breaking news
Tollywood
-
నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్
-
సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?
-
విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్
-
‘బేబీ’ మూవీ నేషనల్ అవార్డు ప్రెస్మీట్ (ఫొటోలు)
-
పల్లె పాటకు జాతీయ అవార్డు రావడం చాలా గొప్పగా ఉంది
-
అర్జున్రెడ్డి పారితోషికం.. అప్పుడు నాకదే ఎక్కువ: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అనగానే చాలామందికి గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే! పెళ్లిచూపులు సినిమాతో హీరోగా క్రేజ్ వచ్చినప్పటికీ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం (Arjun Reddy Movie)తో దమ్మున్న హీరో అని నిరూపించుకున్నాడు. దాదాపు రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టించింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతోనే విజయ్ రేంజ్ మారింది. కింగ్డమ్కు తొలిరోజు భారీ కెలెక్షన్స్ఈ మధ్య ఫ్లాపులే ఎక్కువగా పలకరిస్తుండటంతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసిమీదున్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న రిలీజైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.అప్పుడదే ఎక్కువఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ.. కింగ్డమ్కు వస్తున్న రెస్పాన్స్పై సంతోషం వ్యక్తం చేశాడు. తనకు పేరు తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసుకుంటూ.. అప్పుడు తన రెమ్యునరేషన్ రూ.5 లక్షలని, ఆ సమయంలో అదే తనకు పెద్ద అమౌంట్ అన్నాడు. ఇప్పుడు రిలీజైన కింగ్డమ్కు మంచి కలెక్షన్స్ వస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో.. -
బబ్లూ పృథ్వీరాజ్ సెకండ్ ఇన్నింగ్స్.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్గానే (ఫోటోలు)
-
బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది'
బుల్లితెర నటి అంజలి పవన్ (Anjali Pavan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నటి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ చనిపోయిన విషయాన్ని అంజలి.. సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అమ్మా, నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు.. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా.. మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు.నమ్మలేకపోతున్నాం..నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది. అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఇతర నటీనటులు.. అయ్యో, నమ్మలేకపోతున్నాం.. ఓం శాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ మీ అమ్మగారు మీ కడుపున పుడతారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అభిమానులు నటిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.రెండో ప్రెగ్నెన్సీ..మొగలిరేకులు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. 2017లో నటుడు సంతోష్ పవన్ను పెళ్లి చేసుకోగా వీరికి చందమామ అనే కూతురు ఉంది. ఇటీవలే రెండోసారి గర్భం దాల్చగా.. జూన్లో అంజలికి ఘనంగా సీమంతం కూడా చేశారు. త్వరలోనే మరో బుజ్జాయి ఇంట్లో అడుగుపెట్టనుందని సంతోషిస్తుండగా.. అంతలోనే అమ్మ మరణించడంతో నటి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అంజలి.. రాధా కల్యాణం, దేవత వంటి సీరియల్స్తో పాటు లెజెండ్, ఒక లైలా చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Anjali Attota (@anjaliattota) చదవండి: జాతీయ అవార్డ్స్.. వాళ్ల కష్టానికి ఫలితం అంటూ షారుక్ ఖాన్ -
చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ ఫైర్ అయ్యారు. కొందరు ఆకతాయిలు చేసిన చిల్లర కామెంట్లకు చెప్పు తెగుద్ది అంటూ ఆమె బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కపూరంలోని ఓ షాపింగ్మాల్ ఓపెనింగ్లో అనసూయ పాల్గొన్నారు. దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు చేరుకున్నారు. ఆమె మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు అనసూయకు వినిపించేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగుద్ది.. అంటూ గడ్డిపెట్టారు. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబసభ్యులపై ఎవరైనా ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా అంటూ ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని, వారు చాలా హానికరమన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ సమయంవలో అనసూయకు మద్ధతుగా చాలామంది నిలిచినట్లు తెలుస్తోంది. -
ఉత్తమ తెలుగు జాతీయ చిత్రం.. సత్తా చాటిన మన సినిమాలు
-
క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్లో నిహారిక (ఫోటోలు)
-
శ్రీలంకలో వరలక్ష్మీ .. ఎందుకో తెలుసా?
ఎదగడానికైనా, ఎదిగిన తరువాత అయినా ప్రచారం ముఖ్యంగా మారిన రోజులివి. ప్రస్తుతం అలాంటి ప్రచారంలో ఉన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్(Varalaxmi Sarathkumar). ఈమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మీ నటించిన పాత్రలు అంత బలంగా ఉంటాయి. 2012లో పోడాపోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె శరత్కుమార్ వారసురాలు అన్నది తెలిసిందే. అయితే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా, అలాంటి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకిగానూ నటించడమే ఈమె ప్రత్యేకత. అలా ఎలాంటి పాత్రకైనా రెడీ అనే వరలక్ష్మీ బహుభాషా నటి కూడా. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కారణాలేమైన ఇప్పుడీమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారనే చెప్పవచ్చు. అందులో భాగంగా శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. శ్రీలంకలో చిన్నమోన్ లైఫ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ప్రాంతంలో ఈమె ఫొటో షూట్ నిర్వహించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఫొటోల్లో తనకే సొంతమైన అందంతో పాటు ధైర్యాన్ని వ్యక్తం చేసేలా వరలక్ష్మీ కనిపించడం విశేషం. పలు చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వరలక్ష్మీ ఇటీవల నటించిన ది వెర్డిక్ట్ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలను అందుకున్నారు. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా ముద్ర వేసుకున్న ఈ భామ మరిన్ని వైవిధ్యభరిత కథా పాత్రల View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇతర భాషల్లో సినిమాలు చేస్తే దివ్యాంగుల్లా అనిపిస్తుంది: మురుగదాస్
కోలీవుడ్లో దీన, రమణ, గజనీ, తుపాకీ, సర్కార్ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుల లిస్ట్లో ఏఆర్.మురుగదాస్ చేరిపోయారు. ఈయన తెరకెక్కించిన గజనీ చిత్రాన్ని హిందీలో అమీర్ఖాన్ హీరోగా చేసి విజయాన్ని సాధించారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవి హీరోగా స్టాలిన్ పేరుతో ఒక సినిమా చేశారు. ఇటీవల సల్మాన్ఖాన్ హీరోగా సికిందర్ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. దీంతో నెటిజన్లతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా దర్శకుడితోపాటు యూనిట్ సభ్యులపై విమర్శలు గుప్పించారు. కాగా మురుగదాస్ ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా మదరాసి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను ఇతర భాషల్లో చిత్రాలు చేసేటప్పుడు దివ్యాంగుల్లా భావన కలుగుతుందన్నారు. అదే మాతృభాషలో చిత్రం చేయడం చాలా బలం అని అన్నారు. కానీ, తెలుగులో మాత్రం అలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఎందుకంటే తెలుగు భాష కూడా ఇంచుమించు మన భాషలానే ఉండడంతో పట్టు దొరుకుతుందన్నారు. భాష తెలియని ప్రాంతంతో చిత్రం చేయడం దివ్యాంగుల మాదిరి భావన కలుగుతుందనే అభిప్రాయాన్న మురుగదాస్ వ్యక్తం చేశారు. కాగా హిందీలో రెండు చిత్రాలు చేసిన ఆయన ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. హిందీలో తెరకెక్కించిన సికిందర్ సినిమా డిజాస్టర్ కావడం వల్లనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. -
జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి ఎంపికైంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి హనుమాన్ రెండు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డ్ సాధించింది.ఆ తర్వాత వేణు యెల్దండి తెరకెక్కించిన రూరల్ ఎమోషనల్ చిత్రం బలగం ఉత్తమ సాహిత్యం విభాగంలో అవార్డ్ దక్కించుకుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలోని ఊరు పల్లెటూరు అనే పాటకు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది.సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రం బేబీకి రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్ప్లేతో దర్శకుడు సాయి రాజేశ్ను జాతీయ అవార్డు వరించింది. ఈ సినిమాలోని ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్కు ఉత్తమ సింగర్ అవార్డ్ దక్కింది. అలాగే సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపికైంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులుఉత్తమ తెలుగు చిత్రం- భగవంత్ కేసరి(అనిల్ రావిపూడి)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ- హనుమాన్ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్- హనుమాన్ఉత్తమ స్క్రీన్ప్లే- బేబీ(సాయి రాజేశ్)ఉత్తమ గాయకుడు- బేబీ (పీవీఎన్ఎస్ రోహిత్ )ఉత్తమ సాహిత్యం- కాసర్ల శ్యామ్ (బలగం)ఉత్తమ బాలనటి- సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు) -
National Film Awards: హనుమాన్కు జాతీయ అవార్డు.. ఉత్తమ చిత్రంగా..!
