సినిమా ట్రైలర్ లాంచ్లో మొదట కాజోల్ మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన నటీమణుల వర్కింగ్ అవర్స్ గురించి చెప్పుకొచ్చారు. 8గంటలకు మించి వారు పనిచేయలేరని ఆమె అన్నారు. ఇంతలో అజయ్ దేవ్గణ్ కలుగచేసుకుని ఇలా రియాక్ట్ అయ్యారు. నిజాయతీ ఉన్న దర్శకనిర్మాతలు ఎవరూ కూడా వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరని పేర్కొన్నారు. 8 గంటల పాటు నటీనటులు షూటింగ్లో పాల్గొంటే చాలని వారు అనుకుంటారని ఆయన అభిప్రాయ పడ్డారు. దీంతో వారందరూ కూడా దీపికా పదుకొణెను ఉద్దేశించి ఆమెకు సపోర్ట్గా మాట్లాడారని నెటిజన్లు అనుకున్నారు.దీపికా పదుకొణె కండీషన్స్దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయ్యాయి. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునే మొదట రూ.20కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో షేర్ అడిగినట్లు సమాచారం. రెండోది కేవలం రోజుకు 8గంటలు మాత్రమే కేటాయిస్తానని దీపిక డిమాండ్. అయితే, ఉన్న 8 గంటల్లో అందులో 2 గంటలు జర్నీకే పోతుందని చర్చ. తెలుగు డైలాగ్స్ చెప్పలేనని పేర్కొన్న దీపిక. ఇలా పలు కండీషన్స్ ఉండటం వల్ల దీపికా పదుకొణెను సందీప్ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. -
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ కోసం వేదిక ఫైనల్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్కు వేదిక ఫైనల్ అయిపోయింది. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక కోసం సిద్ధమవుతోంది. జూన్ 8న ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈమేరకు తాజాగా స్వీ యూనివర్సిటీ రిజిస్టార్కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెన్సారు కోసం కాపీ కూడా రెడీ అయిపోయింది. తిరుపతిలో హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8న తారకరామా స్టేడియంలో నిర్వహించడానికి అనుమతులు కోసం దరఖాస్తు. ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టార్ కు లేఖ రాసిన మెగా సూర్య ప్రొడక్షన్. అభిమానులు భారీగా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్న మూవీ టీమ్. చాలా కాలం తరువాత పవన్… pic.twitter.com/4g8fxrX64F— ChotaNews App (@ChotaNewsApp) June 3, 2025 -
'థగ్ లైఫ్ ఆడకూడదు అంటూ వార్నింగ్'
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. -
రజనీకాంత్ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్
సోషల్మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్ అవుతుంది. రజనీకాంత్ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.ఈ ఫోటో 2018 నాటిది. రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్కు రూ. 50 వేలు దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు. దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్కు తెలిపారు. అందుకు స్పందించిన రజనీ.. యాసిన్తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు. రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.This child sitting on the lap of superstar Rajnikanth became an example of honesty in Tamil Nadu. Mohammad Yasin found 50 thousand rupees on the road. He went straight to the police station and gave the money to the police officer and said "I found this money on the road.… pic.twitter.com/Vy4wrozbzO— Gabbar (@Gabbar0099) June 1, 2025 -
అనుష్క 'ఘాటి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) వెండితెరపై కనిపించి రెండేళ్లవుతోంది. ఈసారి ఆమె పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఘాటి చిత్రం (Ghaati Movie)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో తాజాగా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ఘాటి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అనుష్క, విక్రమ్ ప్రభు నదిలో సంచులు మోసుకుంటూ వెళుతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ కృష్ణారెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.'వేదం'తర్వాత అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కలిసిన చేస్తున్న రెండో చిత్రమిది. అనుష్క, UV క్రియేషన్స్తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం. అనుష్క ఈ సినిమాతో పాటు మలయాళంలో కథనార్: ద వైల్డ్ సోర్సరర్ చేస్తోంది. ఇవి కాకుండా మరో నాలుగైదు సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అవేవీ బయటకు చెప్పకుండా అభిమానులను సస్పెన్స్లో ఉంచుతోంది. #Ghaati GRAND RELEASE WORLDWIDE ON JULY 11th ❤🔥#GhaatiFromJuly11th⭐ing @iamVikramPrabhu🎥 Directed by the phenomenal @DirKrish🏢 Proudly produced by @UV_Creations & @FirstFrame_Ent🎼 Music on @adityamusic pic.twitter.com/VGM9A3cpkS— Anushka Shetty (@MsAnushkaShetty) June 2, 2025చదవండి: బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా -
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ రియాక్షన్ ఇదే
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో చాలామంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ వేదికపై నటుడు రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad) చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన అత్యంత నీచమైన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు అలీ కూడా ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రాజేంద్ర ప్రసాద్ గురించి నటుడు అలీ ఇలా అన్నారు. 'ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఉద్దేశపూర్వకంగా అనలేదు. పోరాపాటున మాట తూలింది. కానీ, మీడియా మిత్రులు దానిని వైరల్ చేస్తున్నారు. ఆయనొక మంచి నటుడు, కొద్దిరోజుల క్రితం తనకు అమ్మలాంటి కూతురు మరణం వల్ల పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదు.' అని నటుడు అలీ అన్నారు.రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యల పట్ల తప్పు తెలుసుకుని అలీకి క్షమాపణలు చెబుతారని అందరూ భావించారు. కానీ, ఆయన అలాంటి పనిచేయకుండా తను అన్న మాటలను సమర్ధించుకుంటూ.. మరోసారి తన నోటికి పని చెప్పారు. తాను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని రాజేంద్ర ప్రసాద్ ఇలా వివరణ ఇచ్చారు. 'నా మాటలను అర్థం చేసుకోవడం అనేది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ. దానికి ఎవరూ ఏం చేయలేం. నేనైతే ఇలాగే సరదాగా ఉంటాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by Zubeda Ali (@zubedaspage)Rajendra Prasad Blames Audience:నేను ఇలానే మాట్లాడుతా...తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ సంస్కారం.. pic.twitter.com/dPz8O9aKMo— Movies4u Official (@Movies4u_Officl) June 2, 2025 -
ఛాన్సుల కోసమే అలాంటి పని చేయడం లేదు: నటి
వెండితెరపై గ్లామర్గా నటించడం తప్పా అని చాలా మంది కథానాయికలు ప్రశ్నించారనే విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ నటి 'మాళవిక మీనన్'(Malavika Menon) కూడా అదే అడుగుతోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో ఈ కేరళా కుట్టికి భారీగానే అభిమానులు ఉన్నారు. దీంతో మాతృభాషలో నటిస్తూనే కోలీవుడ్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగులో కూడా 'అమ్మాయిలు అంటే అదో రకం, వందనం' అనే రెండు చిత్రాలతో తన లక్ను చూసుకుంది. కానీ, ఇక్కడ అనుకున్నంతగా ఛాన్సులు రాలేదు. కానీ, మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ అమ్మడు తమిళంలో ఇవన్ వేర మాదిరి, విళా, బ్రహ్మన్, వెత్తువెట్టు, నిజమానిళలా వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అయితే ఈ బ్యూటీ చిత్రాలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రక్రారును ఆకట్టుకుంటుంది. దీంతో చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించే మాళవిక మీనన్ గ్లామర్గా మారడానికి కారణం అవకాశాల కోసమా? అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారని పేర్కొంది. అయితే అలాంటిదేమీ లేదని చెప్పింది. అయినా గ్లామర్గా నటించడంలో తప్పేంటి అని ప్రశ్నించింది. మలయాళ చిత్రాల్లో గ్లామర్గా నటించే అవకాశం ఉండదని, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో అలా నటించవచ్చునని పేర్కొంది. అయినా సామాజిక మాధ్యమాల్లో తన గ్లామరస్ ఫొటోల గురించి అడుగుతున్నారని, తాను మాత్రమే అలా చేస్తున్నానా అని ప్రశ్నించింది. అయినా ఫేక్ అకౌంట్లతో అవాస్తవాలు రాస్తూ ముఖం చూపడానికి భయపడే వారు సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని మాళవిక వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) -
రీరిలీజ్లో ఆల్టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ!
'ఖలేజా' సినిమా (Khaleja Movie)తో నిండా మునిగాడు నిర్మాత సింగనమల రమేశ్. కొమురం పులి, ఖలేజా సినిమాలతో ఏకంగా రూ.100 కోట్లు నష్టపోయానని ఆ మధ్య తన బాధను వ్యక్తం చేశాడు. మహేశ్బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ఖలేజా సినిమా షూటింగ్ జాప్యం ఒక కారణమైతే ప్రేక్షకులు దాన్ని డిజాస్టర్గా మల్చడం మరో కారణం. కానీ ఆ సినిమా ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తుండటం విశేషం!అప్పుడలా.. ఇప్పుడిలా..2010లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఖలేజా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు బాగానే చూసేవారు. అసలే కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బిజినెస్మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోకిరి, ఒక్కడు.. ఇలా మహేశ్ సినిమాలే చాలావరకు రీరిలీజ్ అయ్యాయి. తాజాగా మహేశ్ తండ్రి, సూపర్స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఖలేజాను 4కె వర్షన్లో రీరిలీజ్ చేశారు.నీ వల్ల అవుద్ది సామిఇంకేముంది, మరోసారి జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొత్త సినిమాలను సైతం పక్కకు నెట్టి ఖలేజా సినిమాను వీక్షిస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.11.83 కోట్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రీరిలీజ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రంగా ఖలేజా నిలిచింది. ఇది చూసిన అభిమానులు.. ఈ రికార్డులన్నీ కేవలం నీ వల్లే అవుతాయి సామి అంటూ కామెంట్లు చేస్తున్నారు.త్వరలోనే మరో రీరిలీజ్ఖలేజా సినిమాలో మహేశ్బాబుకు జంటగా హీరోయిన్ అనుష్క నటించింది. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, సునీల్, షఫీ, అలీ, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించాడు. అతడు తర్వాత త్రివిక్రమ్- మహేశ్ డైరెక్షన్లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్, ఉత్తమ గేయరచయిత విభాగంలో రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు అందుకుంది. ఇకపోతే మహేశ్బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న అతడు చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయనున్నారు. Raju’s Rage is Real, Box-Office Numbers are Surreal 🥵#Khaleja4K smashes records as the first Telugu re-release to cross ten crore, raking in ₹11.83 crore in just 3 days💥💥@urstrulyMahesh #RecordBreakingKhaleja4K pic.twitter.com/vjV0Zbtzcg— Khaleja4K (@KhalejaTheFilm) June 2, 2025చదవండి: నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు -
ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!: యాంకర్ రవి
యాంకర్ రవి (Anchor Ravi).. బుల్లితెరపై ఎన్నో షోలు చేసే ఇతడు తాజాగా ఓ షోకి గెస్టుగా వెళ్లాడు. ఆహాలో తేజస్వి యాంకర్గా చేస్తున్న కాకమ్మ కథలు షోలో హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. యాంకర్ రవి మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల నాకు మంచి కుటుంబం దొరికింది. మా నానమ్మకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతం వచ్చు. అలా తను వేరేవాళ్లకు పాఠాలు చెప్పేది. అయితే ఈ కళపై ఆధారపడితే డబ్బు సంపాదించలేనని నాన్న అనేవాడు.దేశభక్తి..నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మిలిటరీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ కల్నల్ ఇల్లు చూపించాడు. ఆర్మీ ఆఫీసర్ అయితే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా.. అన్నాడు. నీకు గౌరవం, డబ్బు కావాలంటే ఆర్మీలో చేరాలన్నాడు. ప్రతి ఆదివారం అక్కడకు తీసుకెళ్లి.. మొదటి ప్రాధాన్యత దేశం.. తర్వాతే ఏదైనా అని నాకు దేశభక్తి నూరిపోశాడు. ఇంటర్ తర్వాత అందరూ ఇంజనీరింగ్ అని వెళ్తే నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లాను. ఎగ్జామ్లో పాసై, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి అకాడమీలో చేరాను.ఆర్మీ శిక్షణ మధ్యలో వదిలేశా..పుణెలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఉదయం నాలుగు గంటలకు శిక్షణ మొదలయ్యేది. మూడు నెలలకోసారి సెలవులిచ్చేవారు. 11 రోజులపాటు ఇంటికెళ్లి మళ్లీ ట్రైనింగ్లో చేరేవాళ్లం. రెండేళ్ల తర్వాత ఓసారి ఇంటికి వచ్చినప్పుడు మా నానమ్మ నన్ను వదిలిపెట్టలేదు. ఆమె ప్రేమను చూశాక నేను తిరిగి వెళ్లనని చెప్పాను. జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆర్మీ శిక్షణను మధ్యలో వదిలేయడమే! నానమ్మ ప్రేమను కాదనుకుని వెళ్లిపోయుంటే లైఫ్ మరోలా ఉండేది. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటాను అని రవి చెప్పుకొచ్చాడు.చదవండి: హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ -
అడివి శేష్ గ్యాప్ కి కారణం ఇదేనా..!
