Tollywood
-
యషిక ఆనంద్ బోల్డ్ లుక్స్.. ఆర్జీవీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు..!
ఆర్జీవీ హీరోయిన్ ఆరాధ్య స్టన్నింగ్ లుక్స్..సాగర తీరాన బాలీవుడ్ భామ నోరా ఫతేహీ..హీరోయిన్ యషిక ఆనంద్ బోల్డ్ గ్లామర్..రెడ్ శారీలో ఫరియా అబ్దుల్లా అందాలు.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Aaradhya🦋 (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
-
టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్ట్లో బిగ్ రిలీఫ్ లభించింది. వ్యక్తిగత గోప్యతను కాపాడాలంటూ పిటిషన్ వేయగా.. చైతుకు అనుకూలంగా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం..నాగచైతన్యకు అనుకూలంగా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా.. పలు అశ్లీల వెబ్సైట్లు, కొన్ని డిజిటల్ ప్లాట్ఫారమ్లలో నాగచైతన్య పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్నారని సీనియర్ లాయర్ వైభవ్ గగ్గర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగచైతన్య పోలికలతో ఉన్న అనధికారిక వస్తువుల విక్రయం, ఏఐ-జనరేటెడ్ కంటెంట్ను ఆన్లైన్లో విచ్చలవిడిగా వాడుతున్నారని ధర్మాసనానికి వివరించారు. నాగచైతన్య వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న పోస్టులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, వాయిస్, ఫొటోలు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. -
సందిగ్ధం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
నిహాల్, ప్రియా దేశ్పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. ఈ మూవీలో తెరచాప ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్రలో కనిపించారు. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కించారు.తీర్థ క్రియేషన్స్ బ్యానర్పై సంధ్య తిరువీధుల నిర్మించారు. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ ఎలా మెప్పించిందో చూద్దాం.కథేంటంటే..క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ (నిహాల్) మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఊర్లో హాస్పిటల్ కట్టిస్తాడు. ఊహించని విధంగా దేవ్కి సత్య (అర్జున్), కల్యాణి (కాజల్ తివారి) ఎదురు పడతారు. ఆ ఊర్లో వారికి దేవ్ ఆశ్రయం ఇస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా సత్య, కల్యాణి గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్కి మాత్రమే కనిపిస్తుంటారు. అసలు ఆ ఇద్దరు ఎవరు? వారి గతమేంటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న అసలు కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫస్ట్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. కథ చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. దేవ్ క్యారెక్టర్ పరిచయం.. మేఘనతో ప్రేమ కథ, గ్రామ జీవితం లాంటి సాధారణ సీన్లతో రోటీన్గా అనిపిస్తుంది. అయితే సత్య, కళ్యాణి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందిసెకండాఫ్లో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచే ప్రేక్షకుడికి కాస్తా థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ పెరుగుచుంది. అక్కడక్కడా సస్పెన్స్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని అంశాలను మాత్రం దర్శకుడు కాస్తా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్గా ఓ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. దర్శకుడు తాను రాసుకున్న కథను అనవసర కమర్షియల్ హంగులు లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టపడేవారు సందిగ్ధం ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..దేవ్ పాత్రలో నిహాల్ బాగానే ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘన పాత్రలో ప్రియా దేశ్పాగ్ అందంతో పాటు పాత్రకు తగ్గట్టుగా నటించింది. అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో మెప్పించారు. విలన్గా నవీన్ సంకరపు ఫర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా అనిపించాయి. -
పెద్ది మేకర్స్ దూకుడు.. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు..!
రామ్ చరణ్ పెద్ది మేకర్స్ రిలీజ్కు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ పైరసీ, లీక్ విషయంలో మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్లు కాకుండా చర్యలకు మార్గం సుగమమైంది.తాజాగా పెద్దిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు దిగింది. ఈ సినిమాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్లు పెద్ది టీమ్ దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులకు మేకర్స్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సోషల్ మీడియా కార్యకలాపాలపై పెద్ది మూవీ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కాలేజీ స్టూడెంట్ గా పోలీస్ ఆఫీసర్.. స్పిరిట్ లో ప్రభాస్ రోల్ ఇదే..!
-
పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు)
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ HD స్టిల్స్
-
భారతీయ ఇండీ సినిమాకు కేరాఫ్ అడ్రస్గా రానా
తెలుగు హీరో రానా దగ్గుబాటికి చెందిన 'స్పిరిట్ మీడియా' మన దేశంలో ఇండీ సినిమాలకు సరికొత్త ప్లాట్ఫామ్గా మారుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇండియాలోని అన్ని భాషలకు చెందిన చిన్న చిత్రాలను, క్రియేటివ్ కథలను సపోర్ట్ చేస్తూ వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను, మన నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడమే స్పిరిట్ మీడియా మెయిన్ టార్గెట్.దీనివల్ల పెద్దగా గుర్తింపు లేని ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలకు తమ కథలను దేశవ్యాప్తంగా చూపించే ఒక అద్భుతమైన ఛాన్స్ దొరుకుతోంది. ఈ ఇండీ ఫిలిం మూవ్మెంట్లో ప్రస్తుతం నార్త్ ఈస్ట్ సినిమాలు చాలా స్పెషల్గా నిలుస్తూ వేగంగా ఎదుగుతున్నాయి. సిక్కిం, అసోం, మణిపూర్ లాంటి ప్రాంతాల నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతి ఇస్తున్నాయి. అక్కడి విభిన్నమైన కల్చర్ని, అచ్చమైన భావోద్వేగాలని చాలా రియలిస్టిక్గా చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సిక్కిం మూవీ 'షేప్ ఆఫ్ మోమో'ని చెప్పుకోవచ్చు.ట్రిబేనీ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే 15కి పైగా అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. జోయా అక్తర్, పాయల్ కపాడియా లాంటి క్రేజీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇలాంటి అద్భుతమైన సినిమాలను థియేటర్లకు తీసుకురావడం ద్వారా స్పిరిట్ మీడియా అన్ని ప్రాంతాల సినిమాలకు సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మంచి సినిమా కల్చర్ ని బిల్డ్ చేస్తోంది. -
రూ.20 కోసం గొడవ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నా: నటుడు ఎమోషనల్
శివకుమార్.. ఈ బుల్లితెర నటుడు మౌనరాగం సీరియల్తో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో ఓ ధారావాహికలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే సీరియల్స్ కన్నా సోషల్ మీడియాలోనే ఈయన ఎక్కువ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా అతడి ప్రేమ వ్యవహారం ఆన్లైన్లో ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది.కలిసుంటున్న జోడీ'మౌనరాగం', 'జానకి కలగనలేదు' సీరియల్స్ నటి ప్రియాంక జైన్తో రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు, ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. ప్రియాంక ఆల్రెడీ తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో రాబోయే బిగ్బాస్ సీజన్లలో ఆమె ప్రియుడు శివకుమార్ ఉండటం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు.ప్రియాంకజైన్తో శివకుమార్తండ్రి కర్కశత్వంపైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే శివకుమార్ బాల్యంలో మాత్రం తండ్రి ప్రేమకు నోచుకోలేదు. ప్రేమను పంచాల్సిన తండ్రి బాధ పెడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. శివకుమార్ మాట్లాడుతూ.. మా అమ్మ స్కూల్ టీచర్. సాయంత్రం 5 తర్వాత అరగంట ఆలస్యంగా వస్తే చాలు అమ్మపై నాన్న కోప్పడేవాడు. ఎవడితో తిరుగుతున్నావ్? అని నీచంగా మాట్లాడేవాడు. అమ్మను కొట్టేవాడు. రూ.20 కోసం పెద్ద గొడవప్రతిరోజు ఇదంతా చూసి అలిసిపోయాను. ఆయన ప్రవర్తనకు విసిగిపోయాను. ఆయన మందు తాగుతాడు, గుట్కా నములుతాడు, ఎన్నో ఎఫైర్స్ ఉన్నాయి. మా నాన్నను చూశాక మా చెల్లికి అబ్బాయిలంటేనే విరక్తి వచ్చేసింది. ఒకరోజు ఏమైందంటే.. మా నాన్న జేబులో రూ.20 కనిపించలేదు. ఆయనే ఎక్కడో తాగినచోట ఖర్చు చేసుంటాడు. నేనే తీశానని నాపై నింద వేశాడు. ఆయన చేసిన గొడవకు ఊరంతా మా ఇంటి ముందుకొచ్చింది. కుటుంబమంతా చనిపోదామని..కేవలం రూ.20 కోసం అంత పెద్ద గొడవ! ఈ జీవితమే వద్దు అని చచ్చిపోవాలనుకున్నా.. నాతోపాటు అమ్మ, చెల్లిపై కిరోసిన్ గుమ్మరించాను. అగ్గిపుల్ల వెలిగించేలోపు అమ్మ స్టూడెంట్ ఒకరు మమ్మల్ని బయటకు తీసుకెళ్లి కాపాడారు. ఆరోజు గనక తను ఆపకపోయుంటే ఈరోజు శివకుమార్ మీ ముందుండేవాడు కాదు. ఎవరినైనా మంచి తండ్రిని చూసినప్పుడు నాకెందుకు ఇలాంటి నాన్న లేడని బాధపడేవాడిని. నాన్న ప్రేమను పొందలేకపోయాను. ఇలాంటి వ్యక్తితో ఇంకా ఎందుకు కలిసుండటం? విడాకులు ఇచ్చేయమని అమ్మతో అనేవాడిని. ఇన్నాళ్లకు వాళ్లిద్దరికీ విడాకులు ఇప్పిస్తున్నాను అని శివకుమార్ ఎమోషనలయ్యాడు.NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు -
ఈ గుండెని తాకిపో తాతా: తారక్ ఎమోషనల్ పోస్ట్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 103వ జయంతి నేడు (మే 28). ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చుని తాతతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వీడియో వైరల్జూనియర్ ఎన్టీఆర్ రాక నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయి కిందపడ్డాడు. దీంతో తారక్.. అతడిని పైకి లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.గుండె తల్లడిల్లుతోందిజూనియర్ ఎన్టీఆర్.. తాతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలోనూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. pic.twitter.com/eQQ1DFqBdu— Jr NTR (@tarak9999) May 28, 2026 He cares. 🥹❤️ pic.twitter.com/J5HpAai5Lh— appie 🎀 (@fizz_nandamuri) May 28, 2026 -
విజయ్కు భార్యపై ఎంత ప్రేమో.. వీడియో వైరల్
హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. ఆన్స్క్రీన్పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ ది బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ప్రేమ విషయాన్ని వీలైనంతవరకు సీక్రెట్గా ఉంచారు. అదే సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామంటూ కొన్ని హింట్లు కూడా వదిలారు. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం అని కాకుండా డైరెక్ట్గా పెళ్లి వార్త చెప్పి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. జంటగా..ఈ పెళ్లిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభిమానుల్ని, తన ఊరి ప్రజలను భాగం చేయడం విశేషం! ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మార్చిలో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ విరోష్ జోడీ ప్రస్తుతం 'రణబాలి' సినిమాలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్స్ మధ్య గ్యాప్ దొరికినప్పుడు ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ విమానాశ్రయంలో కనిపించారు.భార్యపై ఎంత ప్రేమో!ఈ సందర్భంగా సింపుల్ టీ షర్ట్లో కనిపించిన విజయ్ మెడలో ఒక చైన్, లాకెట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ లాకెట్ R అక్షరంలో ఉంది. దీంతో రష్మిక మందన్నాకు గుర్తుగా R పెండెంట్ ధరించాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినిమాల విషయానికి వస్తే.. విజయ్ చేతిలో 'రణబాలి' కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. అటు రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ మూవీ 'కాక్టైల్' జూన్ 19న విడుదలవుతోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మైసా మూవీ ఉంది. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) చదవండి: కరుప్పు రిజెక్ట్ చేసిన విజయ్కు థాంక్స్.. ఎందుకో తెలుసా? -
పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
'ఎస్వీ కృష్ణారెడ్డిగారు లేకపోతే నేను దర్శకుడిగా ఎదిగేవాడిని కాదు' అంటున్నాడు డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి. ఈయన దర్శకత్వంలో శ్రీకాంత్, లయ జంటగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్ మిడిల్ క్లాస్'. ఈ సినిమా టీజర్ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇద్దర్నీ మర్చిపోలేనుఈ సందర్భంగా జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మా అమ్మానాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఇద్దరే.. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి.. వీరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కృష్ణారెడ్డి దగ్గర పని చేయకపోయుంటే నేను దర్శకుడిని అయ్యేవాడినే కాదు. నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్తాను.. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాను. ఒకసారి డ్యామ్ ఎత్తేసరికి మా పంటపొలం కొట్టుకుపోయింది. పొలమంతా నీటమునిగింది. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లుఆ సమయంలో నాకు ఎస్వీ కృష్ణారెడ్డి రూ.25 వేలు సాయం చేశారు. ఆ డబ్బు మా నాన్నకు ఇస్తే మళ్లీ పొలం బాగు చేయించాడు. ఆ 9 ఎకరాల పొలం నేడు రూ.5 కోట్లు విలువ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా విషయానికి వస్తే ఇందులో గోవిందుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించబోతున్నాడు.చదవండి: వయసు ముదిరిపోతోందని ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన నటి -
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)
-
సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోండి
ప్రస్తుతం టాలీవుడ్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. పర్సంటేజీ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది గానీ ఇదంతా జరగడానికి ముందు అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు.. మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలని చెప్పుకొన్నారు. కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడీ విషయంపై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)ఏ బిజినెస్లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు. సినిమా కూడా అంతే. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి 'సమస్యలు… సమస్యలు…' అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది! ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు. సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు!''సిన్సియర్గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి. వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్పై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్గా సినిమాలు తీయండి. ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది' అని మధుర శ్రీధర్ చెప్పుకొచ్చారు.స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలని డైరెక్ట్ చేసిన ఈయన.. తర్వాత నుంచి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. గతేడాది ఈయన నుంచి మోతవరి లవ్ స్టోరీ, సంతాన ప్రాప్తిరస్తు మూవీస్ వచ్చాయి.(ఇదీ చదవండి: చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం) -
'జాతిరత్నాలు' సినిమాలా ఇది గుర్తుండిపోతుంది
కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో మొదలైన సినిమా 'లఫూట్ గ్యాంగ్'. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బీవీఎస్ రవి, రాజ్ తరుణ్, ఆకాష్ పూరీ తదితరులు విచ్చేశారు.(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)ఇందులో నటిస్తున్న అంటోనీ కార్తీక్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా 'జాతిరత్నాలు' తరహాలో అందరికీ గుర్తుండిపోతుందని అన్నారు. 1990ల్లో ఓ హాస్టల్లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా ఉండే యువకుల గ్యాంగ్.. హాస్టల్లో ఎలా ఉంటారు? వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. చిరు జోక్యంతో సద్దుమణిగింది) -
చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?
తెలుగులో ప్రతివారం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏవీ హిట్ అవ్వట్లేదు. ఒకటిరెండు రోజుల మెరుపులు తప్పితే బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేస్తున్నాయి. కానీ చాలామంది దర్శకనిర్మాతలకు ఈ నిజం ఒప్పుకోవడానికి ఇప్పటికీ మనసు రావట్లేదు. అంతకుముందు రివ్యూయర్లపై నెపం నెట్టేసేవారు. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. నవ్వుతూ నిజాలు చెప్పేస్తున్నారు. అసలు తెలుగు సినిమాల పరిస్థితి ఇలా ఎందుకు తయారైందో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)'యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్ కొనేస్తున్నాం. ట్విటర్లో నెగిటివిటీ ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చేస్తున్నాం. ఏది నిజం? ఏది అసలు కంటెంట్? ఏది కావట్లేదు? ఏది జనాలకు ఎక్కుతుంది? ఏది ఎక్కదు? అసలు ఏం జరుగుతుందనేది తెలియక లోపల ప్యాక్ అయిపోతోంది. పాట బాగుందా? ఓపెనింగ్ వస్తాదా రాదా అని అందరికీ ఫోన్లు చేయడం. జనాలకు కూడా ఇండస్ట్రీ అంటే విరక్తి వచ్చేసింది. చాలా భయమేస్తోంది. ఇలా చేసుకుంటూ పోతే ఏం కథలు రాయాలి? ఏం సినిమాలు తీయాలి? ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. రొమ్ కామ్, థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటి కొన్ని జానర్లని మనం చంపేశాం. నేను నమ్మకంగా చెబుతున్నా 'బేబి'ని ఇప్పుడు రిలీజ్ చేస్తే సగం షేర్ కూడా రాదు. ఈ రెండేళ్లలో అంత మార్పులొచ్చేశాయి' అని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ అన్నారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని చెప్పడానికి చాలామంది భయపడతారు. కానీ నేను ధైర్యంగా చెబుతున్నా. ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడమే మనందరికీ పెద్ద సవాల్. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత హెల్తీగా ఉంటుంది' అని చెప్పారు.పైన ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవాళ్లే. వీళ్లు ఇప్పుడు ఈ విషయాల్ని చెబుతున్నారు గానీ జనాలకు వీటి గురించి ఎప్పుడో అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నా పెద్దా ఏ సినిమా రిలీజైనా సరే అసలు టాక్ రావడం కంటే ముందే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులని చాలామంది దర్శకనిర్మాతలే ప్రోత్సాహిస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్కి సంబంధం లేకుండా పోస్టర్లపై పెద్ద పెద్ద నంబర్లు వేసి ప్రేక్షకుల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఫలితంగా ఇప్పుడు టాలీవుడ్ దాని పర్యవసనాలని అనుభవిస్తోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు!(ఇదీ చదవండి: తెలుగులో చాన్నాళ్ల తర్వాత పిల్లల సినిమా.. టీజర్ రిలీజ్)Many people are scared. I'm saying this boldly 🗣️Today's industry is in very bad shape 📉Bringing audiences to theaters is the biggest challenge 🙌🏻#DilRaju pic.twitter.com/4oE7ORMvSD— Filmyscoops (@Filmyscoopss) May 27, 2026It's becoming hard to know what’s genuine and what’s real. We’re buying comments and views, and if there’s negativity on Twitter, we’re turning it into positivity.- Director #SaiRajesh at the #SummerHolidays teaser launch event. pic.twitter.com/CAy04ccej4— Suresh PRO (@SureshPRO_) May 27, 2026 -
మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్
-
ఆయా షేర్... రికార్డ్
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ వంటి హిట్ మూవీ నిర్మించిన సుధాకర్ చెరుకూరి ‘ది ప్యారడైస్’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి నాని ఇంట్రో సాంగ్గా విడుదలైన తొలిపాట ‘ఆయా షేర్...’ కి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటని అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చాందీపాడగా, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈపాట తెలుగు వెర్షన్ 150 ప్లస్ మిలియన్ల వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్ సాధించినట్లు పేర్కొని, నాని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.‘‘నాని కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్బస్టర్గా ‘ఆయా షేర్...’ నిలిచింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ వేదికలను షేక్ చేస్తూ ఈపాట ఒక కల్చరల్ ఫెనామినల్గా మారింది’’ అని చిత్రబృందం తెలిపింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ సాయి. -
భావోద్వేగాల వదలనే...