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (71st National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం వరించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. సుకుమార్ కూతురికి పురస్కారంమిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. గాంధీ తాత చెట్టు చిత్రానికిగానూ సుకుమార్ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ విభాగంలో సామ్ బహదూర్ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి ఈ విజేతలను ఎంపిక చేసింది.71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితా..(ఫీచర్ ఫిలిం కేటగిరిలో..)ఉత్తమ సహాయ నటుడువిజయరాఘవన్ - పోక్కాలమ్ మలయాళ చిత్రంముధుపెట్టయి సోము భాస్కర్ - పార్కింగ్ తమిళ చిత్రంఉత్తమ సహాయ నటిఊర్వశి - ఉళ్లోళుక్కు మలయాళ చిత్రంజంకీ బోడివాల - వశ్ గుజరాతీ చిత్రంబెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్సుకృతి వేణి బండ్రెడ్డి - గాంధీ తాత చెట్టుకబీర్ ఖాండరి - జిప్సీ మరాఠి మూవీత్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ - నాల్ 2 మరాఠీ మూవీఉత్తమ దర్శకుడుసుదీప్తో సేన్ -ద కేరళ స్టోరీఉత్తమ డెబ్యూ దర్శకుడుఆశిశ్ బెండె- ఆత్మపాంప్లెట్బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్పీవీఎన్ ఎస్ రోహిత్ - (ప్రేమిస్తున్నా.. బేబీ మూవీ)బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్శిల్పరావు (చెలియా.. జవాన్ మూవీ)బెస్ట్ సినిమాటోగ్రఫీప్రసంతను మొహపాత్ర - ద కేరళ స్టోరీబెస్ట్ లిరిక్స్ఊరు, పల్లెటూరు సాంగ్.. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ (బలగం)బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)నందు, పృథ్వి (హనుమాన్)బెస్ట్ స్క్రీన్ప్లేఉత్తమ స్క్రీన్ప్లే రచయితసాయిరాజేశ్ నీలం (బేబీ)రాంకుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్)డైలాగ్ రచయితదీపక్ కింగక్రాని (సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై)ఉత్తమ చిల్డ్రన్స్ ఫిలిం: నాల్ 2 (మరాఠి మూవీ)బెస్ట్ కొరియోగ్రఫీ: దిండోరా బాజ్ రె పాట.. కొరియోగ్రాఫర్: వైభవి మర్చంట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్ (సాంగ్స్) - (వాతి), హర్షవర్ధన్ రామేశ్వర్ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)- (యానిమల్)బెస్ట్ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్)బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సచిన్ లోవలేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: మోహన్దాస్ (2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో)బెస్ట్ ఎడిటింగ్: మిధున్ మురళి (పొక్కలాం- మలయాళ చిత్రం)బెస్ట్ సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరణ్- హరిహరణ్ మురళీధరన్ (యానిమల్)బెస్ట్ పాపులర్ ఫిలిం (హోల్సమ్ ఎంటర్టైన్మెంట్) - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానిఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్ఉత్తమ పంజాబీ చిత్రం - గొడ్డే గొడ్డే చాఉత్తమ మరాఠి చిత్రం - శ్యాంచీ ఆయ్ఉత్తమ మలయాళ చిత్రం - ఉల్లొళుఉత్తమ కన్నడ చిత్రం - కందిలుఉత్తమ హిందీ చిత్రం: కాథల్ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్ఉత్తమ ఒడియా చిత్రం- పుష్కరఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్ఉత్తమ అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982స్పెషల్ మెన్షన్యానిమల్ (రీరికార్డింగ్ మిక్సర్) - ఎమ్ఆర్ రాజకృష్ణన్నాన్ ఫీచర్ ఫిలిం విజేతల జాబితాబెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ) బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)బెస్ట్ స్క్రిప్ట్: సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) - కథారచయిత- చిదానంద నాయక్బెస్ట్ వాయిస్ ఓవర్: ద సేక్రడ్ జాక్: ఎక్స్ప్లోరింగ్ ద ట్రీ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్) - (వాయిస్ ఓవర్: హరికృష్ణన్ ఎస్)బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిలిం -హిందీ)బెస్ట్ ఎడిటింగ్: నీలాద్రి రాయ్ (మూవింగ్ ఫోకస్)బెస్ట్ సౌండ్ డిజైన్: శుభరుణ్ సేన్గుప్తా (దుండగిరి కె పూల్)బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ చిత్రం) - శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్బెస్ట్ ఫిలిం క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామీస్)బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)ఉత్తమ షార్ట్ ఫిలిం: గిద్ ద స్కావెంజర్బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం (సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్): ద సైలెంట్ ఎపిడమిక్ (హిందీ)బెస్ట్ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యుమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిలిం: టైమ్లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్ రికన్స్ట్రక్షన్ ఫిలిం: మా బో, మా గాన్ (ఒడియా చిత్రం), లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ద ఈస్టర్న్ హారిజన్ (ఇంగ్లీష్ చిత్రం)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శిల్పిక బోర్డొలాయ్ (మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ- మిజోరాం చిత్రం)స్పెషల్ మెన్షన్1. నేకల్: క్రోనికల్ ఆఫ్ ద పాడీ మ్యాన్ (మలయాళం)2. ద సీ అండ్ సెవన్ విలేజెస్ (ఒడియా)చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
గర్భంతో ఉండగా అలా ఎలా చేశావ్?: లావణ్య త్రిపాఠి సోదరి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతోంది. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్డే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కి కాస్త గ్యాప్ తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఓకే చెప్పిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. గతేడాది డిసెంబర్లో లావణ్య ఈ సినిమాలో భాగమైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. మే నెలలో చిత్రీకరణ వేగవంతం చేశారు. మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా కానిచ్చేశారు. గర్వంగా ఉందిమొత్తానికీ సినిమాను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల క్రితమే సతీలీలావతి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా వరకు సినిమా షూటింగ్లో పాల్గొందట లావణ్య. ఈ విషయాన్ని లావణ్య అక్క శివాని త్రిపాఠి వెల్లడించింది. సతీలీలావతి టీజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లావణ్య, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ ట్రిమిస్టర్ (ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు) మొత్తం పని చేస్తూనే ఉన్నావు, అలా ఎలా చేయగలిగావు? ప్రతిసారిలాగే ఈసారి కూడా టాలెంట్తో చంపేశావు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు లావణ్య థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.ప్రేమ పెళ్లివరుణ్ తేజ్, లావణ్య 'మిస్టర్' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వివాహం జరగ్గా, హైదరాబాద్ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో.. లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లు చేసింది. చదవండి: ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే? -
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే?