-
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఈ వారం ఏకంగా 22 చిత్రాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ థగ్ లైఫ్ ఒక్కటే కాస్తా బజ్ ఉన్న సినిమా. ఆ తర్వాత తెలుగులో వస్తోన్న శ్రీ శ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్, బద్మాషులు లాంటి చిత్రాలు ఆసక్తిగా పెంచుతున్నాయి. బాలీవుడ్ నుంచి హౌస్ఫుల్-5 కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.అయితే ఈ వారం ఓటీటీల విషయానికొస్తే రజినీకాంత్ లాల్ సలామ్, జింఖానా, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి వచ్చేస్తున్నాయి. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది. ఈ సిరీస్లో రీతూ వర్మ, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇవీ మినహయిస్తే ఓటీటీల్లో అంతగా చెప్పుకొదగ్గ సినిమాలేవీ రావడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్తో పాటు దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02క్రిమినల్ కోడ్- సీజన్ 4- జూన్ 04వన్ ఆఫ్ దెమ్ డేస్- (హాలీవుడ్ మూవీ) - జూన్ 04జిన్నీ అండ్ జార్జియా- సీజన్-3 - జూన్ 05టైర్స్ - సీజన్-2- జూన్ 05జాట్ (హిందీ మూవీ) - జూన్ 05 (రూమర్ డేట్)మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ- జూన్ 06స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06అమెజాన్ ప్రైమ్స్టోలెన్- జూన్ 04సన్ నెక్ట్స్లాల్ సలామ్- జూన్ 06జియో హాట్స్టార్టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02గజానా (హిందీ) - జూన్ 02దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06జీ5చాట్ కపట్- ది డిసెప్షన్ (హిందీ)- జూన్ 06సోనీ లివ్..అల్లప్పుజా జింఖానా- జూన్ 05మహారాణి- సీజన్-4- జూన్ 06లయన్స్గేట్ ప్లేరెడ్-2- అడ్వంచర్ మూవీ- జూన్ 0612 స్ట్రాంగ్- హాలీవుడ్ మూవీ- జూన్ 06హై ఫోర్సెస్- హాలీవుడ్ మూవీ- జూన్ 06కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06యాపిల్ టీవీ ప్లస్స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04 -
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్?అలా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. 'హైదరాబాద్లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు. నా కష్టార్జితం..నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను' అని రకుల్ చెప్పుకొచ్చింది.సినిమారకుల్ ప్రీత్.. 'కెరటం' సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, పండగ చేస్కో, కిక్ 2, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్, ఇండియన్ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్ -
ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుశ్పై ప్రశంసలు కురిపించారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. టఈ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డ్ అందుకుంటారు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా. అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు" అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. "ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. ధనుష్, శేఖర్ కమ్ముల.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు" అంటూ ప్రశ్నించారు. -
హాస్య నటుడు అలీని అనరాని మాట అన్న రాజేంద్ర ప్రసాద్
-
త్వరలో స్కై
‘‘స్కై’లో ప్రతిభ గల టీమ్తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి కథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మురళీ కృష్ణంరాజు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వంలో మురళీ కృష్ణంరాజు, శ్రుతీ శెట్టి జంటగా నటించిన సినిమా ‘స్కై’. నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీలక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్గా నాకు ఇది తొలి చిత్రం. ‘స్కై’ ప్రీమియర్ చూసినవారు చాలా బాగుందని చెప్పారు. మా సినిమాని ఆదరిస్తే ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం’’ అన్నారు. ‘‘ఒక కాంపాక్ట్ బడ్జెట్లో పర్ఫెక్ట్గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా ‘స్కై’ ఓ ఉదాహరణ’’ అని సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ చెప్పారు. -
మేఘాలు చెప్పిన ప్రేమ కథ
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జోడీగా నటించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Chappina Prema Katha). విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విపిన్ మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమాలో సంగీత విద్వాంసులు ప్రిన్స్ రామవర్మ, ట్రావెల్ కోర్ వారసులు అతిథి పాత్రలు చేశారు’’ అన్నారు. ఉమాదేవి కోట మాట్లాడుతూ– ‘‘నాకు కథలు రాయడం ఇష్టం.నా జీవితంలో కె. విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగార్లను కలవడం ఓ భాగ్యం. ఇంట్లో వాళ్ల సపోర్ట్తో ఈ బ్యానర్ని స్థాపించా. ప్రతి సినిమాలో కళని కనెక్ట్ చేయాలనేది నా ఆశ. అందుకే ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ని సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేలా తీశాం. ఈ సినిమాను సిరివెన్నెలగారికి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘పాటలు చక్కగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్. కెమేరామేన్ మోహన్ కృష్ణ మాట్లాడారు. -
కామెడీ... మిస్టరీ
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా, ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించారు. సునీత, రాజ్కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కేఎస్కే చైతన్య మాట్లాడుతూ– ‘‘కామెడీ, మిస్టరీ, ఎమోషన్... ఇలా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’.సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఓ కొత్త లోకంలో ఉంటారు. వారికి సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథతో ‘గ్యాంబ్లర్స్’ తీశాం’’ అని రాజ్కుమార్ బృందావనం తెలిపారు. సునీత మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సంగీత్ శోభన్ నటన చాలా కొత్తగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మా చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తోంది’’ అని చెప్పారు. -
నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నా సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లందరూ స్వతహాగా ప్రతిభ ఉన్నవారు. నా చిత్రాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేకానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం (జూన్ 1) హైదరాబాద్లో ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ, అండగా నిలబడిన నిర్మాత అచ్చిరెడ్డిగారికి కృతజ్ఞతలు.దర్శకుడిగా నాకు తొలి చాన్స్ ఇచ్చిన హీరో రాజేంద్రప్రసాద్గారికి థ్యాంక్స్’’ అన్నారు. నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ– ‘‘కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో చేసిన ‘శుభలగ్నం’ చిత్రం నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఆయన సృజనాత్మకతలో ఎంత ముందు చూపు ఉందో ఊహించుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ వేడుకల్లో మురళీమోహన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, అలీ, బండ్ల గణేశ్, లయ, ఇంద్రజ, ఆమని, సుచిత్రాచంద్రబోస్ తదితరులు పాల్గొని, ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
'పాడేరు 12వ మైలు' సినిమా జూన్ 6న రిలీజ్
సత్యం రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పాడేరు 12వ మైలు'. ఎన్.కె దర్శకత్వం వహించారు. గ్రంధి త్రినాధ్ నిర్మాత. సుహాన హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం విశేషాలని పంచుకుంది.ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాం. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెన్స, లవ్ ఎలిమెంట్స్ తో రాబోతోందని దర్శకుడు ఎన్.కె చెప్పుకొచ్చారు. హైదరాబాద్, వైజాగ్, పాడేరులో షూటింగ్ జరిగిన ఈ సినిమాకు పీఆర్ సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి. -
'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్
నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'చౌకీదార్'. తెలుగు, కన్నడ భాషల్లో తీస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. డా. కల్లహల్లి చంద్ర శేఖర్ ఈ మూవీ నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది. తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 ఏడాదిగానూ సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా 'పాఠశాల' చిత్రం ఎంపికైంది.మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన 'పాఠశాల' చిత్రాన్ని రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 2014 ఏడాది సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా గద్దర్ సినీ అవార్డ్కు ఎంపికైంది.ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారానికి పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 'పాఠశాల' చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోందని అన్నారు. -
రవితేజ తో అదిదా సర్ ప్రైజ్ అంటున్న కేతికా శర్మ..
-
శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది
యంగ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఇంట్లో సెలబ్రేషన్స్ అని కొన్ని ఫొటోలు చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందా? పెళ్లెప్పుడు? అబ్బాయి ఎవరు? అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. ఇంకా ఊరుకుంటే ఇది చాలా దూరం వెళ్తుందేమోనని ఊహించిన శ్రీలీల.. మొత్తానికి ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చేసింది.'నా ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఇట్లో మేం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా అమ్మ చూసుకున్నారు' అని శ్రీలీల చెప్పింది. దీంతో పాటు ఓ నాలుగైదు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకల్లో నటుడు రానా భార్య మిహిక పాల్గొనడం విశేషం.(ఇదీ చదవండి: పరమశివుడిగా సూపర్స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?)ఈ ఫొటోలు చూసి శ్రీలీల ఎంగేజ్మెంట్ అని అందరూ అనుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఈమె.. సదరు హీరోతో డేటింగ్లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలీల తాజా ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. వరస సినిమాలు చేసింది. చివరగా 'రాబిన్ హుడ్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్'లో నటిస్తోంది. అలానే పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి!
అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్కు వెళ్లినప్పుడు ఓ హోటల్ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్ సారీ చెప్పాడు. అందుకు శంకర్.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్ కూతుర్లు చాలా సింపుల్గా ఉంటారంటూ మహేశ్బాబు ఈ సంఘటనను అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు.మహేశ్కు సారీ చెప్పిన శంకర్ కూతుర్లుతాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్ (Aditi Shankar) ఓ యూట్యూబ్ ఛానల్లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. అక్కడ మహేశ్బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం. వీడియో వైరల్అప్పుడు మహేశ్ బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్ రమేశ్ను మహేశ్కు బాడీగార్డ్ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు. Finally hearing from @shankarshanmugh daughter about her funny experience with @urstrulyMahesh.Papam @MeherRamesh ni body guard anukundi 😂😂#MaheshBabu #Khaleja4K #ssmb29 pic.twitter.com/TfzfBLePGo— 👌🌟Ⓜ️🅱️2️⃣9️⃣ (@SPYderLoading) May 31, 2025 చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..! -
పరమశివుడిగా సూపర్స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?
సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'జటాధర' మూవీ యూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. ఈ క్రమంలో కృష్ణని స్మరించుకుంటూ ఆయన పరమశివుడు రూపంలో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'హ్యాపీ బర్త్డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా' అని రాసుకొచ్చారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'జటాధర' సినిమా షెడ్యూల్ రీసెంట్గా పూర్తి చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)పాన్ ఇండియా మూవీగా తీస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సుధీర్ బాబు హీరో కాగా సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న జటాధర చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుంటోంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) -
కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కమెడియన్ అలీ (Comedian Ali) ఆప్తమిత్రుడు. ప్రతి ఏడాది వేసవికి అలీతో పాటు బ్రహ్మానందానికి ఓ బహుమతి పంపిస్తుంటారు. అవే మామిడి పండ్లు. ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఫామ్హౌస్లో పండిన మామిడి పండ్లను ఈసారి కూడా అలీకి పంపించాడు. అవి చూసి అలీ దంపతులు మురిసిపోయారు.ఈసారి ప్రత్యేకంగా..అయితే ఈసారి వాటికి అదనంగా మరిన్ని బహుమతులు వచ్చాయి. అవే ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్.. వంటి రెడీ టు మిక్స్ పొడులు. వాటన్నింటిని చూసి అలీ భార్య జుబేదా తెగ సంబరపడిపోయింది. చిరంజీవి అన్న తమకోసం ప్రేమగా పంపారని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇన్స్టంట్ వంట..అత్త సురేఖ చేసే వంటల్ని అందరికీ వడ్డించాలన్న సంకల్పంతో ఉపాసన.. అత్తమ్మాస్ కిచెన్ పేరిట గతేడాది ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే! ఇక్కడ పచ్చళ్లతో పాటు అప్పటికప్పుడు ఈజీగా వంటలు చేసుకునేలా రెడీ టు మిక్స్ పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి. చిరు సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా భోళా శంకర్ (2023) సినిమాలో నటించాడు. ఏడాదిగా వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా (#Mega157) చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Zubeda Ali (@zubedaspage) చదవండి: ప్రాణాలతో చెలగాటమాడే గేమ్.. ఫైనల్ సీజన్ ట్రైలర్ చూశారా? -
ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్ను షేర్ చేసింది. శుభం కథేంటంటే..వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది.ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. This June 13th, katha aarambham on JioHotstar 💫 Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025 -
సినిమా హిట్టయినా అవకాశాలు నిల్.. దానిపైనే ఫోకస్ పెట్టిన బ్యూటీ
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం... తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. మాతృ భాష ఏదంటే?అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.ఆచితూచి..‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!హిట్ అయినా అవకాశాలు నిల్మలయాళంలో టొవినో థామస్తో చేసిన ‘ఎఆర్ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
సక్సెస్ అంటే...
నార్నే నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాలో సంపద హీరోయిన్. చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సతీష్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చదు’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎన్టీఆర్గారు ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు’’ అన్నారు చింతపల్లి రామారావు. -
నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తి అవి: మంచు మనోజ్
‘‘తొమ్మిదేళ్ల తర్వాత ‘భైరవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను. ఈ చిత్రంలో నా వాయిస్, డిక్షన్ మా నాన్నగారిలా (మోహన్బాబు) అనిపించిందంటున్నారు. ఇది కావాలని ట్రై చేయలేదు. అది డీఎన్ఏ. అవి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి’’ అని మంచు మనోజ్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.విజయ్ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ‘బ్లాక్ బస్టర్ బీభత్సం’ పేరుతో నిర్వహించిన ప్రెస్మీట్లో విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘ముగ్గురు హీరోలని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. కానీ, కథలో మూడు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. ముగ్గురు హీరోలకి ఇది మంచి కమ్ బ్యాక్ అని ఆడియన్స్ చెప్తుంటే హ్యాపీగా అనిపించింది’’ అన్నారు.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా నటనకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది నా కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూవీ’’ అని చెప్పారు. ‘‘ఇంత మాస్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు’’ అని పేర్కొన్నారు నారా రోహిత్. ‘‘ముగ్గురు హీరోలతో సినిమా చేసి, హిట్ సాధించాను. ఇక రీ రిలీజ్ సినిమాలను శుక్రవారం కాకుండా సోమవారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీనిపై చర్చలు జరగాలి’’ అని కేకే రాధామోహన్ చెప్పారు. -
బ్యాచిలర్ కష్టాలు
నటుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రవీణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించారు. ఎస్జే మూవీస్పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.వికాస బడిస సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నా అంగీ జాతీయం... నీ లుంగీ జాతీయం...’ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బ్యాచిలర్ కష్టాలు, బ్యాచిలర్ లైఫ్లో ఉండే ఆనందాలను తెలియజేస్తూ విష్ణువర్థన్ రాసిన ‘నా అంగీ జాతీయం..’పాటని అనురాగ్ కులకర్ణిపాడారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కథా చర్చల్లో..?
‘‘కొన్ని క్షణాలు మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్గారితో సమయం గడపడం అలాంటిదే. ఆయన జ్ఞానం, వినయం, ఆలోచనల్లోని స్పష్టత నిజంగా స్ఫూర్తిదాయకం’’ అంటూ పూరి కనెక్ట్స్ ‘ఎక్స్’ ఖాతాలో విజయేంద్ర ప్రసాద్, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు ఈ సంస్థ ప్రతినిధులు. దాంతో రచయిత విజయేంద్ర ప్రసాద్–దర్శకుడు పూరి జగన్నాథ్ ఎందుకు కలిశారు? అనేది హాట్ టాపిక్గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా కథా చర్చల కోసమే విజయేంద్ర ప్రసాద్ని పూరి కలిశారనే ఊహాగానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. జూన్ చివర్లో చిత్రీకరణను ప్రారంభించేందుకు హైదరాబాద్, చెన్నై లొకేషన్స్ను రెక్కీ చేస్తున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగానే విజయేంద్ర ప్రసాద్ను పూరి జగన్నాథ్ కలిసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
చిరంజీవితో శేఖర్ కమ్ముల.. ఇది చాలా స్పెషల్
తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్. చాలా సాధారణంగా అనిపించే కథలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతుంటారు. ప్రస్తుతం 'కుబేర' అనే చిత్రాన్ని రిలీజ్కి సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఓ విషయమై కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: హైదరాబాద్ పబ్లో తెలుగు నటి కల్పిక రచ్చ రచ్చ)'టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. 'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్ అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు. 'లెట్స్ సెలబ్రేట్' అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. 'ఛేజ్ యువర్ డ్రీమ్స్, సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది' అన్న నమ్మకం ఇచ్చింది ఆయనే''కాబట్టి నా 25 ఏళ్ల జర్నీ సెలబ్రేషన్స్ అంటే ఆయన దగ్గరే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సరే ఈ మూమెంట్స్లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు' అని శేఖర్ కమ్ముల తన ఆనందాన్ని అక్షరాల రూపంలో రాసుకొచ్చారు. 'డాలర్ డ్రీమ్స్' సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా చాలా మంచి సినిమాల్ని అందించారు. జూన్ 20న 'కుబేర'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు) View this post on Instagram A post shared by Sekhar Kammula (@kammula.sekhar) -
హైదరాబాద్ పబ్లో తెలుగు నటి హంగామా.. వీడియో వైరల్
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కల్పిక గణేశ్.. తాజాగా ఓ వివాదంలో నిలిచింది. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్కి వెళ్లింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులు, ఈమెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెబుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)అయితే గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో నటిపై పబ్ సిబ్బంది దాడి చేశారని అంటున్నారు గానీ అందుకు తగ్గ ఫొటోలు, వీడియోలు ఏం బయటకు రాలేదు. దీంతో దాడి నిజంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఆఫర్స్ లేవు. ఇలాంటి ఈ టైంలో వివాదం ద్వారా వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం) View this post on Instagram A post shared by iamkalpika (@iamkalpika27) -
భారీ బడ్జెట్ పేరుతో ప్రజలపై భారం వేయకండి: నారాయణమూర్తి
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి తెలిపారు. విడుదలైన ప్రతి సినిమాకు అలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. క్రమేపి వారు థియేటర్కు వచ్చి సినిమా చూడటం తగ్గిస్తారని సూచించారు. చవకగా దొరికే వినోదం ఇప్పుడు చాలా ఖరీదుగా మారిపోయందని అభిప్రాయపడ్డారు. ఇకనుంచి అయినా సరే టికెట్ ధరలు పెంపు అంశంపై అందరూ ఒకసారి పరిశీలించాలని ఆయన కోరారు.'భారీ ఖర్చుతో సినిమాలు తీయడం మంచిదే. కానీ, ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో ఐదేళ్ల పాటు లవకుశ తీశారు, ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమాలు బాగుంటే తప్పకుండా జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడలేని పరిస్థి వస్తుంది.' అని ఆర్ నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ కోసం గద్దర్ అవార్డులను ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. -