‘‘చెన్నై లవ్ స్టోరీ’లోని ‘వదలనే...’పాటనుపాండిచ్చేరిలో షూట్ చేశాం. ఒక అందమైన గుడి దగ్గర నాకు, గౌరికి సీన్ చెప్పారు డైరెక్టర్ రవి. ఆ సమయంలో మా ముగ్గురికీ కళ్లు చెమర్చాయి. అంత భావోద్వేగానికి గురయ్యాం. మణిశర్మగారు అన్నిపాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారు’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆయన హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయిరాజేశ్ కథను అందించిన ఈ చిత్రాన్ని రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్, ఎస్కేఎన్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వదలనే..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈపాటను విడుదల చేశారు.‘‘వదలనే...’ నా కెరీర్లో బెస్ట్ సాంగ్గా మిగిలిపోతుంది’’ అన్నారు రవి నంబూరి. ‘‘వదలనే...’ ఓ గొప్పపాటగా నిలిచిపోతుంది’’ అని సాయి రాజేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, కెమెరామేన్ డేనియల్ విశ్వాస్ మాట్లాడారు. ఈ వేడుకలో పలువురు సంగీతదర్శకులుపాల్గొన్నారు. -
ఆడపులులం మేము
ఆడపిల్ల కదా... సిల్వర్ స్క్రీన్పై ఆడుతూపాడుతూ గ్లామరస్గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్ని పక్కన పెట్టి, సిల్వర్ స్క్రీన్పై డిష్యుం డిష్యుంకి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయికలు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్లోకి ఎంటరవుతున్నారు. దీపికా పదుకోన్ వంటి సీనియర్ హీరోయిన్ మాత్రమే కాదు... రష్మికా మందన్నా, సంయుక్త, ఆలియా భట్, కృతీ సనన్... ఇలా పలువురు యంగ్ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కోసం గుర్రపు స్వారీ, కత్తి సాము, గన్ షూట్ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఈ హీరోయిన్లు ఏయే చిత్రాల్లో పవర్ఫుల్గా కనిపించనున్నారో తెలుసుకుందాం...‘మైసా’ కోసం మార్షల్ ఆర్ట్స్ఒకపాత్ర ఒప్పుకుంటే ఆపాత్రలానే మారిపోవాలనుకుంటారు రష్మికా మందన్నా. ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ‘మైసా’ సినిమాలోని మైసాపాత్ర కోసం ఈ బ్యూటీ తీసుకున్న ఓ రిస్క్ 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం. నిజానికి ఈ సన్నివేశాన్ని డూప్తో చేయిద్దామని యూనిట్ అన్నప్పటికీ ‘నో నో’ అంటూ, తానే చేశారు. ఇంకా ఈ సినిమా కోసం బోలెడన్ని రిస్కీ ఫైట్స్ చేస్తున్నారామె. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం రష్మిక థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ప్రత్యేకంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్లో కఠోర శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు 8 గంటలపాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగింది. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, అధునాతన స్టంట్ టెక్నిక్స్ వంటివి నేర్చుకున్నారు. ఆ ట్రైనింగ్ పూర్తయ్యాక కేరళలో తీసిన యాక్షన్ సీక్వెన్స్లో భాగంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైసా అనే గిరిజన గోండు యువతిపాత్రలో కనిపించనున్నారు రష్మిక. ఈ షెడ్యూల్ కోసమే రష్మిక బ్యాంకాక్లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ ఏడాదే విడుదల కానుంది.కత్తి సాముకి సైక్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు సంయుక్త. అనడమే కాదు... ఆ పని చేశారు కూడా. ‘స్వయంభు’ సినిమాలో చేసిన యోధురాలిపాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి సాములో శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ పర్యవేక్షణలో ఆమె ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతే కాదు... ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించే రోజు షూటింగ్కు దాదాపు నాలుగైదు గంటల ముందు ప్రాక్టీస్ సెషన్స్లోపాల్గొన్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దట్టమైన అడవుల నేపథ్యంలో చిత్రీకరించారు. అందువల్ల శిక్షణను కూడా అదే తరహా వాతావరణంలో, కొండలు గుట్టలు వంటి కఠినమైన భూభాగాలకు అలవాటు పడేలా నిర్వహించారు. ఇక ఈ భారీపాన్ ఇండియన్ మూవీలోనిపాత్ర కోసం హీరో నిఖిల్ సిద్ధార్థ్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ఇరవై ఏళ్లయింది దీపికా పదుకోన్ సినిమాల్లోకి వచ్చి. ఇన్నేళ్లల్లో గ్లామరస్ క్యారెక్టర్స్తోపాటు పూర్తిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. అలాగే ‘పఠాన్, జవాన్, ఫైటర్’ వంటి సినిమాల్లో యాక్షన్ రోల్స్ చేశారు. ‘ఫైటర్’ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. తాజాగా చేస్తున్న ‘కింగ్’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు కానీ... స్టంట్ రిహార్శల్స్ చేశారట. ఈ చిత్రంలో ఒకేసారి ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ చేసే యాక్షన్ సీన్ ఉందని సమాచారం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ని సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారని టాక్. ఈ భారీ ఫైట్లో షారుక్, దీపిక, సుహానాపాల్గొన్నారట. ఒక నటి 20 ఏళ్ల తర్వాత కూడా ఉత్సాహంగా యాక్షన్ రోల్స్ ఒప్పుకోవడం, రిహార్సల్స్ చేసి మరీ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాలోనూ దీపికా పదుకోన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ‘కింగ్’ సినిమాకి ముందే ట్రైనింగ్ తీసుకుని, యాక్షన్ సీన్స్ చేశారు దీపికా పదుకోన్. అయితే గర్భవతి కావడంతో ‘రాకా’లోని యాక్షన్ సీన్స్ని ఆమెకు బదులు డూప్తో చేయించాలనుకుంటున్నారట. కాగా ‘కింగ్’ సినిమా కోసం యువ నటి సుహానా కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...సుహానా... షూట్కి రెడీ‘రెడీ టు షూట్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి రావడం రావడమే సుహానా ఖాన్ ‘కింగ్’ చిత్రంతో తుపాకీతో ఎంట్రీ ఇస్తున్నారు. మామూలుగా ‘స్టార్ కిడ్స్’పై ఎన్ని అంచనాలు ఉంటాయో షారుక్ ఖాన్ తనయగా సుహానా మీద అన్నీ ఉన్నాయి. 2023లో చేసిన ‘ది ఆర్చీస్’ సుహానాకి తొలి సినిమా. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. సో... ‘కింగ్’ వంటి భారీ యాక్షన్ సినిమాతో సుహానా వెండితెరపైకి వస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఒక క్రూరమైన, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని హంతకుడిపాత్రలో కనిపిస్తారట. ఆయనపాత్ర రెండు టైమ్లైన్స్లో ఉంటుందని సమాచారం.ఒకటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అని టాక్. ఈ చిత్రంలో షారుక్ శిష్యురాలిపాత్రను సుహానా చేస్తున్నారు. షారుక్ దగ్గర యాక్షన్ ట్రైనింగ్ తీసుకునేలా ఈపాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఇది పూర్తిగా యాక్షన్ క్యారెక్టర్ కావడంతో ‘కింగ్’ షూటింగ్ ఆరంభించే ముందు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ శిక్షకుల వద్ద మార్షల్ ఆర్ట్స్, గన్ షూట్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు సుహానా. ఈ షూటింగ్ లొకేషన్లో కుమార్తెకు షారుక్ కూడా కొన్ని యాక్షన్ మెళకువలు నేర్పిస్తున్నారట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘కింగ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఫైట్కే కాదు... పాటకూ ట్రైనింగ్స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు... బ్రెయిన్తో ఆలోచించి, ప్రత్యర్థిని ట్రాప్ చేయాలి, బాడీ పవర్ని ఉపయోగించి రఫ్ఫాడించాలి. సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగల్లా కనిపించే ఆలియా భట్, శార్వరి ఈ స్పై క్యారెక్టర్ చేశారు. ఆ సినిమానే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ఆల్ఫా’. బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలింస్ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ హీరో ఓరియంటెడ్ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్ఫుల్ స్పై ఏజెంట్లుగా ఒదిగిపోవడానికి ఆలియా, శార్వరి ఫిట్నెస్తోపాటు మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.జిమ్లో ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తూ, పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉన్న వీడియోలను ఆలియా షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. విశేషం ఏంటంటే... ఫైట్స్కి మాత్రమే కాదు... ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం కూడా ఆలియా, శార్వరి కఠినమైన వర్కౌట్స్ చేశారట. ఈపాట డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కువ స్టామినాని డిమాండ్ చేయడంతో ఈ వర్కౌట్స్ చేశారని తెలిసింది. ఇద్దరూపాల్గొన్న ఫైట్స్, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా ఉంటాయని బాలీవుడ్ టాక్. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏజెంట్గా ఫైట్ఆలియా, శార్వరిలానే వామికా గబ్బి కూడా స్పై క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై తుపాకీ ఎక్కు పెట్టి, ఏజెంట్గా సిల్వర్ స్క్రీన్పై విజృంభించడానికి వామికా శిక్షణ తీసుకున్నారు. ‘జీ 2’ సినిమా కోçసమే వామికా గబ్బి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్లోకి ఎంటరయ్యారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’కి (2018) సీక్వెల్గా ‘జీ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ గోపి 116పాత్ర చేశారు శేష్. సీక్వెల్లోనూ ఈపాత్ర చేస్తున్నారు. ఏజెంట్ మహాలక్ష్మి నాగిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులోని యాక్షన్ సీన్స్, స్పై మిషన్స్, ఫిట్నెస్కి సంబంధించి వామికా గబ్బి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం యూరప్లో చిత్రీకరించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుందని తెలిసింది. ఇక 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా వామికా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పంజాబీ, హిందీ మలయాళం వంటి భాషల్లో నటించిన వామికా ‘జీ 2’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’లో ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపించిన వామిక ‘జీ 2’లో పూర్తి భిన్నంగా చాలా పవర్ఫుల్గా కనిపించనున్నారు. ఈపాన్ ఇండియన్ స్పై యాక్షన్ మూవీ పలు భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.ఇంటర్పోల్ ఆఫీసర్గా ట్రైనింగ్గ్లామరస్, డీ గ్లామరస్, ట్రెడిషనల్... ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అంటారు కృతీ సనన్. ‘ఆది పురుష్’లో సీతగా కనిపించిన ఈ బ్యూటీ ‘మిమీ’లో సరోగేట్ మదర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘కాక్టెయిల్ 2’లో గ్లామరస్గా కనిపించనున్నారు. ఇప్పుడు తనలోని పూర్తి స్థాయి యాక్షన్ నటిని ఆవిష్కరించుకోవడానికి కృతి కసరత్తులు చేస్తున్నారట. మరి... ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్ అలాంటిది. బాలీవుడ్ భారీ మాస్ సినిమాల్లో ఒకటైన ‘డాన్’ సిరీస్లో నటించే చాన్స్ కృతీకి దక్కిందని సమాచారం. ‘డాన్, డాన్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చేయనున్న విషయం తెలిసిందే.రెండు భాగాల్లో డాన్గా షారుక్ ఖాన్, ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాగా ప్రియాంకా చోప్రా నటించారు. అయితే మూడో భాగంలో రణ్వీర్ సింగ్ని డాన్పాత్రకు తీసుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ, ఈ సినిమా నుంచి రణ్వీర్ తప్పుకున్నారు. ఇక షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అనే తరుణంలో సరిగ్గా మూడు వారాల ముందు రణ్వీర్ తప్పుకున్నారట. ఈ విషయంలో రణ్వీర్–ఫర్హాన్ మధ్య వివాదం నెలకొంది. ముందు నటిస్తానని చెప్పి, తర్వాత తప్పుకోవడంతో రణ్వీర్కి సహాయ సహకారాలు అందించకూడదని ముంబైకి చెందిన ‘ఫిల్మ్ బాడీ’ నిర్ణయించుకుంది.అలాగే నష్టపరిహారం కింద రణ్వీర్ తనకు రూ. 45 కోట్లు ఇవ్వాలని ఫర్హాన్ డిమాండ్ చేస్తున్నారు. మరి... ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది కాలమే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాపాత్రకు కృతీ సనన్ని ఎంపిక చేశారని భోగట్టా. ‘డాన్’ సిరీస్లో ఈపాత్రకు యాక్షన్ సీన్స్ ఉన్నట్లే మూడో భాగంలోనూ ఉంటాయి. దాంతో కృతీ సనన్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్త వినిపిస్తోంది.అయితే కృతీ సనన్ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఫర్హాన్ అక్తర్ ఆఫీస్ వద్ద కృతి పలుమార్లు కనిపించడంతో ‘డాన్ 3’ చర్చల్లోపాల్గొనడానికే అని ప్రచారంలో ఉన్న వార్తకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ సినిమాని 2023లోనే ప్రకటించారు ఫర్హాన్. అయితే ఇప్పటివరకూ షూటింగ్ ఆరంభించలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ తారలే కాదు... మరికొంత మంది కూడా క్యారెక్టర్ డిమాండ్ మేరకు కసరత్తులు చేసి, సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండాపాత్రల్లో ఒదిగిపోతున్న ఈ కథానాయికలను అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
వెకేషన్ మోడ్
వెకేషన్ మోడ్ ఆన్ చేశారు అల్లు అర్జున్. కొద్ది రోజులుగా ‘రాకా’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కాస్త సేద తీరేందుకు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్యారిస్లో ఉన్నారని తెలిసింది. వచ్చే నెల ప్రారంభంలో ఇండియాకు వస్తారు అల్లు అర్జున్. ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ వచ్చే నెలలో ముంబైలో ప్రారంభం కానుంది.సినిమాలో కీలకమైన ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్తోపాటు ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ దీపికా పదుకోన్ ఓ ప్రధానపాత్రలో నటిస్తున్నట్లుగా యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. ఇంకా హీరోయిన్స్ రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా భాగం కానున్నారని సమాచారం.పునర్జన్మల కాన్సెప్ట్తో ఈ సినిమా సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుందని సమాచారం. -
ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్తో ఈమెకు సంబంధమేంటి?
