breaking news
Tollywood
-
హై హై ప్రతి నాయికా
డ్యూయెట్స్ పాడుతూ, కాసిన్ని జోక్స్ వేస్తూ, ఎమోషనల్ సీన్స్లో కన్నీళ్లు పెట్టుకుంటూ... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే విభిన్న తరహా పాత్రలు దక్కితే ‘సై’ అనేస్తారు. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే... నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ సమంత, తమన్నా వంటివారు విలన్ రోల్స్ చేసి, సక్సెస్ అయ్యారు.శ్రద్ధా శ్రీనాథ్, అనన్యా నాగళ్ల, సంయుక్త, రచితా రామ్, రుక్మిణీ వసంత్... ఇలా యువ తారలు సైతం విలన్ రోల్స్ చేసేందుకు ఆలోచించడం లేదు. ప్రతి నాయిక పాత్రల్లో నటనపరంగా విజృంభించి, ‘హై హై ప్రతినాయికా’ అని ప్రేక్షకులు అనేలా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లేడీ విలన్గా చేస్తున్న కొందరు హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.స్లమ్ డాగ్లో... వెంకటేశ్ ‘కూలీ నెం.1’, నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘స్లమ్ డాగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు టబు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు విలన్గా కనిపిస్తారని సమాచారం. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... గతంలో ‘మక్బూల్’, ‘అంధా ధూన్’ వంటి హిందీ చిత్రాల్లో టబు నెగటివ్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే.ధన పిశాచి... టాలీవుడ్కి విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘జటాధర’లో సోనాక్షీ సిన్హా విలన్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఆమె ధన పిశాచిగా కనిపించనున్నారు. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శిల్పా శిరోద్కర్ పాత్రలోనూ నెగటివ్ షేడ్స్ ఉంటాయట. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్లు ‘జటాధర’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. దెయ్యంగా పూజ? దర్శక–నిర్మాత–నటుడు–కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ‘కాంచన’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘కాంచన 4’. ఈ చిత్రంలో రాఘవా లారెన్స్తో పాటు పూజా హెగ్డే, నోరా ఫతేహీ మెయిన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారట. పూజ లేదా నోరా ఫతేహీ... ఇలా ఎవరో ఒకరి పాత్ర నెగటివ్ షేడ్స్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కాంచన 4’ సినిమా వచ్చే వేసవిలో విడుదల కావొచ్చు. వారియర్ విలన్...కాలేజీ అమ్మాయి, ప్రేయసి, భార్య... ఇలా హీరోయిన్గా విభిన్న రకాల పాత్రల్లో నటించి, మెప్పించారు రష్మికా మందన్నా. ఇప్పుడు తనలోని నెగటివ్ యాంగిల్ని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారట రష్మిక. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ ఖరారయ్యారు.ఇంకా రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, ఆలియా. ఎఫ్... వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న వారియర్ విలన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే రష్మిక విలన్గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే కావొచ్చు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఇంకా మరికొందరు కథానాయికలు ‘ప్రతి నాయిక’లుగా కనిపించనున్నారు. -
నా డ్రీమ్ అదే.. నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలని!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సమాధి వద్దకు విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు.Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
రహస్యంగానే విజయ్ దేవరకొండ, రష్మిక.. కారణం ఏంటి?
సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. రీసెంట్గా అక్కినేని నాగార్జున కుటంబంతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కూడా శుభవార్తలు విన్నాం. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna)లు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. సోషల్మీడియాలో అయితే, పాన్ ఇండియా రేంజ్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ జోడీ మాత్రం తమకు ఏమ్ తెలియనట్లు సైలెంట్గా ఉంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణెలతో పాటు చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు తమ అభిమానులతో పంచుకున్నారు. నేటి ప్రపంచంలో ఎవరూ కూడా తమ ప్రేమ,పెళ్లి విషయాల్ని దాచుకోవడం లేదు. సమయం వచ్చినప్పడు చెప్పేస్తున్నారు.విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, ఈ జంట మాత్రం ఇలాంటి సమయంలో చాలా గుంభనంగా ఉంది. కనీసం ఇవన్ని రూమర్స్ మాత్రమే అని కూడా వారు తమ అభిమానులకు చెప్పలేదు. నిజమే అయితే, కనీసం తమ ఫ్యాన్స్కు కూడా చెప్పకుండా ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒక లోకేషన్లో కనిపించడం చూశాం. విజయ్ ఇంట్లో రష్మిక ఫోటోలు దిగడం, పుట్టినరోజు సమయంలో ఒకే ప్రదేశానికి వెకేషన్ ప్లాన్ చేయడం వంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా పలు ఫోటోలతో అభిమానులే డీకోడ్ చేశారు. ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారంటే తప్పులేదు. కానీ, నిశ్చితార్థం విషయాన్ని కూడా అంత సీక్రెట్గా ఉంచడం ఎందుకు అనే సందేహం అందరిలో వస్తుంది. రష్మిక రీసెంట్గా తన కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది కానీ నిశ్చితార్థం గురించి మాత్రం చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో ఇంత రహస్యం అవసరమా అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. -
80's రీయూనియన్.. స్టార్ సెలబ్రిటీలంతా ఒకేచోట (ఫోటోలు)
-
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
ఓటీటీలో 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా స్ట్రీమింగ్
త్రిబాణధారి బార్బరిక్( Tribanadhari Barbarik) సినిమా చుట్టూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎవరూ చూడలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ మూవీ గురించి వైరల్ అయింది. ఆపై సినిమా ఫలితం చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చింది. ఇలా త్రిబాణధారి బార్బరిక్ చుట్టూ అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఓటీటీలోకి రానున్నండంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.‘త్రిబాణధారి బార్బరిక్’.. సన్ నెక్స్ట్(Sun NXT)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుందని ఒక పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు.కథేంటంటే..ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు.దేవ్కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. -
తెలుగమ్మాయి 'ఈషా రెబ్బా' క్యూట్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
జాను లిరితో బ్రేకప్? క్లారిటీ ఇచ్చిన సింగర్!
యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్తో దుమ్ము లేపింది జాను లిరి (Janu Lyri). పద్ధతిగా చీర కట్టి, పల్లెటూరి అమ్మాయిగా స్టెప్పులేసే జాను ఫోక్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాపులారిటీతో ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని విజేతగా నిలిచింది. జానూకి గతంలో నటుడు టోనీ కిక్తో పెళ్లవగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. విభేదాల కారణంగా టోనీతో విడిపోయిన జాను కుమారుడితో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది.రెండో పెళ్లి చేసుకుంటా..ఆ మధ్య ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నా.. చచ్చిపోవాలనుంది అంటూ బోరుమని ఏడ్చింది. ఆ మరుసటి రోజే.. నేనెవరికీ భయపడను.. బాధతో డిప్రెషన్కు వెళ్లిపోయాను, ట్రోల్స్ను పట్టించుకోను అని ధైర్యం కూడదీసుకుంది. అంతేకాదు, ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గణ్ (Dilip Devgan)తో దిగిన ఫోటో షేర్ చేస్తూ అతడే తనకు కాబోయే భర్త అని పరిచయం చేసింది. రెండో పెళ్లి చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది.హ్యాపీగా ఉన్నాంమే నెలలో తమ ప్రేమను బయటపెట్టిన వీరిద్దరూ ఈ మధ్యే విడిపోయారంటూ తాజాగా ప్రచారం ఊపందుకుంది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ఈ రూమర్స్పై దిలీప్ స్పందించాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని ఒక్కముక్కలో తేల్చేశాడు. కానీ, ఈ విషయంపై అంతకుమించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.చదవండి: 'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్ -
‘శశివదనే’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
భర్త మహాశయులకు విజ్ఞప్తి!
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని అంటున్నారట హీరో రవితేజ. ఈ విజ్ఞప్తి వివరాల కోసం ప్రేక్షకులను వచ్చే సంక్రాంతికి థియేటర్స్కి రమ్మంటున్నారు. రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత ‘అనార్కలి’ అనే టైటిల్ను అనుకున్నారు.కానీ తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ కోసమే రవితేజ స్పెయిన్ వెళ్లారు. కొంత టాకీ పార్టు, రెండు పాటల చిత్రీకరణ స్పెయిన్ లొకేషన్స్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అక్టోబర్లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
గ్రామంలో హైలెస్సో..
సుధీర్ ఆనంద్ (‘సుడిగాలి’ సుధీర్) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్ను విడుదల చేశారు. శివాజీ, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్. -
థ్రిల్లింగ్ మారియో
అనిరుధ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘మారియో’. ‘నాటకం, తీస్ మార్ ఖాన్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ జి. గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ప్రోడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, రాకేందు మౌళి, కెమెరా: ఎంఎన్ రెడ్డి. -
నేను నీకు కరెక్టేనా?
‘విక్రమ్... అందరికీ ఒక టైపు ఉంటుంది కదా... నేను నీ టైపేనా’, ‘అంటే... ఒకరికొకరు కరెక్టా? అని ఎలా తెలుస్తుంది... అంతకన్నా ఎప్పుడు తెలుస్తుంది’, ‘కొంపతీసి నేను నీకు కరెక్టేనా అని ఆలోచిస్తున్నావా ఏంటి?’, ‘నేను నీకు కరెక్టేనా? అని కూడా ఆలోచిస్తున్నా?’... ఈ సంభాషణలు‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రోమోలోనివి.రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా పేర్కొని, రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. -
నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి
'కేజీఎఫ్' సినిమాతో హీరోయిన్గా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. తర్వాత అడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తోంది. ఈ ఏడాది నాని 'హిట్ 3'తో వచ్చింది. సక్సెస్ అందుకుంది. ఇప్పుడు 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలో రానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది.'నేను ప్రభాస్లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను. అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు' అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ప్రభాస్ అభిమానులు భిన్నంగా స్పందిస్తుంటారు. తమ ఫేవరెట్ హీరోకి లేడీ వెర్షన్ అంటే అనుష్కనే అవుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీనిధి శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్)శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది.త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా కోసం ఈమెను హీరోయిన్గా తీసుకున్నారనే రూమర్ వినిపించింది. దీని గురించే 'తెలుసు కదా' ప్రమోషన్లలో అడగ్గా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!) -
ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్
-
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!
ఒకప్పుడు అంటే తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అంటే వామ్మో అన్నట్లు చూసేవారు. కానీ గత కొన్నేళ్లలో మాత్రం ఈ విషయం చాలా సాధారణమైపోయింది. ప్రేక్షకులు కూడా ముద్దు సన్నివేశాల్ని సాధారణంగానే తీసుకుంటున్నారు. ఒకవేళ హీరోయిన్లని ఈ సీన్స్ గురించి అడిగితే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనే మాట అంటారు. అయితే అది ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది అని హీరోయిన్ కోమలి ప్రసాద్ అంటోంది.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్)రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోమలి.. స్వతహాగా తెలుగమ్మాయి. సహాయ పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్గా 'శశివదనే' అనే మూవీ చేసింది. అక్టోబరు 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా ట్రైలర్ చూపించిన లిప్ కిస్ గురించి కోమలి మాట్లాడింది.'ఈ రోజుల్లో ముద్దు సన్నివేశంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నటించానని అనడం పెద్ద జోక్ అయిపోయింది. కానీ మా సినిమాలో ఈ సన్నివేశానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నేను చేసిన శశి అనే అమ్మాయి పాత్ర.. అసలు ఏడుస్తూ రాఘవని ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా అని ఇదేదో కావాలని ఇరికిందింది అయితే కాదు' అని కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్: నటి హేమ) -
పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా!
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ (Actress Hema). టాలీవుడ్లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా తన జర్నీ గురించి యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకుంది. హేమ మాట్లాడుతూ.. అమ్మకు సినిమాలంటే ఇష్టం. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేనింతవరకు వచ్చేదాన్ని కాదు. ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లవుతోంది.పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదుకెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్కు, ఓ ఇంటర్వ్యూకు.. అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్డ్గా ఉంటాడు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్కు వెళ్లేదాన్ని. తిరిగి రాగానే మళ్లీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. అందుకే బిగ్బాస్కు వెళ్లా..లాక్డౌన్లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తున్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ.. ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ రావడంతో షోకి వెళ్లిపోయా.. బిగ్బాస్ హౌస్లో అందరికీ బాగా వండిపెట్టాను. నాకు నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురుచెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో కలిసి చిల్ అయ్యేదాన్ని. నాగార్జున వస్తే..త్వరగానే డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. చిన్న చిన్న బిజినెస్లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్కి నాగార్జున, అమలతో కలిసి వచ్చారు. గంటన్నరసేపున్నారు. ఇంకా ఉండాలనుకున్నారు. కానీ అక్కడున్నవాళ్లు ఫోటోల కోసం ఇబ్బందిపెడుతుండటంతో ఇక వెళ్లిపోండి.. అని నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాలపాలయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది. ఈ నటి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ -
బిగ్బాస్లోకి 'ప్రభాస్' ఫ్రెండ్తో పాటు మరో నలుగురికి ఎంట్రీ!