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha Movie). జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిజానికి ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. కానీ మౌత్ టాక్ బాగుండటంతో ఏరోజుకారోజు వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలుచోట్ల థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే నరసింహ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు హోంబలే ఫిలింస్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.నరసింహస్వామి కథపురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద- నరసింహస్వామి కథే మహావతార్: నరసింహ. ఈ యానిమేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించాడు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.విష్ణు దశావతరాలుహోంబలే ఫిలింస్.. క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్లో సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ యూనివర్స్లో వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. రాబోయే సినిమాలు..ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో నరసింహ (ఆల్రెడీ రిలీజైంది), 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలను విడుదల చేస్తామని హోంబలే గతంలో వెల్లడించింది. 53 CRORES India GBOC and counting… 💥The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc— Hombale Films (@hombalefilms) August 1, 2025చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్
బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్ బిగ్బాస్ షోతో పాపులర్ అయింది. ఉయ్యాలా జంపాలా సీరియల్తో నటనవైపు అడుగులు వేసిన సిరి.. సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్లో నటించి ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా, పులి మేక వంటి వెబ్ సిరీస్లతో ఫుల్ పాపులర్ అయింది. తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చీరలో అందంగా సిరిఆ మధ్య వచ్చిన షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రంలోనూ చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా ఈ బిగ్బాస్ బ్యూటీ ప్రియుడు, నటుడు శ్రీహాన్తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీహాన్ పంచెకట్టులో ఉండగా సిరి చీరలో అందంగా ముస్తాబైంది. ఇది చూసిన కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. అందుకే పెళ్లి ఆలస్యం?కాగా సిరి, శ్రీహాన్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సిరి-శ్రీహాన్ పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పట్టించుకోనట్లే ఉంటున్నారు. దానికింకా టైముంది అన్నట్లుగానే ఓ ఎక్స్ప్రెషన్ పడేస్తున్నారు. అయితే ఓ సందర్భంలో సిరి మాట్లాడుతూ.. చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) చదవండి: వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి -
కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. కింగ్డమ్.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.హిట్టు కొట్టినంఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ను రౌడీ హీరో షేర్ చేస్తూ మనం (హిట్) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..! ఇకపోతే కింగ్డమ్ వీకెండ్లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైగర్ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.ఆ సినిమాలతోనే పోటీఅయితే ఈ చిత్రానికి.. మహావతార్ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్ ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి! కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, వెంకటేశ్, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. BOOM 💥🔥Manam Kottinam 🤗❤️ https://t.co/FOqpt7dxjK— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2025చదవండి: రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్ -
'మదరాసి' ఫస్ట్ సాంగ్.. అనిరుధ్ మ్యాజిక్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'మదరాసి'(Madharaasi ). ఇందులో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్లో విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా ఉన్న ఈ సాంగ్ను సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఆలపించారు. అయితే తెలుగు వర్షన్ను ధనుంజయ్ సీపాన ఆలపించారు. -
ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్ సెట్ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్కు తీసుకురావలనే ప్లాన్లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. -
మృణాల్ ఠాకూర్ బర్త్డే స్పెషల్.. రెమ్యునరేషన్తో తెలివైన నిర్ణయం (ఫోటోలు)
-
పొంగల్ బరిలో ప్రభాస్
-
రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్
నటుడు అజిత్ ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం మినహా అన్నీ విజయం సాధించాయి. తాజాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం కారు రేస్పై దృష్టి సారిస్తున్న అజిత్ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఈ హిట్ కాంబినేషన్ రూపొందనున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రానికి అజిత్ పారితోషికమే తీసుకోకుండా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అలాగని ఫ్రీగా నటించడం లేదు.. అజిత్, నిర్మాత రాహుల్ ఒక డీల్ చేసుకున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ డీల్ ఏమిటంటే చిత్రం విడుదలైన తరువాత ఓటీటీ, డిజిటల్ హక్కులను అజిత్కు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అజిత్ ఇప్పటివరకు ఒక్కో చిత్రానికి రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇంతకుముందు వరకు కొంత పారితోషికంతో పాటు ఒకటి రెండు ఏరియాల హక్కులను కోరే హీరోలు ఇకపై అజిత్లా ఓటీటీ, డిజిటల్ హక్కులు కోరతారేమో. -
నటిపై తండ్రే సంచలన కామెంట్.. పోలీసులకు ఫిర్యాదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ పేరు కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తనపై తండ్రే ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ప్రిజం పబ్ యాజమాన్యం ఆమెపై కేసు పెట్టింది. బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. అయితే, అదంతా అబద్దం అంటూ ఆమె వివరణ ఇచ్చింది. రీసెంట్గా హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్కు వెళ్లిన కల్పిక అక్కడ కూడా గొడవ చేసింది. సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని అతనిపై ఫైర్ అయింది. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. దీంతో ఆమె మళ్లీ వివరణ ఇచ్చింది. ప్రశాంతత కోసం రిసార్ట్కు వెళ్లినా తనకు ఎలాంటి ప్రశాంతత దక్కలేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు. మంచి డాక్టర్ను చూసి మానసిక వైద్యం కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే, తాజాగా కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.కల్పిక కొంత కాలంగా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసిందన్నారు. దీంతో ఆమెను గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామన్నారు. అయితే, అక్కడ ఉండకుండా ఆమె తిరిగి వచ్చిందని చెప్పారు. వైద్యులు సూచించిన మెడిషన్స్ కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందన్నారు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు పడుతుందన్నారు. దయచేసి ఆమెను మళ్లీ రిహాబిలిటేషన్కు తరలించాలని పోలీసులను ఆయన కోరారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. -
‘హ్రీం’ మూవీ ప్రారంభోత్సవం..క్లాప్ కొట్టిన హీరో సందీప్కిషన్ (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్ 'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన '3BHK' సినిమా
సిద్ధార్థ్ హీరోగా నటించిన '3BHK' సినిమా సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్.. ఈ అంశం చుట్టూ 3BHK సినిమా ఉంటుంది. ఇందులో శరత్కుమార్, సిద్ధార్థ్ తండ్రికొడుకులుగా మెప్పించారు. దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తెలుగులో కాస్త నిరాశ పరిచినప్పటికీ కోలీవుడ్లో మంచి టాక్ తెచ్చుకుంది.'3BHK' సినిమా అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో నేడు (ఆగష్టు 1)న సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో ఈ వీకెండ్ కుటుంబంతో పాటు అందరూ చూడతగిన చిత్రమని చెప్పవచ్చు. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చినా.. ఫైనల్గా ఒక మంచి చిత్రాన్ని చూశామనే ఫీల్ కలుగుతుంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఖలేజా రికార్డ్స్ బద్దాలేనా? అతడు రీ-రిలీజ్
-
'వీరమల్లు' పోయింది.. నిధి అగర్వాల్కు మిగిలిన ఒకే ఒక్క ఆశ ఇదే
అంతన్న డింతన్నడే గంగరాజు తరహాలో కొన్ని చిత్రాల ప్రచారం జరుగుతుంది. అయితే ఆ చిత్రాలు విడుదలైన తరువాత అంచనాలు తలకిందులవుతాయి. ఆప్రభావం హీరోహీరోయిన్లు సహా యూనిట్ అంతటిపైనా పడుతుంది. దాని నుంచి బయట పడడానికి చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నటి నిధిఅగర్వాల్ పరిస్థితి అలాగే తయారైంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఏ ఒక్కటి ఆశించిన విజయాన్ని అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. అలా ఇక్కడ రవిమోహన్కు జంటగా భూమి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కోలీవుడ్లో ఒక రౌండ్ కొట్టవచ్చుననే అందరూ అనుకున్నారు. అయితే ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అవడంతో పెద్దగా నిధి అగర్వాల్కు ప్లస్ కాలేదు. ఆ తరువాత శింబుకు జంటగా ఈశ్వరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో శింబుతో ప్రేమ అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అదే సమయంలో ఈశ్వరన్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ సరసన ఒక చిత్రం చేశారు. అయినప్పటికీ నిధికి సరైన బ్రేక్ రాలేదు. ఆ తరువాత తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఈ సారి సక్సెస్ గ్యారంటీ అని ఈ అమ్మడు సంతోషపడి ఉండవచ్చు. అయితే ఈ చిత్రం విడుదల కోసం ఐదేళ్లు చూశారు. ఈ చిత్రం ఫలితం నిధి అగర్వాల్కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమెకు ఓకే ఒక్క ఆశ రాజాసాబ్. ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో నిధి అగర్వాల్ మళ్లీ అవకాశాల కోసం పోరాటం మొదలు పెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