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అని అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఒక్క సాంగ్తో తెలుగులో ఈమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఐదారేళ్ల పాటు తెలుగులో అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. అలాంటి ముమైత్ అసలేమైపోయింది? ఇప్పుడేం చేస్తోంది? ఈమెకు పాకిస్తాన్ ఉన్న సంబంధమేంటి?(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ముమైత్ ఖాన్ పుట్టి పెరిగిందంతా ముంబైలో. ఈమె అసలు పేరు ఇది కాదు ముంతాజ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని ముమైత్ అని మార్చుకుంది. 2001లో రిలీజైన తమిళ మూవీ 'మజ్ను'తో ఐటమ్ డ్యాన్సర్గా అరంగేట్రం చేసింది. తెలుగులో అయితే హరికృష్ణ హీరోగా నటించిన 'సామి'తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఛత్రపతి, యోగి, సామాన్యుడు, ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యధన, నేనింతే, మగధీర తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఓ హీరో మూవీ వస్తుందంటే ముమైత్ పాట కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లింది. అలా 2006-11 మధ్య కాలంలో ఏడాది ఐదారు సినిమాలు చేసింది.ఐటమ్ సాంగ్సే కాదు మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. అలాంటి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈమె సినిమాల్లో కనిపించడం మానేసింది. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడిన ముమైత్.. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు సినిమాలు మానేశానని అంతా అనుకున్నారు. కానీ నేనెప్పుడూ సినిమాలు మానలేదు, మానాలని అనుకోలేదు. యాక్సిడెంట్ జరిగింది. నా మెదడులో 5 నరాలు చిట్లాయి. ఈ ప్రమాదం తర్వాత కనీసం ఏడేళ్లు పని చేయకూడదని డాక్టర్లు చెప్పారు. చిన్న వస్తువు మోయడం కూడా చాలా కష్టంగా అనిపించేది.ఈ ప్రమాదం తర్వాత 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. దేవుడు నన్ను ముమైత్ ఖాన్గా మార్చాడు. ఆయనే దీనంతటికీ ఫుల్స్టాప్ పెట్టమని హింట్ ఇచ్చాడు. దాన్ని నేను అంగీకరించాను. ఏడేళ్ల పాటు నన్ను నేను తెలుసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించాను. ఈ సమయంలో నన్ను మా అమ్మే చూసుకుంది. నన్ను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. నా లైఫ్ స్టైల్ని మారకుండా చూసుకుంది. ఈ ఏడేళ్లలో నాకేం ఇష్టమనే విషయాలను బాగా తెలుసుకున్నా. నేను బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్కి, మేకప్ కిట్స్కి, స్టైయిలింగ్ టీమ్స్ని ముంబై నుంచి తెప్పించాల్సి వచ్చేది. వాటిని హైదరాబాద్లోనే ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచనతోనే వ్యాపారం మొదలెట్టా. ఇప్పుడు అదే నా కెరీర్గా ఎంచుకున్నానని గతంలో ముమైత్ చెప్పుకొచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికొస్తే ముమైత్ తల్లిది తమిళనాడు కాగా తండ్రిది పాకిస్తాన్. ముమైత్ పుట్టిన తర్వాత వీళ్ల కుటుంబం ముంబైకి వచ్చేసింది. 13 ఏళ్ల వయసు నుంచే పని చేయడం మొదలెట్టిన ముమైత్ ఖాన్, చిన్నతనంలో ఆకలి కష్టాలని కూడా అనుభవించింది. బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో పాల్గొంది కానీ డ్రగ్స్ కేసు వల్ల మధ్యలో బయటకొచ్చి మళ్లీ షోలోకి వెళ్లింది. కానీ 49వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు చేయడం తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) -
‘సింగిల్ రాజు’ సినిమా టీజర్ లాంచ్.. (ఫొటోలు)
-
కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్
-
'చెన్నై లవ్స్టోరి' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినవాడే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు. గతంలో ఈయన చేసిన చిత్రాలు కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన అన్న కొడుకు, హీరో నిరంజన్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ సుధీంద్ర.. 2018లో వచ్చిన 'సెకండాఫ్' మూవీతో నటుడిగా పరిచయమయ్యాడు. 2022లో రిలీజైన 'నమ్మ హుడుగురు' మూవీలోనూ నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'సీతా పయనం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహించగా ఇతడి కూతురు ఐశ్వర్య హీరోయిన్గా చేసింది. భాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.నటుడు నిరంజన్ సుధీంద్ర.. డాక్టర్ సంజనా రాజ్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరైన ఉపేంద్ర.. కాబోయే వధూవరులని మనసారా దీవించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపేంద్ర సతీమణి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం చాలా బెటర్: టాలీవుడ్ హీరోయిన్) -
యాక్షన్ హీరో అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
టీఎఫ్సీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి: చిరంజీవి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్సీసీ) అన్నది హయ్యెస్ట్ బాడీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. థియేటర్స్లో పర్సెంటేజీ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదు. ఇలాంటివాటి వల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం అందరికీ సముచితం’’ అని హీరో చిరంజీవి తెలిపారు. మల్టీప్లెక్స్లోలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా పర్సెంటేజీ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం చిరంజీవిని కలిసి, వివరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్సీసీ) ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పనితీరు, ఫలితాల పట్ల కొందరు ఎగ్జిబిటర్స్లో అసంతృప్తి, అపనమ్మకం ఉందన్న విషయం అర్థం అయింది.ఫిల్మ్ చాంబర్ కమిటీ జూన్ 30వ తేదీ వరకూ అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించి,ప్రోడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజీ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. కమిటీ సకాలంలో నివేదిక ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సురేష్బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు శేఖర్, నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్తో పాటు భరత్ నారంగ్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మెగాస్టార్ చెంతకు పర్సంటేజీ వివాదం.. అసలేం జరగనుంది?
టాలీవుడ్ పర్సెంటేజ్ వివాదం మరింత రసవత్తరంగా మారింది. ఈ సమస్య చివరికీ మెగాస్టార్ వరకు చేసింది. ఈ వివాదం మరింత ముదరడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతస సంఘం చిరంజీవిని కలిశారు. దాదాపు గంటసేపు వీరితో చిరంజీవి సమావేశంలో కానున్నారు. ఎగ్జిబిటర్స్తో, గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీపై అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ రోజు తెలంగాణ ఎక్జిబిటర్స్, నిర్మాత కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల నియమించిన కమిటీ నుంచి అన్ని వివరాలు చిరంజీవి తెలుసుకున్నారని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండు మూడు రోజుల్లో అఫిషియల్గా చెబుతామని తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య..: ఎగ్జిబిటర్ శ్రీధర్..ఇది ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య అని.. పెద్ది మూవీ గురించి కాదని ఎగ్జిబిటర్ శ్రీధర్ వెల్లడించారు. చిరంజీవి రెస్పాన్స్ బాగుందని అన్నారు. అన్ని వివరాలు మెగాస్టార్ అడిగి తెలుసుకున్నారని వివరించారు. సింగిల్ స్రీన్ థియేటర్స్ పడుతున్న సమస్యలు ఇన్ని ఉన్నాయా అని చిరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని శ్రీధర్ అన్నారు. -
'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్బంప్స్ స్పీచ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Reiterates... "Ee Cinema Raasi Pettukondi" 🔥#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/OOAdD59WHI— Trends RamCharan ™ (@TweetRamCharan) May 25, 2026 -
దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..!
టాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. -
డబ్బింగ్లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?
సూర్య 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తమిళ, తెలుగులో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ 'దృశ్యం 3' ఎలాంటి ప్రచారం లేకుండానే మన థియేటర్లలోకి వచ్చి మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. అయితే ఈ రెండింటికి తెలుగులో ఏమంత గొప్ప టాక్ రాలేదు. కానీ ఆ ప్రభావం కలెక్షన్స్పై అస్సలు పడినట్లు కనిపించడం లేదు. అదే టైంలో వీటితో పాటు రిలీజైన తెలుగు మూవీస్ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకీ పరిస్థితి?(ఇదీ చదవండి: హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)టాలీవుడ్ బాక్సాఫీస్కి సంక్రాంతి ఎంత ముఖ్యమో అంతకు మించి వేసవిలో సందడి ఉంటుంది. కానీ ఈ సమ్మర్ని తెలుగు దర్శకనిర్మాతలు హీరోలు వృథాగా వదిలేశారు. చెప్పుకోదగ్గ ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. దీంతో థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎండలు, ఐపీఎల్ వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు గానీ అసలు కారణం ఇది కాదు. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్తో ఒక్కరూ మూవీస్ చేయట్లేదు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి.అలా స్టార్స్ సినిమాల కోసం ముఖం వాచిపోయిన తెలుగు ప్రేక్షకులకు.. సూర్య, మోహన్ లాల్ మూవీస్ మండవేసవిలో కూలింగ్ వాటర్లా కనిపించాయి. అంత ఎండలో వాటర్ బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. అలానే ఈ రెండు చిత్రాలు ఏమంత పెద్దగా గొప్పగా లేవు అని ఆడియెన్స్కి తెలిసినా సరే చూసేద్దాంలే అని వెళ్తున్నారు. సూర్య చిత్రానికి బీ,సీ సెంటర్లలో రెండో వారం కూడా ఆదరణ లభిస్తుండగా.. మోహన్ లాల్ చిత్రం మల్టీప్లెక్స్ల్లో జోరు చూపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోలేకపోయిన తెలుగు దర్శకనిర్మాతలు పదుల కోట్ల రూపాయల వసూళ్లని చేజేతులా వదిలేసుకున్నారు.ఉన్నంతలో తెలుగు ఆడియెన్స్ కోసం వేసవి చివరలో వస్తున్న పెద్ద సినిమా 'పెద్ది'నే. ప్రస్తుతానికైతే దీనిపై బజ్ బాగానే ఉంది కానీ ఇండస్ట్రీలో పరిస్థితులే బాగోలేవు. ఈ మూవీకి కచ్చితంగా పర్సంటేజీ ఇచ్చి తీరాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా టాలీవుడ్లోని అంతర్గత సమస్యలు కూడా డబ్బింగ్లకు ఓ రకంగా ప్లస్ అవుతున్నాయి. మరి ఈ విషయం తెలుగు హీరోలు దర్శకులు నిర్మాతలకు ఎప్పుడు అర్థమవుతుందో?(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం) -
ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ.. తండ్రి తలుచుకుని చాలా భావోద్వేగానికి గురైంది. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈమెకు తొలుత మలయాళంలో అవకాశమొచ్చింది. 1992లో 'సర్గామ్' మూవీతో ఈమె హీరోయిన్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ హిట్ తర్వాత అదే ఏడాది 'ఆ ఒక్కటి అడక్కు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. దీంట్లోనే ఆమె స్క్రీన్ నేమ్ రంభగా ఫిక్స్ అయింది. తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్బై చెప్పింది. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీకి దూరమైనా రియాలిటీ టీవీ షోలకు ఈ మధ్య జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇంతలోనే తండ్రి చనిపోవడంతో దుఖంలో మునిగిపోయింది.(ఇదీ చదవండి: హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్) -
తమిళ హీరో కార్తీ మరో తెలుగు సినిమా లాంచ్ (ఫొటోలు)
-
పెద్ది మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న జాన్వీ కపూర్
-
'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ మరింత అందంగా (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో పెద్దమనిషి నన్ను చెప్పుతో కొట్టాడు: బండ్ల గణేశ్
కమెడియన్గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు ఇటీవలే రీఎంట్రీ ప్రకటించాడు. చిరంజీవి- బాబీ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే నిర్మాతగానూ సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు. తాజాగా నటుడు రాజా రవీంద్ర పాడ్కాస్ట్లో పాల్గొన్న బండ్ల గణేశ్ ఒక చేదు సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పుకొచ్చాడు.ఘోరమైన అవమానంబండ్ల గణేశ్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఒక పెద్దమనిషి నన్ను ఎంతో అవమానించాడు. ఆ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. ఆయన మంచి వ్యక్తే.. కానీ ఆరోజు ఎందుకలా చేశాడో తెలీదు. అయితే ఆయన కోపమే నాకు వరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. నేను, ఇంకో యాక్టర్ సెట్లో సాయంత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. సారీ చెప్పినా..నేను ఊరికే కూర్చుని సార్.. సార్ అని పిలిచినందుకు ఆ పెద్ద మనిషి సడన్గా నన్ను చెప్పుతో కొట్టాడు. దేవుడి మీద ఒట్టు.. ఆయన ఏ టెన్షన్లో ఉన్నాడో కానీ చెప్పు తీసుకుని కొట్టాడు. రెండు రోజుల తర్వాత సారీరా.. ఏమనుకోకు, వేరేవాళ్ల మీద కోపం నీమీద చూపించాను అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఎంతైనా నేను బలహీనుడిని కాబట్టే కదా నాపై ప్రతాపం చూపించాడు.ఛాలెంజ్ఆరోజు ఆయనలా కొట్టిన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. నా దగ్గర డబ్బు లేదనే కదా నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేశే కాదు అని నాకు నేనే సవాల్ విసురుకున్నాను. అలా నా జీవితాన్ని మార్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే బండ్ల గణేశ్ తక్కువకాలంలోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా రాణించి కోట్లు కూడబెట్టాడు.చదవండి: మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్? -
నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
కరుప్పు సక్సెస్: కేక్ కట్ చేసిన త్రిష (ఫోటోలు)
-
నువ్వు లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు: నాగ్ ఎమోషనల్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. డబ్బింగ్ చిత్రాల నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూర్ గుజ్జలపూడి హరి (46) గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్గా హరి ఎన్నో సినిమాలను పంపిణీ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే!డబ్బింగ్ సినిమాలువిశాల్, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. విశాల్ తమిళంలో నిర్మించిన పలు సినిమాలను తెలుగులో 'హరి వెంకటేశ్వర పిక్చర్స్' బ్యానర్పై విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్కు చెందిన పలు చిత్రాలను నెల్లూరులో పంపిణీ చేశారు.25 ఏళ్లకు పైగా పరిచయంహరి మరణంపై హీరో నాగార్జున విచారం వ్యక్తం చేశాడు. 'హరి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఇక లేడన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మా పరిచయం 25 సంవత్సరాలకు పైగా సాగింది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక పిల్లర్లా అండగా నిలబడ్డారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని, గొప్ప డిస్ట్రిబ్యూటర్ను కోల్పోయింది' అని ట్వీట్ చేశాడు. Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.… pic.twitter.com/CcxEEwyLoe— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 24, 2026 చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్చరణ్ -
పెద్దిని ఆపితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..!
-
ఇద్దరు భామలతో 'పెద్ది' స్టెప్పులు.. ఐటం సాంగ్ చూశారా?
రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి వరుస సర్ప్రైజ్లు వదులుతున్నారు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో హల్లో..' ప్రోమో వదిలారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ఈ ఐటం సాంగ్లో శృతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్గా మెరిసింది. ఇక పెద్ది.. అటు శృతి హాసన్తో, ఇటు జాన్వీ కపూర్తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. సింగర్ రక్షిత సురేశ్ ఎంతో హుషారుగా ఆలపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక పెద్ది విషయానికి వస్తే.. శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్చరణ్ -
క్షమాపణలు చెప్పిన రామ్చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా, తాజాగా భోపాల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రామ్చరణ్ నోరు జారడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డాడు. దీంతో వెంటనే తన తప్పు సరిదిద్దుకుంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా క్షమాపణలు చెప్పాడు.ఏం జరిగింది?'పెద్ది కీ ఆవాజ్' పేరుతో భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న హోస్ట్ రామ్చరణ్తో ర్యాపిడ్ ఫైర్ ఆడించాడు. కొంతమంది క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ వారి గురించి ఒక్కమాటలో చెప్పాలన్నాడు. అలా సచిన్, ధోని, కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్స్ గురించి ఒక్క లైన్లోనే పొగడ్తలు కురిపించాడు. చివరగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావించాడు యాంకర్.వీడియో క్లిప్ వైరల్ఇక్కడే చరణ్ తప్పులో కాలేశాడు. 'నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన మనదేశంలో ఫుట్బాల్ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు' అని బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది. క్రికెటర్ను ఫుట్బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో చరణ్ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అటు హోస్ట్ కూడా ఈ తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షమించండిదీంతో చరణ్ ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ క్షమాపణలు చెప్పాడు. 'కొన్నిసార్లు నేను పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాను. అంతమంది జనం, హడావుడి మధ్యలో అనుకోకుండా పొరపాటు దొర్లింది. అందుకు బుమ్రా గారిని క్షమించమని కోరుతున్నాను. నేను నిజంగా ఆయన ఆటకు వీరాభిమానిని. ఆయనపై నాకెంతో గౌరవం ఉంది. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి' అని ట్వీట్ చేశాడు. Uff… I’m genuinely so forgetful with names sometimes.Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026Context - pic.twitter.com/yK0YIH6V7d— Film Culture (@CinemasHive) May 23, 2026 చదవండి: ఈ సినిమా రిలీజ్లు ఎప్పుడు? -
రామ్చరణ్ 'పెద్ది కీ ఆవాజ్' ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ (ఫోటోలు)
-
స్వయంభు ప్రపంచంలో...
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రంపోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమాపోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల విస్తృత స్థాయిని చూపించారు.నిఖిల్ సిద్ధార్థ, భరత్ కృష్ణమాచారి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కలిసి వీఎఫ్ఎక్స్ సంస్థ ఫాంథమ్ ఎఫ్ఎక్స్ను సందర్శించడం కనిపించింది. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రా చీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విడుదల ఎప్పుడు?