బిగ్బాస్-9 తెలుగులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారి పేర్లు కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్బాస్లో ఆట మరింత రణరంగంగా మారనుందని చెప్పవచ్చు.సినీ నటుడు ప్రభాస్ శీను(Prabhas Sreenu) బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 11,12 తేదీలలో వీరందరూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరో ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆయన పేరునే ట్యాగ్లైన్గా మార్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో సంఖ్య పెరగడంతో పాటు ఆట మరింత ఆసక్తిగా ఉండనుందని సమాచారం. బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్(Nikhil Nair) కూడా బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. భారీ కటౌట్తో ఉన్న నిఖిల్ సిరీయల్స్తో మెప్పించాడు. ఇంటింటి గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్తో గుర్తింపు పొందాడు.అలేఖ్య చిట్టి పికిల్స్తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య(Ramya) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఆమె పేరు బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో బిగ్బాస్ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్.లఘు చిత్రాలు, వెబ్ సీరిస్లతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్(Akhil Raj) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయినట్లు సమాచారం. అయితే, సోషల్మీడియాలో అతనికి పెద్దగా గుర్తింపు లేదు. ఇలా బిగ్బాస్తో అందరికీ దగ్గరకావాలనే ప్లాన్ ఉన్నాడు. యూకేలో నివసిస్తున్న మౌనిషా చౌదరి(Mouneesha Chowdary) బిగ్బాస్లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. -
చైతన్య రావు-క్రాంతి మాధవ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
-
ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ
కొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్ అంకుల్స్ ఇలాగే చేస్తారు కదా!సెల్ఫీ ఫోటోలుఇట్స్ ఓకే.. నన్ను ఇండియన్ అంకుల్ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్క్రీమ్ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్ను ఈ పోస్ట్లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.సినిమాహిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్ డైరెక్షన్లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే? -
కూలీ ఫేమ్ రచిత రామ్ 'కల్ట్' పోస్టర్ విడుదల
కన్నడ హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా కూలీ సినిమాలో లేడీ విలన్గా నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘కల్ట్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీకి ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఇందులో రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆమెకు జోడీగా జైద్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రచిత రామ్ ఒక లవ్ ఫెయిల్యూర్ యువతిగా కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది అనే అంశం చుట్టూ కథ సాగుతుంది.రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కల్ట్ పోస్టర్లో ఆమె లేడీ డాన్ లుక్లో కనిపించారు. బాత్రూమ్లో టాయిలెట్ సీటింగ్పై కూర్చొని, సిగరెట్ తాగుతూ.. ఆమె మాస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పక్కన గిటార్ కాలిపోతుండగా, వెనకాల ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కూడా ఉంది. ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే డైలాగ్తో పోస్టర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా రచిత రామ్ మరోసారి తన నటనలో విభిన్నతను చూపించబోతున్నారు. ఇలాంటి పాత్రలతో రచిత రామ్ తన కెరీర్లో కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది. View this post on Instagram A post shared by R R (@rachita_instaofficial) -
ప్రియురాలు ఫిర్యాదు.. సింగర్కు నాలుగేళ్ల జైలు శిక్ష
అమెరికన్ ప్రముఖ ర్యాపర్ డిడ్డీ (54)కి జైలు శిక్ష పడింది. అమ్మాయిల ట్రాఫికింగ్కు పాల్పడుతున్నాడని ఈ ఏడాది జులైలో న్యూయార్క్లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఆయన్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కానీ, అతని మాజీ ప్రియురాళ్ళు కాసాండ్రా వెంచురా, జేన్లతో వ్యభిచారం కోసం రవాణా చేసినందుకు అతని ప్రమేయం ఉందని తేలింది. తమను డిడ్డీ విక్రయించాడని వారు కోర్టుకు ఆధారాలు అందించారు. దీంతో అతనికి 4ఏళ్లు జైలు శిక్ష పడింది.2016లో డిడ్డీ తన ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేకప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా సహా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది. ఈ క్రమంలోనే తనను విక్రయించాడని కూడా పేర్కొంది.ర్యాపర్ డిడ్డీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి పేర్కొన్నాడు. దీంతో అతనికి 4 ఏళ్లు జైలు శిక్ష విదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షను అధిగిమించి తిరిగొస్తావని ఆశిస్తున్నట్లు డిడ్డీతో ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మహిళలకు హాని కలిగించడానికి నువ్వు చూపిన చొరవ.. వారికి సహాయం చేయడానికి చూపించాల్సింది అంటూ చేసిన పాపాల విముక్తి కోసం ఈ శిక్ష తప్పదని పేర్కొన్నారు.తన ప్రతిభతో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘల్ గా డిడ్డీ కీర్తిని అందుకున్నాడు. కోర్టు తీర్పు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన భయానకంగా, అవమానకరంగా ఉందని తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే తాను మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని చెప్పాడు. నేను చేసిన తప్పులను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించుకోను. నేను శిక్ష అనుభవించాల్సిందే. డిడ్డీ 2029లో విడుదల కావచ్చు.BREAKING: Sean 'Diddy' Combs sentenced to over 4 years in federal prison.Back in July, Combs was found guilty of two counts of transporting individuals for prostitution."A substantial sentence must be given to send a message to abusers and victims alike that abuse against… pic.twitter.com/atFjasAmiv— Collin Rugg (@CollinRugg) October 3, 2025 -
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) వరుస బ్లాక్బస్టర్స్ అందుకుంటున్నాడు. గతేడాది హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ ఏడాది మిరాయ్ (Mirai Movie)తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెల తిరిగేలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఓటీటీలో మిరాయ్ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 10న హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మిరాయ్ విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)చదవండి: సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ -
మహానటి సావిత్రిలా ముస్తాబైన ప్రియాంక జైన్ (ఫోటోలు)
-
రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక
-
దిగొచ్చిన యూట్యూబ్.. ఐశ్వర్యరాయ్ వీడియోలు తొలగింపు
బాలీవుడ్ కపుల్స్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల దెబ్బతో యూట్యూబ్ దిగొచ్చింది. యూట్యూబ్లో తమ అనుమతి లేకుండా ఫోటోలు ఉపయోగిస్తున్నారని వాటిని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును వారు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు నుంచి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ యూట్యూబ్లో ఆ వీడియోలు ఉండటంతో ఐశ్వర్య దంపతులు ఆగ్రహించారు. మరోసారి కోర్టుకు వెళ్లారు. యూట్యూబ్పై రూ. 4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో ఆ సంస్థ దిగొచ్చింది.ఐశ్వర్య దంపతులు రూ.4కోట్ల దావా వేయడంతో ఆ వీడియోలను యూట్యూబ్ తొలగించింది. సుమారు 250కి పైగా వీడియో లింక్లను తొలగించడంతో పాటు ఆ ఛానల్స్ను బ్లాక్ చేసింది. ఇప్పటికే ఆ వీడియోలకు సుమారు 20 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పవచ్చు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు ఇలాంటి చిక్కులు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా అక్కినేని నాగార్జున కూడా తన ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండానే కొన్ని సంస్థలు తమ వ్యాపారా ప్రకటనలకు ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించడంతో వారు అభ్యంతరం తెలిపారు. ఆమె పేరు, గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు ఏంటి అంటూ కోర్టు పేర్కొంది. ఐశ్వర్యను దెబ్బతీసేలా ఉన్న యూఆర్ఎల్లను తొలగించి బ్లాక్ చేయాలని గూగుల్, యూట్యూబ్తో సహా ఇతర ప్లాట్ఫార్మ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోపు ఎలాంటి వీడియోలు కనిపించకూడదని హెచ్చిరించింది. ఈ క్రమంలోనే యూట్యూబ్, గూగుల్ చర్యలు చేపట్టింది. -
కాకినాడలో టిల్లు భామ నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్
మలయాళంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ ప్రేమ వివాహం చేసుకుంది. తాజాగా ఇదే విషయాన్ని సోషల్మీడియాలో ప్రకటించింది. చాలా కాలంగా అభిషేక్తో ప్రేమలో ఉన్నానంటూ చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్ను చూపుతూ తన భర్తతో పాటు ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘బేబీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఆర్య దయాళ్ పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాటను ఆమె పాడారు. తెలుగులో ఆమెకు ఇదే తొలి కావడం విశేషం. ఈ పాటకు టాలీవుడ్లో అభిమానులు భారీగానే ఉన్నారు. స్టార్ సింగర్గా మలయాళంలో భారీ క్రేజ్ ఉన్న ఆర్య దయాళ్ ఇలా సింపుల్గా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఈ దంపతులను అభినందిస్తున్నారు. అభిషేక్ కూడా సంగీత ప్రపంచంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MazhavilManoramaTV (@mazhavilmanoramatv) -
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
-
క్లాప్... క్లాప్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దసరా సందడి ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించింది. ఈ పండగ సందర్భంగా పలు సినిమాలు ఘనంగా ప్రారంభోత్సవాలు జరుపుకున్నాయి. ఆ చిత్రాల వివరాలేంటే చూద్దాం. వెంకటేశ్ క్లాప్తో... నాని హీరోగా ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం జరిగింది. ‘నాని 34’ అనే వర్కింగ్ టైటిల్తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్చాన్ చేయగా, నాని, వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్ను సుజిత్కి అందించారు. ఫస్ట్ షాట్కి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తూ, నానీని ఎప్పుడూ చూడని పాత్రలో చూపించనున్నారు సుజిత్’’ అని వెంకట్ బోయనపల్లి తెలిపారు.కాంబినేషన్ రిపీట్... హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) మంచి విజయం సాధించింది. ఈ కాంబినేషన్లో మరో సినిమా ఆరంభమైంది. ‘శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు 2’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయిదుర్గా తేజ్ క్లాప్ కొట్టగా, హీరో నారా రోహిత్ స్క్రిప్ట్ని నిర్మాతలకు అందజేశారు. ‘‘హై ఓల్టేజ్ హ్యూమర్ ఎక్కువగా ఉండే కథనంతో ఈ చిత్రం నాన్స్టాప్ వినోదాన్ని అందించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త ప్రేమ కథ ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాల ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. చైతన్యా రావు హీరోగా, ఐరా, సాఖీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ నాయుడు, శ్రీకాంత్ .వి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ దేవా కట్టా క్లాప్ కొట్టారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్లు స్క్రిప్ట్ని డైరెక్టర్కి అందజేశారు. వర ముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సరికొత్త ప్రేమకథతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: జ్ఞాన శేఖర్. ముగ్గురు యువకుల స్నేహం: ప్రేమ్, వాసంతిక జంటగా ‘మావా’ టైటిల్తో సినిమా ఆరంభమైంది. ఏ.ఆర్. ప్రభావ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి వెంకటేశ్ బాలసాని క్లాప్ ఇవ్వగా, ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘స్నేహం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముగ్గురు అబ్బాయిల మధ్య ఉండే స్నేహాన్ని అద్భుతంగా చూపించబోతున్నాం’’ అని యూనిట్ తెలిపింది. థ్రిల్లర్ నేపథ్యంలో... అభిరామ్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ రెడ్డి దాసరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి భగీరథ కెమెరా స్విచ్చాన్ చేయగా, స్క్రిప్టును ఎన్.ఆర్. అనురాధా దేవికి అందించారు అభిరామ్. లవ్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు మేకర్స్. -
డిసెంబరులో...
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. తాజాగా డిసెంబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 24న ప్రారంభం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘వీరసింహా రెడ్డి’ (2023). వీరి కాంబినేషన్లో రానున్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రారంభం కానుంది. -
అంత సులభం కాదు.. ట్రంప్ టారిఫ్స్పై నిర్మాత విశ్వప్రసాద్
కొన్నిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సినిమా రంగంపై ఊహించని పిడుగు వేశాడు. విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇది అమల్లోకి వస్తే ఓవర్సీస్లో టాలీవుడ్ చిత్రాలకు ఇబ్బంది ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. దీని వల్ల ఇప్పట్లో తెలుగు మూవీస్కి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు. 'సాక్షి'తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)ట్రంప్.. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?ఇక్కడ లాస్ట్ అంటే బిఫోర్ ఎలక్షన్ నుంచి 'మాగా' అన్నది ఒక క్యాంపెయిన్. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వీలైనంత వరకు అంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు.. వాళ్ల ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికాలోనే జరగాలన్నది ఆయన ఆశయం. దాని ప్రకారం సినిమాల్లో కూడా ఈ హాలీవుడ్ వర్క్ అంతా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళకుండగా అమెరికాలో జరగాలన్నది ఆయన ఉద్దేశం. దాన్ని నియంత్రించడానికే 100% టారిఫ్ అన్నారు. కానీ అది ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి అనేదానికి ఒక ప్రొసీజర్ లేదు. కాబట్టి అది అంత సులభం కాకపోవచ్చు.ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ ఏమైనా సంతకం చేశారా?అంటే నేను విన్నది ఏంటంటే.. ఇది ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే దీన్ని అంటే ఆ గైడ్ లైన్స్ డెవలప్ కావాలి. దీన్ని స్టడీ చేయడానికి చాలా అంశాలున్నాయి. అంటే దేని మీద టాక్స్ వేయాలా దేని మీద టారిఫ్ వేయాలా అన్నది. ఇదంతా డెవలప్ చేయడం కూడా ఎంత టైం అన్నా పట్టొచ్చు. మూడు నెలలైనా కావొచ్చు ఏడాదైనా పట్టొచ్చు. అప్పటివరకు మనం ఏం చెప్పలేం. జనరల్గా టారిఫ్ ఉన్నా లేకున్నా మనం కాస్ట్ కంట్రోల్ చేసుకొని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసే అంటే మన దరిదాపుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.(ఇదీ చదవండి: సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం) -
కళ్యాణ్ జీ గోగణ 'మారియో' ఫస్ట్ లుక్ రిలీజ్
'నాటకం', 'తీస్ మార్ ఖాన్' సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేస్తున్నారు. దసరా సందర్భంగా ఆ చిత్రం అప్డేట్ ఇచ్చారు. 'మారియో' అనే టైటిల్ నిర్ణయిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.హీరోహీరోయిన్లుగా అనిరుధ్, హెబ్బా పటేల్ నటించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో 'మారియో' చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. -
సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం.. తన భార్య, కొడుకుతో కలిసి పెళ్లిలో సందడి చేశాడు. తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న డేనియల్ విశ్వాస్.. మాధురి అనే అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లిలోని ఓ చర్చిలో ఈ శుభకార్యం జరిగింది. దీనికి కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ అందరూ హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ గతేడాది రిలీజైన 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం 'కె ర్యాంప్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఇకపోతే తన చిత్రాలు 'వినరో భాగ్యము విష్ణుకథ', 'క' సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసిన డేనియల్ విశ్వాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో కిరణ్.. తన భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి మరీ వేడుకకు హాజరయ్యాడు.(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం) -
'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
సినిమా పైరసీ రాకెట్ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్కార్డులు, హార్డ్డిస్క్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ (Fact Check) టీమ్ చెప్పింది.ఐ బొమ్మ గురించి తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ పేజీ తమ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. 'కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.' అని తెలిపింది.#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025 -
నా కుమార్తె నగ్న చిత్రాలు అడిగారు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని గుర్తు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక కలతపెట్టే సంఘటనను పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.సైబర్ నేరగాళ్లు తన కుమార్తెతో ఎలా ప్రవర్తించారో ఇలా పంచుకున్నారు. "కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, వెళ్లి నా భార్యతో చెప్పింది. ఇలాంటివి సైబర్ నేరంలో ఒక భాగం.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో ఏడవ తరగతి నుంచే పిల్లలకు ఈ నేరాల గురించి తెలియాలి. అందుకోసం ప్రతి స్కూల్లో సైబర్ పీరియడ్ అని ఒక గంట సమయం కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి నేరాళ గురించి పిల్లలకు వివరించాలి. నేటి ప్రపంచంలో సైబర్ నేరం వీధి నేరాల కంటే ప్రమాదంగా మారుతోందని మీ అందరికీ తెలుసు. ఈ నేరాన్ని ఆపడం చాలా ముఖ్యం..." అని అక్షయ్ వెల్లడించారు. ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు కూడా ఆవతల మరో వ్యక్తితో ఆడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తన కుమార్తె ఘటనను అక్షయ్ గుర్తుచేశారు.ముంబైలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మహారాష్ట్ర), రష్మి శుక్లా, ఇక్బాల్ సింగ్ చాహల్ (ఐపీఎస్), రాణి ముఖర్జీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
స్టార్ క్రికెటర్ సోదరి.. 'బిగ్బాస్'లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) హోస్ట్గా ‘బిగ్బాస్ 19’( Bigg Boss 19) ఆగష్టులో మొదలైంది. హిందీలో కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఈ షోలోకి భారత క్రికెటర్ అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈమేరకు సోషల్మీడియాలో పలు పోస్ట్లు కనిపిస్తున్నాయి.ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malti Chahar) హిందీ బిగ్బాస్-19లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి బాలీవుడ్ పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్గా కూడా రాణిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మాల్తీకి సుమారు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2014లో ఫెమినా మిస్ ఫోటోజెనిక్, మిస్ సుడోకు కిరీటాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్లతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. View this post on Instagram A post shared by Malti Chahar (@maltichahar) -
వెంకీ & త్రివిక్రమ్ మూవీలో నా రోల్..?