'హరి హర వీరమల్లు'తో పక్కదారి పట్టించారు: ఆర్ నారాయణమూర్తి
జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉంటుందని ప్రకటన వచ్చిన తర్వాత చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఎంట్రీతో చిత్ర పరిశ్రమ ఆ నిర్ణయాన్ని సడలించుకుంది. తాజాగా ఇదే అంశంపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పలు వ్యాఖ్యలు చేశారు.మల్టీఫ్లెక్స్ మాదిరే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అయితే, కొందరు అసలు విషయాన్ని దాటేసి ఇదంతా 'హరి హర వీరమల్లు' సినిమాకు నష్టం చేసేందుకు కుట్ర అంటూ తెరపైకి తీసుకురావడం చాలా దుర్మార్గం అని పేర్కొన్నారు. సింగిల్ థియేటర్స్ మనుగడ కోసమే వారు బంద్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఇలా అన్నారు. 'నేను చాలా ఏళ్ల క్రితమే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ సిస్టమ్ ఉండాలని, లీజ్ సిస్టమ్ వద్దని కోరాను. చాలామంది నిర్మాతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజీలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కల్యాణ్పై ఎవరు కుట్ర చేస్తారు..? పవన్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం.. రావాలని పిలిస్తే పవన్పై గౌరవం మరింత పెరిగేది. పర్సంటేజీ సిస్టమ్ అన్ని థియేటర్స్కు లేకపోవడం వల్ల నిర్మాతలు అందరూ నాశనం అయిపోతున్నారు. సింగిల్ థియేటర్స్ మూత పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ల మాదిరే వాటికి కూడా ఇదే పద్ధతి ఉండాలి. దీని కోసం మేము చాలా ఏళ్లపాటు పెద్ద ఉద్యమం చేశాం. థియేటర్స్ 'లీజ్ సిస్టమ్' వల్ల తీరని నష్టం జరుగుతుంది. దీనిని అందరూ గుర్తించాలి. 'బంద్ అనేది బ్రహ్మాస్తం లాంటిది. సింగిల్ థియేటర్ల మనుగడ నేడు ప్రశ్నార్థకరమైంది. భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పర్సంటేజి అంశాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్లకు వంతపాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. కానీ, నేడు సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి. ఇదే జరిగితే ప్రేక్షకులు ఓటీటీలలోనే సినిమాలు చూస్తారు. ఆ పొరపాటు జరిగితే ఇండస్ట్రీ నాశనమవుతుంది. పవన్ సినిమా రిలీజ్ అవుతుందటే థియేటర్స్ బంద్ చేయడం చాలా దుర్మార్గం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మాటలు చాలా తప్పు. ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.' అని నారాయణమూర్తి అన్నారు. -
శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపై ప్రకటన చేశారు. తాజాగా తను నటించిన కొత్త సినిమా భైరవం విడుదలైంది. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లి ప్రస్థావన రావడంతో అందుకు క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవంగా నారా రోహిత్ పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయింది. కానీ, తన తండ్రి మరణం వల్ల వాయిదా వేసుకున్నారు.నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి. అయితే, ఇప్పుడు నారా రోహిత్ పెళ్లి టైమ్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్లో ఒకరిగా ఫుల్ జోష్లో ఉన్న శ్రీలీల(Sreeleela) త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెట్టింట వైరల్ అవుతుంది. అందుకు కారణం తాజాగా సోషల్మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో, ఫోటోలే అని తెలుస్తోంది. కొంత సమయం క్రితం శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఫోటోలు పంచుకుంది. తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు 'బిగ్ డే' అంటూనే పూర్తి వివరాలు 'కమింగ్ సూన్' అంటూ హింట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేసి.. సైలెంట్గా శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందని త్వరలో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, అసలు విషయం నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు ఉంది. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం ఉంది. ప్రతి ఏటా ఆమెకు ఇది అలవాటుగా చేస్తారని టాక్. పుట్టినరోజు సెలబ్రేషన్స్ను ఈరోజుల్లో కూడా తిధుల ప్రకారం ఇలా జరుపుకునే వాళ్లు ఉన్నారా..! అదీ హీరోయిన్ జరుపుకోవటం వింతగా ఉందని కొందరు చెబుతున్నారు.ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు పూర్తిగా ప్రకటించలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు 'బిగ్ డే' అంటూ.. హింట్ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చని అంటున్నారు. మరోవైపు ఆమె పుట్టినరోజును ఇలా సెలబ్రేట్ చేసుకుందని కూడా సమాచారం ఉంది. ఫోటోలు షేర్ చేసే సమయంలో కాస్త క్లారిటీగా విషయం చెబితే బాగుంటుంది కదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్ వచ్చింది. కార్తిక్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం జరిగిన ‘ఐఫా’ (IFFA) వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం' అని ఆమె చెప్పారు. శ్రీలీల నటి మాత్రమే కాదు ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదువుతుంది. హీరో తల్లి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
బక్రీద్ కానుకగా ఓటీటీలో 'లాల్ సలామ్'.. అధికారిక ప్రకటన
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ 'లాల్ సలామ్'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారుబక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్ నెక్ట్స్(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్ మొదట నెట్ఫ్లిక్స్తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ ఢీల్ను క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.కథేంటంటే'లాల్ సలామ్' కథ మొత్తం 1990ల కాలం బ్యాక్డ్రాప్తో నడుస్తోంది. మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్).. దాడి చేసిన గురు కూడా మొయిదీన్ భాయ్కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్ లివింగ్స్టోన్) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్ట్స్లో లాల్ సలామ్ చూడాల్సిందే. -
అవార్డులు గౌరవం ఇస్తాయి: మురళీమోహన్
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి. ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం. అంతేకానీ డబ్బుల గురించి కాదు... అవార్డు లనేవి గౌరవం ఇస్తాయి’’ అని నటుడు, నిర్మాత మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Telangana Film Awards) (2014–2023)కి సంబంధించి జ్యూరీ చైర్మన్గా మురళీమోహన్ వ్యవహరించారు. జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.ఈ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని ఎఫ్డీసీ కార్యాలయంలో మురళీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఈ పదేళ్లల్లో ముఖ్యమంత్రులందర్నీ కలిసి విన్నవించాం. అప్పుడు అందరూ ఇద్దాం, చేద్దాం అన్నారు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగారు ఓ స్ఫూర్తితో ప్రజాగాయకుడు గద్దర్గారి పేరిట ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ని ప్రకటించడం సంతోషం. ఈ కమిటీకి ‘దిల్’ రాజుగారు నన్ను చైర్మన్ని చేశారు.మా జ్యూరీలో అందరూ అనుభవం ఉన్నవారిని, సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారు. అందరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతోనే అవార్డులు ఎంపిక చేశాం. గురువారం సాయంత్రం ఈ అవార్డుల జాబితాను రేవంత్ రెడ్డిగారికి సమర్పించాం. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ అవార్డుల ప్రదానానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డిగారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి అవార్డుల ప్రదానం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని, ఒక అవగాహనకు రావాలి. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుంది. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు’’ అని పేర్కొన్నారు.తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు అవార్డుల చొప్పున (తొలి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం) ఈ పదేళ్లకు సంబంధించిన సినిమాలను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారి ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. అలాగే ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డుల్లో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డు (రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు) లతోపాటు అదనంగా తెలంగాణకి చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనున్నాం. జూన్ 14న 2024కి సంబంధించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’తోపాటు ఈ పదేళ్లకి సంబంధించిన అవార్డులను కలుపుకుని మొత్తం 11 ఏళ్లకి సంబంధించి అదే రోజు ప్రదానం చేస్తాం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు కె. దశరథ్, డీవీకే రాజు, ఊహ, ఉమామహేశ్వర రావు, వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డా. హరీశ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డుకి ఎంపికైన చిత్రాలు2014 1. రన్ రాజా రన్ 2.పాఠశాల 3. అల్లుడు శీను 2015 1. రుద్రమదేవి 2. కంచె 3. శ్రీమంతుడు 2016 1. శతమానం భవతి 2. పెళ్ళి చూపులు 3. జనతా గ్యారేజ్ 2017 1. బాహుబలి 2, 2. ఫిదా 3. ఘాజీ 2018 1. మహానటి 2. రంగస్థలం 3. కేరాఫ్ కంచరపాలెం 2019 1. మహర్షి 2. జెర్సీ 3. మల్లేశం 2020 1. అల వైకుంఠపురములో.. 2. కలర్ ఫోటో 3. మిడిల్ క్లాస్ మెలోడీస్ 2021 1. ఆర్ఆర్ఆర్ 2. అఖండ 3. ఉప్పెన 2022 1. సీతారామం 2. కార్తికేయ 2 3. మేజర్ 2023 1. బలగం 2. హనుమాన్ 3. భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డు: ప్రజాకవి కాళోజీ ప్రత్యేక అవార్డులు... ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ (హీరో) పైడి జైరాజ్ ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు: మణిరత్నం (డైరెక్టర్) బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్ (డైరెక్టర్) నాగిరెడ్డి–చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు (నిర్మాత) కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ (హీరో) రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత)⇒ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు... ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు... నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు... కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. – హీరో బాలకృష్ణ⇒ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ‘శ్రీమంతుడు, మహర్షి, మేజర్’ సినిమాలకు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా దర్శకులకు, ఈ అవార్డులకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను సెలబ్రేట్ చేసే ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలను ఇన్షియేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.– హీరో మహేశ్బాబు ⇒ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు నేను ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. అదే విధంగా 2016కి సంబంధించి రెండో ఉత్తమ సినిమాగా ‘పెళ్ళి చూపులు’ ఎంపికవడంపై సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకు చెందుతుంది. ఎందుకంటే వారి ప్రేమ, అభిమానాలే నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగమైన నా దర్శక–నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఇతర చిత్రయూనిట్కి థ్యాంక్స్. – హీరో విజయ్ దేవరకొండ⇒ 2015వ సంవత్సరానికిగాను మా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఆనందంగా,ప్రోత్సాహకరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారికి, మిగతా సభ్యులకు కృతజ్ఞతలు. రుద్రమ దేవిగా అనుష్క అద్భుతంగా నటించారు. గోన గన్నారెడ్డిపాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తెర ముందు, తెర వెనక మా చిత్రానికి వెన్నెముకగా నిలిచారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – దర్శక–నిర్మాత గుణశేఖర్⇒ తెలుగు సినిమా మార్గదర్శకులలో బీఎన్ రెడ్డిగారు ఒకరు. ఆయన పేరు మీద అవార్డు అందుకోనుండటం చాలా గౌరవం. నన్నెంతగానో స΄ోర్ట్ చేస్తున్న నా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ జ్యూరీకి నా ధన్యవాదాలు. – దర్శకుడు సుకుమార్ -