చిత్ర పరిశ్రమలో పలు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే ఆయా చిత్రాల రిలీజ్ డేట్స్ని అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శక–నిర్మాతలు. మరికొందరేమో చిత్రీకరణ జరుగుతున్న తీరు,పోస్ట్ ప్రోడక్షన్ పనులు వంటి వాటి ఆధారంగా ఫలానా తేదీకి విడుదల చేస్తామని చెబుతుంటారు. ఇంకొందరేమో ఫలానా తేదీకి తప్పుకుండా వస్తాం... రిలీజ్ పక్కా... ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు అని బలంగా చెబుతుంటారు. అయితే షూటింగ్స్ ఆలస్యం కావడం..పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం... కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం... సరైన విడుదల తేదీ కుదరకపోవడం... బాక్సాఫీస్ వద్ద తీవ్రమైనపోటీ ఉండటం... ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు... విడుదల తేదీల్లో అనివార్యంగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల విడుదల తేదీలు ముందుగా ప్రకటించినప్పటికీ వాయిదా పడటం... మరికొన్ని చిత్రాల షూటింగ్స్,పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి అయినప్పటికీ ఎలాంటి రిలీజ్ డేట్స్ ప్రకటించకుండా ప్రమోషన్స్ మాత్రం ఫుల్ స్వింగ్లో చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘విశ్వంభర, స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్, స్వయంభు, ఆపరేషన్ అరుణా రెడ్డి, చెన్నై లవ్స్టోరీ, సంబరాల ఏటిగట్టు, కొరియన్ కనకరాజు’ వంటి సినిమాల రిలీజ్ డేట్స్పై ఎలాంటి స్పష్టత లేదు. ఈ చిత్రాల విడుదల ఎప్పుడు? అన్నది సగటు సినీ ప్రేమికుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఎదురు చూడాల్సిందే. ఇక వాయిదా పడుతూ వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...విశ్వంభరుడి రాక కోసం...చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపా ట ఈ మూవీ నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే 2025 సంక్రాంతి బరిలో సందడి చేయాల్సి ఉంది.జనవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పకుండా సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అనుకున్నారంతా. అయితే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన పా న్ ఇండియన్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో మూవీ విడుదల తేదీ విషయంలో చిత్రబృందం సందిగ్ధతను కొనసాగిస్తున్నట్లు ఫిల్మ్నగర్ టాక్. ‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమాని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అంటూ తన పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 22న చిరంజీవి ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయిదే వేసవి మొదలై ఇప్పటికే సగానికి పైగా అయినప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఇంద్ర’ (2002 జూలై 24 రిలీజైంది) విడుదల తేదీ అయిన జూలై 24ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరి ఆ తేదీకి అయినా ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదలవుతుందా? అదీ కుదరకుంటే దసరా కానుకగా అక్టోబరులో రిలీజ్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ‘విశ్వంభర’ రిలీజ్పై మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. టెంపుల్ రోడ్లో...దర్శకుడు పూరి జగన్నాథ్ శైలి ప్రత్యేకమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాని శరవేగంగా అనుకున్న సమయంలో పూర్తి చేయగలరనే పేరుంది ఆయనకు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ కూడా ఆయన స్టైల్లో స్పీడుగానే సాగిందని టాక్. అయితే విడుదల తేదీ విషయంలోనే సందిగ్ధం నెలకొందట. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించారు. టబు, బ్రహ్మాజీ, దునియా విజయ్కుమార్ ఇతర కీలక పాత్రలుపోషించారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోహన్ పిక్చర్స్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించారు. ఈ మూవీ చిత్రీకరణ,పోస్ట్ ప్రోడక్షన్, రీ–రికార్డింగ్ పనులు పూర్తి అయినప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు.‘‘పూరి మార్క్ యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్, ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ‘స్లమ్ డాగ్’కి తనదైన శైలిలో స్వరాలు అందించారు. ప్రత్యేకించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ పా న్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా 26 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ కెరీర్లో ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ స్పెషల్ ఫిల్మ్గా గుర్తుండిపోతుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.స్వయంభు... ‘కార్తికేయ 2’(2022)వంటి పా న్ ఇండియా బ్లాక్బస్టర్ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’.ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్ఫుల్ వారియర్ పా త్రలో కనిపించనున్నారు. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రా ంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అతను అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందట. ఈ క్యారెక్టర్లో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్ ఈ ప్రాజెక్ట్పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. తన కెరీర్లో ‘స్వయంభు’ని ఒక మైలురాయిగా భావించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు నిఖిల్. ఈ మూవీ టీజర్లోని విజువల్స్, భారీతనం, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందన రావడంతో పా టు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.‘కేజీఎఫ్, సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఏప్రిల్ 16న విడుదల చేసిన తొలి పా ట ‘రా రా ధీవర’కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘స్వయంభు’ని తొలుత 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ కాలేదు. అలాగే ఆ తర్వాత ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్న ఈ మూవీ రిలీజ్కి కేవలం తెలుగులో సరైన విడుదల తేదీ కుదిరితే సరిపోదు. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలకు గట్టిపోటీ లేకుండా ఉండే తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడి మార్కెట్ని కూడా జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది మేకర్స్. మరి వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని ‘స్వయంభు’ కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాలి.ఆపరేషన్ అరుణారెడ్డినటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ప్లే రచయిత... ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారుపోసాని కృష్ణమురళి. శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘దుశ్శాసన’. 2011 మే 27న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ తర్వాత నటుడిగా బిజీ అయినపోసాని కృష్ణమురళి కొన్నేళ్ల పా టు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మూవీ ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఆయన కీలక పా త్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది.ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టడంతో పా టు తొలిసారి రెండు పా టలు కూడా రాయడం విశేషం. హిందోళ చక్రవర్తి టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలోపోసాని కృష్ణమురళి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, ఎంపీ రఘునందన్ రావు ఇతర ప్రధాన పా త్రలుపోషించారు. 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో యూపీ సినిమా లైన్స్ , కుసుమ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంపోస్ట్ ప్రోడక్షన్, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటికీ సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ లేదు.‘‘నిజాయితీపరులైన జర్నలిస్టుల కథతో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ రూపొందింది. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుందనేది కథాంశం. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్గా హిందోళ చక్రవర్తి నటించారు. కొందరు చేసిన రాజకీయాలకు ఓ మంచి జర్నలిస్ట్ రోడ్డున పడే పరిస్థితి వస్తే.. ఇలాంటి నిజాయతీ కలిగిన అమ్మాయి జర్నలిజంలో ఉండాలని ముఖ్యమంత్రి అండగా నిలబడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథనం ఆసక్తిగా ఉంటుంది. సినిమా ప్రా రంభం నుంచి చివరి దాకా తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకుల ఊహకు కూడా అందదు. స్క్రీన్ప్లే అంత అద్భుతంగా ఉంటుంది. ఈ నెలాఖరులో లేదా జూన్లో మా సినిమాని విడుదల చేస్తాం’’ అంటూపోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.కొరియన్ కనకరాజు... వరుణ్ తేజ్ హీరోగా నటì ంచిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపా క గాంధీ రచన–దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘మిరాయ్’ మూవీ ఫేమ్ ‘రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, నటుడు సత్య కీలకపా త్రపోషించారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయినప్పటికీ విడుదల ఎప్పుడు? అన్నది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ , మేర్లపా క గాంధీ హిలేరియస్ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్ –ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది.హారర్, కామెడీ, ట్విస్ట్లతో ఇండియన్, కొరియన్ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పా త్రపోషించారు. ఈ సినిమా కోసం కంప్లీట్గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారాయన. రితికా నాయక్ చక్కని నటనతో ఆకట్టుకుంటారు. సత్య కామెడీ టైమింగ్తో మరోసారి నవ్వులు పండిస్తారు. వినోదం, యాక్షన్, హారర్ని మేళవిస్తూ మేర్లపా క గాంధీ ఈ మూవీ తెరకెక్కించారు.కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. తమన్ సంగీతం అందించిన మా సినిమా నుంచి విడుదల చేసిన ‘కమ్సాహం నిదా...’ పా టకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వేసవిలో సినిమాని విడుదల చేస్తాం’’ అంటూ చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే... వేసవిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫొటో, బేబి’ చిత్రాల దర్శకుడు సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించారు. అమృత ప్రోడక్షన్స్ , మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించారు. చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కానప్పటికీ మేకర్స్ మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ‘‘మణిశర్మ సంగీతం అందించిన మా మూవీ నుంచి విడుదల చేసిన తొలి పా ట ‘గుర్తుందా...’ కి అనూహ్యమైన స్పందన వచ్చింది.మా సినిమాను జూన్ 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తాం’’ అంటూ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఎస్కేఎన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ డాల్బీలో చేయడం సంతోషంగా ఉంది. రవి నంబూరితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ‘గుర్తుందా...’ పా ట కోసం కోటి రూపా యలు ఖర్చు చేసి సెట్ వేశారు. ‘రాజా వారు రాణి గారు’ మూవీ తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్గా ఉండే క్యారెక్టర్ చేశాను.మా మూవీ ప్రమోషన్ కంటెంట్కు వచ్చిన రెస్పాన్స్ , సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఏడు పా టలు కంపోజ్ చేశారు. ఆ పా టల్ని అందరూ థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయిన రోజు థియేటర్స్లో మ్యూజిక్ కన్సర్ట్ జరిగినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్లో ఒకటిగా మా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.సంబరాల ఏటిగట్టు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పా త్రలుపోషించారు. ‘హను–మాన్’(2024) వంటి పా న్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్పోస్ట్పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల విషయంపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే సందిగ్ధం నెలకొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.టాక్సిక్...‘కేజీఎఫ్ 1, 2’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత యశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ , మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే... ఈ మూవీని తొలుత మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మార్చి 19 నుంచి జూన్ 4కు రిలీజ్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ, జూన్ 4న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా మరోసారి మారనుంది. త్వరలోనే కొత్త డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్. ‘‘సినిమాకాన్ లో ‘టాక్సిక్’ని ప్రదర్శించిన తర్వాత ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అక్కడ వచ్చిన స్పందన చూసిన తర్వాత ఇది వరల్డ్ వైడ్గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యాలను కాంటాక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో మా సినిమా విడుదల తేదీని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నాం. గతంలో ప్రకటించినట్లుగా జూన్ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలోనే చెబుతాం. భారతీయ సినిమా తన సత్తాను వరల్డ్వైడ్గా చాటుతూ గొప్ప భవిష్యత్తుతో ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో దాని స్థాయిని మరింత పెంచాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది.ఒక నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ కోసం, మనందరి కోసం నా వంతు పా త్రపోషించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. కొన్ని కథలకు సహనం అవసరం. కొన్ని ప్రయాణాలకు అది తప్పనిసరి. మీరు ఆస్వాదించి, వేడుక చేసుకునే ఒక చిత్రాన్ని మీకు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక గర్వకారణంగా నిలిచే చిత్రం ఇది’’ అని యశ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల పైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
'పెద్ది' ఆపితే ఆమరణ నిరహార దీక్ష చేస్తా
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆంధ్రాలో విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ తెలంగాణలోని థియేటర్లలోకి వస్తుందా అనే సందేహం మాత్రం నెలకొంది. దానికి కారణం పర్సంటేజీ వివాదం. కొన్నిరోజుల ముందు అంతా సద్దుమణిగింది అనుకుంటే.. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది'కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇదలా ఉండగానే నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)'మీరు పెద్ది సినిమాని ఇదే ప్రకారం ఆపాలని నిర్ణయించుకుంటే బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ నిరహార దీక్షకు దిగుతా. మీరు చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేయట్లేదు అంటూనే అదే చేస్తున్నారు. చేస్తున్న వాళ్లు ఎవరో మాకు బాగా తెలుసు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు' అని నట్టికుమార్ ఆవేశపడిపోయారు.ఇదంతా చూస్తుంటే తెలంగాణలో 'పెద్ది' రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది. శనివారం జరిగిన ఇదే ప్రెస్మీట్లో ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే అవకాశం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ అడ్డంకులు దాటుకుని మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. రన్నర్, క్రికెటర్, కుస్తీ వీరుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)Producer #NattiKumar :"మీరు #PEDDI సినిమా ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను." pic.twitter.com/NaeuuHtT7Q— Whynot Cinemas (@whynotcinemass_) May 23, 2026 -
లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిజిక్ మెంటైన్ చేస్తూ ఫిట్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో మాత్రం కాస్త బొద్దుగా ఉండేవాడు. రాఖీ మూవీ టైంలో ఇదే విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత పూర్తిగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చాడు. అయితే చిన్నతనంలోనే తన శరీరం గురించి ఆలోచిస్తూ తారక్ మదనపడేవాడని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చెప్పారు. ఎన్టీఆర్ చిన్నతనంలో జరిగిన సంఘటనలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)'జూ.ఎన్టీఆర్కి నేనంటే ఇష్టం. చిన్నప్పుడే యాక్టింగ్, బాడీ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోవాలనుకున్నాడు. దీని గురించే వాళ్ల అమ్మ కూడా నన్ను అడిగారు. 'వద్దమ్మా.. మీ వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలు చేయించండి బాగా చేస్తాడు' అన్నాను. 'అంకుల్ నేను లావుగా ఉన్నానా? జనాలు చూస్తారా?' అని ఎన్టీఆర్ నన్ను అడిగాడు. దీంతో బాబు నువ్వు మీ తాత లాగా బ్రహ్మాండంగా ఉంటావు. నువ్వేం భయపడక్కకర్లేదు' అని చెప్పినట్లు పోసాని వెల్లడించారు.'డైరెక్టర్ ఉదయ్ కుమార్తో అప్పట్లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. దీనికి నన్ను డైలాగ్స్ రాయమని అడిగాడు. అప్పట్లో రైటర్గా బిజీగా ఉండేవాడిని కథ వినమని చెబితే వెళ్లి విన్నాను. 'మీకు స్టోరీ నచ్చిందా బాబు' అని తారక్ని అడిగాను. నచ్చిందని చెప్పాడు. నేను మాత్రం నాకు నచ్చలేదు. కథ బాగోలేదు బాబు అని డైరెక్టర్ అక్కడున్నప్పుడే ఎన్టీఆర్కి చెప్పా. స్టోరీ లైన్ నచ్చకపోయినా నువ్వు డైలాగ్స్ రాయమంటే రాస్తాను. ఆలోచించుకో బాబు అని అన్నాను. మీరు వద్దు అన్న తర్వాత ఇంకెందుకు అని ఆ స్టోరీని పక్కనబెట్టేశాడు. ఎన్టీఆర్ నన్ను అంతలా నమ్మాడు. అలా ఉదయ్ కుమార్తో కాకుండా రాజమౌళితో 'సింహాద్రి' చేశాడు. తర్వాత ఎక్కడికో వెళ్లిపోయాడు' అని పోసాని అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.కెరీర్ ప్రారంభంలో రచయిత, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. తర్వాత కాలంలో నటుడిగా మారారు. ఎన్టీఆర్ 'టెంపర్' మూవీలో ఈయన చేసిన నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో 'మీరు మారిపోయారు సర్' అని పోసాని చెప్పే డైలాగ్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోసాని లీడ్ రోల్ చేస్తూ దర్శకనిర్మాతగా 'ఆపరేషన్ అరుణారెడ్డి' తీశారు. దీని ప్రమోషన్లలో భాగంగానే ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం) -
రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ చెడిపోయిందా ?
-
మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు కష్టాలు తొలగిపోలేదు. సమస్య మళ్లీ మొదటకొచ్చింది. అంతా సెట్ అయిందనుకున్న పర్సంటేజీ గొడవ మళ్లీ మొదలైంది. 'పెద్ది'కి కూడా పర్సంటేజీ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో శనివారం సమావేశమైన అనంతరం పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో రెండుమూడు సార్లు చర్చలు జరిగాయి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే 2-3 నెలల్లో సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఏడాది దాటిపోయినా అది జరగలేదు. నిర్మాతలు.. ముందుగా మూడు వారాలన్నారు. ఇప్పుడు మరో మూడు వారాలని వాయిదా వేస్తున్నారు. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలని థియేటర్లలో ఆడిస్తాం అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు.దేశం మొత్తం థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉంది. తెలంగాణలో మాత్రం రెంటల్ ఉంది. నిర్మాతలు.. సమస్యని రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు. మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగడం లేదు. మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. అది ఎంతిస్తారో చెప్పండి అని కూడా శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు తెలంగాణలో మాత్రం ఉండదు. రేట్లు పెంచొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశాం. 'పెద్ది'పై మాకు ఎలాంటి పగ లేదు. కానీ ఇప్పుడు కాకపోతే నిర్మాతలు మళ్లీ ఎప్పుడు పట్టించుకుంటారనేది తెలియదు అందుకే ఈ చిత్రాన్ని కూడా పర్సంటేజీ శ్లాబ్లో చేర్చాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చారు.దీనిబట్టి చూస్తే ఆంధ్రా వరకు 'పెద్ది'కి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు గానీ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తారా అనేది సందేహం. ఎందుకంటే అటు నిర్మాతలు గానీ ఇటు ఎగ్జిబిటర్లు ఎవరూ తగ్గడం లేదు. విడుదలకు మరో 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో 'పెద్ది' విషయంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్లా మారిపోయింది.(ఇదీ చదవండి: వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్) -
పవర్ఫుల్ లుక్లో రషీన్, పోస్టర్ రిలీజ్
ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. 1987లో రాగలీల సినిమాతో పరిచయమై భారత్ బంద్, ప్రియతమా, బిల్లా, సింహ వంటి సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మే 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ Production No. 1 నుంచి ఒక ప్రత్యేక బర్త్డే పోస్టర్ ను లాంచ్ చేశారు.ఆ పోస్టర్ ద్వారా ఆయన పాత్ర వ్యక్తిత్వాన్ని, అందులోని మిస్టరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. రహమాన్ పవర్ఫుల్ లుక్లో కనిపించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
అప్పట్లో స్టార్ హీరో.. పదేళ్ల గ్యాప్.. హిట్ పడుతుందా?