-
వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ ఎమోషనల్
దసరా వచ్చిందంటే ఆయుధపూజ చేయాల్సిందే! ఇంట్లో ఉన్న బండిని తళతళా మెరిసేట్టు శుభ్రంగా కడిగి పూజ చేసి దిష్టి తీయాల్సిందే! కమెడియన్ వైవా హర్ష (Harsha Chemudu) కూడా అదే చేశాడు. తన కార్లు, బైకులన్నింటినీ శుభ్రంగా కడిగి దండవేసి ఇంటి ముందు రెడీగా పెట్టాడు. భార్యతో కలిసి వాహనపూజ చేశాడు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.ఫ్యామిలీ త్యాగాలుఆయుధపూజ చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తాం. ఇవన్నీ చేయటానికి ఎంతో కష్టపడతాం. ఆటోమొబైల్స్ మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నేను ఎన్ని వాహనాలు కొంటున్నా అడ్డు చెప్పని ఫ్యామిలీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను బాధపడకూడదన్నదే వాళ్ల కోరిక. అలాగే ఇది నా చిన్ననాటి కల.నా ఇంటినిండా అవే..చిన్నప్పుడు కార్లు, బైకులంటూ వాటి ఫోటోలతో నా గదినంతా నింపేసేవాడిని. ఎక్కడ చూసినా వాటి స్టిక్కర్లే ఉండేవి. నా పాకెట్మనీలో కొంత డబ్బు దాచుకుని దానితో ఆటోమొబైల్స్ మ్యాగజైన్లు కొనుక్కునేవాడిని. కొద్దిరోజుల్లోనే అది పూర్తిగా చదివేసి.. మళ్లీ తర్వాతి నెల మ్యాగజైన్ కోసం ఎదురుచూసేవాడిని. అలా నా చిన్నప్పుడు నేను ఇష్టపడ్డ వాహనాలను సేకరిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటూ పోతున్నాను. అందుకే నా దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయి.మీ వల్లే ఇదంతా..మీ సపోర్ట్ లేకుంటే ఇవన్నీ కొనగలిగేవాడినే కాదు. నన్ను మీలో ఒకడిగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థాంక్స్. నా ప్రతి విజయంలో మీ భాగస్వామ్యం ఉంది. మీవల్లే నేనిక్కడ ఉన్నాను. మీవల్లే నా కలల్ని సాకారం చేసుకోగలుగుతున్నాను అని రాసుకొచ్చాడు. వైవా హర్ష.. ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్, తండేల్, సారంగపాణి జాతకం, జూనియర్, బకాసుర రెస్టారెంట్ చిత్రాల్లో మెరిశాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి -
మెగాస్టార్ వింటేజ్ లుక్ కోసం పోటీ పడుతున్న డైరెక్టర్స్
-
అనసూయ 'అరి' మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం అరి. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు.అరి రిలీజ్ ఎప్పుడంటే?లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి మెసేజ్తో ‘అరి’ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
హిట్ కాంబో రిపీట్... శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
హీరోయిన్ సమంత బ్యూటీఫుల్ లుక్స్.. (ఫొటోలు)
-
కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత
దసరా పండగ సందర్భంగా తన జీవితంలోని ఓ స్పెషల్ న్యూస్ను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త ప్రయాణం అంటూ తన ఇంటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే పూజగది ఫోటోను కూడా షేర్ చేసింది. ఇంటి బయట గోడపై తన నిక్నేమ్ SAM అనే లోగో అందంగా అమర్చి ఉంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్లో ఉందా? ముంబైలోనిదా? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్తిల్లు కొన్న సామ్కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసమంత సినిమాల విషయానికి వస్తే.. ఏమాయ చేసావె మూవీతో తెలుగులో తన జర్నీ మొదలుపెట్టింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మజిలి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల్లుడు శీను, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 1లో ఉ అంటావా మావా.. అనే ఐటం సాంగ్లో తళుక్కుమని మెరిసింది. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో నటించడంతో పాటు ఈ మూవీని తనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.చదవండి: ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే! -
OG డైరెక్టర్ సుజిత్తో హీరో నాని కొత్త చిత్రం ప్రారంభం
-
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ను గ్రాండ్గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు. -
ఏయ్.. మీసాల పిల్ల.. నయన్ను ఆటపట్టించిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి.ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. మీసాల పిల్ల పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. మా ఊర్లో కుర్రోళ్లు పొగరుమోతు పిల్లని క్యూట్గా… మీసాల పిల్ల అని పిలుస్తారు అంటూ ఆటపట్టించారు. ఈ హిలారియస్ కామెడీ ప్రోమో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు. -
అనగనగా ఒక రాజు.. ప్రమోషన్స్ వేరే లెవెల్!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచాడు. పొలిశెట్టి హీరోగా వస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమా రిలీజ్కు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రమోషన్స్లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రోమోను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దసరా కావడంతో మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినీ ప్రియులకు నవీన్ పొలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని పొలాల మధ్య చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఆడియన్స్ను అలరిస్తోంది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. -
పవన్ కళ్యాణ్ 'పురుష' షూటింగ్ పూర్తి
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఓ డిఫరెంట్ కామెడీ మూవీ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ 'పురుష' అనే సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ఉలవల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమా వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్లు హీరోయిన్లు. తాజాగా ఓ ప్రత్యేక గీతం పూర్తి చేసి షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. -
డైరెక్టర్గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT— ahavideoin (@ahavideoIN) October 2, 2025 -
కార్తీక్ రాజు హీరోగా 'విలయ తాండవం'.. పోస్టర్ లాంచ్
యువ హీరో కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విలయ తాండవం'. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద మందల ధర్మారావు, గుంపు భాస్కరరావు నిర్మిస్తున్నారు. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన టైటిల్ పోస్టర్ బుధవారం (అక్టోబర్ 1) రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశ్ పూరీ, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు.ఆకాష్ పూరి మాట్లాడుతూ.. 'విలయ తాండవం' టైటిల్ పవర్ఫుల్గా ఉంది. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'కార్తీక్ రాజు నేను తీసిన 'కౌసల్యా కృష్ణమూర్తి' చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. ఈ 'విలయ తాండవం'తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి అని అన్నారు. -
రాజుగారి నాలుగో గది.. హిట్ కాంబో మరోసారి
దసరా సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ వస్తుంటాయి. ఈసారి కూడా అలానే పలు చిత్రాలవి వచ్చేశాయి. వీటిలో హారర్ ఫ్రాంచైజీ అయిన రాజుగారి గది నాలుగో భాగం ఒకటి కాగా.. సామజవరగమన కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఈ క్రమంలోనే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.(ఇదీ చదవండి: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం)యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారిన తర్వాత 'రాజుగారి గది' సినిమాలతో ఫేమస్ అయ్యాడు. అయితే తొలి పార్ట్ సూపర్ హిట్ అయింది. రెండు, మూడో పార్ట్స్ మాత్రం యావరేజ్ అనిపించుకున్నాయి. మూడో భాగం 2019లో రాగా దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు నాలుగో భాగాన్ని అనౌన్స్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుందని చెప్పుకొచ్చారు. ఈసారి కాళికా దేవి బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీయబోతున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది.2023లో అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిన సినిమా 'సామజవరగమన'. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకుడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా లాంఛనంగా పూజతో ప్రాజెక్టుని ప్రారంభించారు. అయితే ఇది 'సామజవరగమన' సీక్వెలా లేదంటే కొత్త స్టోరీతో తీస్తున్నారా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ) -
అఖండ 2 రిలీజ్ డేట్ పోస్టర్.. నయనతార కొత్త సినిమా
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ సినిమా అఖండ 2 రిలీజ్ డేట్ను దసరా సందర్భంగా ఒక పోస్టర్తో మేకర్స్ ప్రకటించారు. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం రానుంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మరోవైపు నయనతార, దర్శకుడు సుందర్.సి కాంబినేషన్ సినిమా ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగులో మహాశక్తి పేరుతో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రాజుగారి గది-4 పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. యాంకర్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. -
కేసుల నేపథ్యంలో విదేశాలకు శిల్పాశెట్టి దంపతులు..
ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు(ఎల్వోసీ) జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.60 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో ఈ జంట నిందితులుగా ఉంది. దీంతో ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ దంపతులకు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ విషయంలోనే ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించింది.తమపై ఉన్న లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని ముంబై హైకోర్టును శిల్పాశెట్టి దంపతులు ఆశ్రయించారు. ఈమేరకు వారి తరఫున ఒక పిటిషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో వారి లాయర్ ఇలా చెప్పారు. రాజ్కుంద్రా ఒక వ్యాపారవేత్త అని.., శిల్పాశెట్టి సినీ నటి కావడంతో ఇరువురు తరచుగా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆమె తన వృత్తిపరమైన పనుల కోసం నిత్యం ప్రయాణించాల్సి ఉంటుందని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. వారిద్దరూ కేవలం నిందితులు మాత్రమేనని వారు తమ వ్యాపారం, వృత్తిని కొనసాగించే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు. లుకౌట్ నోటీసుల పేరుతో వారి అవకాశాలను దూరం చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. జనవరి 2026 వరకు లుకౌట్ నోటీసుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, వారి అభ్యర్తనను న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది. దీంతో వారికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి రావచ్చని తెలుస్తోంది. -
శారీలో నిహారిక లుక్స్.. ఫెస్టివ్ మూడ్లో దిల్ రాజు సతీమణి!
శారీలో నిహారిక కొణిదెల ఫెస్టివ్ లుక్స్..ఫెస్టివ్ మూడ్లో దిల్ రాజు సతీమణి తేజస్విని..ఐస్లాండ్లో చిల్ అవుతోన్న మంచు లక్ష్మీ..శారీలో నివేదా థామస్ బ్యూటీఫుల్ లుక్..సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి సాహితి..కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి డిఫరెంట్ పోజులు.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
బాబా బ్లాక్ షీప్.. పోస్టర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్
గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బాబా బ్లాక్ షీప్ అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు.దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా బా బా బ్లాక్ షీప్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ను చూస్తుంటే.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. -
అనుమతి లేకుండా నాగార్జున పేరు వాడితే అంతే
తన హక్కులకు రక్షణ కల్పించాలంటూ తెలుగు హీరో నాగార్జున.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని పేర్కొంది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.(ఇదీ చదవండి: శుభవార్త.. నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్)అయితే నాగార్జున ఫొటోని, గాత్రాన్ని అభ్యంతర కంటెంట్తో పాటు నకిలీ ఎండోర్స్మెంట్, టీ షర్ట్స్ తదితర వ్యాపారాల్లో.. యూట్యూబ్ షార్ట్స్లోనూ ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారని నాగ్ తరఫు న్యాయవాదాలు.. ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నాగ్కి అనుకూలంగా తీర్పు వచ్చింది.ఇక మీదట సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాగార్జున హక్కులకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానం ఆదేశించింది. నాగార్జున ఇప్పుడు ఇలా చేయడంతో ముందు ముందు ఇతర సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు విషయమై ఇదే దారిలో వెళ్తారని అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) -
త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన
అల్లు వారి ఇంట్లో శుభకార్యం. బన్నీ సోదరుడు, హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మధ్యనే మూడు నాలుగు రోజుల క్రితం శిరీష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్మెంట్ జరగనుందని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్)'మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నయనికతో నాకు నిశ్చితార్థం అక్టోబరు 31న జరగనుంది. కొన్నాళ్ల క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆశీర్వదాలు కచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను' అని శిరీష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.అల్లు అరవింద్ కొడుకుగా అందరికీ తెలిసిన శిరీష్.. 'గౌరవం' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా కొత్త ప్రాజెక్టులు చేయట్లేదు. దీంతో ఏం చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. (ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
శశిరేఖగా నయనతార.. దసరాకు మరో సర్ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి కొణిదెల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్యే చిరు-నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఈ మూవీ నుంచి నయనతార ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరాకు సర్ప్రైజ్పసుపురంగు చీరలో, కొప్పున పూలెట్టుకుని, చేతిలో ఓ గొడుగు పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది నయన్. రేపు (అక్టోబర్ 2న) దసరా కానుకగా ఓ సర్ప్రైజ్ ఉంటుందన్నారు. అంటే మూవీ నుంచి ఏదైనా గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉండొచ్చన్నమాట! ఇక ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలవుతోంది. Introducing #Nayanthara garu as ‘SASIREKHA’ in our #ManaShankaraVaraPrasadGaru 🤗✨It’s an absolute joy to have her in this beautiful role and to work with her. Tomorrow, get ready for a delightful surprise from #MSG ❤️#ChiruAnil - Sankranthi 2026 🥳 pic.twitter.com/lvS2TO8fSi— Anil Ravipudi (@AnilRavipudi) October 1, 2025 -
రాజాసాబ్ ట్రైలర్ బ్లాక్ బస్టర్.. రూ. 1000 కోట్లు పక్కా
-
మరో వివాదంలో సినీ నటి డింపుల్ హయతి
-
కత్తిలాంటి హీరోయిన్ని పట్టేసిన సుడిగాలి సుధీర్! (ఫొటోలు)
-
దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీజులు డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ (22) షేక్పేటలోని వెస్ట్వుడ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడ చేరినప్పటినుంచి డింపుల్, డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వకుండా రోజూ హింసిస్తున్నారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నంమంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు యత్నించారని ఆరోపించింది. వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కిందపడేసి పగలగొట్టాడని పేర్కొంది. తన తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారని భయాందోళన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డింపుల్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గల్ఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతి.. యురేఖ, ఖిలాడి, రామబాణం సినిమాలు చేసింది. గద్దలకొండ గణేశ్లో స్పెషల్ సాంగ్లో మెరిసింది.చదవండి: నవంబరులో కొదమసింహం -
నవంబరులో కొదమసింహం
చిరంజీవి కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘కొదమసింహం’ ఒకటి. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా, మోహన్బాబు విలన్ పాత్రపోషించారు. కె. నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘన విజయాన్ని సాధించింది. ముప్పైఐదేళ్ల తర్వాత ఈ సినిమాని నవంబరు 21న రీ రిలీజ్ చేయనున్నట్లు రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వరరావు తెలిపారు.‘‘చిరంజీవి కౌబాయ్గా నటించి, ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘కొదమసింహం’. రాజ్–కోటి సంగీతం, మోహన్బాబు వినోదం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్తో సరికొత్తగా నవంబరు 21న రీ రిలీజ్ చేయబోతున్నాం’’ అని కైకాల నాగేశ్వర రావు చెప్పారు. -
బీచ్లో సాయిపల్లవి సిస్టర్.. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్!
బీచ్లో సాయి పల్లవి సిస్టర్ చిల్.. బ్లూ డ్రెస్లో మరింత హాట్గా బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్. సిస్టర్ మెహందీ వేడుకల్లో మెరిసిన బుల్లితెర నటి శివంగి జోషి.. డిఫరెంట్ స్టైల్లో అతియా శెట్టి లుక్..యూఎస్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ కార్తీక నాయర్.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
దుర్గమ్మ సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్న నటి హేమ
టాలీవుడ్ సహాయ నటిగా చాలా సినిమాలు చేసిన హేమ.. కొన్నాళ్ల నుంచి అస్సలు నటించట్లేదు. గతేడాది డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులకు పట్టుబడిన ఈమె.. కొన్నాళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగింది. ఎలాగోలా ఆ గండం నుంచి గట్టెక్కింది. అప్పటినుంచి వీలైనంత తక్కువగానే బయట కనిపిస్తున్న హేమ.. సోమవారం ఉదయం విజయవాడ దుర్గమ్మని దర్శించుకుంది. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.'ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. గతేడాది మీరందరూ నాపై వేసిన నీలాపనిందులని దుర్గమ్మ తుడిచిపెట్టింది. చేయని తప్పునకు అందరూ నన్ను బలి చేశారు. అయితే నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజు నన్ను గుడికి వచ్చేటట్లు ఆ దుర్గమ్మే చేసింది. కానీ దాని నుంచి బయటపడటం నా వల్ల కాలేదు. ప్రతిక్షణం దుర్గమ్మ తల్లి.. నేనున్నాను నువ్వు ముందుకెళ్లు అని నన్ను బతికించింది''ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేను. దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని వేయండి. ఈ రోజు నేను గుడిలో ఉండి చెబుతున్నాను. ఏ తప్పు చేయలేదు' అని కన్నీళ్లు పెట్టుకుని హేమ ఎమోషనల్ అయిపోయింది. అలానే సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాల్ని కూడా చెబుతూ.. ఈవెంట్స్, బిజినెస్ చాలా ఉన్నాయి. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ప్రతి గుడిలో పూజారులు నా కోసం పూజలు చేశారు. హేమమ్మ క్షేమంగా రావాలని కోరుకున్నారు అని చెప్పుకొచ్చారు. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర-2.. కొరటాల శివ బిగ్ ప్లాన్!
జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్ఫుల్ రోల్ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్ఫుల్ రోల్కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY— Movie Tamil (@_MovieTamil) September 30, 2025 -
అల్లర్ల భూమిగా మార్చేశారు.. విజయ్పై సినీ నటి కామెంట్స్
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్పై తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తుంది. తమిళనాడులో తన ఉణికి కూడా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కనీసం ఒక వీడియో రూపంలో కూడా స్పందించ లేదు. కేవలం సోషల్మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే షేర్ చేశారు. దీంతో నెటిజన్లు నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.ఇప్పటికే విజయ్ని అరెస్ట్ చేయాలంటూ సినీ నటి ఓవియా సోషల్మీడియాలో ఒక పోస్ట్ పంచుకుంది. అయితే, తాజాగా ఆమె మరోసారి ఇలా రియాక్ట్ అయింది. కరూర్ సంఘటన తర్వాత, రజనీకాంత్ సర్, అజిత్ సర్, సూర్య సర్ అభిమానుల మీద నాకు గౌరవం పెరిగింది. వారిలో చాలామంది సరైన మార్గంలో వెళ్తున్నారు. కానీ, విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చాలా ప్రమాదకరమైన ట్వీట్లు చేస్తూ.. హింసను సృష్టిస్తున్నాడు. అతను తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.' అంటూ ఆమె పేర్కొన్నారువిజయ్ అభిమానులపై కూడా తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి. విజయ్కు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారు బూతులతో ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. సోషల్మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఓవియాను టార్గెట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ భారీగా పోస్ట్లు షేర్ చేస్తున్నారు. After #Karur incident, my respect for Rajini sir, Ajith sir, and Suriya sir has grown as their fans walk on the right path.But Vijay is misleading youngsters, making people like Adhav Arjuna post harmful tweets and create violence.He is turning Tamil Nadu into a land of riots. pic.twitter.com/XccxjsfAYG— Oviya (@oviya__offll) September 30, 2025 -
అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్.. ఇంతకీ ఎవరితడు?