అర్జున్ అంబటి హీరోగా 'పరమపద సోపానం'.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పరమపద సోపానం'. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో ఎస్.ఎస్.మీడియా బ్యానర్లో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి నాగ శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి 'భూమ్ భూమ్' అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలోని 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రమోషన్లలో భాగంగా రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో సందడి చేయనుంది.గీతా మాధురి మాట్లాడుతూ.. " పరమపద సోపానంలో 'భూమ్ భూమ్' అనే పాటని పాడాను. నాగ శివ పూరి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మనముందుకు 'పరమపద సోపానం'ని తీసుకొస్తున్నారు. ఈ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్" అని అన్నారు. -
టీవీల్లో పుష్పరాజ్.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం దంగల్ మూవీ రికార్డ్ను మాత్రమే అధిగమించలేకపోయింది. ఇటీవల ఈ మూవీలో నటనకు గానూ అల్లు అర్జున్కు గద్దర్ అవార్డ్ వరించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. జనవరి 30 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో బుల్లితెరపై కూడా సందడి చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత టీవీల్లోనూ పుష్ప-2 ప్రసారమైంది.తాజాగా హిందీ ప్రేక్షకులను కూడా టీవీల్లో అలరించనున్నారు పుష్పరాజ్. ఈనెల 31 వ తేదీన జీ సినిమాలో ప్రసారం చేయనున్నట్లు పుష్పటీమ్ వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జీ సినిమాలో ప్రసారం కానున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. మొదటిసారి బుల్లితెరపై పుష్పరాజ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో టీవీల్లో పుష్ప-2 వీక్షించేందుకు బాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 31 May ki shaam,Har ghar goonjegi ek hi awaaz, Pushparaj!Dekhiye #TVParPehliBaar 'Pushpa 2: The Rule', 31 May, shaam 7:30 baje, sirf #ZeeCinema par. @zeecinema #Pushpa2TheRule #TVParPehliBaar #Pushpa2OnZeeCinema #Pushpa2OnZeeCinemaOn31May #WildFirePushpa… pic.twitter.com/aFarZPGepn— Pushpa (@PushpaMovie) May 30, 2025 -
అలా జరిగి ఉంటే బిన్ లాడెన్ పదేళ్ల ముందే దొరికేవాడు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల రోజుకొక పాడ్కాస్ట్తో అభిమానులను అలరిస్తున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన తరచుగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక సబ్జెక్ట్పై తన పరిశోధన జరిపి ఫ్యాన్స్కు, సినీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే రోటీన్గా కాకుండా ఈ సారి భిన్నమైన అంశాన్ని తీసుకొచ్చారు. ఏకంగా మోస్ట్ వాంటెడ్ పేరుతో ఒసామా బిన్ లాడెన్ చివరి పదేళ్లు ఎలా బతికాడు? అనే విషయాన్ని పంచుకున్నారు. ఎంతోమంది చావుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ చివరికీ భయపడుతూ బతకాల్సి వచ్చిందని అన్నారు.పూరి మాట్లాడుతూ..'పాకిస్థాన్ స్వాట్ వ్యాలీలో స్పీడ్గా వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. ఆ కారులో నీట్గా షేవ్ చేసుకున్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ కారు డ్రైవర్తో ఏదో మాట్లాడిన తర్వాత పోలీసులు వారిని వదిలేశారు. కానీ ఆ కారులో ఉన్నంది ఒసామా బిన్ లాడెన్ అని పోలీసులకు తెలియదు. ఆరోజు గనుక అతన్ని వదలకుండా ఉంటే.. దశాబ్దం ముందే దొరికే పోయేవాడు. అలా తప్పించుకున్న బిన్ లాడెన్ స్వాట్ వ్యాలీ, పెషావర్, హరిపూర్ తర్వాత చివరికీ అబోటాబాద్లో సెటిలయ్యాడు. అతను ఉన్న ఇంటి పేరు వజీరిస్థాన్ హవేలి. దాదాపు చుట్టూ 12-18 అడుగుల ఎత్తున్న గోడలతో మూడు అంతస్తుల ఇల్లు ఇది. తన ముగ్గురు పెళ్లాలు.. 8మంది పిల్లలు.. ఐదుగురు మనవళ్లతో అక్కడే ఉండేవాడు' అని పంచుకున్నారు.ముఖ్యంగా బిన్ లాడెన్ తన చిన్న పెళ్లాంతోనే ఎక్కువగా ఉండేవాడు. ఆ ఇంటికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది కాదు. చెత్త కూడా ఇంట్లోనే కాల్చేసేవారు. తలుపు తీసేవారు కాదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఆ చుట్టుపక్కల వాళ్లకూ తెలియదు. బిన్ లాడెన్కు నాలుగు జతల బట్టలు, ఒక జాకెట్, రెండు స్వెటర్స్ మాత్రమే ఉండేవి. అలా 9ఏళ్లు అజ్ఞాతంలో కాలం వెళ్లదీశాడు. స్పై శాటిలైట్స్ నుంచి తప్పించుకోవడం కోసం బయటకు వచ్చినప్పుడల్లా కౌబాయ్ టోపీ పెట్టుకుని కాంపౌండ్లో తిరిగేవాడు. అతని రైట్ హ్యాండ్ అబు అహ్మద్ అల్ కువైటీ.. అతని స్నేహితుడు అబ్రార్ మాత్రమే లాడెన్తో ఇతరులకు కమ్యూనికేషన్. అలాగే ఇంట్లో అవసరాలు వాళ్లే చూసుకునేవారు' అని పంచుకున్నారు.లాడెన్ తన ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటూ కుందేళ్లు, కోళ్లను పెంచుకుంటూ బతికేవాడు. మనవళ్లతో మొక్కలు నాటించి.. ఎవరిది పొడుగ్గా పెరిగితే వాళ్లకు బహుమతులు ఇస్తానని పోటీలు పెట్టేవాడట. సీక్రెట్ శాటిలైట్ డిష్ పెట్టుకుని టీవీ చూసేవాడట. తన గురించి ఒబామా ఏం మాట్లాడుతున్నాడో అనుక్షణం తెలుసుకునేవాడు. అతడు ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ యానిమేటెడ్ సినిమాలు చూసేవాడు. స్వీట్స్, చాక్లెట్లు అంటే కూడా అతనికి బాగా ఇష్టం. ఒకసారి తన భార్య డెలివరి అవుతుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో తానే స్వయంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. మారువేషంలో ఉన్న బిన్ లాడెన్.. డాక్టర్తో నా భార్య మూగ, చెవిటిది అని అబద్ధం చెప్పాడు. దాంతో ఆమెను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆ రోజు అమాయకంగా ఆస్పత్రిలో కూర్చొన్న బిన్లాడెన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు' అని తెలిపారు.'అల్ఖైదా ఆపరేషన్స్ గురించి అతడు చెబుతుంటే.. కూతుళ్లు కాగితం మీద రాసేవారు. ఆ సమయంలో అల్ఖైదా బలహీనపడటంపై ఎక్కువగా బాధపడేవాడట. ఒకసారి అల్ఖైదా పేరు కూడా మార్చాలని ఆలోచించాడు. తన పిల్లలు, మనవళ్లు స్కూల్కు వెళ్లే అవకాశమే లేదు. దీంతో తానే పాఠాలు చెప్పేవాడు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కంప్యూటర్ ఉండేది. ఏదైనా సమాచారం చేరవేయాలంటే యూఎస్బీ డ్రైవ్స్ వాడేవాడు. ఏళ్ల తరబడి అదే ఇంట్లో అనుక్షణం భయపడుతూ బతికాడు. రోజంతా ఏం చేయాలో తోచక అతని దగ్గరున్న వీడియో కెమెరాతో కోళ్లు, మొక్కలు, అప్పుడప్పుడు ఇంటిపై నుంచి వెళ్తున్న హెలికాప్టర్ దృశ్యాలను రికార్డు చేసేవాడు. ఎందుకంటే పక్కనే పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్ ఉండేది. ఏ హెలికాప్టర్ వచ్చినా భయం వేసేదంట. ఆ తర్వాత సీల్ టీమ్ ఇంట్లో చొరబడి అతడిని చంపిన తర్వాత అక్కడి కంప్యూటర్ నుంచి 4.70 లక్షల ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పోర్న్ వీడియోలు కూడా దొరికాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఎలా చంపాలో వేసిన ప్లాన్స్ అన్నీ సీల్ టీమ్కు దొరికాయి. ఎన్నో వేల మంది చావులకు, సెప్టెంబరు 11 దాడులకు కారణమైన బిన్లాడెన్ తన చివరి పదేళ్లు కష్టాలు పడుతూ, భయపడుతూ బతికాడు. ఇవి బిన్ లాడెన్ గురించి తెలియని కొన్ని విషయాలు' అంటూ పూరి జగన్నాథ్ తన మ్యూజింగ్స్తో వివరిచారు. -
2014-23 వరకు గద్దర్ సినీ అవార్డుల ప్రకటన
-
గద్దర్ అవార్డ్స్.. 2014 నుంచి 2023వరకు ఉత్తమ చిత్రాలు ఇవే
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. జూన్ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు2014- ఉత్తమ చిత్రాలుఉత్తమ చిత్రం- రన్ రాజా రన్ఉత్తమ రెండో చిత్రం - పాఠశాలఉత్తమ మూడో చిత్రం - అల్లుడు శ్రీను2015- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవిరెండవ ఉత్తమ చిత్రం - కంచెమూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు2016- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతిరెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులుమూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్2017- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి: ది కన్క్లూజన్రెండవ ఉత్తమ చిత్రం - ఫిదామూడవ ఉత్తమ చిత్రం - ఘాజీ2018- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహానటిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - రంగస్థలంమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - C/O కంచరపాలెం2019- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహర్షిరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - జెర్సీమూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - మల్లేశం2020- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - అలా వైకుంఠపురములోరెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటోమూడవ ఉత్తమఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్2021- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - RRRరెండవ ఉత్తమ చిత్రం - అఖండమూడవ ఉత్తమ చిత్రం - ఉప్పెన2022- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - సీతా రామంరెండవ ఉత్తమ చిత్రం - కార్తికేయ 2మూడవ ఉత్తమ చిత్రం - మేజర్2023- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం - బలగంరెండవ ఉత్తమ చిత్రం - హనుమాన్మూడవ ఉత్తమ చిత్రం - భగవంత్ కేసరి2024- ఉత్తమ చిత్రాలుమొదటి ఉత్తమ చిత్రం : కల్కీ 2898రెండవ ఉత్తమ చిత్రం : పోటేల్మూడవ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్స్పెషల్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణఎన్టీఆర్ నేషనల్ అవార్డు- నందమూరి బాలకృష్ణపైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నంబి ఎన్ రెడ్డి అవార్డు - దర్శకుడు సుకుమార్నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అట్లూరి పూర్ణచంద్రరావుకాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండరఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్ -
2024 'గద్దర్ అవార్డ్స్'తో ట్రెండ్ అవుతున్న తెలుగమ్మాయి (ఫోటోలు)
-
పోటాపోటీగా..?