వడ్డే నవీన్.. ఇప్పటి సినీ ప్రియులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్కి బాగా పరిచయమున్న హీరో. అప్పట్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వడ్డే నవీన్ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మరో ప్రయత్నం చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఏమైందో తెలియదు కానీ 2010 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు అంటే 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ కొడతాడా?దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో వడ్డే నవీన్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ హిట్ అయితే తనకు కూడా మంచి కమ్బ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల కొందరు స్టార్స్ రీ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది హీరో రాజశేఖర్ సైతం బైకర్ మూవీతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఈ చిత్రం ఆయనకు బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వడ్డే నవీన్ కూడా కమ్ బ్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ మూవీతో హిట్ పడితే వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమేనంటున్నాడు మన 90స్ హీరో. నవీన్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. -
హీరోగా టాలీవుడ్ హీరోయిన్ బాయ్ఫ్రెండ్.. సినిమా రివ్యూ
టైటిల్ : ఫస్ట్ టైంనటీనటులు: సౌరబ్ ధింగ్ర, అఖిల్ సార్థక్, అనిక్క విక్రమన్,గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం తదితరులునిర్మాత: హేమంత్ ఇప్పలపల్లిరచన-దర్శకత్వం: హేమంత్ ఇప్పలపల్లిసంగీతం: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్, రామ్విడుదల తేది: మే 22, 2026టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రియుడు సౌరభ్ ధింగ్ర హీరోగా పరిచయమైన తెలుగు సినిమా 'ఫస్ట్ టైం'. హేమంత్ ఇప్పలపల్లి.. దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 'బిగ్బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్ర చేశాడు. అనిక విక్రమన్ హీరోయిన్. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించారు. వీఎఫ్ఎక్స్ ఆధారంగా తీసిన ఈ మూవీ నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)కథేంటి?2304 ఏడీలో ఏలియన్స్తో మొదలయ్యే ఈ సినిమా.. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? కొత్త భారతదేశం ఎలా తయారైంది అనే పాయింట్తో తెరకెక్కించారు. ఏలియన్లకు అప్పటి మానవులు ఈ కలియుగంలో జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ ఉంటారు. ఆద్య(అనికా విక్రమన్) ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అదే కాలేజీలో చదువుతున్న రాహుల్(శివ కుమార్) ఎలాగైన ఆమెకు దక్కించుకోవాలనుకుంటాడు. మరోవైపు ఆద్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె బావ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అతనితో బలవంతంగా ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. సోల్మేట్ దొరికితే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చని ఆద్య ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆమెకు ఆది(అఖిల్ సార్థక్) పరిచయం అవుతాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఆద్య బావకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమించిన ఆద్యను ఆది ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? భూమి మీద ఉన్న మనుషులంతా ఎందుకు చనిపోతుంటారు? ఆద్య, ఆదిలు మాత్రమే ఎలా బతుకుతారు? ఏలియన్స్కి ఈ కథలో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో సౌరభ్ ధింగ్రని పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఇదొక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ సినిమా. 2304లో అంటే దాదాపు 300 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న కలియుగం అంతం అయితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు మళ్లీ మానవజాతిని సృష్టించడానికి భారతీయులు..అందులోనూ మన తెలుగువాడు కారణం అయితే ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ దాన్ని తెరపై చూపించడంతో మాత్రం కాస్త తడబడ్డాడు. ఒకవైపు ఏలియన్లు, సైంటిస్టుల ప్రయోగాలు, మరోవైపు ఆద్య జీవితంతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఫస్టాఫ్ కాస్త గందరగోళంగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండడంతో బోరింగ్గా అనిపిస్తుంది. అసలు కథ ఏంటి అనేది సెకండాఫ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరోగా పరిచయమైన సౌరభ్ ధింగ్రకి ఇదే తొలి సినిమా అయినా సరే బాగానే చేశాడు.అనికా విక్రమన్ నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భూపాల్ రాజు శివకుమార్గా అఖిల్ సార్థక్ పర్లేదనిపించాడు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా కూడా ఓకే. సాంకేతికగా సినిమా బాగుంది. ఈ సినిమాలో ఏఐ ఉపయోగించకుండా హ్యూమన్ ఇంటలిజెన్స్ మాత్రమే వాడడం ప్రత్యేకం. దర్శకనిర్మాత హేమంత్ ఇప్పలపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్లో మంచి ఔట్పుట్ ఇచ్చారు. గతంలో విఎఫ్ఎక్స్ అనుభవం ఉండటంతో హేమంత్ చక్కగా తీశారు. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వెంకట్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ పర్లేదనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. (ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
పెద్ది ఐటమ్ సాంగ్.. 50 రోజులు కష్టపడ్డాం..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. చెర్రీ సరసన కనిపించనుంది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.తాజాగా ఈ పాటకు సంబంధించి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం 50 రోజులు కష్టపడ్డానని అన్నారు. ఈ పాటలోని ప్రతి పదం అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ బాణీలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఆయన బాణీలను అర్థం చేసుకోవడానికే కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫుల్ సాంగ్ మే 23న విడుదల కానుంది. -
ఎవరి ఊహలకి అందదు.. చరణ్ అన్న ఇరగకొట్టేసాడు
-
ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మైథాలజీ మూవీ ఏమైంది?
-
బాబీ దర్శకత్వంలో మెగా 158 గ్రాండ్ లాంచ్!
-
సడన్గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రైడే ఓటీటీల్లోనూ కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. మరికొన్ని సడన్గా ఓటీటీల్లో దర్శనమిస్తుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.తాజాగా ఇవాళ ఎలాంటి హడావుడి లేకుండానే ఓ తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది. తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో వచ్చిన చిత్రం గాయపడ్డ సింహం. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా కథేంటంటే..దరహాస్(తరుణ్ భాస్కర్), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్ పెట్టడంతో.. దరహాస్ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనక్కి వచ్చిన (డిపోర్ట్) భారతీయ విద్యార్థుల్లో దరహాస్ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్పై దరహాస్ పగపడతాడు. ఎలాగైన ట్రంప్పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్ టార్చర్ భరించలేక ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్ పగకు మాఫియా డాన్ బ్రూటల్ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లేగా నిలుస్తుంది: పోసాని కృష్ణమురళి
‘‘జర్నలిజం అన్నది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. నిజాయతీ కలిగిన జర్నలిస్టులు ఉంటే సమాజానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రజలను, సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసే శక్తి జర్నలిజానికి ఉంది. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రమే ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. జర్నలిస్ట్ అరుణా రెడ్డి పాత్రలో హిందోళ చక్రవర్తి అద్భుతంగా నటించారు. నేను ఇప్పటివరకూ సుమారు 100కు పైగా సినిమాలకు స్క్రీన్ ప్లే రాసి ఉంటాను. నా కెరీర్లోనే ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. నేను, నా భార్య కుసుమ లత కలిసి ఈ మూవీ స్క్రీన్ ప్లే రాశాం.ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రంగా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలను’’ అని పోసాని కష్ణమురళి తెలిపారు. ఆయన కీలక పాత్రలో నటించి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. హిందోళ చక్రవర్తి టైటిల్ రోల్ చేశారు. బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ ఇతర పాత్రలు పోషించారు. 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో పోసాని కష్ణమురళి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి ‘సాక్షి’తో ఎక్స్క్లూజివ్గా చెప్పిన ఈ చిత్రం విశేషాలు ఈ విధంగా...ప్రేక్షకులు ఊహించలేరు శ్రీకాంత్ హీరోగా, ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నేను తీసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రం 2017 మే 31న విడుదలై 100 రోజులు ఆడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్గా నిలిచి, 100 రోజుల పోస్టర్ పడ్డ చివరి చిత్రం మా ‘ఆపరేషన్ దుర్యోధన’. ఆ తర్వాత ఏ సినిమా కూడా నాకు తెలిసి 100 రోజులు ప్రదర్శించబడలేదు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ టైటిల్ చూడగానే ‘ఆపరేషన్ దుర్యోధన’కి సీక్వెల్ తీశారేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు ఎలాంటి పోలిక లేదు... సీక్వెల్ అస్సలు కానే కాదు. సమాజంలో నేను చూసిన, విన్నటువంటి పలు వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ రాశాను. నేను, నా భార్య కలిసి స్క్రీన్ ప్లే రాశాం. ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకులు ఊహించలేరు. కొత్తవారికి ఎలాంటి ఇమేజ్ ఉండదు ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమా కోసం అందర్నీ కొత్త వారినే తీసుకున్నాను. వారికి జనాల్లో ఎలాంటి ఇమేజ్ ఉండదు కాబట్టి ఆయా పాత్రలతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. నిజాయతీ కలిగిన జర్నలిస్ట్ అరుణా రెడ్డి పాత్రలో హిందోళ చక్రవర్తి నటించారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారు? వ్యాపారాలు చేయడం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎవరు వచ్చారు? అన్నది ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆమె హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు? సరైన నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజాలను నిర్భయంగా మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదని కొందరు కుట్ర పన్ని, అరుణా రెడ్డి రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తారు.ఈ నేపథ్యంలో నిజాయతీ కలిగిన ఇలాంటి వారు జర్నలిజంలో ఉండాలని నిజాయతీపరుడైన ముఖ్యమంత్రి అండగా నిలబడి, సాయం చేస్తాడు. నేను అడగ్గానే సీఎం పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న ఎంపీ రఘునందన్ రావుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజ జీవితంలోనూ ఆయన వాస్తవాలను మాట్లాడుతూ, నిజాయతీగా ఉంటారు కాబట్టే ముఖ్యమంత్రి పాత్రలో ఆయన్ని నటింపజేశాను. అప్పుడు ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రంలో సీఎం పాత్రలో మోత్కుపల్లి నరసింహులు అన్నని నటింపజేశాను. నటుడిగా ఆయనకు అదే తొలి చిత్రం.నటించేందుకు సిద్ధంనేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. అందులో ఎలాంటి దాపరికాలు ఉండవు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమాని నేను ఎవరిపైనో సెటైరికల్గా తీశాననుకుంటున్నారు. అందులో వాస్తవం లేదు. వంద శాతం నిజాయతీగా తీసిన చిత్రం ఇది. ఈ సినిమాకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్... ఇలా అన్ని పార్టీల వారు ఈ చిత్రాన్ని నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి నచ్చే సినిమా ఇది. పైగా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.ఈ చిత్రాన్ని కుదిరితే ఈ నెలాఖరులో లేదంటే జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. ఇకపై నా దర్శక–నిర్మాణంలో కుదిరితే ఏడాదికి రెండు సినిమాలు తీస్తాను... లేకుంటే కనీసం ఒక్క చిత్రం అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతం ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అనే మూవీ కోసం లైన్ అనుకున్నాను. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ విడుదల తర్వాత ఓ నెల గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ స్క్రిప్ట్ని మొదలు పెడతాను. ఈ మూవీలో నాతో పాటు కొత్తవారు నటిస్తారు. నా పాత్ర నచ్చితే ఎవరి సినిమాలో అయినా నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం కొందరు రచయితలు–దర్శకులు నన్ను సంప్రదిస్తున్నారు. తొలిసారి పాటలు రాశాను‘ఆపరేషన్ అరుణారెడ్డి’ చిత్రంలో ఓ పార్టీ అధ్యక్షుడి తనయుడి పాత్రను నేను చేశాను. నా పాత్రతో పాటు హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ ... ఇలా అన్ని పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రానికి మహదేవ్ ఎలేందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించారు. భవిష్యత్తులో తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా కోసం తొలిసారి నేను రెండు పాటలు రాశాను. చాలా సరళమైన పదాలతో ఆ పాటలు అందరికీ అర్థం అయ్యేలా ఉంటాయి. కెమెరామేన్ సుధాకర్ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన పనిని వెండితెరపై చూస్తారు.– డేరంగుల జగన్ మోహన్ -
క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST
-
డ్రాగన్ కష్టాలు.. ఆ లుక్ కోసం ఇంత చేశారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్ల్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ మూవీలో తన లుక్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బరువు తగ్గాల్సి ఉంటుందని ఎన్టీఆర్తో చెప్పానని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మరింత బలహీనంగా, పాలిపోయినట్లుగా కనిపించారని నీల్ అన్నారు. ఈ శారీరక మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారని దర్శకుడు వెల్లడించారు.ఏడాదిన్నర క్రితమే ప్లాన్..దాదాపు ఏడాదిన్నర క్రితం 'డ్రాగన్' లుక్ టెస్టుల సమయంలోనే ఈ మార్పు మొదలైందని దర్శుకుడు వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన లూగర్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు కండలు తిరిగిన యాక్షన్ హీరో లుక్ కంటే.. సన్నని శరీరాకృతి ఆ పాత్రకు బాగా సరిపోతుందని డైరెక్టర్ అన్నారు. అందువల్లే ఈ రోల్ కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే తాను సూచించానని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి అంకితభావంతో ఆ సవాలును స్వీకరించారని ప్రశాంత్ నీల్ చెప్పారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు నాలుగు నెలల పాటు అన్ని షూటింగ్ కార్యక్రమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం. కఠినమైన ఆహార ప్రణాళిక, తీవ్రమైన వర్కౌట్ సెషన్లు, నిశితమైన వైద్య పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బలహీనంగా.. పాలిపోయినట్లు కనిపించడంతో చాలాసార్లు ఆపేయమని చెప్పానని.. అయినా కూడా అతను వినలేదని దర్శకుడు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ లుక్పై చాలా రూమర్స్ వచ్చాయి. ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల వాడారని వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటినీ టీమ్ ఖండించింది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పోషణతోనే ఇది సాధ్యమైందని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది. -
'పదేళ్లలో 55 ట్రాన్స్ఫర్స్'.. త్రిమూర్తులు టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కమల్తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.Tollywood actor Ram Pothineni showed his kind-hearted nature Fulfilling the dream of a die-hard fan battling the rare disease ‘Friedreich’s Ataxia’ for 18 years, Ram personally visited her home, spent time with her, and offered emotional support. #RamPothineni #Tollywood pic.twitter.com/7Fge86Xk58— Telangana Ahead (@telanganaahead) May 21, 2026 -
పెద్ది ట్రైలర్ VS డ్రాగన్ గ్లింప్స్.. తార స్థాయికి చేరిన ఫ్యాన్ వార్స్
-
రికార్డు సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ బర్త్డే సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి డ్రాగన్ గ్లింప్స్ వదిలారు. సాధారణంగా గ్లింప్స్ అనగానే చాలా తక్కువ నిడివితో ఉన్న వీడియోను వదులుతారు. కానీ డ్రాగన్ యూనిట్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కథ గురించి, హీరో ఉన్న సామ్రాజ్యం గురించి చూపించారు. అలాగే విలన్స్ను హైలైట్ చేశారు.గ్లింప్స్ రికార్డుఎన్టీఆర్ను క్రూరమైన పాత్రలో చూపించారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఈ గ్లింప్స్ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ రాలేదంటూ పోస్టర్ వదిలింది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సినిమాడ్రాగన్ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ కథానాయికగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అషుతోష్ రానా, అన్షుమాన్ పుష్కర్, సిద్దాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. Records were never safe from #DRAGON 🐉🔥#DragonGlimpse pic.twitter.com/6omRXL8JCb— Dragon (@DragonMovieOffl) May 20, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లకు పొగరు: డ్యాన్సర్ -
#Mega158: చిరు-బాబీ మూవీ 'మెగా' లాంచ్
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి- బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం #Mega158 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు చిరంజీవి సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి కొబ్బరికాయ కొట్టి క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్రాజు, బండ్ల గణేశ్, వివి. వినాయక్, మెహర్ రమేశ్, వశిష్ట తదితరులు హాజరయ్యారు. మెగా డాటర్స్ సుస్మిత కొణిదెల, నిహారిక సైతం ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది. తను కూడా పూజా కార్యక్రమంలో తళుక్కుమని మెరిసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్గా వ్యవహరించనున్నాడు. #KVNTeluguDebut - #Mega158 is going to be THE BIGGEST LAUNCH EVER in INDIAN CINEMA with three towering personalities coming together💥⚡MEGASTAR @KChiruTweetsxPOWER STAR @PawanKalyanxMEGA POWER STAR @AlwaysRamCharanWatch #ChiruBobby2 Pooja Ceremony Live now❤️🔥--… pic.twitter.com/nt2oA36JN7— KVN Productions (@KvnProductions) May 21, 2026 A new wave of charm joins the MEGA storm 🌪️❤️🔥Welcoming the lovely #AnaswaraRajan to the world of #Mega158 💥#KVNTeluguDebut - #ChiruBobby2 Launched Grandly 🔥A @dirbobby Film 🪓Megastar @KChiruTweets #VenkatKNarayana @MusicThaman @vijaykartikdop @AntonyLRuben @artkolla… pic.twitter.com/xBmHzSlpFH— KVN Productions (@KvnProductions) May 21, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లు పొగరుగా ప్రవర్తించారు: డ్యాన్సర్ -
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్బాబు మేనకోడలు (ఫోటోలు)
-
ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు
కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు''కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)#PrashanthNeel says, 'We spent four months looking at him ( #NTR ) suffer.'“I told him that if you became THINNER for the role of the assassin, it would help.His wife, his mother, all his friends and my whole team were UPSET with me.” pic.twitter.com/FpJ7Puj0BW— Whynot Cinemas (@whynotcinemass_) May 20, 2026 -
ఎన్టీఆర్ అడిగిన ప్రశ్న.. సమాధానానికి నాకు మూడేళ్లు పట్టింది
ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అభిమానులకు నచ్చేయగా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సరైన యాక్షన్ ఏదో మిస్ అయిందే అని ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతుల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)'ఐదేళ్ల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కోర్ ఐడియాని ఎన్టీఆర్కి చెప్పా. అయితే 'ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?' అని నన్ను అడిగారు. దీంతో ఆ పాత్ర ప్రవర్తన, అది చేసే పనులు జస్టిఫై చేయడానికి.. దాని వెనకున్న బలమైన కారణాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడానికి నాకు, నా టీమ్కి మూడేళ్లు పట్టింది. ఇదంతా సిద్ధమైన తర్వాత.. నేను రెడీ అని తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంతటి స్టార్డమ్ ఉన్న ఓ హీరో, ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా కఠిన నిర్ణయం. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది''ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను రాసిన అన్ని పాత్రల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది. నా ట్రయాలజీ(కేజీఎఫ్, సలార్)లో.. ఈ జానర్లో 'డ్రాగన్' చివరి సినిమా. ఈ మూడు ఒకేలా కనిపించడానికి కలర్ కారణం. కానీ మూడు వేర్వేరు స్టోరీలు. దీని తర్వాత కలర్ఫుల్ మూవీస్ చేస్తా. మైథాలజీ ఆధారంగా ఓ కథ రాశాను. ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని సినిమాగా తీస్తాను. 'డ్రాగన్' ద్వారా అతిపెద్ద దేశభక్తి సినిమాని అందించబోతున్నాను' అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.డ్రాగన్.. దేశభక్తి సినిమా అని ప్రశాంత్ నీల్ అనగానే ఎదురుగా ఉన్న యాంకర్ కూడా షాకయ్యారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని చెప్పుకొచ్చారు. మరి డైరెక్టర్ చెప్పినట్లు ఎలాంటి దేశభక్తి చూపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్తో పాటు అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ, రుక్మిణి వసంత్, అశుతోష్ రానా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?) -
తిరుపతిలో కాలేజీ కడతా.. 25 శాతం డిస్కౌంట్ ఇస్తా!