సినీ కార్మికుల వేతనాల పెంపు.. గడువు కోరిన ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి గడువు కోరింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ను కలిసిన ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు రెండు రోజులు గడువు కోరారు. ఈ విషయాన్ని సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులకు కార్మిక శాఖ కమిషనర్ తెలిపారు.ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ ప్రతినిధులతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ కమిషనర్ వెల్లడించారు. అంత వరకు షూటింగ్స్ ఆపవద్దని ఫెడరేషన్ ప్రతినిధులను కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాలతో చర్చల ద్వారా కార్మికుల వేతనాల సమస్య ఓ కొలొక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
'ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు'.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూఎస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కింగ్డమ్ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు. మీ సపోర్ట్తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా... మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు. మా మేనేజర్ అనురాగ్ సైతం ఏడ్చేశారు. ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది. నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా.. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది అన్నారు. యూఎస్ ఫ్యాన్స్ను తప్పకుండా కలుస్తా.. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. -
మరోసారి రాజ్ నిడిమోరుతో సామ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్టాపిక్గా మారింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గానే ఉంటోన్న సామ్.. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా మెలగడమే. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన వీరిద్దరు మరోసారి కెమెరాలకు చిక్కారు.సామ్- రాజ్ నిడిమోరు ఓకే కారులో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో మరోసారి ఈ జంట గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ తమపై వస్తున్న వార్తలపై ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఏదో ఒక సందర్భంలో వీరిద్దరు ఓకే వేదికపై తరచుగా కనిపిస్తూనే ఉన్నారు.ఈ వీడియో చూస్తుంటే ఇద్దరు కలిసి ఓ రెస్టారంట్కు డిన్నర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్లో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్తో పరిచయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
బాణామతి బ్యాక్డ్రాప్లో 'చేతబడి' సినిమా
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్పై నంద కిషోర్ నిర్మిస్తున్న సినిమా 'చేతబడి'. కొత్త దర్శకుడు సూర్యాస్ ఈ మూవీని నిజజీవిత సంఘటనల ఆఘారంగా తెరకెక్కించారు. తాజాగా లుక్ రిలీజ్ చేయడంతో పాటు చిత్ర విశేషాలని దర్శకుడు మీడియాతో పంచుకున్నాడు.చేతబడి.. 16వ శతాబ్దంలో మన దేశంలో పుట్టింది. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలగం ఉండాలి. కానీ ఒక చెడు శక్తితో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన శరీరంలో ప్రతిదానికి ఓ ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుందని సూర్యాస్ తెలిపాడు.1953 గిరిడ అనే గ్రామంలో యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఈ కథని సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నామని దర్శకుడు సూర్యాస్ చెప్పుకొచ్చాడు. -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ నెట్వర్క్. ఈ సిరీస్కు సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న ఈ వెబ్ సిరీస్ను ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి. -
నాతో ఒక్క సినిమా చేయమని డైరెక్టర్ను రిక్వెస్ట్ చేశా: సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) విరూపాక్ష, బ్రో చిత్రాల తర్వాత గతేడాది మరో మూవీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీతోనే మెగా హీరో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాం సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కనపెడితే సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. మయసభ పేరుతో వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ఒక సినిమా చేయాలని మయసభ డైరెక్టర్ దేవా కట్టను రిక్వెస్ట్ చేశానని మెగా హీరో అన్నారు. తన బ్యాడ్ టైమ్లో నాతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవాకట్టా మాత్రమేనని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'దాదాపు 10 ఏళ్ల క్రితమే నా జర్నీ దేవాకట్టాతో స్టార్ట్ అయింది. మేమిద్దరం జిమ్లో కలిసేవాళ్లం. సార్ నాతో ఒక సినిమా చేయండని రిక్వెస్ట్ చేసేవాడిని. అలా చేస్తే చివరికీ రిపబ్లిక్ మూవీతో జతకట్టాం. నా బ్యాడ్ టైమ్లో నాకు వెలుగునిచ్చిన వ్యక్తి దేవాగారు. రిపబ్లిక్ సినిమా టైమ్లో నేను ఏదైతే క్లైమాక్స్ కోరుకున్నానో అదే ముందుకు తీసుకెళ్లారు దేవా కట్టా' అని తెలిపారు.కాగా.. దేవా కట్ట డైరెక్షన్లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది.A friendship tested by ambition.A rivalry that redefined leadership.A story that changed the fate of a state.#Mayasabha Trailer out now.#Mayasabha – A gripping political saga – Starts streaming from August 7th on @sonyliv@devakatta @AadhiOfficial @IamChaitanyarao pic.twitter.com/ZKMWVxqpei— Sony LIV (@SonyLIV) July 31, 2025 -
ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం
టాలీవుడ్లో మరో విషాదం. కొన్నిరోజుల క్రితమే అనారోగ్య సమస్యలతో నటుడు ఫిష్ వెంకట్ చనిపోయారు. ఇప్పుడు విలనీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తోటి నటీనటులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇంతకీ ఏమైంది? ఎవరీ నటుడు?(ఇదీ చదవండి: బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)పలు తెలుగు సినిమాల్లో విలన్ సహాయకుడిగా చేసిన భాను అలియాస్ బోరబండ భాను రీసెంట్గా ఓ స్నేహితుడు పిలవడంతో గండికోట వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేశాడు. అంతా పూర్తయిన కాసేపటికే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో వీళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే భాను చనిపోయాడు.భానుని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భాను చేసే పాత్రలు విలనీ తరహాలో ఉన్నప్పటికీ ఆయన నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటాడని, అందరితో కలిసిపోతాడని సహ నటీనటులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే భాను మృతి పట్లు ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి) -
ప్రముఖ సింగర్పై వైద్యురాలి ఫిర్యాదు.. ఇన్స్టాతో పరిచయం ఆపై..
మలయాళంలో ప్రముఖ ర్యాపర్ వేదన్ (Vedan)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ వైద్యురాలి ఫిర్యాదు మేరకు తాజాగా కేసు నమోదుచేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2021 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు వివిధ ప్రదేశాలలో తనను లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు వేదన్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పింది. త్రిక్కకర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో మాదకద్రవ్యాల కేసులో వేదన్ అరెస్టు అయి, బెయిల్పై విడుదలయిన విషయం తెలిసిందే. అతని అపార్ట్మెంట్లో గంజాయి, రూ.9 లక్షల నగదును గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై చిరుత దంతాలతో తయారైన గొలుసు కూడా అతని వద్ద ఉండటంతో అటవీ శాఖ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఇన్ని కేసులు ఉండగా ఒక వైద్యురాలు అతని ట్రాప్లో ఎలా చిక్కుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2019లో “Voice of the Voiceless” అనే ఆల్బమ్తో కేరళలో బాగా ప్రాచుర్యం పొందాడు. సామాజిక అంశాలపై గళమెత్తిన వ్యక్తిగా గుర్తింపు పొందిన అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రివ్యూ.. హిట్టా..! ఫట్టా..!
-
చీరకట్టులో చక్కనమ్మ..సంక్రాంతి భామ ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
లీగల్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్ రిలీజ్పై ప్రకటన
కోలీవుడ్లో ఓటీటీ వేదికగా విడుదలైన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్పై పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జీ5 తమిళ్లో జులై 18న విడుదలై దూసుకెళ్తుంది. ఇందులో శరవణన్, నమ్రితా ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు.ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్ ఆగష్టు 1న తెలుగులో విడుదల కానుంది. జీ5 వేదికగా తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సిరీస్ సుందరమూర్తి (శరవణన్) అనే ఓ లాయర్ చుట్టూ తిరుగుతుంది. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది ఒక సామాన్యుడి ధైర్యాన్ని, న్యాయాన్ని సాధించేందుకు చేసే పోరాటాన్ని చూపించే కథగా రూపొందించబడింది. శక్తివంతమైన కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్గా నిలుస్తుందని చాలామంది రివ్యూలు ఇచ్చారు.A battle, a long lost hope for justiceWatch #SattamumNeedhiyum – Premieres on 1st August Produced by: 18 CreatorsPrabha & Sasikala#Saravanan @namritha_mv @balajiselvaraj @soori_prathap@vibinbaskar @RamDasa2 @BhavnaGovardan@mariamila1930 @harihmusiq @srini_selvaraj pic.twitter.com/leCiC7erZG— ZEE5 Telugu (@ZEE5Telugu) July 30, 2025 -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ HD స్టిల్స్
-
హాలీవుడ్ రేంజ్ లో సుకుమార్, రామ్ చరణ్ మూవీ..!