'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ టచ్ చేసిన అల్లు అర్జున్.. పార్ట్ 2తో సరికొత్త రికార్డులు కూడా సృష్టించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్నటివరకు బన్నీ డ్యాన్స్ అంటే టాలీవుడ్ లేదా బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ స్టెప్పులు కంపోజ్ చేసేవారు. ఇప్పుడు అట్లీతో మూవీ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చారు. ఇంతకీ ఇతడెవరు?ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషి.. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం స్టెప్పులు కంపోజ్ చేయబోతున్నాడు. గత నెల రోజుల నుంచి ఓ భారతీయ సినిమా కోసం పనిచేస్తున్నానని అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ విషయాలు చెప్పకూడదు అంటూ ఇన్ స్టాలో కొనిషి ఓ పోస్ట్ పెట్టాడు. బన్నీతో ఇతడు కలిసున్న ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి 'ఓజీ'కి లేదుగా సాహో రేంజీ...)కొనిషి.. డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్. పుట్టింది జపాన్లో పెరిగిందంతా ఇంగ్లాండ్లో. విచిత్రమైన అవతారంలో కనిపించే ఇతడికి పలు దేశాల్లో అభిమానులున్నారు. 15 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ లాంటివి నేర్చుకోకముందే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. హిప్ హాప్ డ్యాన్స్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అమెరికన్ హిప్ హాప్ 'క్వెస్ట్ క్రూ'తో కలిసి పనిచేశాడు.అయితే అమెరికన్ రియాలిటీ షో 'సో యూ థింగ్ యూ కెన్ డ్యాన్స్' 1,2,3 సీజన్లలో పాల్గొని చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో సీజన్లో రన్నరప్గా నిలిచినప్పటికీ అందరినీ ఆకట్టుకున్నాడు. 2008లోనే ఎమ్మ అవార్డ్ కూడా అందుకోవడం విశేషం. ఇలాంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు బన్నీకి స్టెప్స్ కంపోజ్ చేస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఆ పాట ఏ రేంజులో ఉండబోతుందో?(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. హీరో ఎవరంటే?) View this post on Instagram A post shared by Hok (@hok) -
భారత సినిమా పై ట్రంప్ బాంబ్
-
ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌతేలా
నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)కు చిక్కులు తప్పవని తెలుస్తోంది. తాజాగా ఈడీ విచారణకు ఊర్వశి హాజరైంది. కొద్దిరోజుల క్రితం విచారణకు రావాలని ఆమెకు ఈడీ కార్యాలయం సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు వెళ్లింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంత డబ్బు సంపాదించారు..? తనను వారు ఎలా సంప్రదించారు..? మనీ ట్రాన్షక్షన్స్ ఎలా చేస్తారు..? వంటి అంశాల గురించి ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్లోని స్టార్స్ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, సోనూ సూద్ వంటి స్టార్స్తో పాటు సురేశ్ రైనా వంటి క్రికెటర్స్ కూడా ఈ కేసులో ఉన్నారు. -
ప్రశాంత్ వర్మ సినిమా.. శుక్రాచార్యుడిగా ప్రముఖ నటుడు
'హనుమాన్' సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'తో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే చిత్రంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహాకాళి చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇచ్చారు. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్న నటించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మహాకాళి సినిమాని చాలారోజుల క్రితమే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్కు ప్రశాంత్ వర్మ స్టోరీ మాత్రమే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ ఖన్నా రీసెంట్గా వచ్చిన ఛావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుందని ప్రచారం జరుగుతుంది.In the shadows of gods,rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025 -
సుడిగాలి సుధీర్ ‘హైలెస్సో’ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ఇదే లాస్ట్ వార్నింగ్.. కాస్త హద్దుల్లో ఉండండి: హీరోయిన్
గత 15 ఏళ్లగా హీరోయిన్గా రాణిస్తున్న మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్. మాతృభాషలోనే కాకుండా తమిళంలోనూ పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్లోకి కూడా వచ్చేస్తుంది. శ్రీవిష్ణుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.కోన వెంకట్ సమర్పణలో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆమె చంద్రముఖి2, విజయ్ ఆంటోని (రక్తం) మూవీలో ఆమె నటించారు. సుమారు 50కి పైగా మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన నంబియార్ సోషల్మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా ఎంతమాత్రం తగ్గరనే పేరు ఉంది.దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఈమెను పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. అదే ఇప్పుడు ఈమెకు కోపాన్ని రేకెత్తిస్తోంది. దీంతో మహిమా నంబియార్ యూట్యూబ్ ఛానల్స్కు హెచ్చరికలు జారీ చేశారు. దీని గురించి ఈమె తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొంటూ ఇటీవల కాలంలో తన గురించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయన్నారు. అలాంటి వదంతులను ఇప్పటి వరకూ సహిస్తూ వచ్చానని, ఇకపై సహించేది లేదని చట్టపరమైన చర్చలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇంత కాలం తన గురించి జరుగుతున్న వదంతులను శాంతంగా సహిస్తూ వచ్చానని, ఇకపై అలా ఉండదని, తాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అదే విధంగా తన వ్యక్తగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. ఒక వేళ ఎవరైనా హద్దులు దాటి తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్చలు తీసుకుంటాననీ, ఇదే తన చివరి హెచ్చరిక అంటూ నటి మహిమా నంబియార్ పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూడు పదుల అమ్మడు అంతగా హర్ట్ అయిన ప్రచారం ఏమిటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. -
హైలెస్సో ఆరంభం
సుడిగాలి సుధీర్ (సుధీర్ ఆనంద్) హీరోగా ‘హైలెస్సో’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్పై శివ చెర్రీ, రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్, అతని సరసన హీరోయిన్లుగా నటిస్తున్న నటాషా సింగ్, నక్ష శరణ్, కీలక పాత్ర పోషిస్తున్న అక్షర గౌడలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకులు మెహర్ రమేశ్, చందు మొండేటి, వశిష్ఠ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. హీరో నిఖిల్ టైటిల్ను లాంచ్ చేశారు. నిర్మాత బన్నీ వాసు స్క్రిప్ట్ను అందజేశారు.గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ మహిళ కాలు, ముఖం కనిపించకుండా చేతిలో ఆయుధం పట్టిన ఓ మిస్టీరియస్ ఫిగర్, అన్నం, పువ్వులు వంటి వాటితో డిజైన్ చేసిన పోస్టర్ని విడుదల చేశారు. ‘‘మా సినిమా మోషన్ పోస్టర్, టైటిల్ను లాంచ్ చేసిన నిఖిల్గారికి, అతిథులుగా విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని సుధీర్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సుజాత సిద్ధార్థ్. -
సన్నీ లియోన్ కీలక పాత్రలో పాన్ ఇండియా మూవీ!
యోగేశ్ కల్లే, అకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం త్రిముఖ. సన్నీ లియోన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే రివీల్ చేయనున్నారు. పాన్ ఇండియాలో రేంజ్లో హిందీ, తెలుగు భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను చేరువయ్యేలా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, మోట్టా రాజేంద్రన్, ఆషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు వినోద్ యజమాన్య సంగీతమందిస్తున్నారు. -
బాలయ్య కామెంట్స్పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా చేయొద్దన్న చిరంజీవి
మెగా అభిమాన సంఘాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఫ్యాన్స్కు వద్దని వారించారు. అది మన సంస్కారం కాదంటూ అఖిల భారత చిరంజీవి యువతకు సూచించారు. మెగాస్టార్ విజ్ఞప్తితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్తున్న అభిమానులు విరమించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఫ్యాన్స్.. బాలయ్యపై పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.మెగాస్టార్ వద్దని వారించడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. అభిమాన సంఘాల విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అప్రమత్తమై వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది. టారిఫ్ ప్రభావం ఎలా ఉంటుందంటేఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.పరిశ్రమలో ఆందోళనఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ‘అమెరికా సినిమా పరిశ్రమను రక్షించేందుకు’ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇది అంతర్జాతీయ సినిమా వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ప్రభాస్ డార్లింగ్స్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సతీమణికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లనున్నారు. Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x— Allu Arjun (@alluarjun) September 29, 2025 -
బాలకృష్ణ వ్యాఖ్యలపై మరోసారి 'చిరు' కామెంట్
కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో విదేశాల్లో ఉన్న చిరంజీవి ఆ కామెంట్లపై స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా చిరు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియా వారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు.చిరంజీవి తన వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడాలని మీడియా వారు కోరారు. అయితే, విలేకరులు అడిగే ప్రశ్నలను ఆయన దాటవేశారు. ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పేశానని క్లారిటీ ఇచ్చారు. ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిరు హైదరాబాద్ ఎయిర్పోర్టుకి వస్తున్నారనే విషయం తెలిసి అభిమానులు భారీగానే వచ్చారు. వారితో సెల్ఫీలు ఇస్తూ దిగి ఆయన వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే మీడియాకు లేఖ రాసిన చిరంజీవి.బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులతో పాటు కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యల వల్ల చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే పవన్కళ్యాణ్ను చంద్రబాబు పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. -
పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ కమెడియన్.. ఆసక్తిగా టైటిల్!
జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు లాంటి చిత్రాలతో మెప్పించాడు. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో వస్తోన్న ఐదో చిత్రానికి హైలెస్సో అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్తో పాటు పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈ మూవీకి కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. With the divine blessings of Gangalamma Thalli, we humbly begin our journey🙏Here's #HaiLesso Motion Poster🔥In Telugu, Tamil, Malayalam & Kannada✨ @Iamnatashasingh @naksha_saran #AksharaGowda @actorsivaji @sivacherry9 #Ravikiran @iamkumarkota @anudeepdev @ChotaKPrasad… pic.twitter.com/1I7DyDkBRI— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 An arrival of our holy diety in her fierce avatar ❤️🔥@sudheeranand's next #SS5 titled as #HaiLesso 🔥A divine & rooted tale of our culture is coming to thrill you all 🙏💥Shoot begins soon⌛️In Telugu, Tamil, Malayalam & Kannada✨ Directed by @iamkumarkotaProduced by… pic.twitter.com/KtYZR7LyD0— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 -
'రష్మికా మందన్న' గ్లామరస్ సాంగ్ విడుదల
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా(Rashmika) నటించిన కొత్త చిత్రం థామా(Thamma).. హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి తాజాగా ఒక సాంగ్ను విడుదల చేశారు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న ఈ మూవీ విడుదల కానుంది. యూత్ను ఆకట్టుకునేలా మరింత గ్లామర్గా ఈ సాంగ్ కోసం రష్మిక కనిపించింది. -
'బాయ్కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?
ఉన్నట్టుండి సడన్గా 'కాంతార ఛాప్టర్ 1' సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ కనిపిస్తోంది. 'బాయ్ కాట్ కాంతార' అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావుడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు మనమెందుకు ఆ చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగులో మాట్లాడలేదు ఇంత పొగరా? అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పనిచేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు?రిషభ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో రిలీజై బ్లాక్బస్టర్ అందుకున్న చిత్రానికి ఇది ప్రీక్వెల్. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి సడన్గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే దీని వెనక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)ఎందుకంటే మొన్నీమధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలిరోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు చిత్రానికి ఏమంత చెప్పకోదగ్గ వసూళ్లు రావటం లేదు. తొలిరోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ.. రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తుంది. ఇప్పుడు గానీ 'కాంతార 1' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారంటీ!మరి కారణం ఇదేనో ఏమో తెలీదు గానీ 'బాయ్ కాట్ కాంతార' అని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కానీ అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకుని 'కాంతార'ని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది! చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా! కానీ ఈ మధ్య కాలంలో అలాంటివే కనిపించలేదు. మరి కేవలం 'కాంతార'నే ఎందుకు టార్గెట్ చేసినట్లు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం) -
'శశివదనే' లవ్స్టోరీ.. ట్రైలర్ విడుదల
‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'... ఇందులో కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్గా హిట్-3 సినిమాతో ఆమె మరింత గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 'శశివదనే' చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్తో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది గోదావరి నేపథ్యంలో సాగే ఫీల్గుడ్ వింటేజ్ విలేజ్ లవ్స్టోరీ. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
విక్రమ్తో సినిమా.. కథ విన్న తర్వాత రిజెక్ట్ చేశారు: డైరెక్టర్
కోలీవుడ్ నటుడు విక్రమ్కు పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఉన్నారు. ఆయనకు కథ నచ్చిందంటే అందులో నటించడానికి ఎంతవరకైనా వెళతారు. అయితే కథ ఆయనకు నచ్చాలి అంతే. వీరదీరసూరన్ చిత్రం తర్వాత విక్రమ్ ఇప్పటివరకు మరో చిత్రంలో నటించలేదు. అయితే పలు కథలు వింటున్నారు. అలా 96, సత్యం సుందరం చిత్రాల దర్శకుడు ప్రేమ్కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అది కూడా సెట్ పైకి వెళ్లలేదు. అందుకు కారణాలను దర్శకుడు ప్రేమ్కుమార్ తెలుపుతూ.. తాను విక్రమ్ హీరోగా చిత్రం చేయాలని భావించినప్పుడు కథ రెడీ కాలేదని తెలిపారు. అయితే తన వద్ద ఉన్న రెండు కథలు సింగిల్ లైన్లను ఆయనకు వినిపించానని చెప్పుకొచ్చారు. అందులో విక్రమ్కు ఒక కథ నచ్చడంతో చేద్దామని కూడా చెప్పారు. దీంతో తాను పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి విక్రమ్ కు చెప్పగా ఆయన ఈ స్క్రిప్టు కాదు మీరు చెప్పిన ప్రేమకథా చిత్రం చేద్దామని మరోసారి చెప్పారు. అయితే ఓ చిత్రానికి కథను సిద్ధం చేసిన తర్వాత మరో కథను రెడీ చేయడానికి చాలా సమయం పడుతుందని విక్రమ్తో తాను చెప్పానన్నారు. దీంతో విక్రం హీరోగా చేయాల్సిన కథ అలా నిలిచిపోయిందని దర్శకుడు ప్రేమ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఫహాద్ ఫాజిల్కు మలయాళంతో పాటు తెలుగు, తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఈయన ఇటీవల వడివేలుతో కలిసి నటించిన మారిశన్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రేమ్కుమార్ దర్శకత్వంలో ఫాహత్ ఫాజిల్ నటించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
జక్కన్న - మహేష్ మూవీ రూమర్స్.. అదే గనుక నిజమైతే..!
-
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (ఫొటోలు)
-
ధన పిశాచి రాబోతోంది!
సుధీర్బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్స్ ఇండియా సినిమా ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో జీ స్టూడియోస్పై ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్స్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా నుంచి ‘ధన పిశాచి రాబోతోంది’ అంటూ ఓ సాంగ్ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ సోనాక్షీ సిన్హా పోస్టర్ని విడుదల చేశారు. ‘‘సెప్టెంబర్ 30న ధన పిశాచి రాబోతోంది.. చెడు నయా అవతారాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ క్యాప్షన్ని జత చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ని బట్టి చూస్తే డబ్బు అంటే పిచ్చి ఉన్న పాత్రలో సోనాక్షి కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా, క్రియేటివ్ ప్రోడ్యూసర్: దివ్యా విజయ్. -
ఈ ఫోటోలోని టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా?