ఈరోజు ఎన్టీఆర్తో పాటు మంచు మనోజ్ పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే మనోజ్ చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే 'వడ్డీకాసులవాడ' పేరితో మనోజ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. రెండు నిమిషాలున్న వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో)నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'భైరవం', 'మిరాయ్' సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. కామెడీ జానర్లో గతంలో మూవీస్ చేశాడు. హిట్స్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, బాలయ్య మూవీలోనూ నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ చేయబోతున్నాడు. కానీ 'వడ్డీకాసులవాడ' సినిమాలో మాత్రం ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. పూర్తిగా ఫన్ జానర్లోనే ఈ సినిమా ఉండబోతుంది.ఏఐ ఉపయోగించి ఈ వీడియోని రూపొందించారు. అయితే ఇందులో మనోజ్ పాత్ర చెప్పే.. అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా, అందరికీ 25 పర్సంటేజీ డిస్కౌంట్ ఇస్తా లాంటి డైలాగ్స్ మంచు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా అనిపించాయి. తేజ్ ఉప్పాలపాటి దర్శకుడు కాగా మనోజ్, అనిల్ సుంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్) -
ఫ్రెండ్స్ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన బర్త్డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.తారక్ కెరీర్ మొదలైందిలా..దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్.. ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. సినిమాచివరగా తెలుగులో దేవర: పార్ట్ 1తో హిట్ అందుకున్నాడు. హృతిక్ రోషన్ వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్లో విడుదల కానుంది. అలాగే తారక్ చేతిలో దేవర 2 కూడా ఉంది.చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్ భార్య ఎమోషనల్ పోస్ట్ -
చూపులేని హీరోయిన్.. నడవలేని హీరో
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?) -
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
-
ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా.. ఆ కారణం వల్లే..
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ వైదొలిగారు. ఈ మేరకు ఛాంబర్ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.నావల్ల కాదు'కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి నేను పని చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఛాంబర్ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో నడవాలి. ప్రస్తుతం అలా జరగడం లేదు' అని ఫిలిం ఛాంబర్కు రాసిన లేఖలో సునీల్ నారంగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్ రాజీనామాను ఫిలిం ఛాంబర్ ఆమోదించింది.అసలేంటి వివాదం?ఇటీవల టాలీవుడ్లో పర్సంటేజీ (కమిషన్) విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే! సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అగ్రనిర్మాతలు అంగీకరించడం లేదు. కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు జరుగుతున్న పర్సంటేజీ వివాదమే సునీల్ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామాతెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి ఆమోదించింది. pic.twitter.com/0HUtwHeKFC— Telangana State Film Chamber Of Commerce (@TelanganaFilm) May 20, 2026 చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? -
ఇదో అందమైన జ్ఞాపకం.. చేతికైన గాయం గురించి చెప్పిన రామ్ చరణ్
-
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే నేడు (మే 20). ఈ క్రమంలోనే ఎన్టీఆర్ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ హీరో పుట్టినరోజును పండగలా సెలబ్రేట్ చేశారు. ఇక తనకోసం వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ నవ్వుతూ పలకరించాడు. వారిని పలకరిస్తూ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ఇకపోతే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాదాపు 4 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో తారక్ బరువు తగ్గి, గంభీరమైన లుక్తో కనిపించాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్, తారక్ డైలాగ్స్.. గ్లింప్స్లో హైలైట్గా నిలిచాయి. రవి బస్రూర్ సంగీతం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చింది. డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. #DRAGON. The Dragon meet #jrntr #ntrneel #dragon pic.twitter.com/XIYI5U1PzX— Teja M (@TejaM112720) May 19, 2026చదవండి: డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ -
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
-
పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
స్పెషల్ ఎట్రాక్షన్
కమర్షియల్ సినిమాలో హీరో ఉంటారు. ఫైట్స్, పాటలు ఉంటాయి. అయినా అదనపు ఆకర్షణ కావాలి. ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక గీతం థియేటర్స్లో ప్లే అవ్వాలి. అందుకే కొందరు హీరోలు స్టోరీలో స్పెషల్ సాంగ్ చేసే స్కోప్ ఉంటే, సై అంటున్నారు. ఆ పాటలు చేయడానికి హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచే స్టెప్పులు వేస్తున్నారు. మరి... ఏ సినిమాలో ఏ నటి స్పెషల్గా కనిపించనున్నారో ఓసారి లుక్ వేయండి.జైలర్తో స్టెప్పుల్ మంచి కమర్షియల్ మోడ్లో కనిపిస్తున్నారు రజనీకాంత్. ఈ సీనియర్ హీరో నటించిన గత రెండు చిత్రాలు ‘జైలర్, కూలీ’ కమర్షియల్ ఎంటర్టైనర్స్గా ఆడియన్స్ను అలరించాయి. అలాగే ఈ రెండు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటలో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేస్తే, ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా..’ పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ను ఇరగదీశారు. కాగా రజనీకాంత్ పూర్తి చేసిన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ను బాలీవుడ్ నటి నోరా ఫతేహీ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.‘జైలర్’ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్గా రానున్న ‘జైలర్ 2’ మూవీకి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారని తెలిసింది.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ చిత్రం జూన్లో విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్ స్వరకర్త. అన్నట్లు... నోరా ఫతేహీ గురించి మన తెలుగు ఆడియన్స్కు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే..‘బాహుబలి: ది బిగినింగ్’లో ‘మనోహరి’, ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’ ఇలా పలు స్పెషల్ సాంగ్స్లో నోరా నర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది.స్పెషల్ ఎంట్రీ టాలీవుడ్కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి మౌనీ రాయ్. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ చిత్రంలో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. దాదాపు వందమంది డ్యాన్సర్స్తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి, మౌనీ రాయ్ డ్యాన్స్ చేశారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ‘విశ్వంభర’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మాస్ డ్యాన్స్ రామ్చరణ్ టైటిల్ రోల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో హీరో రామ్ చరణ్తో కలిసి శ్రుతీహాసన్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు. ఈ స్పెషల్ సాంగ్కు కుస్తీతో కూడిన ఓ కాన్సెప్ట్ కూడా ఉందట. అంతేకాదు... ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాలు కదిపారని సమాచారం. ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్లో చరణ్, జాన్వీ శ్రుతీహాసన్లను చూడటం మాస్ ఆడియన్స్కు థియేటర్స్లో విజిల్ వర్తీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970–1980 మధ్య కాలంలో సాగుతుంది. ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్గా రామ్చరణ్ నటించారు. అంటే... ఈ చిత్రంలో రామ్చరణ్ క్రికెట్, కుస్తీ ఆడతారు. మరొక గేమ్ కూడా ఉంది. ఈ గేమ్పై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమాలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్వేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. మరోవైపు మహేశ్బాబు ‘ఆగడు’, అర్జున్ కపూర్ ‘తేవర్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఆలియా ఆటా పాటా! ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటకు స్కోప్ ఉంది.ఈ పాటలో నటిస్తారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ పాటలో ఆలియా భట్ కనిపిస్తారనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే, ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ది ప్యారడైజ్లో తమన్నా! స్పెషల్ సాంగ్స్కు ఓ కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు హీరోయిన్ తమన్నా. అంతేకాదు... ఈ బ్యూటీ ఫలానా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమా హిట్టవుతుందనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా..’, కావొచ్చు, హిందీ చిత్రం ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ కావొచ్చు, మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘డాంగ్ డాంగ్..’ పాట కావొచ్చు... తమన్నా స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమాకు అది తప్పుకుండా ప్లస్ అవుతుంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ యువకుడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కు స్కోప్ ఉందట. దీంతో ఈ సాంగ్కు తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఆ దిశగా సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. అయితే ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్న అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంలో మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ తేదీకి విడుదల కుదరకపోవడంతో, ఈ ఏడాది ఆగస్టు 21కి వాయిదా వేశారు. అయితే ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని, అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ సాగడం లేదని, రీ షూట్స్ చేయాల్సి వస్తోందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, అనుకున్న ప్రకారమే ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోందని, ఆగస్టు 21న ఈ సినిమా విడుదల అవుతుందని టీమ్ మరోసారి స్పష్టత ఇచ్చింది.నేను రెడీ టాలీవుడ్కు వచ్చేందుకు నేను రెడీ అన్నారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. స్పెషల్ సాంగ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. హిందీలో ‘హౌస్ఫుల్ 3, హౌస్ఫుల్ 5, 5 వెడ్డింగ్స్’ వంటి చిత్రాల్లో నటించారు నర్గీస్. అలానే సల్మాన్ ఖాన్ ‘కిక్’లో ‘యార్ నా మిలే’, తమిళ హీరో ప్రశాంత్ ‘సాగసం’లో స్పెషల్ సాంగ్స్ చేశారు నర్గీస్. ఇప్పుడు తెలుగు సినిమాకు వచ్చారు. హవీష్, కావ్యాథాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నేను రెడీ’.ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేశారు నర్గీస్. టాలీవుడ్లో నర్గీస్ చేసిన తొలి సినిమా ఇదే. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ పతాకంపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదల కానుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘నేను రెడీ’ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ‘నేను రెడీ’ సినిమా విడుదల కాకముందే, తెలుగులో ఇంకో సినిమాలో మరో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నర్గీస్. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో నర్గీస్ ఫక్రీ డ్యాన్స్ చేశారని తెలిసింది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావొచ్చు.బ్లాక్ గోల్డ్లో సీరత్ ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో అరుదుగా ప్రత్యేక పాటలు చూస్తుంటాం. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది బ్లాక్గోల్డ్’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేఎమ్సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్డ్రాప్లో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రంలో హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ సంగతి ఇలా ఉంచితే.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీకమల్, తన్వీ లీడ్ రోల్స్లో నటించిన ‘ఉషా పరిణయం’ (2024) చిత్రంలో సీరత్ కపూర్ ప్రత్యేక పాటలో మెరిశారు. ఇక శర్వానంద్ ‘రన్ రాజా రన్’లో హీరోయిన్గా నటించిన సీరత్ కపూర్ నాగార్జున ‘రాజుగారి గది 2’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో కీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు తారలు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. -
తమిళ భాష నేర్చుకుంటున్నాను
హీరో, హీరోయిన్లు వివిధ భాషల్లో సినిమాలు చేస్తుంటారు. ఆయా భాషల్లో తమ పాత్ర తాలూకు భావోద్వేగాలు అర్థం చేసుకునేందుకు, సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆ భాషలు నేర్చుకుంటుంటారు. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమిళ్ నేర్చుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ (2024) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు భాగ్యశ్రీ. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ‘కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించిన ‘కాంత’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారామె. ప్రస్తుతం తెలుగులో అఖిల్ సరసన ‘లెనిన్’ మూవీలో నటిస్తున్న భాగ్యశ్రీ ‘సెయాన్’ అనే మరో తమిళ్ సినిమాలో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నటిగా నన్ను నేను నిరూపించుకునేలా ఉంటుంది. ప్రేక్షకుల పట్ల నిజాయితీగా ఉండాలంటే నటించే చిత్రాల భాషను నేర్చుకోవాలి. తెలుగులో ‘కింగ్డమ్’ చిత్రానికి నేనే డబ్బింగ్ చె΄్పాను. ఇప్పుడు ‘సెయాన్’ కోసం తమిళ భాష నేర్చుకుంటున్నాను’’ అని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారమైతే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'తో పాటు జ్యోతిక 'సిస్టమ్', మధువిధు, మేం కాప్లం లాంటి డబ్బింగ్ మూవీస్, సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే డ్రీమ్ క్యాచర్, భీంసేరి లాంటి చోటా చిత్రాలు అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేరింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్)అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సినిమా 'పైసా వాలా'. కె.నవీన్ తేజస్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. రూ.10 హవాలా నోటు చుట్టూ తిరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కానీ స్టార్స్ లేకపోవడంతో దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్లోకి వచ్చింది.'పైసా వాలా' విషయానికొస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత అతడి ఫోన్, పర్స్ మిస్ అవుతుంది. అందులోనే హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన సదరు పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెరిదింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
ఒకప్పుడు తెలుగులో హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. రీసెంట్ టైంలో మిరాయ్, భైరవం చిత్రాలతో విలన్గా మారిపోయాడు. ఆకట్టుకున్నాడు కూడా. ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి' అనే మూవీలో నెగిటివ్ టచ్ ఉండే హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. మీడియాతో కలిసి తన ప్రీ బర్త్ డే వేడుకల్ని హైదరాబాద్లో చేసుకున్నాడు. ఇందులోనే తండ్రితో గొడవ గురించి ప్రశ్న ఎదురవగా సెటైరికల్గా సమాధానమిచ్చాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)'మీ నాన్నతో గొడవ క్లియర్ అయినట్టేనా?' అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మనోజ్.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? కానీ మైక్తో వెళ్ళకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గతంలో మంచు కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఓ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు మైక్తో కొట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు.మీడియాతో మాట్లాడుతూ మనోజ్ మరికొన్ని విషయాల్ని పంచుకున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాలు నాకు ఇచ్చిన డైరెక్టర్స్ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇంకో జన్మ ఇచ్చారు. అలానే నా భార్య మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ చెప్పాడు.తాజాగా 'ఐక్య ధైర్య సేనా సమితి' పేరుతో ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. ఎవరైనా బెదిరింపు కాల్స్తో బాధపడుతుంటే వాళ్లకు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే దీనిని మొదలుపెట్టాం. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ)Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026 -
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
-
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘గోదారి గట్టుపైన’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్థింగ్ డిఫరెంట్గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక) -
వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్మెయిల్’ ప్రారంభం (ఫొటోలు)
-
హైదరాబాద్ : షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన నటి హిమజ (ఫొటోలు)
-
ఫ్యామిలీ ట్రిప్లో హీరోయిన్ శ్రీదేవి విజయ్కుమార్.. (ఫొటోలు)
-
తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్..!
కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్తో ఓ సినిమా చేస్తోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ వైరల్గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్పై డేటింగ్ రూమర్స్కు చెక్ పడినట్లైంది. -
బాబీతో మరో మెగా ప్రాజెక్ట్.. 70 ఏళ్ల వయసులో చిరు కష్టం చూశారా?