-
నటి బ్రిగిడా సాగా..కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
-
వైజాగ్ లో గ్రాండ్గా ‘థగ్ లైఫ్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
పాకిస్థాన్ 10 వీడియోలు.. NIA అదుపులో బయ్యా సన్నీ యాదవ్
తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్లో భాగంగా ఆయన కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్కు వెళ్లారు. అక్కడ పరిస్థితిలు ఎలా ఉంటాయో తన యూట్యూబ్లో చెప్పుకొచ్చాడు. పాక్లో మొదటిరోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్గా షేర్ చేశారు. దానిని చూసిన ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేశారు.పహల్గాం (Pahalgam Terror Attack)లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై భారత్ దాడికి దిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్థాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీసింది. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని వాటితో డబ్చు చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన యూట్యూబ్లో పోస్ట్ చేశారని తెలుస్తోంది.పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందని హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను (Jyoti Malhotra) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు (ISI) మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. ఓసారి చైనాకూ కూడా ఆమె వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఆమె తరహాలోనే బయ్యా సన్నీ యాదవ్కు కూడా ఏమైనా పాక్ అధికారులతో పరిచయాలు ఉన్నాయా..? అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. -
నటుడు రవిమోహన్కు అత్త నోటీసులు
నటుడు రవిమోహన్ (జయం రవి), భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం సీరియల్గా సాగుతోందనే చెప్పాలి. ముందు రవిమోహన్, ఆర్తీ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తమ జీవితంలో వివాదం తలెత్తడానికి కారణం గాయని కెనిషానే కారణం అని ఆర్తిపై విమర్శలు చేశారు. అయితే మీ వివాదంలోకి తనను లాగొద్దని కెనిషా గట్టిగానే హెచ్చరించారు. కాగా రవిమోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాగా తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని రవిమోహన్ ఆయన భార్య ఆర్తికి, అత్త సుజాతలకు నోటీసుల పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్తి తల్లి సినీ,టీవీ సీరియళ్ల నిర్మాత సుజాత తన న్యాయవాది ద్వారా రవిమోహన్కు ఒక నోటీస్ పంపారు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇకపై సోషల్మీడియాలో తప్పుడు పోస్ట్లను షేర్ చేయవద్దన్నారు. అదే నోటీస్ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో రవిమోహన్, ఆర్తీల వ్యవహారం గురించి, వారి వివాహ సమస్యల గురించిన ప్రసారాన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అదేవిధంగా రవిమోహన్, ఆర్తి, ఆమె తల్లి సుజాతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయకూడదని పేర్కొన్నారన్నారు. వీరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి. -
సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్తో తెరకెక్కించనున్న మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ను అధికారికంగా అనౌన్స్ చేశారు. యానిమల్తో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీనే ప్రభాస్కు జోడీగా తీసుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ యానిమల్ చిత్రంలో తన గ్లామర్తో అభిమానులను కట్టిపడేసింది. ఇక ప్రభాస్ సరసన స్పిరిట్లోనూ తన అందాలతో టాలీవుడ్ ప్రియులను అలరించనుంది.అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా హీరో రామ్ చరణ్ దంపతులు పంపిన సర్ప్రైజ్ గిఫ్ట్ను ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సందీప్ రెడ్డికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని జాడీలో పంపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా వైరల్ కావడంతో వావ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
గద్దర్ అవార్డ్స్ ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. 2024 ఏడాదిగానూ ఎంపికైన అవార్డ్ గ్రహీతలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. సృజనాత్మక రంగంలోని ఏ కళాకారుడికైనా, సాంకేతిక సిబ్బందికైనా రాష్ట్ర గుర్తింపు అనేది చాలా విలువైనదని అన్నారు. ఇలాంటి అవార్డులు మరింత ప్రేరణనిస్తాయని రాసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించడం సినీ పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. అవార్డులు విషయంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు. కాగా.. ఇవాళ జయసుధ నేతృత్వంలోనే జ్యూరీ గద్దర్ అవార్డులు-2024 విజేతలను ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డ్ను సొంతం చేసుకున్నారు.ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. Hearty Congratulations to each and every winner of the First #GaddarTelanganaFilmAwards for the year 2024. 👏👏State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity. It’s greatly encouraging to see the Government of…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2025 -
తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు
-
రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!
-
తెలంగాణ గద్దర్ అవార్డులు.. ఉత్తమ సినీ గ్రంథంగా రెంటాల జయదేవ పుస్తకం
రచయిత, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డు వరించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలపై ఆయన రచించిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' అనే పుస్తకం ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది. 2024లో వచ్చిన ఉత్తమ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జయదేవ రచనకు అవార్డ్ లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీ ఈ విషయాన్ని ప్రకటించింది.దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ మన సినిమా... ఫస్ట్ రీల్ పుస్తకం. ఇప్పటికీ మన సినీ చరిత్రలో నమోదు కాకుండా మిగిలిపోయిన అనేక అంశాలను తవ్వి తీసిన అరుదైన రచన ఇది. మూకీ సినిమాల రోజుల నుంచి తెర మీద బొమ్మ మాటలు నేర్చి.. భాషల వారీగా ప్రత్యేక శాఖలుగా విడివడిన టాకీల తొలి రోజుల దాకా మన భారతీయ సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాలో జరిగిన మనకు తెలియని అనేక పరిణామాలను సాక్ష్యాలతో, సవిశ్లేషణాత్మకంగా రాసిన గ్రంథం ఇది. రచయిత జయదేవ శ్రమించి సేకరించిన దాదాపు వందేళ్ల క్రితం అలనాటి పత్రికా సమాచారం, ఫోటోల లాంటి ప్రామాణిక ఆధారాలతో... అరుదైన సమాచారంతో... ఈ సినీ చరిత్ర రచన సాగింది.తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం కాళిదాస్(1931)పై అనేక కొత్త సంగతులను రెంటాల జయదేవ ఇందులో తవ్వితీశారు. నిజానికి, అది ఒక సినిమా కాదనీ.. మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారమనీ, అందులో ప్రధాన భాగమైన ‘కాళిదాస్’ కథాచిత్రం మాత్రం 4 రీళ్ల నిడివిలో పూర్తిగా తెలుగులోనే తీసిన లఘుచిత్రమని తెలిపారు. అలనాటి సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించారు. తమిళులు దాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే... పూర్తి తెలుగు డైలాగులు ఆ సినిమాను తెలుగువాళ్లం మన సినీ చరిత్ర లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామని గుర్తుచేశారు. అలా మనం విస్మరిస్తున్న మన తొలినాళ్ల తెలుగు సినీచరిత్రను అక్షరబద్ధం చేశారు.హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీసీమల్లో వచ్చిన మొట్టమొదటి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ రచనలో జయదేవ అందించారు. అత్యంత అరుదైన దాదాపు 2 వేల పత్రికా ప్రకటనలు, ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 90 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక పుస్తక ప్రచురణ సంస్థ ఎమెస్కో 566 పేజీల ఈ బృహత్ రచనను ప్రచురించింది. ఈ పుస్తకం పండిత, పామరుల ప్రశంసలందుకొని, ప్రామాణిక చరిత్ర గ్రంథంగా పాఠక లోకంలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపికైంది.ఆనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. అలనాటి వారు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల నుంచి కూడా ఎంతో విలువైన సమాచారాన్ని జయదేవ సేకరించి మన సినిమా... ఫస్ట్ రీల్ అనే పుస్తకంలో పొందుపరిచారు. పైపైన వివరాలకు పరిమితం కాకుండా సినిమాల రూపకల్పన, అందుకు జరిగిన కసరత్తు, నటీనటుల ఎంపిక, వాటి విడుదలకు నిర్మాతలు పడిన పాట్లు, అనేక పరిమితుల మధ్యనే ఆనాటి దర్శకులు చూపిన సృజనశీలత, అప్పటి సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాల తీరు, సినిమా వ్యాపారం జరిగే పద్ధతులు, కాలానుగుణంగా వచ్చిన పరిణామాలు... అన్నీ ఈ రచనలో కళ్లకు కట్టినట్లు వివరించారు.తెలుగునాట రచయితగా, పరిశోధకుడిగా, పత్రికా రంగంలో ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా ప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల పైగా నిరంతరాయంగా ఆయన తన రచనలతో ప్రత్యేక కృషి చేస్తున్నారు. తండ్రి గారైన ప్రముఖ అభ్యుదయ కవి, దాదాపు 200 పుస్తకాలు రాసిన గ్రంథకర్త, జర్నలిస్టు, కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ సాహితీ, పత్రికా వారసత్వాన్ని జయదేవ పుణికిపుచ్చుకున్నారు. పాత తరం పత్రికా విలువల జెండాను కొత్త తరంలో ముందుకు తీసుకువెళుతున్న అతి కొద్దిమంది నిఖార్సయిన జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. జయదేవ పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకూ, పరిశ్రమ వారికీ సుపరిచితం. ఆపకుండా చదివించే ఆయన రచనలు పాఠకుల్ని ఆకట్టుకోవడమే కాక, పలుమార్లు చర్చనీయాంశం అవుతుంటాయి.తొలి పూర్తి నిడివి పది రీళ్ల తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని కూడా గతంలో రెంటాల జయదేవే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా దినోత్సవం విషయంలో అనేక దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న తప్పులను ఆయన సాక్ష్యాధారాలు చూపి సరిదిద్దారు. తెలుగు సినీరంగ చరిత్రను మార్చేసిన ప్రామాణికమైన ఆయన పరిశోధనను ప్రముఖ చరిత్రకారులు, సినీ పెద్దలు బాహాటంగా ఆమోదించారు. ప్రపంచ వ్యాప్తంగా జయదేవ పరిశోధన అంగీకారం పొందడంతో, ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ మన తెలుగు సినిమా దినోత్సవాన్ని సవరించుకొని, ఆయన చెప్పిన ఫిబ్రవరి 6నే అధికారికంగా తెలుగు సినిమా డేను జరుపుకొంటూ ఉండడం విశేషం.ఇది చదవండి: తెలుగు సినిమా పండగ రోజురెంటాల జయదేవ విశిష్ట కృషిని గుర్తించి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుకు ఎంపిక చేసింది. 2011కి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఈ పరిశోధనాత్మక గ్రంథంతో తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ వరించింది. తొలినాళ్ల తెలుగు సినిమా చరిత్రపై కనివిని ఎరుగని పరిశోధన చేస్తూ, ఎన్నో కొత్త సంగతులు బయటపెట్టిన రెంటాల జయదేవ (Rentala Jayadeva) నిరంతర అపూర్వ కృషిని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికీ ప్రాతినిధ్య సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం గుర్తించింది. భక్త ప్రహ్లాద సరైన విడుదల తేదీని పురస్కరించుకొని ఆయనను ఇటీవల ప్రత్యేకంగా సత్కరించడం విశేషం. -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' ఆసక్తిగా తెలుగు ట్రైలర్
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) ట్రైలర్ విడుదలైంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో మీడియా ఫోకస్, రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు. అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. -
ప్రముఖ హీరో మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్
తమిళ చత్రి పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు కోలీవుడ్లో రాణించిన నటుడు రాజేష్ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన సతీమణి జోన్ సిల్వియా గతంలోనే మరణించారు. వారికి దివ్య, దీపక్ పిలల్లు ఉన్నారు.1974లో దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుస ఛాన్సులు దక్కాయి. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. పోతురాజు, మహానది, సత్య, కన్ని పరువతిలే వంటి సినిమాల్లో నటించారు. ఆయన హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించాడు . 1985లో చెన్నైలోని కె.కె. నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ ఇంట్లో అనేక తమిళ, మలయాళ మరియు హిందీ సినిమా షూటింగ్లు పూర్తయ్యాయి. సినిమాలతో పాటు ఆయన హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సూపర్స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరారు. రాజేష్తో తనకు ప్రత్యేకమైన అనుభంధం ఉందని గుర్తుచేసుకున్నారు. -
#GaddarAwards2024 : గద్దర్ అవార్డులు-2024 (ఫొటోలు)
-
'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్.. తెలుగు హీరో కోసమేనా?