-
క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi)పై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్మీడియలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా స్పందించారు. తను నటించిన కొత్త సినిమా 'సార్ మేడమ్' విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్(CASTING COUCH) ఆరోపణల గురించి ఆయన్ను ప్రశ్నించగా రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఆమెపై సైబర్క్రైమ్లో తన టీమ్ పిర్యాదు చేసిందని చెప్పారు.తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్ ఆరోపణల గురించి విజయ్ ఇలా అన్నాడు.. 'చిత్రపరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవు. కానీ, ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారు. ఇలాంటి మాటలు ఇక్కడ సహజం. వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరాను. సోషల్మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థం అవుతుంది. ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుంది. ఆపై పేరు వస్తుంది. ఆమె దానిని ఆస్వాదించనివ్వండి.' అంటూ విజయ్ చెప్పారు.తనపై ఆరోపణలు చేసిన మహిళపై తన టీమ్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిందన్నారు. తాను ఏడు సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అలాంటివి తన లక్ష్యం మీద ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని బలంగా చెప్పారు.విజయ్పై వచ్చిన ఆరోపణ ఇదేకోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి (జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఇలా ఆరోపించింది. ‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. విజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. మళ్లీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది. -
'కింగ్డమ్' ట్విటర్ రివ్యూ.. అనకొండలా తిరిగొచ్చిన విజయ్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కింగ్డమ్' థియేటర్స్లోకి వచ్చేసింది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఓవర్సీస్లలో సినిమా పూర్తి అయింది. దీంతో వారు ట్విటర్ వంటి సోషల్మీడియాలలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సరైన విజయం కోసం విజయ్ దేవరకొండ కొంతకాలంగా ఎదురుచూస్తున్న క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకుడితో సినిమా ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్గా నటించగా సత్యదేవ్ కీలకపాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్దే వరకొండ అన్నదమ్ముల పాత్రల్లో కనిపించారు. వారి బంధం ఎలా ఉందో నెటిజన్లు సోషల్మీడియాలో పంచుకున్నారు.కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఒక అనకొండలా తిరిగొచ్చాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక ఎమోషనల్ బ్లాక్బస్టర్ అంటూ.. అన్నదమ్ముల అనుబంధం గురించి అద్భుతంగా చూపించారని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, సత్య దేవ్ తమ నటనతో అదరగొట్టారని అంటున్నారు. ఈ సినిమా కోసం అనిరుధ్ సంగీతంతో ఫుల్ డ్యూటీ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన స్టోరీ లైన్తో తెరకెక్కిన ఈ చిత్రంలో అత్యుత్తమ నటన కనబరిచారని విజయ్ని అభినందిస్తున్నారు. టైర్-1 హీరోల లిస్ట్లోకి తెలంగాణోడు వచ్చేశాడని పేర్కొన్నారు.‘కింగ్డమ్’ టైటిల్ కార్డ్ నుంచే మెప్పించేలా ఉందని ఫ్యాన్స్తో పాటు కామన్ ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. సినిమా ప్రారంభం కావడమే సీన్తో ఉంటుందని, ఆపై కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. కథ విషయంలో ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా ఖచ్చితమైన స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచిందన్నారు. మెత్తం మీద సినిమా బ్లాక్బస్టర్ అంటూ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందని ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి.ఫస్టాప్ ఎంత బలంగా ఉందో సెకండాఫ్ కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉందని ఎక్కువ రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని జైలు సీన్స్తో పాటు బోట్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన బలమంటున్నారు. బక్కోడు ఫుల్ డ్యూటీ చేశాడంటూ అనిరుధ్ బీజీఎమ్తో ప్రతి సీన్ను భారీగా ఎలివేట్ చేశాడని చెప్పుకుంటున్నారు.ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే కానీ,..కింగ్డమ్లో ఎక్కువ పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. అయితే, కొందరు మాత్రం కేజీఎఫ్, పుష్ప, బాహుబలి వంటి సీన్స్ కింగ్డమ్లో గుర్తుకుచేస్తాయని చెబుతున్నారు. ఫస్టాప్లో చాలా బలంగా ఉందని అందుకు తగ్గట్టుగా సెకండాఫ్ లేదని మరికొందరు అంటున్నారు. క్లైమాక్స్ కాస్త నిరూత్సాహపరిచాడని కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా పెద్దగా భావోద్వేగ సీన్స్ మెప్పించలేకపోయాయని కొందరు అంటున్నారు.#Kingdom 1st half opens to positive reviews 🥳🥳🎉🎉🎉Everyone’s praising #Anirudh’s musical work 🥁🥁#GowthamTinnauri strikes again 😳💥#VijayDeverakonda MASISVE COMEBACK loading… 🔥🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse… pic.twitter.com/tKfqJ5FNSO— Movies Singapore (@MoviesSingapore) July 30, 2025#Kingdom ⭐⭐⭐½/5!!First half Nice👍👍👍@anirudhofficial BGM💥💥💥💥🔥🔥🔥🔥🔥@TheDeverakonda 🔥🤯🔥🔥🤯💯 Interval 👍👍👍2nd half Good 💥 #KingdomOnJuly31st #VijayDeverakomda pic.twitter.com/0noDRo8tRu— its cinema (@itsciiinema) July 30, 2025#Kingdom Blockbuster🔥🔥@TheDeverakonda Anna Ni performance Excellent specially in emotional scenes 🔥E movie chusina taruvata andaru Vijay Anna performance gurunchi matladutaru . Gowtham style of Movie. Particular ga e movie ki Emotional carry chestava Leda anukuna but… pic.twitter.com/vjsURcqU5k— urstruly karthik (@CultMBFan2) July 30, 2025#Kingdom is an action drama that is technically very strong and works well on the drama front, though it falters somewhat in terms of emotional depth.Director Gowtham Tinnanuri succeeds in building a properly engaging narrative in the first half. Although the narration feels…— Venky Reviews (@venkyreviews) July 30, 2025#Kingdom - JAIL AND BOAT SEQUENCE - going to be a TALK OF THE TOWN Tomorrow #VijayDeveraKonda on DUTY. pic.twitter.com/AmfDO5AfjD— GetsCinema (@GetsCinema) July 30, 2025Tier 1 loki Telanganodu 💥😎#Kingdom #VijayDeverakonda pic.twitter.com/cV6EIDbbxM— Mahi Gadu (@mahi_gaduu) July 30, 2025The world of Kingdom next level stuff, unmatched since KGF! This is the kind of script we’ve been waiting for @TheDeverakonda and @anirudhofficial You truly belong to a different league. #Kingdom a pure adrenaline rush.A massive blockbuster @vamsi84 annapic.twitter.com/HNh8W64SL8— Vasu (@AllHailNTR) July 30, 2025Motham Thagalabadipoindhi 🔥#Kingdom USA premieres erupted with a massive wave of love and it’s a solid BLOCKBUSTER verdict with packed housefuls ❤️🔥❤️🔥North America Release by @ShlokaEnts@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse… pic.twitter.com/5KCTGHn3Zj— Ramesh Bala (@rameshlaus) July 31, 2025Good Movie - 3.5 /5 @TheDeverakonda was terrific as SURI with total screen presence 🔥Anirudh’s music is on another level & feels like he is the another hero.Ragile Ragile 🌋 Movie Content🌋 Top-notch production values - Worth the watch.#Kingdom pic.twitter.com/wxQV3QWEpH— 𝐌α𝐯𝐞𝐫𝐢𝐜𝐤 𝐑𝐞𝐝𝐝𝐲 (@IdedhoBagundhey) July 30, 2025#Kingdom - Watch out for this sequence in the poster. Vijay Deverakonda’s acting, Gowtham’s dialogue writing skills and Anirudh’s score complemented each other so well🔥🔥 pic.twitter.com/RliCqwqaWN— Gulte (@GulteOfficial) July 30, 2025#KingdomReview for premier's -4/5Peak Performance Of King 👑 @TheDeverakonda and mind-blowing BGM @anirudhofficial Second half boat scene high 💥Hit kottesav @TheDeverakonda#Kingdom pic.twitter.com/5EwbBUJD47— வம்சி 🦁 (@vamsireddi_07) July 30, 2025 -
హీరోయిన్లకు 'సీత' కష్టాలు
సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం.. సీతలోని సుగుణాలు నేటి మహిళలకు ఎంతో ఆదర్శమని చెప్పవచ్చు. దయ.. ధైర్యం.. ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత.. మన సీతమ్మ తల్లి! అయితే, సినీ రంగంలో ఆమె పాత్రను ఎవరు పోషించినా ఆ నటిపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. వారు ట్రోలింగ్తో పలు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ మధ్య శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటి నయనతార నటించడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. సాంగీక చిత్రాల్లో అందాలను విచ్చల విడిగా ఆరబోసిన ఈమె ఏంటీ సీతాదేవిగా నటించడమని విమర్శించారు. అయితే ఆ చిత్రం విడుదలయిన తరువాత సీతగా నయనతార ఒదిగిపోయారు అనే ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా బాలీవుడ్ భామ కృతీసనన్ నటించినప్పుడూ ఆమె గురించి ట్రోలింగ్ చేశారు. ఆ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఆ విమర్శల్లో అర్థం ఉందనుకుందాం. కానీ, ఇప్పుడు నటి సాయిపల్లవిపై కూడా విమర్శలు చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సహజత్వానికి ప్రాముఖ్యత నిస్తున్న నటి సాయిపల్లవి. పెదాలకు లిప్స్టిక్ వేసుకోవడానికి కూడా వద్దనే చెప్పే నటి ఈమె. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ప్రాణం పెట్టి నటించే సాయిపల్లవి బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్కు గురౌతున్నారనిపిస్తోంది. రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటి సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. సీతాదేవిగా ఆమె నటించడం రామాయణం కావ్యాన్నే అవమానపరిచినట్లు అని బాలీవుడ్లో విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఆ చిత్రంలో శూర్పణక పాత్రలో నటిస్తున్న రకుల్ప్రీత్ సింగ్తో కలిసి నటి సాయిపల్లవిపైనా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, యష్ రావణాసురుడిగా నటించిన కొన్ని సన్నివేశాలు విడుదలయిన తరువాత ట్రోలింగ్స్ అధికం అవుతున్నాయి. అయితే ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా నటి సాయిపల్లవి తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కారణం చిత్రం విడుదలైన తరువాత తన నటనే అలాంటి వారికి సమాధానం చెబుతుందనే ఆమె ధైర్యం కావచ్చు. -
'ఇంత బతుకు బతికి'.. బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ!
బిగ్బాస్ ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. జీవితంలో ఒక్కసారైనా బిగ్బాస్ హౌస్కు వెళ్లాలన్న కల నేరవేర్చుకోవడమే కాదు.. ఏకంగా విన్నర్గా నిలిచాడు. రైతుబిడ్డగా హోస్లోకి ఎంట్రీ ఇచ్చి.. బిగ్బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు. జై జవాన్- జై కిసాన్ అంటూ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచాడు.అయితే బిగ్బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం ప్రశాంత్కు కొద్దిగంటల్లోనే ఆవిరైంది. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు హంగామా సృష్టించారు. దీంతో బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పల్లవి ప్రశాంత్ ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఇంత బతుకు బతికి.. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని ఏడ్చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉంటది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
కింగ్డమ్లో ఎవరా స్టార్ హీరో?.. విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, నాగవంశీ సమాధానాలిచ్చారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కింగ్డమ్ ట్రైలర్ చివర్లో ఓ కెమియో రోల్ను చూపించారు. ఆ రోల్లో ఉన్నది స్టార్ హీరోనా? అని అడిగారు. ఇది మీరు థియేటర్లోనే చూడాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే మీరు ఊహించినట్లే పెద్ద హీరోనే ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానులు ఇంతకీ ఎవరా హీరో అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.కాగా.. కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. Who Is That Big Hero? pic.twitter.com/w5M7x0SKMH July 30, 2025 -
ఎవరికోసమో మారను.. నన్ను ఎవరూ వెలేత్తి చూపొద్దు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత కింగ్డమ్పై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉండడంతో తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తానెప్పుడు ఎవరికోసమే మారనని.. ఎవరికీ భయపడనని అన్నారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నేనేప్పుడు లోపల ఏది అనిపిస్తే అదే మాట్లాడతా.. కెరీర్ ప్రారంభంలో అగ్రెసివ్గా ఉన్నా. అప్పుడు నాలో డిఫెన్స్ మెకానిజంతో ఉండేవాన్ని. ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి. అందుకే కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. మనం సినిమాల్లోనూ చూస్తుంటాం కదా.. హీరో ముందుగా పవర్ఫుల్గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్ అయిపోతాడు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుతూ..'ఇప్పుడు నా అభిమానుల ప్రేమతో నేను కూడా సాఫ్ట్ అయిపోయా. ఇప్పుడైతే నాకేలాంటి ఫియర్ లేదు. మొదట్లో నాకు కొద్దిగా భయముండేది. ఇప్పుడైతే అలాంటిదేం లేదు. నా చుట్టూ ఉండే వాతావరణం వల్లే అలాంటి ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆడియన్స్ లవ్ వల్ల ఫియర్ పోయి ప్రశాంతంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ తెలిపారు. -
పృథ్వీరాజ్ సుకుమారన్ సతీమణికి వేధింపులు
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సతీమణి, నిర్మాత సుప్రియ మేనన్ వేధింపులకు గురౌతున్నట్లు పేర్కొన్నారు. ఏడేళ్లుగా తనను ఒక మహిళ వేధిస్తున్నట్లు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసుకొని తనను టార్గెట్ చేస్తూ నిత్యం అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నట్లు సుప్రియ తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వేధింపుల గురించి సుప్రియ మీనన్ ఇలా చెప్పారు. '2018 నుంచి ఆన్లైన్ ట్రోల్స్, వేధింపులను ఎదుర్కొంటున్నాను. నన్ను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్లో చాలా ఖాతాలను క్రియేట్ చేసుకున్న ఒక మహిళ పదేపదే నన్ను ట్యాగ్ చేస్తూ వేధిస్తుంది. ఆమె పేరు క్రిస్టినాల్డో. ఆమె నా గురించి చేసిన ప్రతి పోస్టు చాలా అసహ్యకరమైన రీతిలో ఉంటుంది. ఆమె ఖాతను నేను పదేపదే బ్లాక్ చేస్తున్నప్పటికీ మరో కొత్త నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంది. ఆమె ఎవరనేది నాకు చాలా సంవత్సరాల క్రితమే తెలిసింది. కానీ ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు కాబట్టి వదిలేశాను. ఇదే అదునుగా తీసుకున్న ఆమె నాపై విషం చిమ్ముతూనే ఉంది. చివరకు మరణించిన నా తండ్రిని లక్ష్యంగా చేసుకుని నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించింది. అందుకే ఆమె గురించి బయటకు చెప్పాల్సి వచ్చింది.' అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె ఒక నర్సు అని తెలుస్తోంది. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సుప్రియ ఉన్నట్లు సమాచారం.సుప్రియా మేనన్ ఒకప్పుడు ఆమె జర్నలిస్టుగా పనిచేసేవారు. పృథ్వీరాజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే, తన సతీమణి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చాలాసార్లు పృథ్వీరాజ్ చెప్పారు. వీరికో పాప (అలంకృతా మేనన్) ఉంది. పృథ్వీరాజ్ తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ ఇలా అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే.. అందుకే మలయాళంలో వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. -
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు ప్రకాష్రాజ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేస్లో ఈడీ అధికారుల విచారణకు సినీ నటుడు ప్రకాష్రాజ్ హజరయ్యారు. ఈ యాప్స్ ప్రమోషన్స్లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు నటుడు ప్రకాష్రాజ్ వెళ్లారు. -
దేశంలో సంచలనం సృష్టించిన కేసుపై సినిమా ప్రకటన
మేఘాలయ హనీమూన్ మర్డర్పై సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు గురించి త్వరలో వెండితెరపై చూపించనున్నారు. ఈ మేరకు 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో సినిమా తీస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ప్రకటించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన అనుమతులు కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నామని ఆయన తెలిపారు.తన సోదరుడి మృతి గురించి సినిమా తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సచిన్ పేర్కొన్నారు. ఇందులో తప్పు ఎవరది అనేది ప్రపంచం తెలుసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు చేసేందుకు మరోకరు ముందుకు రాకూడదనే ఆలోచనతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యమని దర్శకుడు నింబావత్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ఇండోర్, మేఘాలయలోనే సినిమా అంతా తెరకెక్కిస్తామన్నారు.మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఏంటి..?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్తను హత్య చేసింది. రఘువంశీ మరణం తర్వాత ఆమె ప్రియుడు ఏమీ తెలియనట్లుగా అంత్యక్రియలకు వెళ్లి మృతుడి తండ్రిని ఓదార్చాడు. -