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో వచ్చే సెట్స్పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ సోషల్మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
బ్లాక్మెయిల్ ఆరంభం
వరుణ్ సందేశ్, సురేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్మెయిల్’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత–నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. సురేష్ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు మంచి కంటెంట్తో సినిమా రాబోతోందని అర్థమైంది’’ అని అన్నారు.‘‘నన్ను నమ్మి ఈ సినిమాను నా చేతిలో పెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు శ్రీనివాస్ గుండ్రెడ్డి. ‘‘నేను హీరోగా నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్గారు ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు సురేష్. ‘‘200 కుటుంబాలకు పని కల్పించవచ్చనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. నా సినిమాకు వచ్చే లాభాల్లో 10 శాతం మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్కు ఇస్తాను’’ అని తెలి΄ారు అవినాష్. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ తేజ. -
'తిమ్మరాజుపల్లి టీవీ'లో అదో గుర్తుండిపోయే జ్ఞాపకం: ప్రదీప్ కొట్టె
న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్. -
సాహిత్యం ఒక థెరపీ.. తెలుగు సినిమాల్లో పాడాలనుంది
ఏది మనసును ఇబ్బంది పెడితే, దాన్ని కాగితంపై రాయండి. రాయడం అనేది ఒక ఆటోమేటిక్ రిలీజ్, అదొక థెరపీ కూడా.. అంటూ బ్రేకప్ టిప్స్ పంచుకుంది ప్రముఖ బాలివుడ్ సింగర్ కం యాక్టర్ సంజీతా భట్టాచార్య. మొదట్లో అలా రాసిన పాటను పాడేటప్పుడు గొంతు ఆగిపోతుందని, భావోద్వేగాలు అడ్డొస్తాయని.. కానీ కాలక్రమంలో ఆ వ్యక్తి కన్నా పాటే మిగిలిందని, అదే సంగీతంలోని అందమని ఆమె తెలిపారు. “మనిషి వెళ్లిపోతాడు… కానీ పాట మాత్రం ఉండిపోతుంది” అనే తన మాటలతో ఈ జనరేషన్లో బ్రేకప్లను బలహీనతగా కాకుండా, భావాలను అర్థం చేసుకునే ఒక దశగా చూడాలని సంజీతా సూచించారు. బాధను దాచుకోకుండా, దాన్ని ఆర్ట్గా, పాటగా, రాతగా మార్చితే అదే మన శక్తిగా మారుతుందన్నారు.షారుఖ్ కోసం స్పానిష్ సాంగ్..నగరంలోని ఇనార్బిట్ మాల్ లో షాపర్ష స్టాప్, హైబ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలోని ఫస్ట్ గ్లోబల్ గర్ల్ గ్రూప్ ఆడిషన్స్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంజీతా భట్టాచార్య ‘సాక్షి’తో ముచ్చటించారు. గ్లామరస్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక బెర్క్లీ కళాశాలలో మ్యూజిక్ డిగ్రీ పొందిన సంజీతా భట్టాచార్య.. సంగీతమే తనకు మొదటి ప్రేమ అని తెలిపింది. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో తాను నటించడంతో పాటు స్పానిష్ సాంగ్ పాడటం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. షారుక్ అంటే తనకూ ఎంతో ఇష్టమని, షూటింగ్ సమయంలో అలా చూస్తూ ఉండిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న నాకు మొదటి ప్రేరణ.. తానొక పెయింటింగ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్గా సృజనాత్మకతతో జీవిస్తూ అందులోని ప్రేమను ఆస్వాదిస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఫ్రాంక్లిన్, క్రిస్టినా, సెలిన్ డియాన్తో పాటు ఏ.ఆర్.రహ్మాన్ తన ఫేవరెట్స్ అని చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్ కొత్త ఆల్బమ్ బీటీఎస్ అరిరంగ్ అందుబాటులో ఉందని, మరిన్ని కొత్త ప్రాజెక్టులతో రానుననాని, ఈ సంవత్సరం విడుదలకానున్న అల్బమ్ లో హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ పాటలు ఉంటాయని అన్నారు.మ్యూజిక్, కల్చర్, ఇన్స్పిరేషన్..హైదరాబాద్ ప్రజలు, ఇక్కడి సంస్కృతి ముఖ్యంగా బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడికి 5 సార్లు వచ్చాను.. ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడి నుంచి కొత్త ఫ్రెండ్స్తో వెళుతున్నాను.. అని హైదరాబాద్ ఆత్మీయ విశేషాలను పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో కూడా పాడాలని ఉంది.. ఆ కోరిక త్వరలో నిజం కావాలని ఆశించారు. ఈ సందర్భంగా అభిమానుల కే-పాప్ సాంగ్ కావాలనే కోరిక మేరకు.. స్మూత్ లైక్ బెటర్ బీటీఎస్ సాంగ్ పాడి అలరించారు. ఈ తరం అమ్మాయిలు సోషల్ మీడియా వాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్ లైఫ్స్టైల్, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫోటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. ఫ్యాన్స్కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు. -
ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న మనోజ్
హీరో మంచు మనోజ్ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్ను ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.అలాంటి వారికోసం..ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.మానవత్వం కోసం..ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..కొత్త ఆశఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్ చేశాడు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు. Before celebrating birthdays, me and my wife @BhumaMounika wanted to begin with service.Life’s journey has taught us that beyond every high and low, what truly matters is humanity and the people who stand beside us.This spirit of service did not begin today. It has always… pic.twitter.com/p6gg3HqljP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 17, 2026 చదవండి: పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే.. -
ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్
టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్కు వెళ్లినప్పుడు.. షూట్లో లేకుండా మీరు షాపింగ్కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్ వరకు వచ్చాక మీరు షూటింగ్ లోకేషన్లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్ఎక్స్లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా మెప్పించింది. -
నటి పావలా శ్యామలకు ప్రొడ్యూసర్ దిల్ రాజు భరోసా
-
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
స్పెషల్ ఎంట్రీ
టాలీవుడ్కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. హవీష్ హీరోగా నటించిన ‘నేను రెడీ’ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ‘‘నేను రెడీ’ సినిమా రీ–రికార్డింగ్ పనులతో సహా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. జూన్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం. హవీష్కు క్లీన్ కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
కొత్త అనుభూతినిచ్చేలా...
నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృష కర్మ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్లో ఓ భారీ షెడ్యూల్ను పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపి, రాజస్తాన్ లొకేషన్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్ప కళతో కనిపిస్తున్న ఈ లొకేషన్స్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఓ హైలైట్ అని తెలుస్తోంది. ‘‘షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
సన్నగా మారేందుకు సర్జరీ? క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్
బొద్దుగా కనిపించే హీరోయిన్లు, హఠాత్తుగా బక్కచిక్కిపోయి కనిపిస్తే ఎవరికైనా లేనిపోని సందేహాలు వస్తాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి గతంలో ఇలానే అనుకున్నారు. 2018లో 'మహానటి'లో నిండుగా బొద్దుగా కనిపించిన ఈమె.. తర్వాత కాలంలో ముఖంలో జీవకళ కోల్పోయినట్లు సన్నగా మారిపోయి షాకిచ్చింది. దీంతో అసలు ఈమెకు ఏమైందా అనుకున్నారు. కొందరైతే సర్జరీ చేసుకుందేమోనని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ సందేహాలపై స్వయంగా కీర్తినే క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)'2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్నెస్పై నాకేం అవగాహన లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో 'మహానటి' చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్నెస్పై దృష్టి పెట్టాలనుకున్నా. హెచ్ఐఐటీ, కార్డియో వర్కౌట్స్తో పాటు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బో డైట్ పాటించి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది''2020లో యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగింది. సరైన విధంగా జిమ్ చేస్తే ఎంత ఉపయోగమో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్తోపాటు యోగా, అనిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్ను బ్యాలెన్స్గా చేస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్లో ఉన్నా''అయితే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవడం వల్లే బయట కనిపించలేదు. జీవితంలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ జిమ్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.కేరళకు చెందిన కీర్తి సురేశ్.. 'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి'తో అదరగొట్టి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా దక్కించుకుంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లో చేస్తోంది.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
భారత ఆర్మీకి చెందిన గూఢచారులు అనగానే స్టైల్గా సూటు బూటు వేసుకుని ప్రైవేట్ జెట్స్లో తిరుగుతూ విలన్లని చితగ్గొట్టేస్తుంటారు లాంటి వాటినే ఇన్నాళ్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. అయితే ఓ గూఢచారి.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడనేది 'ధురంధర్'లో కొంతమేర రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే మన మూవీస్లో ఆర్మీని చూపించే తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)'ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు. 'ధురంధర్' పక్కనబెట్టేస్తే నిజానికి దూరంగా ఉంటాయి. అందుకే నేను వాటిని చూసేందుకు వెళ్లను కూడా. మహేశ్ బాబు మూవీ(సరిలేరు నీకెవ్వరు) ఏదో ఉంది. బాంబు ఉంటే పక్కనే కూర్చుని కాఫీ తాగుతుంటాడు. అదంతా చూసి నాకు కామెడీగా అనిపిస్తుంది. ఇదే సినిమాకు నా ఫ్రెండ్తో కలిసి వెళ్లాను. నేను నవ్వుతుంటే.. అరేయ్ నవ్వకురా జనాలు కొడతార్రా అని అన్నాడు. మరి ఆ సీన్ అలా ఉంది ఏం చేయమంటావ్ అని అడిగా. నువ్వు ఆర్మీ వాడివి అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతారు అని ఫ్రెండ్ నాతో అన్నాడు. దీంతో నేను థియేటర్ నుంచి బయటకొచ్చేశా. ఆర్మీని వాళ్లు అపహస్యం చేసినట్లు అనిపించింది. నేను అది తీసుకోలేకపోయాను' అని మేజర్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.సినిమాలంటేనే రియాలిటీకి ఆమడ దూరంలో ఉంటాయి. వాటిలో లాజిక్స్ వెతకలేం. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే తరహాలో ఉంటాయి. విలన్ ప్రకాశ్ రాజ్ని చివరలో ఆర్మీ చేర్పించే సీన్స్పై రిలీజ్ టైంలోనే విమర్శలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆర్మీ మేజర్.. ఈ ప్రస్తావన తీసుకురావడంతో మహేశ్ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, మిస్టర్ ఎక్స్, కాళిదాస్ 2, కర్తవ్య లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్తో పాటు ఎగ్జామ్ లాంటి డబ్బింగ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'ధురంధర్ 2' అయితే విదేశాల్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు చిత్రం కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల)వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'Cమంతం'. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబరు 14న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం స్టోరీ అంతంత మాత్రంగా ఉండేసరికి ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం తాజాగా రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'Cమంతం' విషయానికొస్తే.. నగరంలో గర్భిణులని వరుసగా హత్య చేస్తుంటారు. ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు పోలీసులకు కూడా అంతుచిక్కవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిటెక్టివ్గా ఉన్న హీరో (వజ్రయోగి) ఈ కేసును ఎలా టేకప్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? వారి వెనుక ఉన్న ఫ్లాష్బ్యాక్ ఏమిటనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక హీరోతో సింగర్ బ్రేకప్!) -
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. అటు వృద్ధాప్య సమస్యలు, ఇటు అనారోగ్యం ఆమెను మరింత కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి అస్వస్థతకు లోనవగా చికిత్స కోసం కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. దీన స్థితిలో నటికానీ చికిత్సకు సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఓ క్యాబ్ ఎక్కించి ఆమెను బలవంతంగా పంపించేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను మధ్యలోనే దింపేశాడు. కూకట్పల్లిలోని ఓ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఫుట్పాత్పై దించేసి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి కటిక చీకటిలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయింది. ఆస్పత్రిలో చికిత్సకాసేపటికి ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు.. ఆమె ఆశ్రయం పొందుతున్న ఆర్కే ఫౌండేషన్కు సమాచారమివ్వడంతో వారు తనను సనత్నగర్లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఒకప్పుడు తన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి ఇప్పుడిలా రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించడం చూసి సినీప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.చదవండి: సూర్యకు భారీ పారితోషికం.. మరి త్రిషకెంతో? -
బర్త్డే సెలబ్రేషన్స్.. ఆహా అనిపిస్తున్న అనసూయ (ఫొటోలు)
-
రామ్చరణ్ చేతికి గాయం? హీరోకు ఏమైంది?
గేమ్ ఛేంజర్తో భారీ డిజాస్టర్ను మూటగట్టుకున్న రామ్చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. బ్యాండేజ్తో చరణ్?మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్చరణ్ చేతికి బ్యాండేజ్తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్కు వెళ్లాడు చరణ్. చరణ్కు ఏమైంది?అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో చరణ్కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది. #RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026 చదవండి: స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు: సల్మాన్ ఖాన్ -
క్యూట్ లుక్స్తో కవ్విస్తున్న నటి పూజిత పొన్నాడ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్లో మంచు లక్ష్మీ.. కేన్స్లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్లో అనన్య పాండే..జిమ్లో బిగ్బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న వీకే నరేశ్.. ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు విలువ దాదాపు రూ.2.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఖరీదైన స్పోర్ట్స్ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు నరేశ్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. వీకే నరేశ్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన, కామెడీతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది బ్యూటీ, హే బల్వంత్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. Live life King Size like Naresh pic.twitter.com/PaChEpGm9A— Journalist Nishant (@NishantOpinions) May 15, 2026 -
కొత్త సీఎంకు ఫోన్ చేసిన మెగాస్టార్.. ఏ సలహా ఇచ్చారంటే?
తమిళనాడు సీఎం విజయ్కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. సబ్ కమిటీ ఏర్పాటు
టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అంశంపై ముందడుగు పడింది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్సంటేజీ వివాదంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ పర్సంటేజీ సమస్యను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్కు సంబంధించిన పర్సంటేజీ విధానంపై చర్చ జరిగింది. సబ్ కమిటీ ఛైర్మన్గా డి. సురేష్ బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ ఉన్నారు. ఈ సబ్-కమిటీలో మూడు రంగాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మాతల రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్(ఎస్కేఎన్), టి. ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు.ఎగ్జిబిటర్స్ రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలేని కూడా ఉన్నారు. -
ది రాజాసాబ్పై కామెంట్స్.. సప్తగిరి క్షమాపణలు!
టాలీవుడ్లో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సప్తగిరి ఒకరు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం పురుషః అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన సప్తగిరి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చేసిన చిన్న సినిమాల గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ది రాజాసాబ్ పేరును కూడా కలిపేశారు. ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కావడంతో సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా తాను చేసిన కామెంట్స్పై సప్తగిరి స్పందించారు. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించాలని కోరారు. మినిమం బడ్జెట్ మూవీస్ చేస్తున్నాను.. ఆ సినిమాల లిస్ట్ చెబుతూనే ది రాజాసాబ్ పేరు చెప్పానని తెలిపారు. మారుతి కూడా నాకు ఫోన్ చేశారని.. సారీ చెప్పమని అడిగారని వెల్లడించారు. ఆయనకు కూడా సారీ చెప్పా.. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు సప్తగిరి. -
శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ లయ.. ఫోటోలు
-
వివాదంలో రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్ ఫంక్షన్కు హాజరైన ఆయన పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు, షీల్డ్స్ అందజేశారు. అయితే ఈ ఈవెంట్కు నవ తెలంగాణ విద్యార్థి విభాగం సభ్యులు వచ్చిన ఒక్కసారిగా నిరసనకు దిగారు. అసలు ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా అని నిలదీశారు. అక్కడ స్కూల్ మేనేజ్మెంట్, విద్యార్థి సంఘం మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.అదే సమయంలో పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజీవ్ కనకాలను సైతం ప్రశ్నించారు. నుమతులు లేని అలాంటి స్కూల్ ఫంక్షన్కి ఎలా అటెండ్ అవుతారని అడిగారు. అయితే ఈ విషయాల గురించి తనకు ఏమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. మంచి కార్యక్రమం అని పిలిస్తే వచ్చానని తెలిపారు. దయచేసి ఈ ఈవెంట్కు సంబంధించిన నా ఫోటోలు, వీడియోలు ఎవరూ కూడా పబ్లిసిటీ వినియోగించవద్దని రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. నన్ను అలర్ట్ చేసినందుకు నవ తెలంగాణ విద్యార్థి విభాగానికిని నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల ఓ స్కూల్ వివాదంలో ఇరుక్కున్నారు10th lo highest marks vachina students ki Rajeev Kanakala garu shields andincharu. Sanmana karyakramam jarugutunna samayam lo Nav Telangana Vidyarthi Shakti (NTVS) organization members okkasariga protest chesaru. Aa school ki… pic.twitter.com/45jhHyXQZK— Milagro Movies (@MilagroMovies) May 15, 2026 -
పర్సంటేజీ సమస్య.. ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లు వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్కీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది. హైదరాబాద్లో శుక్రవారం ఇరువర్గాలతో కలిసి మీటింగ్ పెట్టింది. ఇందులోనే కీలక నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో 18 మంది సభ్యులు. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తలో ఆరుగురు కమిటీలో ఉంటారని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్స్ యాక్టీవ్ గిల్డ్ నిర్మాతలు సమావేశం వాడివేడిగా సాగుతోంది. చర్చలు జరుగుతున్నప్పుడే ఏషియన్ సునీల్ నారంగ్ అరుస్తూ బయటికి వచ్చేశారు. దీంతో ఈయనని బతిమాలిన చదలవాడ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ, అనుపమ్ రెడ్డి తిరిగి మీటింగ్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇరు వర్గాలు వేర్వేరుగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే: టాలీవుడ్ విలన్) -
మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే
మహేశ్ బాబు ఇప్పటివరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేశాడు. హిందీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆసక్తి చూపించలేదు. ఈ విషయం గురించి గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడా టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఒకప్పుడు టాలీవుడ్ విలన్ రోల్స్ చేసిన రాహుల్ దేవ్. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ గురించి ఇతడు చేసిన కామెంట్స్ షాకింగ్గా అనిపించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)మహేశ్ బాబు గతంలో ఓసారి మాట్లాడుతూ.. 'బాలీవుడ్ వాళ్లు నన్ను భరించలేరు' అన్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి? అని యాంకర్ అడగ్గా.. రాహుల్ దేవ్ నవ్వుతూనే ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు ఓ అర్థం ఉంటుంది. త్రివిక్రమ్తో మహేశ్ చేశారు. ఇలాంటి మూవీస్ హిందీలో ఉండవు. అక్కడంతా రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు తీసే టైపు సినిమాలు లేదంటే హాలీవుడ్ రీమేక్సే ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఆయనకు(మహేశ్) భాష రాదు అదే అసలు కారణం' అని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ నటుడు ఏ ఉద్దేశంతో మహేశ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడనేది అర్థం కావట్లేదు.మహేశ్ గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. గర్వంగా అనిపించొచ్చు కానీ వాళ్లు నన్ను భరించలేరు. నా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. తెలుగు సినిమాల్లో నాకు దొరుకుతున్న స్టార్డమ్, అభిమానం చూసిన తర్వాత మరో పరిశ్రమకు ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. ఇక్కడే మూవీస్ చేస్తానని, అది పెద్ద హిట్ అవుతాయని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమవుతోంది' అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' మూవీ.. హిందీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?) -
మేకప్ లేకున్నా అదే అందం.. సాయిపల్లవి జపాన్ ట్రిప్ (ఫొటోలు)
-
హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?