చిన్నప్పుడు మనల్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులను ఎలాగో తీసుకురాలేం కానీ.. ఆ జ్ఞాపకాలు మనతో పాటే ఉంటే ఎంత బాగుంటుంది. బాల్యం, యవ్వనంలో స్మృతులు ఎవరి జీవితంలోనైనా వెలకట్టలేనివే. అలాంటి క్షణాలు మనతో ఉండాలని కోరుకుంటాం. అదీ సాధ్యం కాకపోవచ్చు. ఆ జ్ఞాపకాలను గుర్తుగా కొన్ని ఫోటోలు ఉన్నా చాలు. వాటిని చూసి తెగ మురిసిపోతాం. అలాంటి జ్ఞాపకాన్నే మనతో పంచుకున్నారు టాలీవుడ్ యాక్టర్. ఇంతకీ ఆయనెవరో మీరు కూడా చూసేయండి.తాజాగా మన టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తన చిన్ననాటి రోజులను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. టీనేజ్లో ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న వాటిని ఒకసారి అలా తిరగేస్తుంటే అనుకోకుండా కుటుంబంతో ఉన్న పాత ఫోటో కనిపించందని ట్వీట్ చేశారు. ఈ ఫోటోను చూసిన అందమైన క్షణం.. నా కుటుంబంతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిందని రాజీవ్ కనకాల రాసుకొచ్చాడు. మేమంతా ఒక కుటుంబంగా పంచుకున్న ప్రేమ, నవ్వుకు ఈ చిన్ననాటి ఫోటో నిదర్శనమని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, నటుడిగా మెప్పించిన రాజీవ్ కనకాల.. యాంకర్ సుమను పెళ్లాడిన సంగతి తెలిసిందే. Stumbled upon this old family photo while browsing through our archives. Seeing this brings back so many beautiful moments and memories spent together. Grateful for all the love and laughter we’ve shared as a family.#photo #old #memories💕 pic.twitter.com/RgGeq5GpHS— Raajeev kanakala (@RajeevCo) September 27, 2025 -
వీళ్లే నా జీవితం.. సెపరేట్గా ఉంటున్నా: నిహారిక
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ మధ్యే పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు మగపిల్లాడు జన్మించాడు. అత్తగా ప్రమోషన్ పొందడంతో నిహారిక (Niharika Konidela) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక అత్తగా ఫుల్ బిజీ అయ్యానంటోంది. ఆమె మాట్లాడుతూ.. మా అన్నకు కొడుకు పుట్టినప్పటినుంచి నాకెవరూ పనులు చెప్పడం లేదు. సెపరేట్గా ఉంటున్నా..ఎందుకంటే నేనెప్పుడూ వాడిని ఎత్తుకునే ఉంటున్నాను. లేకపోతే నీళ్లు తీసుకురాపో, ఆ పని చేయు అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాడు పెద్దయ్యాక యాక్టర్ అవుతానంటే మాత్రం కచ్చితంగా నా బ్యానర్లోనే సినిమా తీస్తాను. ప్రస్తుతం నేను సెపరేట్గా ఉంటున్నాను. అలా అని కుటుంబానికి దూరంగా ఉండను. రెండురోజులకోసారైనా కచ్చితంగా ఇంట్లోవాళ్లందరినీ కలుస్తాను. ఎందుకంటే వీళ్లే నా జీవితం.హీరోయిన్గా సినిమా చేస్తాకుటుంబసభ్యుల ముందుకు వెళ్లానంటే నా ఒత్తిడినంతా మర్చిపోతాను. నా మొదటి సినిమా 'ఒక మనసు'లో నేనంత బాగా నటించలేదు. ఆ మూవీ కోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ, అప్పుడు నాకు 20 ఏళ్లే! హీరోయిన్గా ఏదైనా మంచి సినిమా ఆఫర్ వస్తే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య వచ్చినవాటిలో మిరాయ్ మూవీ నచ్చింది. ఇటీవలే పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను అని నిహారిక చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్ -
'స్పిరిట్' వైరల్.. ప్రభాస్ తండ్రిగా 'స్టార్ హీరో'!
హీరో ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’... ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చిన సమయం నుంచి ఎలాంటి వార్త వచ్చినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే ఆయన డేట్స్ ఇచ్చారని, ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఆయన కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని టాక్. సందీప్రెడ్డి యానిమల్ సినిమాలో కూడా తండ్రి పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుంది. ఇదే క్రమంలోనే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఫాదర్ పాత్రకు కూడా ఎక్కువ స్పేస్ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. సందీప్ రెడ్డికి ఇష్టమైన నటుడు చిరంజీవి ఆయనతో ఒక ఫుల్ లెన్త్ సినిమా ఛాన్స్ వస్తే చేయాలని ఉందని కూడా చెప్పారు. ఇంతలో ఇలా స్పిరిట్లో చిరు భాగమైతే ఆయన సంతోషానికి హద్దులు ఉండవని చెప్పవచ్చు. సందీప్ ఆఫీస్తో పాటు తన ఇంట్లో కూడా చిరు ఫోటో ఉంటుంది. అంతలా మెగాస్టార్ను సందీప్రెడ్డి ఇష్టపడుతాడు.చిరంజీవి కూడా సందీప్, ప్రభాస్ ఇద్దరినీ చాలా ఇష్టపడుతారు. ఈ కాంబినేషన్ సెల్యులాయిడ్పై స్థిరపడితే.. ఇంకేముంది బాక్సాఫీస్ కలెక్షన్స్ మోత మోగాల్సిందే.. ఈ కాంబినేషన్ సినిమా వ్యాపారం పరంగా కూడా పాన్ ఇండియా రేంజ్లో చాలామందిని ఆకర్షిస్తుంది. అదనంగా, ఈ చిత్రంలో ప్రభాస్, సంజయ్ దత్ అన్నదమ్ములుగా కనిపిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. వారిద్దరూ ఇప్పటికే రాజా సాబ్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు, అందరి మనస్సులో వచ్చే పెద్ద ప్రశ్న ఏమిటంటే, చిరంజీవి ఈ చిత్రంలో భాగం కావడానికి ఖచ్చితంగా అంగీకరిస్తారా? ఇదే సందేహం చాలామందిలో ఉంది. నిజమే అయితే, ఫ్యాన్స్కు పండగే అవుతుంది. ప్రస్తుతానికి విశ్వంభర, మన శంకర వర ప్రసాద్ సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, సందీప్ కాంబినేషన్లో ఒక సినిమా రానుందన కూడా కొద్దిరోజులుగా ప్రచారం ఉంది. అయితే, పెద్ది సినిమా తర్వాత ఈ మూవీ ఉంటుందని టాక్. -
తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ పోస్ట్ చేశారు.రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth).. యూట్యూబ్లో ఒకప్పుడు వెలుగు వెలిగాడు. వెబ్ సిరీస్లు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్తో బాగా క్లిక్కయ్యాడు. టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న సమయంలోనే బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. అలా తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్బాస్లో మాత్రం సిరి హన్మంత్తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.వివాదాల్లో షణ్నుషో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయనతో బ్రేకప్.. ఓ కేసులో ఇరుక్కోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ సినిమాలు చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత తొలిసారి షణ్ముఖ్ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈమేరకు గ్లింప్స్ వదిలారు. అందులో షణ్ను మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్పై చాలా ఆసక్తి ఉందని మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు. జీవితం అయిపోయిందనుకున్నానేను బిగ్బాస్కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. తర్వాత ఓ కేసులో నా పేరు వచ్చింది. చాలా బాధపడ్డాను. దాన్నుంచి అంత ఈజీగా బయటపడలేకపోయాను. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అలా ఒకరోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పిల్లాడు నన్ను పిలిచి, నువ్వంటే చాలా ఇష్టం అన్నా.. కానీ, ఇప్పుడు నచ్చట్లేదని చెప్పాడు. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. కమ్బ్యాక్ ఇవ్వాలని ఆరోజే నిర్ణయించుకున్నాను.అమ్మకు క్యాన్సర్ఈ మధ్య మా నాన్న రైలు అందుకోవాలన్న ఆత్రంతో ప్లాట్ఫామ్పై పరిగెడుతుండగా బీపీ ఎక్కువై పడిపోయాడు. ఆరోజు నేను బాధను పంటికింద బిగపట్టాను. ఎందుకంటే అమ్మకు క్యాన్సర్. తనకు సర్జరీ జరిగింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే కుట్లు ఊడిపోతాయి. అందుకని ఆరోజసలు నేను ఏడవనేలేదు. ఏదేమైనా నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయాను అంటూ షణ్ముఖ్ ఎమోషనలయ్యాడు.చదవండి: పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్ -
దేవర పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే
-
రాజమౌళి కొత్త రికార్డ్.. మహేష్ సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్
-
మెగాస్టార్ 47.. రామ్ చరణ్ 18.. బుచ్చిబాబు స్పెషల్ విషెస్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన సినీ ప్రయాణంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్గా ఎదిగిన చిరు.. తన మొదటి సినిమా ప్రాణం ఖరీదును గుర్తు చేసుకుంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేటికి సరిగ్గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చెర్రీకి అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్కు స్పెషల్ డే కావడంతో పెద్ది మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. అరంగేట్రం నుంచి మీ సినీప్రయాణం అద్భుతమంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన జర్నీలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కెరీర్లో పెద్ది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెర్రీ అభిమానులకు బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక పోస్టర్ మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా అలరించనుంది. మెగా హీరో రామ్ చరణ్.. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 18 YEARS OF “MEGA POWER STAR” IN CINEMA ❤🔥From the most awaited debut to one of the most celebrated actors, your journey in cinema has been sensational @AlwaysRamCharan Sir ❤️I'm so happy to be a part of this incredible journey Sir ❤️🤗🙏Dear @AlwaysRamCharan fans, #Peddi… pic.twitter.com/QCLQFCRGqt— BuchiBabuSana (@BuchiBabuSana) September 28, 2025 -
ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన
మెగా హీరో రామ్చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన (Upasana Konidela) బతుకమ్మ ఆడారు. తెలంగాణ పండుగను దేశరాజధాని ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ కళాశాలలో శనివారం (సెప్టెంబర్ 27న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సీజన్లో నా మొదటి బతుకమ్మను రేఖాగారితో జరుపుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్తో బతుకమ్మఇందులో ఉపాసన, రేఖా గుప్త.. కాలేజీ విద్యార్థులతో కలిసి అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడారు. పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం రేఖా.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బతుకమ్మ అంటే పూల పండగ మాత్రమే కాదు. మాతృత్వం, జీవితం, ప్రకృతిని సెలబ్రేట్ చేసుకోవడం..మాతో కలిసి బతుకుమ్మ జరుపుకున్నందుకు థాంక్స్ఢిల్లీలో ఉన్న తెలుగువారు ఈ నగర అభివృద్ధిలోనూ భాగమయ్యారు. తమ సంస్కృతికి కొత్తరంగులు అద్దారు. ఈ పండగ సందర్భంగా.. మనందరం మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని తర్వాతి తరాలకు అందివ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్కు ఉపాసన స్పందిస్తూ.. రేఖా గుప్తాగారు మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి. తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్ చేస్తూ, బతుకమ్మ పండగను మాతో కలిసి జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Rekha Gupta (@officialrekhagupta) Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025చదవండి: నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చా: తమన్ -
నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చా: తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman).. ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ బ్లాక్బస్టర్స్ ఇచ్చాడు. స్టార్ హీరోలందరి సినిమాలకు పని చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. తమన్.. చివరగా ఓజీ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేనేం తప్పు చేశా?ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. 'ఓ సినిమా విషయంలో మహేశ్బాబు (Mahesh Babu) అభిమానులు నన్ను నానామాటలన్నారు. ఎంతో బాధపడ్డాను. నేనేం తప్పు చేశాను? మహేశ్బాబుగారికి నేనేం బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను? నేను ఏ తప్పు చేయలేదే? అని డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చాను. సినిమా బాగోలేకపోతే దానికి మనమేం చేస్తాం? ఈ విషయం అభిమానులెందుకు అర్థం చేసుకోరని బాధేసింది.అండగా ఉన్నాడునా బాధను అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆరు నెలలవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండమన్నాడు. ఆ నెగెటివ్ కామెంట్లు ఏవీ చూడొద్దన్నాడు. నేను నీతో ఉన్నా.. నేను చూసుకుంటా.. నువ్వు మళ్లీ నిరూపించుకోగలవు అని ధైర్యం చెప్పాడు' అని పేర్కొన్నాడు. కాగా మహేశ్బాబు నటించిన బిజినెస్మెన్, ఆగడు, దూకుడు, సర్కారువారిపాట, గుంటూరు కారం చిత్రాలకు తమనే సంగీతం అందించాడు.చదవండి: షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి -
కాంతార ప్రీక్వెల్.. 'వరాహరూపం' లాంటి సాంగ్ విడుదల
రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (kantara). ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే 'వరాహరూపం' సాంగ్ భారీగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఇదే చిత్రానికి ప్రీక్వెల్గా వస్తున్న 'కాంతార:చాప్టర్1' లో కూడా ఇలాంటి పాటనే మేకర్స్ చేర్చారు. 'బ్రహ్మ కలశ' అంటూ శివుడి గురించి భక్తితో ఆరాధించేలే సాంగ్ ఉంది. తాజాగా విడుదలైన ఈ పాటను కృష్ణకాంత్ రచించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. అబ్బి వి ఆలపించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..ఆ సినిమాతో క్లిక్అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.చాలా అవకాశాలొచ్చాయి, కానీ..చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.నిత్యవిద్యార్థినిఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.ఆ హీరోయిన్కు అభిమానినినేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.చదవండి: దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్ -
'ది రాజా సాబ్' ట్రైలర్.. ప్రభాస్ పోస్ట్ వైరల్
కల్కి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి ప్రకటన చేశారు. ప్రభాస్ రాయల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ శుభవార్త అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపించారంటూ ప్రశంసలు దక్కాయి.‘ది రాజా సాబ్’ (The Raja Saab) ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయింత్రం ఆరు గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా ప్రకటించారు. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగానే ప్రభాస్ను చూపించానని మారుతి అన్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ మూవీలో వచ్చే 40 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని కూడా దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం సుమారు 3గంటల పాటు రన్ టైమ్ ఉంటుందన్నారు.దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. The wait of millions finally comes to an end 💥💥#TheRajaSaabTRAILER will be out on September 29th at 6PM.A ROYAL entry into a world of FUN, FEAR and a whole lot of Majestic Experiences ❤️🔥#TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_… pic.twitter.com/9q8WcHXSj2— Director Maruthi (@DirectorMaruthi) September 28, 2025 -
బాలీవుడ్ ఎంట్రీ
‘హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు మీనాక్షీ చౌదరి. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని సమాచారం. జాన్ అబ్రహాం నటించనున్న హిందీ చిత్రం ‘ఫోర్స్ 3’లోని హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసిందట యూనిట్. భావ్ దులియా దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మీనాక్షి పాత్రకూ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ఆమె శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయని, కొన్ని వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...
ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్హాసన్తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్హాసన్ కాంబినేషన్కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్గా 46 సంవత్సరాల తర్వాత కమల్హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్స్క్రీన్పై ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్లను ఒకే ఫ్రేమ్లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కు మోహన్లాల్తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్లాల్నే ఎందుకు గెస్ట్ రోల్కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్లో హిందీ సిల్వర్స్క్రీన్పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
వరలక్ష్మీ కొత్త జర్నీ.. ఒకేసారి మూడు బాధ్యతలు
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కొత్త జర్నీ మొదలుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్.. రీసెంట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా దర్శకురాలిగా, నిర్మాతగా మారిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు కొత్త చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!)తండ్రి శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వరలక్ష్మీ.. 13 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలోని అన్ని బాషల్లోనూ నటించింది. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది. ఇప్పుడు సడన్గా 'సరస్వతి' అనే మూవీని ప్రకటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వరలక్ష్మీ వ్యవహరించనుంది.థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రంలో వరలక్ష్మీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. తమన్ సంగీతమందిస్తున్నాడు. చెల్లి పూజతో కలిసి వరలక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దోస డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. గతేడాది నికోలాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకనిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి) -
'తాళికట్టు శుభవేళ' సినిమా ప్రీ రిలీజ్ వేడుక
శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'తాళికట్టు శుభవేళ'. తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్. దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో శనివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు వినోద్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, వీడియో సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'తాళికట్టు శుభవేళ సినిమా పేరు విన్నప్పుడే ఎంతో పాజిటివ్గా అనిపించింది. మూవీలో సంగీతం మధురంగా ఉంది. కొత్త తరానికి విలువలు నేర్పే మంచి కుటుంబ కథతో ఈ చిత్రం నిలిచిపోతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు. -
మరోసారి తండ్రయిన హీరో సుహాస్
'కలర్ ఫోటో' సినిమాతో ఫేమ్ తెచ్చుకుని ఆడపాదడపా మూవీస్ చేస్తున్న హీరో సుహాస్.. ఇప్పుడు మరోసారి తండ్రయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ క్రమంలోనే తోటి సెలబ్రిటీలు, స్నేహితులు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: హీరో ధర్మ మహేశ్)షార్ట్ ఫిల్మ్స్తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాడు. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' తదితర చిత్రాలు కూడా ఇతడికి బాగానే పేరు తీసుకొచ్చాయి.అసలు విషయానికొస్తే గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని సుహాస్ ప్రకటించాడు. సుహాస్ది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు నో చెప్పేసరికి లేచిపోయి 2017లో పెళ్లి చేసుకున్నారు. లలిత.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ గతంలో పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా ఇద్దరు వారసులు పుట్టారు. ప్రస్తుతం సుహాస్, తెలుగులో రెండు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?) View this post on Instagram A post shared by Suhas (@suhassssssss) -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్
ధర్మ మహేశ్ (Dharma Mahesh).. హీరోగా చేసింది రెండే రెండు సినిమాలు (సిందూరం, డ్రింకర్ సాయి).. కానీ సినిమా వార్తలకంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అదనపు కట్నం అడుగుతున్నాడని, వేరే మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ మహేశ్పై సంచలన ఆరోపణలు చేసింది భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి. ఈ మేరకు బిగ్బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి (Rithu Chowdary) అతడి ఫ్లాట్కొచ్చిన వీడియోలు బయటపెట్టింది. మీడియా ముందుకు ధర్మ మహేశ్రీతూ కోసం అతడు గొడవపడ్డ చాటింగ్ స్క్రీన్షాట్స్ కూడా రిలీజ్ చేసింది. మహేశ్తో పాటు అతడి కుటుంబాన్ని సైతం నిందించింది. ఈ వివాదంపై చాలారోజులుగా సైలెంట్గా ఉన్న మహేశ్ ఎట్టకేలకు నోరు విప్పాడు. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ గౌతమి (Gautami Chowdary) వరుస ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఓపిక నశించిన మహేశ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తాను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే గౌతమి కూడా ఎన్నో తప్పులు చేసిందన్నాడు. తన ఫోన్ నెంబర్ తెలీదుఅతడు ఇంకా మాట్లాడుతూ.. గౌతమి ఫోన్లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అడిగితే.. నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది అంటుంది. మొగుడ్ని.. నాకే నెంబర్ చెప్పదు. రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్డే పార్టీకి వెళ్లొస్తుంది. బాగా తాగి నా ఫోటోను కూడా కాల్చేసింది. ఇవన్నీ నేనెలా తట్టుకోవాలి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం. ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు నాకింకా 19 ఏళ్లే!పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీఅయినా సరే నేను నిలబడతాను, ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. పరువు పోతుందని అబార్షన్ చేయించుకుంది. వేలెత్తి నన్ను చూపించేముందు నిన్ను నువ్వు చూసుకో అంటున్నా.. నీకూ, నాకు పెద్ద తేడా ఏం లేదు. మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించాను. నేను గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవలేదు. నా కొడుకును చూపించమంటే లెక్కచేయడం లేదు. మే తర్వాత నుంచి నా కొడుకును ఇంతవరకు చూపించలేదు. నేను డబ్బు గురించి అడిగానంటే చెప్పుతో కొట్టండి. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. కావాలంటే రక్తపరీక్షలు చేయండి.ఈ ఇంటర్వ్యూలో నేను అబద్ధం చెప్తే కుక్కచావు చస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ మహేశ్.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
‘K ర్యాంప్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం ‘K ర్యాంప్’ మూవీ ప్రెస్ మీట్ లో మెరిసిన నటి యుక్తి తరేజా (ఫొటోలు)
-
ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు -
'బిగ్బాస్' సంజనాకు సుప్రీం కోర్ట్ నోటీసులు
డ్రగ్స్ కేసులో సినీ నటి సంజన గల్రానీకి సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్బాస్లో కంటెస్టెంట్గా ఉన్న విషయం తెలిసిందే. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ సమయంలో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనా గల్రానీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో 14వ నిందితురాలిగా సంజనాను చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు.సంజన గల్రానీపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024 మార్చి 25న, కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, Section 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్లో జరపలేమని పేర్కొంది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు సంజనా గల్రానీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.సంజన గల్రానీ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పేర్కొన్నారు.. ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని, అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు. సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న చాలామంది డ్రగ్స్ వాడినట్టు సమాచారం ఉంది. విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు. కానీ, ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమచారం. ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.బిగ్బాస్9లో సంజనబిగ్బాస్9 తెలుగు సీజన్లో సంజన గల్రానీ సత్తా చాటుతున్నారు. ఈ సీజన్కు హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్గా గుర్తింపు పొందారు. అయితే, ఎలిమినేషన్ పేరుతో ఆమెను సీక్రెట్ రూమ్కు బిగ్బాస్ పంపారు. ప్రస్థుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఆమె రాణిస్తున్నారు. -
ఈ తెలుగమ్మాయి యాక్టరే కాదు డాక్టర్ కూడా! (ఫోటోలు)
-
కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్.. జోష్లో ఫ్యాన్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ట్రైలర్ దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు.కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్కు ఆదరణ దక్కడంతో ప్రీక్వెల్ను స్పానిష్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేయనున్నారు. -
మిషన్ మేకోవర్
కథ డిమాండ్ మేరకు సినిమా సినిమాకు కొత్త లుక్స్లోకి మారిపోతుంటారు హీరోలు. కథల్లోని హీరో క్యారెక్టరైజేషన్కు తగ్గట్లుగా గెటప్ మార్చేస్తుంటారు. ఇలా తమ కొత్త సినిమాల కోసం కొందరు హీరోలు ఒక ‘మిషన్’ మీద ఉన్నారు. ఆ మిషన్ ఏంటంటే ‘మేకోవర్’. ఈ ‘మిషన్ మేకోవర్’ విశేషాలు తెలుసుకుందాం.రాముడి పాత్రలో..? సిల్వర్ స్క్రీన్పై లాంగ్ హెయిర్, గడ్డెంతో మహేశ్బాబు కనిపించి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఎస్ఎస్ఎమ్బీ29’ (వర్కింగ్ టైటిల్) సినిమా కోసం మహేశ్బాబు పూర్తిగా మేకోవర్ అయ్యారు. హెయిర్, గడ్డెం పెంచారు. అలాగే వర్కౌట్స్తో ఫిజికల్గా కూడా ధృడంగా తయారయ్యారు. కాగా ఈ కథకు మైథలాజికల్ టచ్ కూడా ఉందని, ఈ చిత్రంలో రాముడిపాత్రలో మహేశ్బాబు కనిపిస్తారనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది.ఈ వార్త నిజం అయితే ‘ఎస్ఎస్ఎమ్బీ29’లో మహేశ్బాబును ప్రేక్షకులు పలు రకాల లుక్స్లో చూసే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది నవంబరులో ఈ సినిమా అప్డేట్ను ఇస్తామని రాజమౌళి చె΄్పారు. నవంబరులో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారని భోగట్టా. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా 2027 మార్చిలో విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది.పోలీస్ ట్రైనింగ్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లోపాల్గొంటారు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్పాత్రలో నటించనున్నారు. ఈ హీరో పోలీస్గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే. దీంతో ‘ది రాజాసాబ్, ఫౌజి’ చిత్రాల షూటింగ్ పూర్తికాగానే, ‘స్పిరిట్’లో పవర్ఫుల్ పోలీస్ లుక్ కోసం ప్రభాస్ మేకోవర్ కావాల్సి ఉంది.ఇందుకోసం ఆయన ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకోనున్నారట. ఈ చిత్రంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. ఇండియాలోని ప్రముఖ లోకేషన్స్తోపాటు మెక్సికో, యూకే వంటి విదేశీ లొకేషన్స్లోనూ ‘స్పిరిట్’ చిత్రీకరణ జరగనుంది. టీ సిరీస్ ఫిలింస్, భద్రకాళి ప్రొడక్షన్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బరువు తగ్గాలని...ఎన్టీఆర్ హెవీ వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ హీరో ఈ రేంజ్లో కష్టపడుతున్నది ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసమే. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఆల్రెడీ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అయితే కథ రీత్యా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తారట. ఈ లుక్ కోసమే ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్నారని తెలిసింది.ఈ లుక్ కోసం బరువు తగ్గే మిషన్ మీద ఉన్నారు. ఇక ఇటీవల ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. వైద్యులు ఆయనకు రెండు వారాలపాటు విశ్రాంతి సూచించారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ రెస్ట్ మోడ్లో ఉన్నారు. కోలుకున్న తర్వాత తిరిగి ఆయన ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు.ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలిసింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.ద్విపాత్రాభినయం? ‘పెద్ది’ సినిమా కోసం బరువు పెరిగారు రామ్చరణ్. సరైన వర్కౌట్స్, డైట్తో పూర్తిగా కొత్తగా మేకోవర్ అయ్యారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో రామ్చరణ్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రామ్చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. కానీ ఈ లుక్ కాకుండా మరో లుక్లో కూడా రామ్చరణ్ కనిపిస్తారు.ఈ రెండో లుక్ కోసమే ఈ హీరో బరువు పెరిగారని తెలిసింది. ఇలా ‘పెద్ది’లో రెండు లుక్స్లో కనిపించనున్నారనే టాక్ తెరపైకి రావడంతో ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అలాగే ఈ చిత్రంలో రామ్చరణ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని, ఇందులో భాగంగానే డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారనే ఊహాగానాలూ ఉన్నాయి.త్వరలో ఈ విషయాలపై ఓ క్లారిటీ వస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్. రెహామాన్ సంగీతం అందిస్తున్నారు.డిఫరెంట్ జడల్ ‘దిప్యారడైజ్’ ప్రపంచం కోసం పూర్తిగా మారిపోయారు హీరో నాని. ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దిప్యారడైజ్’. ఈ సినిమాలో జడల్ అనే డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు నాని. ఈ జడల్పాత్ర కోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఇంటెన్స్ అండ్ హెవీ వర్కౌట్స్తో బరుపు పెరిగారు. ఇక ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మోహన్బాబు, ‘కిల్’ ఫేమ్ రాఘవ్ జూయల్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం లుక్స్, గెటప్స్ మార్చుకున్న, మార్చుకుంటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
సినిమా ఫ్లాప్.. అప్పు చేసి రూ.4.75 కోట్లు తిరిగిచ్చా: హీరో సిద్ధు
సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు చెప్పగానే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలే గుర్తొస్తాయి. వీటితో తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో 'జాక్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్గా చేసింది. అయితే ఈ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. తొలిరోజే ప్రేక్షకుల నుంచి నిరాదరణకు గురైంది. అయితే ఈ మూవీ ఫ్లాప్ దెబ్బకు హీరో సిద్ధు.. తన రెమ్యునరేషన్ తిరిగేచ్చాశడనే టాక్ వినిపించింది. అయితే అందరూ అవి రూమర్స్ అనుకున్నారు. కానీ అది నిజమేనని ఇప్పుడు సిద్ధు క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా'. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రెండు పాటలు రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగానే వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం, గతంలో ఛాన్సుల కోసం వెళ్తే తనకెదురైన అనుభవాల్ని బయటపెట్టాడు. అప్పు చేసి మరీ డబ్బులు తిరిగివ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.'జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ విషయంలో నాకు కూడా బాధ వేసింది. అందుకే రూ.4.75 కోట్లు అప్పు చేసి మరీ తిరిగిచ్చేశాను. ఎందుకంటే ఆ సమయంలో నా చేతిలో డబ్బుల్లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. ఆ మూవీతో కొందరు నష్టపోయారు. అది నాకు నచ్చలేదు. అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను. అయితే డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు. అవి ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను' అని హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి) -
అనగనగా ఒక రాజు.. నవ్వులు పూయిస్తోన్న సంక్రాంతి ప్రోమో!
జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తాజాగా నటిస్తోన్న చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju Movie). ఈ చిత్రంలో గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ మూవీకి మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. సినీ ప్రియులను తెగ నవ్వించేసింది.ఇంకా ఈ మూవీ రిలీజ్కు దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ మేకర్స్ ముందుగానే ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో హీరో, హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి చాలా సరదాగా నవ్వులు పండించారు. సినిమా ప్రమోషన్లో 24 క్యారెట్స్ గోల్డ్ అంటూ ఫన్నీగా ప్రోమోలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.కాగా.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు.Jaanejigars. Pandaga ki kalludam :) ❤️😍Here is the #AnaganagaOkaRaju SANKRANTHI PROMO 😎🕺– https://t.co/5EUHhVXeHd Love you guys. Cannot wait to see you on the big screen ❤️🙏 #AOROnJan14th 💫@Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84 #SaiSoujanya #GandhiN… pic.twitter.com/KfyPIikYG8— Naveen Polishetty (@NaveenPolishety) September 26, 2025 -
చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ! ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది బిగ్బాస్ బ్యూటీ, నటి వితికా షెరు (Vithika Sheru). చెల్లి కృతికను చంటిపాపలా చూసుకుంటుంది. తన పెళ్లి కూడా వితిక చేతుల మీదుగానే జరిగింది. 2022లో కృతిక- కృష్ణల వివాహం ఎంతో ఆడంబరంగా, కన్నులపండగ్గా జరిగింది. రెండు రోజుల క్రితం కృతిక.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.చెల్లెలికి సర్ప్రైజ్వితికాకు అసలే సర్ప్రైజ్లంటే చాలా ఇష్టం. తన భర్తను, ఫ్రెండ్స్ను ఎప్పుడూ ఏదో ఒకరంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చెల్లెలికి ఊహించని కానుకనిచ్చింది. అదే ఆమె సీమంతం. ఒక గదిని అందంగా డెకరేట్ చేసి చెల్లెలి సీమంతం జరిపింది. ఫ్రెండ్స్, కజిన్స్ సమక్షంలో సర్ప్రైజ్ సీమంతం జరుపుకోవడంతో కృతిక మనసు సంతోషంతో నిండిపోయింది. పెద్దమ్మ గిఫ్ట్వీళ్లంతా కలిసి చిన్నపాటి బేబీ డ్రెస్పై బొమ్మలు పెయింట్ వేశారు. వితిక అయితే అక్షరాభ్యాసానికి రెడీగా టీషర్ట్పై తెలుగు అక్షరాలను గీసింది. అందులో పెద్దమ్మ అనే అక్షరాలను పొందుపరిచి వాటిని అండర్లైన్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను వితికా అభిమానులతో పంచుకుంది. అది చూసిన అభిమానులు.. మీ ఓపికను మెచ్చుకుని తీరాల్సిందే! అవతలివారి సంతోషంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)చదవండి: ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత -
ఓజీ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. షాకిచ్చిన బెంగళూరు పోలీసులు!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఓజీ(OG Movie) అభిమానులకు బెంగళూరు పోలీసులు దిమ్మదిరిగే షాకిచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద రిలీజ్కు ముందే ఈవెంట్ నిర్వహించినందుకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఈవెంట్లో కొందరు ఫ్యాన్స్ కత్తులతో హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మడివాలా పోలీసులు వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సిటీ కోర్ట్ అనుమతితోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా బెంగళూరులోని ఓ థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేయడంతో మిగిలిన ఆడియన్స్ ఇబ్బందులు పడ్డారు. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)ప్రీమియర్ షోకు ముందే పవన్ అభిమానులు రోడ్లను బ్లాక్ చేసి, డీజే పెట్టి నిబంధనలను ఉల్లంఘించారు. దీనిపై కన్నడ రక్షణ వేదిక సభ్యులు థియేటర్ వద్దకు చేరుకుని.. రూల్స్ పాటించాలని పవన్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సమాచారం అందగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అక్కడ ఉన్న లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకుని.. ఏర్పాటు చేసిన వేదికను కూల్చివేయమని నిర్వాహకులను చెప్పామని వెల్లడించారు. కాగా.. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
నాలుగో రోజు నవరాత్రుల పూజలో యాంకర్ లాస్య.. (ఫొటోలు)
-
రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ బ్యూటీఫుల్ లుక్స్.. (ఫొటోలు)
-
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఏ లోటూ రాకుండా పెంచిందిమా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు ఒక స్త్రీశక్తి. లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యం అందించేది. అంతేకాదు, సినిమాలు చూపించడం దగ్గరి నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.మాలో స్ఫూర్తి నింపిందివీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు. సినిమాఅటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) 25వ సెప్టెంబరు 2025, రాత్రి 8.31 గంటలకు.. ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారారు. సీతారామరాజు, యువరాజు సినిమాలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. View this post on Instagram A post shared by Yvs Chowdarry (@i_am_yvs) -
పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.1000 టికెట్ ధరల వల్లే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.( OG Movie Box Office Collections )మొదటి ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ఓవరాల్గా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 90.25 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.100 కోట్లకు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఓజీ వసూళ్లకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
OG మూవీలో హీరోయిన్కు అన్యాయం
టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)కి అన్యాయం జరిగింది. కథానాయికగా తన సినిమాలేవో తను చేసుకుంటున్న ఈ బ్యూటీకి ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అదీ ఓజీ మూవీ (They Call Him OG Movie)లో! హీరోయిన్గా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకపోయినా సరే.. పవన్ కల్యాణ్ కోసం తొలిసారి స్పెషల్ సాంగ్కి ఓకే చెప్పింది. అలా థాయ్లాండ్లో ఈ పాటను చిత్రీకరించారు. సర్ప్రైజ్ ఉంటుందన్న బ్యూటీఈ సాంగ్లో పవన్తో కలిసి స్టెప్పులేసిందీ బ్యూటీ! ఈ విషయాన్ని తనే పరోక్షంగా బయటపెట్టింది. ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లినప్పుడు తన నెక్స్ట్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. నా సినిమాల గురించి తర్వాత ప్రకటిస్తాను. ఇప్పుడైతే నవంబర్లో ఓజీ మూవీ వస్తుంది కదా.. అందులో ఒక సర్ప్రైజ్ ఉంది. అది చూసి మీరందరూ సంతోషిస్తారనుకుంటున్నాను అంది. కట్ చేస్తే ఓజీ మూవీలో ఆ స్పెషల్ సాంగ్నే తీసేశారు. అది చూసి నేహా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఎడిటింగ్లో తీసేశారా?ఎడిటింగ్లో నేహా శెట్టినే లేపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి యూట్యూబ్లో అయినా ఆ స్పెషల్ సాంగ్ ఉంటుందేమో చూడాలి! ఓజీ విషయానికి వస్తే.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). పవన్ కల్యాణ్ హీరోగా నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. ఓజీ రిలీజ్శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. నేహా శెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు మూవీలో రాధికగా విపరీతమైన క్రేజ్ అందుకుంది. టిల్లు స్క్వేర్లోనూ అతిథి పాత్రలో తళుక్కుమని మెరిసింది. రూల్స్ రంజన్, బెదురులంక 2012, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు.చదవండి: They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ -
సినిమాను శాసించే సైకాలజీ.. అందుకే ఇవన్నీ హిట్
సైకాలజీ ఆధారిత సినిమాలు మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడంలో సహాయపడతాయి. వాటిని సమాజంలో చర్చించడానికి ఒక వేదికను అందిస్తాయి. ఒక వ్యక్తి చేస్తున్న పనుల వెనుక దాగిఉన్న సైకాలజీ ఏంటి అనేది అంత ఈజీగా ఎవరూ కనిపెట్టలేరు. ఒక్కోసారి వారు హత్యలు చేయవచ్చు లేదా ప్రాణ భయంతో బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ నేరాలు చేయవచ్చు. ఇలాంటి నిజజీవిత ఘటనలతో చాలా సినిమాలు వచ్చాయి. చైల్డ్ కౌన్సిలింగ్, సైకాలజికల్ థ్రిల్లర్, న్యూరోసైకాలజీ, క్లినికల్ సైకాలజీ ఇలా ఏదో ఒక మానసిక సమస్యను తీసుకుని కమర్షియల్ స్టైల్లో వెండితెరపై దర్శకులు చూపిస్తున్నారు. ఇలాంటి కథల వైపే ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలు ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్తోనే వస్తుంటాయి. నేటి సినిమాలను సైకాలజీ కథలే శాసిస్తున్నాయి. వాటి విజయాల శాతం కూడా చాలా ఎక్కువగానే ఉంటంది.విక్రమ్- శంకర్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమా సైకాలజీకి బలమైన సంబంధం ఉంది. ఈ చిత్రం ప్రధానంగా డిస్సోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ (Dissociative Identity Disorder – DID) అనే మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక వ్యక్తిలో బహుళ వ్యక్తిత్వాలు (multiple personalities) ఉత్పత్తి కావడం వల్ల కలిగే పరిస్థితి. అపరిచితుడు లాంటి వ్యక్తులు ప్రపంచంలో సుమారు 1.5 శాతం ఉన్నారని ఒక సర్వే పేర్కొంది."అపరిచితుడు"లో మూడు వ్యక్తిత్వాలు- ముఖ్య పాత్ర రామానుజం – ఒక న్యాయవాది, సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎదుర్కొంటూ మానసికంగా క్షోభకు లోనవుతాడు.- అపరిచితుడు – అతని లోపల ఉన్న కోపం, న్యాయం కోసం పోరాటం, సమాజంపై విసుగు కలగజేసే వ్యక్తిత్వం.- రెమో – అతని లోపలున్న సరదా, ప్రేమను వ్యక్తపరచే వ్యక్తిత్వం.ఈ మూడు వ్యక్తిత్వాలు ఒకే వ్యక్తిలో ఉండటం, అతను వాటిని గుర్తించకపోవడం వల్ల సమాజంలో మంచి లేదా చెడు ఏదైనా జరగవచ్చని వైద్యులు చెప్తారు. అలాంటి వారికి మానసిక చికిత్స అవసరం. అపరిచితుడులో విక్రమ్ పాత్ర రామానుజం సామాజిక అవమానాలు ఎదుర్కొంటే మరో వ్యక్తిత్వంలోకి వెళ్లి గరుడ పురాణం ఆధారంగా శిక్షలు వేస్తుంటాడు. ప్రేమలో నిరాకరణ రావడంతో రెమోలా మారిపోయి తన కోరిక తీర్చుకుంటాడు. అయితే, ఇలాంటి సైకాలజీ వ్యక్తిత్వం ఉన్న వారు నేటి సమాజంలో చాలామంది ఉన్నారు. విక్రమ్ సతీమణి శైలజ (సైకాలజిస్ట్) కావడంతో ఆమె సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయి. దీంతో సులువుగా మూడు వ్యక్తిత్వాలను వేరుగా ప్రదర్శించగలిగాడు. ఇది సినిమా సైకాలజీకి నిజమైన గౌరవం ఇచ్చిన అంశమని చెప్పవచ్చు.క్లినికల్ సైకాలజీతో 'గజిని'గజిని సినిమాకు సైకాలజీతో చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ చిత్రం మొత్తం అన్తెగ్రేడ్ అమ్నీషియా (Anterograde Amnesia) అనే మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. దీంతో ఇబ్బంది పడేవారు వ్యక్తి గత సంఘటనలను మాత్రమే గుర్తుపెట్టుకోగలడు. కానీ, కొత్త సమాచారం, కొత్త సంఘటనలను మెమరీలో నిల్వ చేయలేడు. అంటే, అతను కొత్తగా జరిగే విషయాలను కొద్ది నిమిషాలకే మర్చిపోతాడు. గజినిలో సంజయ్ రామస్వామి పాత్రలో హీరో పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది. తన ప్రేయసి కల్పనను హత్య చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ఫోటోలు, టాటూలు, నోట్లు వంటివి ఉపయోగిస్తాడు. మానసికంగా తాను మర్చిపోకుండా ఉండేందుకు ఉపయోగించే పద్ధతులే ఇవి. ఇలా ఇబ్బంది పడేవారు చాలామందే ఉన్నారు. వారు పాటించే విధానం కూడా ఇదే తరహాలో ఉంటుంది. క్లినికల్ సైకాలజీలో ట్రామా తర్వాత వ్యక్తి ఎలా స్పందిస్తాడో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. గజిని సినిమా ఒక మానసిక సమస్యను కమర్షియల్ స్టైల్లో చూపించి భారీ హిట్ అందుకున్నారు.చైల్డ్ హుడ్ ఫోబియా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్తో భగవంత్ కేసరిసైకాలజీకి చాలా దగ్గరగా ఉండే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అనే అంశంతో భగవంత్ కేసరి చిత్రం వచ్చింది. ఈ సినిమా 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. - ఎడ్యుకేషనల్ సైకాలజీలో పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగానే వారి వయసును భట్టి వారికి అర్థం అయ్యేలా ఈ విషయం గురించి తెలపాలి. పిల్లల భద్రతను, భావోద్వేగాలను, వ్యక్తిత్వాన్ని పరిరక్షించేందుకు ఇది ఒక సైకాలజికల్ టూల్లా ఉపయోగపడుతుంది. చైల్డ్ హుడ్ ఫోబియా (Childhood Phobia)తో కథానాయిక విజయలక్ష్మి (విజ్జి) చిన్నతనంలో జరిగిన సంఘటనల వల్ల ఆర్మీలో చేరే విషయంలో భయం కలిగి ఉంటుంది. ఈ భయాన్ని అధిగమించేందుకు సైకాలజిస్ట్ డాక్టర్ కాత్యాయనీ పాత్రను ప్రవేశపెట్టడం, మానసిక చికిత్స (therapy) ప్రాధాన్యతను చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్లో వచ్చే సీన్లు మనకు కూడా ఆసక్తిని కలిగిస్తాయి.రాక్షససుడుకి సైకాలజీతో సంబంధంరాక్షససుడు సినిమా కథలో ఒక సైకో కిల్లర్ స్కూల్ వయస్సు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వరుస హత్యలు చేస్తుంటాడు. హీరో అరుణ్ (SI) ఈ కేసును చేధించే క్రమంలో, అతను ఈ నేరాలు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి చేస్తున్నట్లు గుర్తిస్తాడు. సైకోపతీ (Psychopathy) నేరస్తుడు ఎమోషనల్ ఎంపతీ లేకుండా, ప్లానింగ్తో హత్యలు చేస్తాడు. అరుణ్ నేరస్తుడి మానసిక స్థితిని అర్థం చేసుకొని, అతని ప్రవర్తన ఆధారంగా కేసును చేధిస్తాడు. ఈ సినిమా సైకాలజీ, నేర పరిశోధన, మానవ ప్రవర్తన అంశాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ భారీ విజయాన్ని అందుకున్నారు.సైకాలజీతో హిట్హిట్ సినిమా కథలో SP అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి, ఒక పెడోఫైల్ను హత్య చేసి, ఆ కేసును తానే విచారించాల్సిన పరిస్థితిలో పడతాడు. అతని ప్రవర్తన, హత్యల పద్ధతులు, మానసిక స్థితి వంటి అంశాలు అన్ని కూడా సైకాలజీతో ముడిపడే ఉంటాయి. ఇందులో నాని పాత్ర చేసే చర్యలు సైకోపతిక్ టెండెన్సీలు, ట్రామా-బేస్డ్ బిహేవియర్ను సూచిస్తాయి. అంటే తనే నేరం చేసి మరో నేరస్థుడిని పట్టుకోవడం. ఈ మూవీ కూడా సైకాలజీ కాన్సప్ట్తో నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. ఒక మనిషి జీవితం సైకాలజీతో చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇలాంటి కథలు వెండితెరపైకి వచ్చినప్పుడు వాటిని ఆసక్తిగా గమనిస్తాడు.. ఒక్కోసారి తన చుట్టూ ఉండే వారి జీవితాలతో పోల్చి సరిచూస్తాడు కూడా.. ఈ కారణం వల్లే ఇలాంటి సైకాలజీ కథలు హిట్ అవుతున్నాయి.-సాక్షి వెబ్ ప్రత్యేకం -
OG సినిమా హిట్టా..! ఫట్టా..!
-
మార్ఫింగ్ వీడియోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
సాక్షి, డిల్లీ: తన పేరుతో మార్ఫింగ్ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో యూట్యూబ్ షార్ట్స్, వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్ సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్లో కోరారు. ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు.పేరు దుర్వినియోగంఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్ సైట్స్ ఆ లింక్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తెలిపింది.గతంలో..గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు.చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్ -
శ్రద్ధా శ్రీనాథ్ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్.. ట్రైలర్ చూశారా?