కీర్తి సురేశ్.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలోనైనా సరే తన నటనతో సత్తా చూపించగలరు. తమిళ హీరో సూర్య కూడా ఆ కోవకు చెందిన నటుడిగానే గుర్తింపు ఉంది. అయితే, సూర్యతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కీర్తి వదులుకుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తి మళ్లీ బిజీ అవుతుంది. బాలీవుడ్ తన మొదటి సినిమా 'బేబీ జాన్' నిరాశ పరిచినప్పటికీ మళ్లీ అక్కడే మరో ఛాన్స్ దక్కించుకుంది. కీర్తి కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్లో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. నటుడు రాజ్కుమార్ రావుతో (Raj Kumar Rao) కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ‘సెక్టార్ 36’ ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.అదే విధంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కీర్తి సురేశ్( Keerthy Suresh) నటించే ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో తమిళం, తెలుగు భాషల్లో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 46వ చిత్రంలోనూ కథానాయకిగా నటించే అవకాశం ఆమెను వరించిందట, అయితే ఆమె విజయ్దేవరకొండకు జంటగా నటించనున్నడం వల్ల సూర్యతో కలిసి నటించే ఛాన్స్ను వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి వివాహానంతరం మళ్లీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకుముందు సూర్యకు జంటగా 'గ్యాంగ్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సూర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా రెట్రోతో మెప్పించిన ఆయన తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో సౌత్ చిత్రపరిశ్రమలో తనదైన ముద్రను వెంకీ అట్లూరి వేశారని చెప్పవచ్చు. -
గద్దర్ అవార్డ్స్ ప్రకటన
-
'గద్దర్ అవార్డ్స్' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్'
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్ నటి జయసుధ (Jayasudha), ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీమ్, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం : పోటేల్ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రం- రజాకార్ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్ (రజాకార్)ఉత్తమ సహాయ నటుడు : ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్రశేఖర్ (గ్యాంగ్స్టర్ )ఉత్తమ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విజేతలు దుల్కర్ సల్మాన్: లక్కీ భాస్కర్అనన్య నాగళ్ల: పొట్టేల్దర్శకులు సూజిత్, సందీప్ (క) నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ (రాజూ యాదవ్)స్పెషల్ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2) -
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'సీతా పయనం' మూవీ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
మలయాళంలో హిట్.. తెలుగులోనూ విడుదల (నరివెట్ట ట్రైలర్)
మలయాళ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన 'నరివెట్ట' (Narivetta) తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఐడెంటిటీ' చిత్రంతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న ఆయన నరివెట్ట సినిమాతో మరో హిట్ అందుకున్నారు. మలయాళం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో తెలుగులో కూడా మే 30న విడుదల చేయనున్నారు. 2003 ముతంగ సంఘటన ఆధారంగా అబిన్ జోసెఫ్ కథ రాశారు. ఈ చిత్రంలో టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ నటించారు. -
నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్కుమార్, విజయ్కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు. -
మళ్లీ దొరికిపోయిన రష్మిక.. తానే హింట్ ఇచ్చిందిగా!
పుష్పభామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప-2 తర్వాత వచ్చిన ఛావా మూవీతో సైతం సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సరసన సికందర్లోనూ మెరిసింది. ప్రస్తుతం నాగార్జున-ధనుశ్ కీలక పాత్రలు పోషిస్తోన్న కుబేరలో కనిపించనుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉండే ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఉన్న పిక్స్ మరింత గ్లామరస్గా ఉన్నాయి. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ నెట్టంట భిన్నమైన కామెంట్స చేస్తున్నారు. ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ.. "ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్.. ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్లో భర్తీ చేయలేనివి " అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు. ఏదేమైనా గతంలో చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక.. మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది. గతేడాది దీపావళి పండుగ సమయంలోనూ రష్మిక.. విజయ్ ఇంటివద్దనే సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా రష్మిక-విజయ్పై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు జంటగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నా సిినిమా ఇంత కల్ట్గా ఉందంటే కారణం అతనే: సుకుమార్ ఆసక్తికర కామెంట్స్
సీనియర్ హీరో అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం 'సీతా పయనం'. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిరంజన్ , అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కన్నడ హీరో ఉపేంద్రపై పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే నా సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్గా ఉందని అన్నారు. ఎందుకంటే ఉపేంద్ర తెరకెక్కించిన ఓమ్, ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలే నాకు ఆదర్శమని తెలిపారు. ఆడియన్స్కు పిచ్చి, మ్యాడ్ తెప్పించే కల్ట్ మూవీస్ ఆయన మనకిచ్చారు. ఆయనలా కేవలం 3 సినిమాలు తీస్తే ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చన్నారు. నేనైతే తప్పనిసరిగా రిటైర్ అయ్యేవాడినని సుకుమార్ నవ్వుతూ మాట్లాడారు. ఉపేంద్ర నుంచే స్క్రీన్ ప్లేను తాను తస్కరించానని సుకుమార్ అన్నారు. -
కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ.. కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్కు ముందు కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ చోరీకి గురి కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సైతం ఓ లేఖను విడుదల చేసింది. మూడు నెలల క్రితమే హార్డ్ డ్రైవ్ పోయినట్లు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.తమ సినిమా హార్డ్ డ్రైవ్ కోసం ముంబయి కంపెనీని నిర్మాత సంప్రదించారు. అయితే తాము మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్కు డ్రైవ్ పంపించామని కంపెనీ ప్రతినిధులు ఆయనతో అన్నారు. కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపిస్తే రఘు డెలివరీ తీసుకున్నారని సదరు కంపెనీ తెలిపింది. అయితే తానేలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాతతో అన్నారు. దీంతో వెంటనే హార్డ్ డిస్క్ మిస్సింగ్ కావడంపై నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. అందులో అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ మొత్తం ఉన్నాయని తెలిపారు. ఆ డ్రైవ్ మిస్సయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. -
తేజ సజ్జా మిరాయ్ మూవీ టీజర్ రిలీజ్
-
'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్
బిగ్బాస్ 2వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నందిని రాయ్.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ దళపతి విజయ్ 'వారసుడు' చేసి మాత్రం తప్పు చేశానని అంటోంది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. మిస్ ఆంధ్రప్రదేశ్గానూ నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేస్తూ ఫేమస్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)వారసుడు చిత్రంలో నటించడం గురించి మాట్లాడిన నందిని రాయ్.. 'విజయ్ సర్ 'వారసుడు'లో నాది చిన్న రోల్ కాదు. నెరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాశ్ రాజ్ కూతురు పాత్ర, శ్రీకాంత్ని రెచ్చగొట్టి అతడి కుటుంబాన్ని విడదీయాలి. ఇదంతా షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్లో సీన్లన్నీ తీసేశారు. మొత్తంగా చూస్తే మూవీలో 2 నిమిషాలు కూడా లేదు నా పాత్ర. రిలీజ్ తర్వాత ఎందుకు ఈ సినిమా చేశావ్ అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ మూవీ చేసినందుకు మాత్రం బాధపడ్డాను. ఇదంతా నేను ఊహించలేదు. ఆ చిత్రం వల్ల నాపై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు తరహా పాత్రలు మళ్లీ చేయను' అని చెప్పుకొచ్చింది.2011లో '040' అనే తెలుగు సినిమాతో నందిని రాయ్ నటిగా మారింది. సుధీర్ బాబు 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో హీరోయిన్ రోల్ పడింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. సిల్లీ ఫెలోస్, శివరంజని, సీఎస్ఐ సనాతన్, భాగ్ సాలే తదితర చిత్రాలైతే చేసింది గానీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది.అలానే తన అనారోగ్య సమస్యల గురించి కూడా నందిని రాయ్ బయటపెట్టింది. గతంలో స్నేహితులతో కలిసి గోవా వెళ్లినప్పుడు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నా. నీటిలో ఒక గుడ్డ.. నా కాలికి పదేపదే తగులుతూ ఉంది. ఎన్నిసార్లు వదిలినా నా కాలికి చుట్టుకుంది. తీరా తీసి చూస్తే అందులో ఎవరికో చేతబడి చేసి రెండు బొమ్మలు, సూదులు గుచ్చి ఉన్నాయి. పువ్వులు, ఎవరిదో జుట్టు కూడా ఉంది. ఆ షాక్తో చాలా డిస్టర్బ్ అయ్యాను. మూడు రోజులు జ్వరంతో బాధపడ్డాను. దాని తర్వాత కొన్ని రోజులు అనారోగ్య సమస్యలు వేధించాయి. చావు మీద భయం వచ్చింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అప్పుడు సినిమా ఆఫర్స్ వచ్చినా అనారోగ్యం వల్ల చేయలేకపోయాయను. ఆ మూవీస్ చేసుంటే నాకు సక్సెస్ వచ్చి ఉండేదేమో అని భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్) -
ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్
‘‘ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్గారు మమ్మల్ని (సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్) నమ్మి ‘భైరవం’ని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. రాధామోహన్గారికి ఈ సినిమాతో పెద్ద విజయం, భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని నారా రోహిత్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.విజయ్ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత బెల్లంకొండ సురేష్గారు ఫోన్ చేసి, తమిళ చిత్రం ‘గరుడన్’ చూడమంటే చూశాను... చాలా నచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’లో శశికుమార్పాత్ర చేయాలని కోరారు. ఆపాత్ర నాకూ బాగా నచ్చడంతో చేశాను.నా తొలి కమర్షియల్ మాస్ ఫిలిం ‘భైరవం’. ఇక ఇన్నేళ్ల నా కెరీర్లో విజయాలు, అపజయాలు, ఎత్తు పల్లాలు ఉన్నాయి. కథల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది. ఇకపై నా నుంచి రెగ్యులర్గా సినిమాలు వస్తాయి. నేను హీరోగా నటించిన ‘సుందరకాండ’ విడుదల జూలైలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.‘పుష్ప’లో షెకావత్ (ఫాహద్ ఫాజిల్ చేసినపాత్ర) క్యారెక్టర్కు నన్ను అడిగారు. ఫొటోలు పంపమంటే, మీసాలు పెంచుకుని ఫొటోషూట్ చేయించి, పంపాను. కానీ ఇదిపాన్ ఇండియా మూవీ కాబట్టి వివిధ భాషల వాళ్లని తీసుకోవాలనే ఆలోచనతో ఫాహద్ని తీసుకుని ఉంటారేమో. -
జూన్ నుంచి జోరుగా...