'పాయల్ రాజ్పుత్' ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్' (67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన జులై 28న మరణించారు. అయితే, కాస్త ఆలస్యంగా ఆ విషయాన్ని పాయల్ తన సోషల్మీడియా ద్వారా తెలిపింది. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారని ఇదే ఏడాదిలో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. తండ్రి మరణంపై ఆమె చాలా ఎమోషనల్ అయింది. క్యాన్సర్తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆమె పేర్కొంది. క్షమించండి నాన్న అంటూ పాయల్ ఒక పోస్ట్ చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.పాయల్ రాజ్పుత్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్పుత్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మెసేజ్లు పెడుతున్నారు. హీరోయిన్ లక్ష్మిరాయ్, నిర్మాత ఎస్కేఎన్ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్ట్లు పెట్టారు. ఇలాంటి సమయంలో మరింత బలంగా ఉండాలని కోరారు.పాయల్ రాజ్పుత్ ‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెంకటలచ్చిమి" అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
నిధి అగర్వాల్.. విచిత్రమైన కండీషన్ (ఫొటోలు)
-
నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇషా కోపికర్ తెలుగులో చంద్రలేఖ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి ఆశ్చర్యపరిచేలా పలు వ్యాఖ్చలు చేసింది. 1998లో వారిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమా ఒక సంచలనం. ఇందులో లేఖ పాత్రలో ఇష కొప్పికర్ నటించింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను తాజాగా ఆమె పంచుకుంది.'నాగార్జున గురించి ఈ విషయం చెబితే ఆయన అభిమానులు ఎవరూ నమ్మరు. చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో నన్ను నాగార్జున చాలాసార్లు చెంపదెబ్బ కొట్టాడు. తెలుగులో ఈ సినిమా రెండోది. ఇందులో నన్ను నాగార్జున కొట్టే సీన్ ఒకటుంది. కానీ, ఆయన నా చెంప మీద మెల్లిగా కొట్టడంతో ఆ సీన్ సరిగ్గా రాలేదు. షూటింగ్ సమయంలో సీన్ కరెక్ట్గా రాకపోతే నాకు నచ్చదు. దీంతో నిజంగానే బలంగా కొట్టమని నేనే నాగార్జునను కోరాను. అందుకు ఆయన ఒప్పుకోలేదు. బలవంతం చేయడంతో ఆయన తప్పని పరిస్థితిలో కొట్టాడు. అయితే, ఆ సీన్కు అవసరమైన కోపాన్ని నేను చూపించలేకపోయాను. అవుట్పుట్ సరిగ్గా రాలేదు. సీన్ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో పలుమార్లు రీటేక్ తీసుకున్నాం. దీంతో నన్ను 14 సార్లు నాగార్జున చెంపదెబ్బ కొట్టారు.' అని ఆమె నవ్వుతూ చెప్పింది.'చెంపదెబ్బలు తిన్న తర్వాత నా మొఖం వాచిపోయింది. ఆయన చేతి గుర్తులు నా మొఖంపై చాలా సమయం పాటు ఉండిపోయాయి. ఆ సమయంలో నాగార్జున కూడా చాలా బాధపడ్డారు. వెంటనే వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. నేను వద్దని వారించాను. సీన్ కోసం నేను డిమాండ్ చేయడం వల్లనే కదా అలా చేశావ్..' అని ఆమె గుర్తుచేసుకుంది.చంద్రలేఖ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. ఇషా కోపికర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఏకంగా 80కి పైగా చిత్రాల్లో నటించింది. చివరిగా అయలాన్లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బీజేపీలో క్రియాశీలంగా ఆమె ఉంది. -
ఒక ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు..? ( ఫోటోలు )
-
కోలీవుడ్లో ఫుల్ బిజీగా మన తెలుగమ్మాయి
నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి. తెలుగు బిగ్బాస్ విన్నర్ అయిన బిందు మాధవి.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. కళగు, కేడీ బిల్లా కిలాడి రంగా, తమిళుక్కు ఎన్ ఒండ్రు అళిక్కవుమ్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం బ్లాక్ మెయిల్, యారుక్కుమ్ అంజాల్ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్ మెయిల్. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు. అలా దర్శకుడు ఎం మారన్ బ్లాక్మెయిల్ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు. -
'కింగ్డమ్ మూవీ.. నా లైఫ్లో ఫస్ట్ క్యారవాన్ సినిమా'
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కింగ్డమ్ మూవీ మేకర్స్ హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్కు హాజరైన కింగ్డమ్ నటుడు వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించడం తన అదృష్టమని అన్నారు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్యారవాన్ దొరికిన చిత్రం కింగ్డమ్ మాత్రమేనని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేశ్ కింగడమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వెంకటేశ్ మాట్లాడుతూ..'హలో హైదరాబాద్.. ఇలాంటి పెద్ద క్రౌడ్ను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైమ్. నాది కేరళ.. నాపేరు వెంకటేశ్.. మలయాళ ఇండస్ట్రీలో ఒక సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత చిన్నపాత్రలు, తమిళ సినిమాలో హీరో.. ఈరోజు కింగ్డమ్. ఈ రోజు క్షణాలకు నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈ జర్నీ పట్ల నాకు సంతోషంగా ఉంది. నాగవంశీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా లైఫ్లో క్యారవాన్ డోర్ దొరికిన మొదటి చిత్రం. ఇదే నాకు పెద్ద విషయం. మళ్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో పనిచేయాలి. భవిష్యత్తులో హీరోగా చేయాలి' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఆ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సంజయ్ దత్ బర్త్ డే కావడంతో స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. దక్షిణాది సినిమాలతో సంజయ్ దత్ బిజీగా ఉన్న సంజయ్ దత్.. బాలీవుడ్లోనూ 'బాఘి 4', 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్- 2' ఆగస్టు 1 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba - @DuttSanjay a very Happy Birthday 💥💥Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/PFgPzOnqea— The RajaSaab (@rajasaabmovie) July 29, 2025 -
సమంత క్రేజీ ఛాలెంజ్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్లలో చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. అంటే షూటింగ్స్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిరోజూ జిమ్కి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. గతంలో చాలాసార్లు జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. 100 కిలోలకు పైనే బరువులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్లో పాల్గొంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.'టేక్ 20 హెల్త్' పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్ చేస్తున్న సమంత.. ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా 'డెడ్ హ్యాంగ్' ఛాలెంజ్ పూర్తి చేసింది. అంటే 90 సెకన్ల పాటు ఓ రాడ్కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్లంతా దాన్ని పూర్తి చేశారు కూడా.(ఇదీ చదవండి: 'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!)'మీరు ఎలా కనిపిస్తున్నారనేది ముఖ్యం కాదు. మీ వారసత్వం ఏంటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేదే ముఖ్యం' అని సామ్ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ వీడియో సమంత లుక్ చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత బక్కగా అయిపోయిందేంటి అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ పరంగా సమంత చేతిలో కొత్త సినిమాలేం చేయట్లేదు. 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లైన్లో ఉంది గానీ ఇది ఆగిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్గా నిర్మాతగా చేసిన తొలి మూవీ 'శుభం' రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో నిర్మాత కమ్ హీరోయిన్ గా ఓ మూవీ మొదలుపెట్టనుందని, నందిని రెడ్డి దర్శకురాలు అని టాక్ నడుస్తోంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. అలానే దర్శకుడు రాజ్తో సమంత డేటింగ్లో ఉందనే పుకార్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by Take 20 (@take20health) -
ఆంధ్రా గో బ్యాక్.. ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాశం యాదగిరి గొడవకు దిగారు, ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చిన తెలంగాణ వాదులు.. ఛాంబర్లో సినారె ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. -