కాశ్మీర్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించిన వెబ్ సీరిస్ 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్' విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు సెల్వా తెరకెక్కించిన ఈ వెబ్ సీరిస్ను అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ తెరకెక్కిస్తుంది. ఇందులో సంతోష్ ప్రతాప్, చాందినీ, శ్యామ హరిణి, హేమా, బాల హాసన్, ధీరజ్ తదితరులు నటించారు. 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్' అనే వెబ్ సిరీస్ను తమిళ్లో నెట్ఫ్లిక్స్ విడుదల చేస్తున్న మొదటిది కావడం విశేషం. ఇందులో డిజిటల్ యుగం రియాలిటీలతో పాటు ప్రజల కోరికలు వారి బలం, బలహీనత, నిజం, అబద్దం వంటి అంశాల్లో ఉండే చిన్న తేడాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. -
మోహన్లాల్ రికార్డ్.. ఒకే ఏడాదిలో రూ. 600 కోట్లు
మలయాళ ప్రముఖ నటుడు మోహన్లాల్ (Mohanlal)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా తను నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam) రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు మలయాళ అభిమానులు ఫిదా అయ్యారు. మాళవికా మోహనన్, ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదలైంది. సెప్టెంబర్ 26న ‘జియో హాట్స్టార్’ (Jio Hotstar)లో స్ట్రీమింగ్కు కూడా రానుంది.ఎంతో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రీసెంట్గా మెహన్లాల్ అందుకున్నారు. ఆపై ఇదే ఏడాదిలో ఆయన నటించిన మూడు చిత్రాలు రూ. 100 కోట్ల క్లబ్లో చేరాయి. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో ఉన్నారు. 2025 మోహన్లాల్కు బాగా కలిసొచ్చిన ఏడాదిగా ఎప్పటికీ మిగిలిపోతుందని పేర్కొంటున్నారు. లూసిఫర్ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్ల మేరకు కలెక్ట్ చేశాయి. తాజాగా హృదయపూర్వం చిత్రం కూడా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది.మలయాళ పరిశ్రమలో ఒకే ఏడాదిలో వంద కోట్ల మార్క్ను ఏకంగా మూడు చిత్రాలకు అందుకున్న నటుడిగా లాల్కు గుర్తింపు దక్కింది. ఆపై ఒక ఏడాదిలో చిత్రపరిశ్రమలో రూ. 600 కోట్లకు పైగా మార్కెట్ను క్రియేట్ చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. దర్శకుడు సత్యన్ అంతికాడ్తో సుమారు పదేళ్ల తర్వాత మోహన్లాల్ కలిసి పనిచేశారు. దర్శకుడిగా ఆయనకు వంద కోట్ల సినిమా కూడా ఇదే కావడం విశేషం. -
స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి
కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి)కి సంబంధించిన కారు, ఇల్లును వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఈఎంఐలు ఆయన చెల్లించికపోవడంతో తన ఇల్లు, ఆఫీస్ వద్ద నోటీసులు అంటించారు. అందుకు సంబంధించిన వార్త కోలీవుడ్లో వైరల్ అవుతుంది. భార్య ఆర్తితో జయం రవి (Jayam Ravi) విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటంచిన విషయం తెలిసిందే. సుమారు ఏడాది నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే రవి తన స్నేహితురాలు, గాయని కెనీషాతో ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరచూ వీరిద్దరూ కలిసే కనిపిస్తున్నారు.రవి మోహన్ సుమారు మూడేళ్ల క్రితం చెన్నై తూర్పు తీర రోడ్డులో ఒక బంగ్లా కొన్నారు. కొంత కాలం పాటు తన భార్య ఆర్తి, పిల్లలతోనే అక్కడ నివశించాడు. అయితే, కుటుంబ విభేదాల వల్ల ఆ ఇంటి నుంచి రవి మోహన్ బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం ఆ ఇంట్లో పిల్లలతో ఆర్తి మాత్రమే నివశిస్తుంది. ఈ పరిస్థితిలో, రవి మోహన్ గత 10 నెలలుగా తన ఇంటి కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన EMI మొత్తాన్ని చెల్లించలేదని తెలుస్తోంది. రూ. 7.64 కోట్ల లోన్ మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. తేనాంపేటలోని సెమేయర్స్ రోడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని రవి మోహన్ స్టూడియోలో కూడా నోటీసులు అతికించారు. రుణం తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొన్నారు.తదనంతరం, తేనాంపేటలోని కెమియర్స్ రోడ్డులోని రవి మోహన్ స్టూడియోస్ కార్యాలయంలో బ్యాంకు ఉద్యోగులు అతికించిన నోటీసును కార్యాలయ సిబ్బంది వెంటనే చించివేయడంతో గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించి నటుడు రవి మోహన్ సరైన వివరణ ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. బ్యాంకు అధికారులు ఇల్లు వేలం వేస్తే ఆర్తి తన పిల్లలతో ఎక్కడ ఉంటుందనేది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆడపిల్లకు సొంతంగా ఇల్లు లేదు తెలుసా..? అంటూ ఒక యంగ్ రచయిత చెప్పిన మాటలను కోట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లకు ఇలాంటి సందర్భం ఎదురైతే ఆమె చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. తాళి కట్టిన భార్యకు ఇల్లు లేకుండా రోడ్డు మీదకు తెచ్చేలా జయం రవి చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. -
SSMB29పై జక్కన్న అదిరిపోయే స్కెచ్.. రంగంలోకి వార్నర్ బ్రదర్స్
-
కర్నూలులో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
ఎప్పటికీ రుణపడి ఉంటా.. ఎల్లలు లేని ఆనందంలో రుక్మిణి
కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంటే మనసు ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతుంది. నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు అలాంటి ఆనందంలో తేలిపోతున్నారు. 2019లో మాతృభాషలో కథానాయకిగా కెరీర్ను ప్రారంభించిన ఈ కన్నడ బ్యూటీ ఆ తరువాత హిందీలో అప్స్టార్ట్స్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులోకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ దిగుమతి అయిన ఈమె తమిళంలో విజయ్సేతుపతికి జంటగా ఏస్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసీ చిత్రం విజయానందాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కన్నడంలో రిషబ్ శెట్టితో నటించిన కాంతార. చాప్టర్ 1 చిత్రం అక్టోబర్ 2న పాన్ ఇండియా చిత్రంగా తెరపైకి రానుంది. దీనితో పాటూ యష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్తో పాటు తెలుగులో ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో రుక్మిణి వసంత్ పేర్కొంటూ తనను నటిగా అంగీకరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. కాంతార చాప్టర్ 1 తనకు చాలా ముఖ్యమైన చిత్రం అన్నారు. తన నటనను చూసిన రిషబ్ శెట్టి అద్భుతం అన్న అభినందనను జీవితంలో మరిచిపోలేనన్నారు. అదే విధంగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తన మనసు ఎల్లలు లేని ఆనందంలో మునిగితేలుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నానని నటి రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడి కెరీర్ మంచి జోష్లో సాగుతోందన్నమాట. -
నేను ఇప్పుడు ఇలా.. అల్లు అర్జున్ దీనికి కారణం: తమన్నా
తమన్నా.. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. కుర్రహీరోయిన్లు వస్తున్నా వాళ్లకి పోటీగా హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అయితే తాను ఇప్పుడు ఇలా ఉండటానికి అల్లు అర్జున్ కూడా ఓ కారణం అని చెప్పుకొచ్చింది. రీసెంట్గా 'డూ యూ వాన్నా పార్ట్నర్' అనే వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేసింది. దీని ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.'అప్పట్లో తెలుగు, తమిళంలో అన్ని రకాల కమర్షియల్ సినిమాలు చేశాను. ప్రతి దానిలోనూ నాలుగైదు సాంగ్స్ ఉండేవి. కానీ అల్లు అర్జున్ మాత్రమే 'బద్రీనాథ్' కోసం నేను కూడా తనతో పాటు సరిసమానంగా డ్యాన్స్ చేయాలని ప్రోత్సాహించాడు. ఫ్లోర్ మూమెంట్స్ నేను కూడా చేస్తానని చెప్పి దర్శకుడిని ఒప్పించి తొలి అవకాశమిచ్చాడు. ఈ మూవీ రిలీజైన తర్వాత నాకు డ్యాన్స్ చేసే ఛాన్సులు చాలా వచ్చాయి. స్పెషల్ నంబర్స్కి పాపులర్ అయ్యాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ)తమన్నా చెప్పింది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్లలో బాలీవుడ్లో హిట్ స్పెషల్ సాంగ్స్ ఈమె కనిపించింది. 'ఆజ్ కీ రాత్', నషా, స్పింగ్ జరా, గఫూర్.. ఇలా తదితర పాటల్లో ఓవైపు గ్లామర్ చూపిస్తూ మరోవైపు తన అందచందాలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. అలానే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది.తమన్నా వ్యక్తిగత విషయానికొస్తే ప్రస్తుతం ఈమె వయసు 35 ఏళ్లు. వయసు పెరుగుతున్నా సరే ఈమెకు అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. అలానే మొన్నమొన్నటివరకు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసింది. పెళ్లి కూడా చేసుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.(ఇదీ చదవండి: వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి) -
వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి
టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్- వితికా షెరు (Vithika Sheru) ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు. ఇంతలోనే వితికా మరో గుడ్న్యూస్ చెప్పింది. తన చెల్లెలు కృతిక గర్భం దాల్చిందంటూ సదరు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో కృతిక బేబీ బంప్తో ఫోటోలకు పోజిచ్చింది. చెల్లి పెళ్లికృతిక - కృష్ణల వివాహం 2022లో జరిగింది. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగా జరిపించింది వితికా. పెళ్లయిన మూడేళ్లకు కృతిక తల్లి కాబోతుండటంతో వీరి ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. చెల్లి తల్లి కాబోతోంది, మరి అక్క ఎప్పుడు గుడ్న్యూస్ చెప్తుందో? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.వరుణ్- వితిక జర్నీ'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వితిక- వరుణ్ జంటగా నటించారు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వితిక తొలిసారి గర్భం దాల్చింది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులకే గర్భస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత వరుణ్తో బిగ్బాస్కు వెళ్లొచ్చింది. దేవుడు కరుణించి పిల్లల్ని ఇస్తే అంతకంటే అదృష్టం ఇంకేముందని ఓసారి ఇంటర్వ్యూలో చెప్పింది. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) చదవండి: కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్! -
'సోనూ సూద్'ను విచారిస్తున్న ఈడీ అధికారులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో(betting app case) ఈడీ విచారణకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సోనూసూద్కు ఈడీ ముందుకు వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి ఆయనకు గతంలోనే ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే.ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు సోనూ సూద్ విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనూసూద్తో పాటు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే వారిని కూడా విచారించారు. నిషేధిం ఉన్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా చిక్కుల్లో పడ్డారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్స్తో పాటు మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్సింగ్, యువరాజ్సింగ్, సురేశ్ రైనాలను కూడా ఈడీ విచారించింది. -
'ఓజీ'ని డామినేట్ చేసిన రిషబ్శెట్టి
టాలీవుడ్లో కేవలం వారం గ్యాప్లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ, అక్టోబర్ 2న రిషబ్శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్లో వ్యూస్ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్శెట్టి నటించిన కాంతారనే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే, కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్ ట్రైలర్ ఏకంగా 15 మిలియన్ల మార్క్ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్ చేశారంటూ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్కు కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్ దాటేసింది.'హరి హర వీరమల్లు' ట్రైలర్కు 48 మిలియన్ల వ్యూస్ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వ్యూస్ కోసం బాట్స్ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
రేసు నుంచి తప్పుకోనున్న 'సూర్య'
దక్షిణాదిలో ప్రముఖ కథానాయకుల్లో రాణిస్తున్న నటుడు సూర్య. ఈయన ఇటీవల హీరోగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి కరుప్పు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి శ్వాసిక, ఇందిరెన్స్, యోగి బాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే డివోషనల్ అంశాలతో సాగే సోషియల్ కథాచిత్రంగా రూపొందుతున్న కరుప్పు చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు యూనిట్ వర్గాలు ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశమే ఎక్కవగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ విడుదుల కానుంది. ఆపై శివకార్తికేయన్ ,రవి మోహన్, శ్రీ లీల, అధర్వ కలిసి నటిస్తున్న పరాశక్తి కూడా రానుంది. సంక్రాంతి కోసం తెలుగులో ఇప్పటికే భారీగానే లైనప్ ఉంది. దీంతో సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. సంక్రాంతి పోటీలో ఉండి ఇబ్బందులు పడటం ఎందుకని ఈ నిర్ణయం తీసుకునేందుకు చర్చిస్తున్నారట. ఏదేమైనా పొంగల్ రేసు నుంచి సూర్య తప్పుకోనున్నారనేది తెలుస్తోంది. -
రాజమౌళితో పుష్పరాజ్ మూవీ..! రూ. 2000 కోట్లు పక్కా
-
రాజకీయాల్లోకి హీరో వరుణ్ సందేశ్ తల్లి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) తల్లి రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు సమక్షంలో వరుణ్ తల్లి డా.రమణి పార్టీలో చేరారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.రమణికి రాంచందర్రావు బీజేపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.తనకు సామాజిక సేవ, హిందుత్వ ఎజెండాతో పని చేయడం ఇష్టమని రమణి తెలిపారు. పార్టీకి మంచి పేరు తీసుకువచ్చేందుకు పనిచేస్తానన్నారు. ఎన్ఆర్ఐ విభాగం ద్వారా మరికొందరు పార్టీలో చేరేలా చర్యలు తీసుకుంటానని రమణి వెల్లడించారు.చదవండి: 'అనంతిక'కు సందీప్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్ -
'అనంతిక'కు సందీప్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్
మ్యాడ్ సినిమాతో అనంతిక సనీల్ కుమార్ టాలీవుడ్లో పాపులర్ అయింది.. అయితే, 8 వసంతాలు సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ మూవీలో ఆమె నటించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. 19 ఏళ్లకే కరాటే, కళరిపయట్టు, కత్తిసాము వంటి విద్యల్లో నైపుణ్యం పొందిన ఈ కేరళ బ్యూటీకి దర్శకుడు సందీప్రెడ్డి వంగా మరో ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్పై ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అనంతిక సనీల్ కుమార్తో ఒక ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారట.. అయితే, ఈ చిత్రానికి సందీప్ నిర్మాతగా మాత్రమే ఉండనున్నారు. ఈ సినిమాతో వేణు అనే కొత్త దర్శకుడుని ఆయన పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ మూవీ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక చక్కటి ప్రేమకథగా ఉండనుందని టాక్. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారట. ‘మేం ఫేమస్’ చిత్రంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. -
నవరాత్రి సెలబ్రేషన్స్లో శుభ శ్రీ రాయగురు.. బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర స్టిల్స్!
నవరాత్రి సెలబ్రేషన్స్లో బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు..బ్యూటీ మూవీ హీరోయిన్ నీలఖి పాత్ర స్టిల్స్..గ్రీన్ డ్రెస్లో ఊర్మిళ హోయలు..యాంకర్ లాస్య నవరాత్రి సంబురాలు.బీచ్లో బిగ్బాస్ బ్యూటీ కిర్రాక్ సీత చిల్.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Seetha/Supraja🦋🇮🇳 (@kirrakseetha) -
మిరాయ్ టీమ్పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్ను ఐకాన్ స్టార్ అభినందించారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025 -
జిమ్లో సమంత- రాజ్ నిడిమోరు.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(samantha ruth Prabhu) ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. శుభం మూవీ నిర్మించిన సామ్.. ఆ తర్వాత కొత్త మూవీస్ ప్రకటించలేదు. అయితే కెరీర్ పరంగా కాస్తా వెనకపడినా సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.అయితే సినిమాల కంటే ఎక్కువగా.. రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దుబాయ్లో జంటగా కనిపించిన వీరిద్దరు.. మరోసారి కెమెరాలకు చిక్కారు. ముంబయి బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సామ్, రాజ్ బయటికి వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గతంలో వీరిద్దరు హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత చాలాసార్లు వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు. దీంతో ఈ సామ్, రాజ్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తమపై వస్తున్న రూమర్స్పై సమంత, రాజ్ స్పందించలేదు. కాగా.. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సామ్.. 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/PlDCMUqD4Q— Samcults (@Samcults) September 23, 2025 -
మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్ను బ్యాడ్న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025 -
బికినీలో 'సాయి పల్లవి'.. అసలు నిజం ఇదే అంటూ కౌంటర్
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి డ్రెస్ స్టైల్ అంటే సింప్లిసిటీకి, ఎలిగెన్స్కి అద్దం పడుతుంది. ఆమె ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్లను ఇష్టపడుతుంది. శారీస్, కుర్తాస్, అనార్కలీస్ వంటి డిజైన్స్లలో కనిపిస్తుంది. భారీ బడ్జెట్ సినిమా, ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పిన సరే గ్లామరస్ పాత్రలకు నో చెబుతుంది. అయితే, రీసెంట్గా తన సోదరి పూజా కన్నన్తో కలిసి సాయిపల్లవి స్విమ్ సూట్లో కనిపించి అందరికీ షాకిచ్చింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు నెటిజన్లు తప్పుబడుతున్నారు. కానీ, ఆమె అభిమానులు మాత్రం సాయిపల్లవికి అండగా నిలబడుతున్నారు.సాయి పల్లవిపై ట్రోల్స్సాయి పల్లవి బికినీ ఫొటోలపై సోషల్మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. కేవలం సినిమాల్లో మాత్రమే పద్ధతిగా ఉంటానని చెప్పి ఇలా బికినీలో ఫోజులు ఇచ్చి తన అసలు రంగు బయటపెట్టిందని విమర్శిస్తున్నారు. బాలీవుడ్లో మరిన్ని ఛాన్స్ల కోసమే ఆమె ఇలాంటి ప్లాన్ వేసిందని చెప్పుకొచ్చారు. కేవలం తనదంతా ఒక ట్రాప్ అంటూ తప్పబట్టారు. సాయిపల్లవిలో ఎలాంటి ప్రత్యేకత లేదని అందరి హీరోయిన్లలాగే అంటూ పేర్కొన్నారు. తన నుంచి ఇలాంటి ఫోటోలు ఎక్స్పెక్ట్ చేయలేదని మరికొందరు చెబుతున్నారు.ఏఐ టెక్నాలజీతో మాయసాయి పల్లవి అభిమానులు మాత్రం ట్రోలింగ్ చేస్తున్న వారిపై కౌంటర్లు విసురుతున్నారు. ఆమె బికినీ ధరించలేదని కేవలం స్విమ్ సూట్తో మాత్రమే నీటిలోకి దిగారని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా సాయిపల్లవి స్విమ్ సూట్ మాత్రమే ధరించింది. కానీ, ఏఐ టెక్నాలజీ సాయంతో వాటిని మార్ఫింగ్ చేసి మరికొందరు వైరల్ చేశారు. దీంతో సాయి పల్లవి బికినీ ధరించిందంటూ అందరూ నమ్మేశారు. తన సోదరితో ఆఫ్ ఫోటోస్ మాత్రమే ఆమె పంచుకుంది. కానీ, అందరినీ ఏఐ టెక్నాలజీ నమ్మించేలా చేసింది.చీర కట్టుకుని వెళ్తారా..?బీచ్లో ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో..? చెప్పాలని సాయి పల్లవి అభిమానులు తిరిగి ప్రశ్నిస్తున్నారు. చీర కట్టుకుని ఎవరైన స్విమ్ చేయడానికి వెళ్తారా...? మన ఇంట్లో ఉన్న వాళ్లు కూడా స్విమ్ సూట్ ధరించే నీటిలోకి దిగుతారు కదా అంటూ సమాధానం ఇస్తున్నారు. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా సాయిపల్లవి ఇష్టమని గుర్తుచేశారు. పంచకట్టుకుని ఎవరైనా ఈత కొడతారా..? లేదు కదా! తమకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరించే నీటిలోకి దిగుతారు. అలాంటప్పుడు సాయిపల్లవిని మాత్రమే ట్రోలింగ్ చేయడం ఎందుకు.. ఇది ఆమె ఎంపిక మాత్రమే.. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీకు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) -
చీరలో రాశీ ఖన్నా.. అస్సలు చూపు తిప్పుకోలేరు! (ఫొటోలు)