లొకేషన్ సెర్చ్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలకపాత్రల్లో నటించనున్నారు.పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్నారు. జూన్ చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. షూటింగ్ ఆరంభించినప్పటి నుంచి మొత్తం సినిమా పూర్తయ్యేవరకూ షెడ్యూల్స్ని జోరుగా జరిపేలా ప్లాన్ చేశారట. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై ఏరియాల్లో లొకేషన్స్ రెక్కీ చేస్తోంది పూరి అండ్ టీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
వినాయక చవితికి జాతర
ఆగస్టులో థియేటర్స్లో మాస్ జాతర అంటున్నారట రవితేజ. ‘ధమాకా’ వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనేపోలీసాఫీసర్పాత్రలో రవితేజ, విలన్గా నవీన్ చంద్ర నటిస్తున్నారని తెలిసింది.ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు పూర్తయింది.పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. కాగా ‘మాస్ జాతర’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
'కన్నప్ప మూవీపై పెద్ద కుట్ర'.. నిర్మాణ సంస్థ సంచలన లేఖ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్ను ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (24 Frames Factory) నిర్మాణ సంస్థ ఆరోపించింది. కన్నప్ప హార్డ్డిస్క్ చోరీకి గురవడంపై వచ్చిన రూమర్స్పై కూడా సంస్థ స్పందించింది.నిర్మాణ సంస్థ తన నోట్లో రాస్తూ..' కన్నప్పలోని ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్తో పాటు, కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ట్రాన్సిట్ సమయంలో చోరీకి గురైంది. ఈ హార్డ్ డిస్క్ ముంబయిలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా నిర్మాణ కార్యాలయానికి డెలివరీ చేస్తుండగా చోరీ చేశారు. హార్డ్డిస్క్ చోరీపై నాలుగు వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కన్నప్ప సినిమా ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఈ చోరీకి పాల్పడిన వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కాదు. దీని వెనుక ఎవరున్నారో తమకు తెలుసని ప్రొడక్షన్ హౌస్ తన లేఖలో పేర్కొంది. కాగా.. అంతకుముందు ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు స్పందింటారు. జటాజూటధారీ.. నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ హరహరమహదేవ్ అంటూ ట్వీట్ చేశారు.OFFICIAL STATEMENT FROM 24 FRAMES FACTORYREGARDING THE THEFT OF CRUCIAL KANNAPPA FOOTAGEIn response to circulating rumours and speculation, 24 Frames Factory is issuing this official statement to bring clarity to the situation.A hard drive containing a pivotal action…— 24 Frames Factory (@24FramesFactory) May 27, 2025 -
అల్లరి నరేశ్.. ఈసారి 'ఆల్కహాల్'?
టాలీవుడ్లో కామెడీ తరహా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్.. ఇప్పుడు చాలా స్లో అయిపోయాడు. ఒకటి అరా సీరియస్ లేదా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కట్లేదు. అయినా సరే మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది డిసెంబరులో చివరగా 'బచ్చలమల్లి' అనే రస్టిక్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్)ఇప్పుడు అల్లరి నరేశ్ చేయబోయే సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడంతా మాస్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో 'ఆల్కహాల్' అని ఓ పేరుని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. రీసెంట్ టైంలో హిట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సితార ఎంటర్టైన్మెంట్స్.. అల్లరోడితో ఈ మూవీని నిర్మించనుందని సమాచారం.'సుడిగాడు' తర్వాత తర్వాత అల్లరి నరేశ్.. కెరీర్ పరంగా కాస్త టర్న్ తీసుకున్నాడు. 'ఉగ్రం' మూవీతో డిఫరెంట్ ప్రయత్నం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మళ్లీ అదే దర్శకుడితో కలిసి 'నాంది' చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. 'బచ్చలమల్లి'పై నరేశ్ కాస్త ఎక్కువ అంచనాలు పెట్టుకున్నాడు గానీ పూర్తిగా ఇది నిరాశపరిచింది. అయినా సరే తగ్గకుండా ఆ తరహా కథతోనే 'ఆల్కహాల్' చేయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం
సాక్షి,విజయవాడ: ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన హస్తం ఉన్నట్లు తేలింది. ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రధాన అనుచరుడు, జనసేన నేత అత్తి సత్యనారాయణ బంద్ కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. పార్టీకి మరక అంటకుండా హడావిడిగా సత్యనారాయణపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది .రాజమండ్రి సిటీ జనసేన ఇన్ ఛార్జ్గా ఉన్న సత్యనారాయణను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. బంద్ ప్రతిపాదన నిజమా..? అబద్ధమా..? తేలేవరకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ వేముల పాటి అజయ్ కుమార్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల సమయంలో థియేటర్ల బంద్ విషయం తెరపైకి వచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ సినీపెద్దలపై, థియేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ అంశంలో ఆ నలుగురు పెద్దలను విచారించాలని మంత్రి దుర్గేష్ హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఇప్పుడు ఆ కుట్ర చేసింది దుర్గేష్ అనుచరుడే అని నిర్ధారణయ్యింది. ఫలితంగా తాము ప్రజల్లో అభాసుపాలయ్యామంటూ జనసేన నేతల్లో కలవరం మొదలైంది. -
సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
గత నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఓవర్సీస్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన సినిమా 'చౌర్యపాఠం'. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వచ్చింది. కానీ వచ్చినంత వేగంగానే మాయమైపోయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఈ వారం దాదాపు 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరమ్ లాంటి స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలతో పాటు 'అజ్ఞాతవాసి' అనే కన్నడ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. మూవీ లవర్స్కి అయితే ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లిస్టులోకే 'చౌర్యపాఠం' కూడా వచ్చి చేరింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్) -
'ఓజీ'లో నారా రోహిత్ కాబోయే సతీమణి
పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నారా రోహిత్కు కాబోయే సతీమణి శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా నారా రోహిత్తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి. వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్ దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్- నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్2లో ఆయన విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. జైలర్ పార్ట్1లో విలన్గా వినాయకన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, సిక్వెల్లో ఆయన పాత్ర కేవలం రెండుమూడు సీన్ల వరకే ఉంటుందని టాక్. జైలర్2 షూటింగ్లో వినాయకన్ రెండురోజులు మాత్రమే పాల్గొనడంతో ఆయన పాత్రపై ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, ఫుల్ లెన్త్ విలన్గా నాగార్జున నటించనున్నారని కథనాలు వస్తున్నాయి.ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’లో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో, నాగార్జున సిమాన్ అనే పాత్రను పోషిస్తున్నారు. అయితే, ఇందులో కూడా ఆయన పాత్ర నెగటివ్ షేడ్లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో క్రేజీ నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు. కూలీ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.జైలర్2 షూటింగ్ రీసెంట్గా చైన్నె పరిసర ప్రాంతాల్లో కొంత భాగం జరిగింది. ప్రస్తుతం కేరళలో జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్లో నాగార్జున పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ రెండి విషయాలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రటన రాలేదు. చిత్ర షూటింగ్ డిసెంబర్ పూర్తి అవుతుందని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించనున్న తదుపరి చిత్రం టాలీవుడ్ యువ దర్శకుడితో చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. -
'నువ్వు RCB ఫ్యాన్వా.. కెరీర్ మీదా గట్టిగా ఫోకస్ చేయాలి' ('3 రోజెస్' టీజర్)
'3 రోజెస్' సీజన్ 2 (3 Roses Season 2) డైలాగ్స్ సోషల్మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’ నుంచి తాజాగా కమెడియన్ సత్యను పరిచయం చేస్తూ ఒక టీజర్ను విడుదల చేశారు. బెట్టింగ్ భోగి పాత్రలో కడుపుబ్బా ఆయన నవ్వించేలా ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్పై పంచ్లు వేస్తూ ఆయన నవ్వించారు.ఆహా (Aha) వేదికగా త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి, సందీప్ బొల్ల ఈ మూవీకి రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎస్కేఎన్ తెరకెక్కిస్తున్నారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా.. దర్శకుడి మీద నమ్మకం వల్లే: అర్చన
'ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది' అంటూ నిరీక్షణ (1982) సినిమాతో తొలిసారి వెండితెరపై హీరోయిన్గా 'అర్చన' మెరిశారు. ఈ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మొదట రంగు తక్కువ అంటూ నటిగా తిరస్కరణకు గురైన ఆమె... ఆ తర్వాత వరుసగా రెండు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు కుటుంబానికి చెందిన అర్చన.. తమిళ అమ్మాయిగా స్థిరపడిపోయారు. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు బాలుమహేంద్రనే నిరీక్షణ సినిమాతో హీరోయిన్ను చేశారు. గిరిజన యువతి పాత్రలో బ్లౌజ్ లేకుండా నటించడంపై ఆమె తొలిసారి స్పందించారు.సుమారు 20 ఏళ్ల తర్వాత 'షష్టి పూర్తి' సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను నటి అర్చన పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె నటించిన తొలి సినిమా గురించి ఇలా చెప్పారు. 'నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటించడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఆరోజుల్లోనే బ్లౌజ్ లేకుండా సినిమా అంతా నటిస్తున్నానని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుణ్ని నమ్మాను. అప్పటికే ఆయన చిత్రీకరించిన ఏ సినిమాలోనూ అశ్లీలతతో పాటు గ్లామర్ను ప్రదర్శించడం అనేది లేదు. అందుకే, ఏమీ ఆలోచించకుండా నిరీక్షణలో నటించాను. నా జీవితంలోనే ప్రత్యేకమైన సినిమా ఇదే. మలయాళంలో మమ్ముట్టి, శోభనలతో బాలుమహేంద్రనే తెరకెక్కించారు. తెలుగులో నేను, భానుచందర్ నటించాం. దర్శకుడి మీద నమ్మకంతోనే బ్లౌజ్ లేకున్నా సరే నటిస్తానని చెప్పాను. అనుకున్నట్లుగానే ఆయన చాలా పవిత్రంగానే ఆ పాత్రను ప్రేక్షకులకు చూపించారు. నిరీక్షణ సినిమాతో నాకు ఒక అన్నయ్య (భానుచందర్) దొరికాడు. ఆ బంధం ఇప్పటికీ ఉంది.' అని ఆమె అన్నారు.నిరీక్షణ సినిమాలో భాను చందర్ .. అటవీశాఖాధికారిగా నటించగా అర్చన గిరిజన్ యువతి పాత్రలో మెప్పించింది. ఇప్పటికే ఈ చిత్రం చాలామందికి ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ మూవీ విడుదల తర్వాత అర్చనకు భారీ అవకాశాలు వచ్చాయి. వీడు (1987), దాసి (1988) చిత్రాలకు గాను రెండుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అర్చన అవార్డు అందుకున్నారు. -
‘బద్మాషులు’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)