తెలుగులో ప్రస్తుతమున్న స్టార్ హీరోలు నటించడం తప్పితే మిగతా విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. కానీ నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంటి వాళ్లు మాత్రం నటిస్తూనే రైటింగ్లో ప్రతిభ చూపించారు. విశ్వక్ సేన్ లాంటి ఒకరిద్దరు డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరో చేరాడు. అతడే రామ్ పోతినేని. ఇప్పటివరకు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తన 23వ మూవీ కోసం దర్శకుడిగా మారిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)పుట్టినరోజు సందర్భంగా రామ్.. డైరెక్టర్గా మారిన విషయాన్ని బయటపెట్టాడు. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వీర పాత్రకు సంబంధించిన బ్యాక్ సైడ్ లుక్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో హీరో కమ్ దర్శకుడిగా రామ్ వ్యవహరిస్తుండగా.. నిర్మాతగా రామ్ సోదరుడు కృష్ణ ఉన్నారు. అంటే నిర్మాణంలోనూ రామ్ హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది.రీసెంట్ టైంలో 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే రామ్కి మరో హిట్ అనేది లేదు. ఇది సక్సెస్ అయిందని వరసగా మాస్ మూవీస్ చేసుకుంటూ వెళ్లాడు. వీటిలో ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో రూటు మార్చేసి 'ఆంధ్రా కింగ్ తాలుకా' అని క్లాస్ టచ్ మూవీ చేశాడు. టాక్ బాగానే వచ్చింది గానీ కలెక్షన్స్ రాక ఇది కూడా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో ఓ పాట రాసిన రామ్.. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా మారడం ఆశ్చర్యం కలిగించింది.హీరో-దర్శకుడిగా ఈ బరువు బాధ్యతల్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. దానికి తోడు ఈ ఏడాది డిసెంబరులోనే థియేటర్లలో రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించాడు. అంటే ఆరు నెలల్లోనే మూవీ పూర్తి చేసి రిలీజ్ చేస్తాడనమాట. ప్రయత్నం మంచిదే అయినా ఎందుకీ సాహసం చేస్తున్నాడనేది ఇక్కడ ప్రశ్న.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)An exciting journey begins with all your love & blessings. 🖤Introducing "𝙑𝙀𝙀𝙍𝘼" in #RAPO23 🔥-the story of a Lone Wolf. 🐺Genre: Psychological Action Thriller.Written & Directed by #𝙍𝘼𝙋𝙊Produced by Krishna PothineniA @RAPO_Cinematics Production.December 2026… pic.twitter.com/m9dkC0XMb7— RAm POthineni (@ramsayz) May 15, 2026 -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. డ్రాగన్ నుంచి బిగ్ అప్ డేట్
-
నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?
ప్రస్తుతం టాలీవుడ్లో ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. థియేటర్లు రన్ చేస్తున్న ఎగ్జిబిటర్లు.. సింగిల్ స్క్రీన్లలో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతుండగా.. నిర్మాతలేమో ఇప్పటికిప్పుడు అంటే కష్టం, తర్వాత చూసుకుందాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. అయితే సమస్య పరిష్కరించుకోవడం సంగతి పక్కనబెట్టి ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేంత వరకు వచ్చారు. అసలు ఈ వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారు?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మధ్య జరుగుతున్న వివాదం గురించి చాలామంది ప్రేక్షకులు సరిగా తెలియదు. సింపుల్గా దాని గురించి చెప్పుకోవాలంటే ఓ మూవీని తీసిన నిర్మాత.. దాన్ని ఓ థియేటర్లో ప్రదర్శించుకునేందుకు ఎగ్జిబిటర్ అనే వాడికి కొంత మొత్తం చెల్లిస్తాడు. అయితే సింగిల్ స్క్రీన్స్లో మూవీ వేసినందుకు అద్దె చెల్లిస్తుండగా.. మల్టీప్లెక్స్లో మాత్రం వచ్చిన డబ్బుల్లో పర్సంటేజీ చెల్లిస్తున్నాడు. అయితే ఇలా వేర్వేరుగా కాకుండా అందరికీ ఒకేలా పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ఇప్పుడు అంటున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తొలుత ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధలు చెప్పుకోగా తర్వాతి రోజు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున కొందరు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి తమ వాదన వినిపించారు.ఇన్నాళ్లు వాళ్లవరకే పరిమితమైన సమస్యని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కలిసి అందరి ముందు పెట్టారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ నిర్మాత నాగవంశీ.. ఆసియన్ సునీల్ని ఉద్దేశిస్తూ మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉన్న ఈయనకు సింగిల్ స్క్రీన్ బాధలేం తెలుస్తాయని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సునీల్.. నాగవంశీని ఉద్దేశిస్తూ విగ్ పెట్టుకుంటాడు అంటూ బాడీ షేమింగ్ చేసేలా మాట్లాడారు. అలా సమస్య కాస్త పక్కదారి పట్టి వేరే వైపు వెళ్లిపోయింది. మరోవైపు 'పెద్ది' రిలీజ్ టైంలో కావాలనే ఎగ్జిబిటర్ శిరీష్ ఇలా చేస్తున్నారని నిర్మాతలు ఆరోపణలు చేశారు. స్పందించిన శిరీష్.. తాము ఎప్పటినుంచో పర్సంటేజీ గురించి అడుగుతున్నామని 'పెద్ది'ని టార్గెట్ చేయట్లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం.. తెలుగు ఫిలిం ఛాంబర్లో సురేశ్ బాబు ఆధ్వర్వంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరగనున్నాయి. సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిర్మాత సి.కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారా? అంటే ఎవరివైపు లేరు. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ పర్సంటేజీ, రెంట్ లాంటి వాటి గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఉండదు కూడా! ఓ మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్కి వెళ్లి చూడటం మాత్రమే ఆడియెన్స్కి తెలుసు. కానీ సరైన మూవీస్ తీయడం, టైంకి రిలీజ్ చేయడం మానేసి వాళ్లలో వాళ్లే గొడవపడి టాలీవుడ్ అంటేనే విరక్తి వచ్చేలా చేస్తున్నారు.అసలు థియేటర్లు నడిచేవే హీరోలు, ప్రేక్షకుల వల్ల. ఆ విషయాన్ని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారేమో అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతమున్న గొడవ పూర్తిగా సద్దుమణగాలంటే తెలుగు రాష్ట్రాల్లో కచ్చితమైన టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ లాంటి రిలీజ్ చేసి మభ్య పెట్టకుండా గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్స్లో పారదర్శకత పాటించాలి. ఒకరిని ఒకరు నిందించుకోకుండా హీరోల రెమ్యునరేషన్, ఓటీటీ బిజినెస్ లాంటి వాటిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి. పెద్ద మూవీ అని టికెట్ రేట్లు ఎడాపెడా పెంచేయకుండా థియేటర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఏళ్లకు ఏళ్లు సాగదీయకుండా స్టార్ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసేలా ఒప్పించాలి. నటీనటులు, మూవీ బడ్జెట్ నియంత్రణలో ఉంచాలి. బడ్జెట్ అనవసరంగా పెంచేసి ఓటీటీల్లో త్వరగా రిలీజ్ చేయడం లాంటివి ఆపాలి. మరీ ముఖ్యంగా డబ్బు పెట్టే ప్రేక్షకుడిపై భారం పడకుండా చూసుకోవాలి. అప్పుడే థియేటర్లు బతుకుతాయి. తద్వారా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా బతుకుతారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్) -
#HBDAnasuya : రంగమ్మత్త (అనసూయ) జర్నీలో ఎన్ని మలుపులో! (ఫొటోలు)
-
టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి
థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు, దానికి టైమ్ పడుతుందని నిర్మాతలు.. అలా టాలీవుడ్లో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్లో నేడు.. ఎగ్జిబిటర్స్, నిర్మాతలతో చర్చలు జరగనున్నాయి. ఛాంబర్ అధ్యకుడు, నిర్మాత సురేశ్ బాబు ఆధ్వర్యంలో ఇరుపక్షాల సమస్యలని చర్చించబోతున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?)ఈ భేటీలో ప్రధానంగా పర్సంటేజీ, రెంటల్, ఓటీటీ విండో గురించి చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, గిల్డ్ నిర్మాతల నుంచి ముగ్గురు సభ్యులు హాజరు కానున్నారు. మొత్తంగా 10 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈరో జు జరిగే చర్చలలో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుంది నిర్మాత సీ కళ్యాణ్ చెబుతున్నారు. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి దాటకుండా ఫిలిం ఛాంబర్ చర్చలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
స్టైల్ మార్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (ఫొటోలు)
-
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఈ ఫోటోలు చూశారా...(ఫొటోలు)
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో చాలామంది హీరోలున్నారు. అందులో నాగశౌర్య. సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. 'ఛలో' లాంటి మూవీస్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఇతడికి సరైన హిట్ అనేది లేకుండా పోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదిప్పుడు ఎలాంటి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా)ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జో అచ్యుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నాగశౌర్య.. 2023లో 'రంగబలి' చేశాడు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు గానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఈ మూడేళ్లలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రం చేయగా గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆటకే తేలిపోయింది. అసలు ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఇప్పుడు సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.'బ్యాడ్ బాయ్ కార్తీక్' విషయానికొస్తే.. కార్తీక్(నాగశౌర్య) వైజాగ్లో ఉంటాడు. అక్క కస్తూరి(శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. ఆమె ఓ లాయర్. రాయలసీమలోని కదిరిలో భూకబ్జాలు చేసే గోవిందప్పు(మైమ్ గోపీ), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంటుంది. దీంతో ఈమెపై దాడి జరుగుతుంది. ఆ విషయం తెలిసి వైజాగ్ నుంచి రాయలసీమకు కార్తీక్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క.. అతడిపైనే ఎందుకు కోప్పడింది? ఒకప్పుడు సఖ్యతగా ఉన్న గోవిందప్ప, వరదారెడ్డి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది? గోవిందప్పను చంపింది ఎవరు? వరదారెడ్డిని చంపింది ఎవరు? మధ్యలో హీరో ప్రేమకథ ఏంటనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
బిగ్బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
ఓటీటీకి దురంధర్-2.. ఫ్రైడే ఒక్క రోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15అమెజాన్ ప్రైమ్ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15జియో హాట్స్టార్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్ట్స్..తెరచాప(తెలుగు సినిమా)- మే 15జీ5..టిఘీ (మరాఠీ మూవీ) - మే 15మనోరమ మ్యాక్స్..కప్(మలయాళ సినిమా)- మే15లయన్స్ గేట్ ప్లే..కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15హులు..రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15ముబీ..ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15 -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్ మూవీ రిలీజ్కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్కు ముందే టాలీవుడ్లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్వర్క్పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)
-
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్కు వరల్డ్ వైడ్గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. -
టాలీవుడ్ గుండెల్లో వణుకు ఐబొమ్మ ఈజ్ బ్యాక్..
-
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
2 పార్ట్స్ లలో విశ్వంభర... రిలీజ్ ఎప్పుడంటే..!
-
చాలా బాధగా ఉంది... పెద్ది అప్పుడే ఎందుకు ఇలా..!
-
‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అంజలి కీలక పాత్రలో 'ముసలోడికి దసరా పండుగ'.. రిలీజ్కు రెడీ
నాజర్, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సందర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకముంది. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు. -
బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
భారీ యాక్షన్ సీక్వెన్స్.. రాజమౌళి ప్లాన్ ఛేంజ్..!
మహేశ్ బాబు- వారణాసి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.అయితే భారీ యాక్షన్ సీన్స్ను కోసం హైదరాబాద్లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం గగన్పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. అందుకోసం ఏకంగా 150 ట్యాంకర్ల అవసరం కావడంతో జలమండలికి లేఖ రాశారు. వేసవికాలం కావడంతో అంత నీరు ఇవ్వలేమని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి వారణాసి టీమ్కు షాకిచ్చారు. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఈ సీన్స్ కోసం ప్రత్యామ్నాయం కోసం వేట ప్రారంభించారు.ఈ నేపథ్యంలోనే మేకర్స్ వారణాసికి ప్లాన్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అండర్ వాటర్ యాక్షన్స్ సీక్వెన్స్ వారణాసిలోనే చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో వాటర్ సమస్య రావడంతో మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. -
నిర్మాత జోకర్ అయిపోయాడు.. సెట్లో నా మీదే జోకులు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వేళ్లపై లెక్కపెట్టగలిగే నిర్మాతలు తప్పితే కొత్తగా ఎవరొచ్చినా ఇక్కడ నిలబడటం కష్టం. హీరోల ఆధిపత్యం చాలా పెరిగిపోయింది. దీంతో నిర్మాత అనేవాడు డబ్బులు ఖర్చుపెట్టే మెషీన్లా మారిపోయాడు. ఇలాంటి కారణాలతోనే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. అలాంటి వాళ్లలో ప్రసాద్ వి పొట్లూరి అలియాస్ పీవీపీ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. టాలీవుడ్ని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)'సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన బిజినెస్ ప్రపంచంలో మరొకటి లేదు. మనం డబ్బులు పెట్టి అవమానాలు పడటం కంటే దారుణమైన విషయం లేదు. ఇండస్ట్రీలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నిర్మాత ఓ జోకర్లా అయిపోయాడు. డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీదే సెట్లో అందరూ జోకులు వేస్తుంటారు. సినిమా పోతే రోడ్డున పడేది నిర్మాతే అని నా మీద ఎవరికీ ఏ ఆందోళన ఉండదు. నన్నో బఫూన్లా చూస్తారు. హాలీవుడ్లో ఉన్నట్లు ఇక్కడ స్టూడియో విధానం లేదు. హీరోలే ఇండస్ట్రీని నడిపిస్తున్నారు. నిర్మాతలకు విలువ లేదు. ఇలాంటి చోట ఉండటం ఎందుకని నేనే వచ్చేశాను' అని పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.'టెంపర్' సినిమాకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్తో వివాదం గురించి స్పందించిన పీవీపీ.. ఆ చిత్రానికి నేను సోలో ఫైనాన్సియర్. బ్యాంక్ తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి దాన్ని వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. మన డబ్బులు మనం తీసుకోవడానికి అవమానాలు పడాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.రవితేజ 'బలుపు' మూవీతో నిర్మాతగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి భారీ సినిమాలు చేశారు. కానీ ఉన్నట్లుండి సడన్గా నిర్మించడం మానేశారు. ఇన్నాళ్లకు అందుకు గల కారణాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్) -
హీరోయిన్ లయ చెస్ ఛాంపియనా?.. పోస్ట్ వైరల్
అప్పట్లో హీరోయిన్గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
అరుణాచలం ట్రిప్లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)