ఓటీటీలో 'సిద్ధార్థ్ ' సినిమా.. అఫీషియల్ ప్రకటన
సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా '3BHK' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్లో బాగా ఆకర్షించింది. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శరత్కుమార్, దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు నటించారు.థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్న '3 బీహెచ్కే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగష్టు 1 నుంచి సింప్లీ సౌత్(Simply South) ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. తమిళ్, తెలుగులో విడుదల కానుంది. కానీ, భారత్లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసే ఛాన్స్ లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికి మాత్రమే ఆ అవకాశం ఉంది. అయితే, అదేరోజున అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం భారత్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఆ తేదీన రాకుంటే.. ఆగష్టు 8న తప్పకుండా విడుదల కావచ్చని టాక్ ఉంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినా.. సినిమా అందరికీ నచ్చుతుంది. -
మరోసారి హంగామా చేసిన నటి కల్పిక
దాదాపు నెలరోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్లో అర్థరాత్రి నటి కల్పిక హంగామా చేసింది. ఈ విషయమై ఆమెపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి కల్పిక.. హైదరాబాద్ సమీపంలో మొయినాబాద్లో ఉన్న ఓ రిసార్ట్లో హడావుడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్కి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా వచ్చిన కల్పిక.. రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ తాళాల్ని మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం లాంటివి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా)అయితే తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని కల్పిక.. ఈ వివాదంపై స్పందించింది. ఓ వీడియోని కూడా రికార్డ్ చేసింది. రిసార్టులో సెల్ఫోన్ సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే తనతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడని చెప్పుకొచ్చింది. ఎంత నిదానంగా చెప్పినా వినకపోవడంతో, మేనేజర్తో గొడవకు దిగాల్సి వచ్చిందని చెప్పింది.గత కొన్నాళ్లుగా కల్పిక సరిగా సినిమాలు చేయడమే లేదు. అలాంటిది ఇప్పుడు వరస వివాదాల్లో నిలిచి ఈమె వార్తల్లో నిలిచింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే చేస్తుందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే త్వరలో ప్రారంభమయ్యే బిగ్బాస్ కొత్త సీజన్లో కల్పిక కూడా ఓ కంటెస్టెంట్గా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. అందుకేనా ఈ హడావుడి అంతా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్) -
శ్రీలంక ట్రిప్లో మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
అల్లు అరవింద్కు 'మహావతార్ నరసింహా' వరం
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' వంటి పెద్ద సినిమానే ఒక యానిమేషన్ సినిమా వెనక్కు నెట్టేసింది. కేవలం ఒక్కరోజు గ్యాప్లో వచ్చిన 'మహావతార్ నరసింహా' చిత్రం తెలుగులో దుమ్మురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ చిత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ చిత్రం ట్రెండ్ కనిపిస్తోంది. బుక్ మై షోలో ఏకంగా కేవలం తెలుగులోనే ప్రతి గంటకు పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ కొనుగోలు చేసింది నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జులై 25న తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.'మహావతార్ నరసింహా' చిత్రం మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలతో కలిపి రూ. 1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 22 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 31 కోట్లగా ఉండవచ్చని అంచనా.. అయితే, తెలుగులో 4రోజులకు గాను రూ. 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏకంగా వీరమల్లు చిత్రాన్ని తొలగించి 'మహావతార్ నరసింహా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పూర్తి రన్ అయ్యేసరికి తెలుగులోనే సుమారు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనా ఉంది. అల్లు అరవింద్ గతంలో కూడా కాంతార, 2018 వంటి చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు ‘మహావతార నరసింహ’తో ఆయన జాక్పాట్ కొట్టారని నెటిజన్లు చెబుతున్నారు. -
స్టన్నింగ్ ఫోజులతో యువరాణి 'నభా నటేష్' (ఫోటోలు)
-
రవితేజ థియేటర్ ప్రారంభం.. ఫస్ట్ సినిమా ఏదంటే..?
మాస్మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏషియన్ సినిమాస్ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్లో లగ్జరీ మల్టీఫ్లెక్స్ను ఆయన నిర్మించారు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా రవితేజ్ కూడా ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో మల్టీఫ్లెక్స్ను ఏర్పాటు చేశారు. జులై 31న ప్రారంభోత్సవం జరగనుంది.ART (ఏషియన్ రవితేజ) మల్టీఫ్లెక్స్లో తొలి సినిమా 'కింగ్డమ్' ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈస్ట్ హైదరాబాద్ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్గా ART నిలవనుంది. సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్.. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించే విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.రవితేజ థియేటర్లో 'కింగ్డమ్' తొలి సినిమా కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్లో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అర్జున్ చక్రవర్తి’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓటీటీలో హిట్ సినిమా.. ఎమోషనల్గా 'అక్కా-తమ్ముడి' అనుబంధం
కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన 'మామన్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 16న తమిళ్లో విడుదలైంది. అయితే, సమ్మర్ బ్లాక్బస్టర్ చిత్రంగా మామన్ నిలిచింది. ప్రతి కుటుంబంలో కనిపించే బాంధవ్యాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. మనందరి జీవితంలో మేనమామ బంధం గొప్పదని, అది తల్లి తర్వాతి స్థానమని ఈ చిత్రం ద్వారా వెల్లడించారు. స్వాసిక, ఐశ్వర్య లక్ష్మీ, రాజ్కిరణ్, రాజేంద్రన్ వంటి నటీనటులు నటించారు.మామన్ చిత్రం జీ5 తమిళ్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. రాఖీ పండుగ సందర్భంగా అగష్టు 8న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందరూ చూడొచ్చు. కానీ, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'అక్క తమ్ముడు' బంధాన్ని చాలా ఎమోషనల్గా ఈ చిత్రంలో చూపించారు. ఆపై అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంది. -
ఎన్టీఆర్ తర్వాత మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన రుక్మిణి
ఇతర భాషల్లో హిట్స్ అందుకుంటే వారికి కచ్చితంగా తమిళంలో అవకాశాలు వరిస్తాయి. అలా కోలీవుడ్లో మంచి అవకాశాలు అందుకుంటున్న కన్నడ నటి రుక్మిణి వసంత్. ఈ బెంగళూర్ బ్యూటీ 2019లో బీర్బల్ త్రిలోగీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత అప్స్టార్ట్స్ అనే హిందీ చిత్రంలో నటించారు. 2023లో నటించిన 'సప్త సాగరాలు దాటి' అనే చిత్రం రుక్మిణి వసంత్కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం పలు అవార్డులను సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్లోనూ నటించిన రుక్మిణి వసంత్కు తరువాత కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్కు జంటగా భైరతి రణంగళ్ అనే భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అలా అక్కడ స్టార్ హీరోయిగా పేరు తెచ్చుకున్న ఈ భామకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాలింగ్ వచ్చింది. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్కు జంటగా నటించారు. ఆ తరువాత కోలీవుడ్కు దిగుమతి అయ్యారు. ఇక్కడ శివకార్తికేయన్కు జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మదరాసి చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్ సేతుపతి సరసన ఏస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో మదరాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వసంత్కు తాజాగా ఒక తెలుగు, ఒక తమిళం చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నారు. ఇకపోతే తమిళంలో విక్రమ్తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల వీరధీరశూరన్ చిత్రంతో హిట్ను అందుకున్న విక్రమ్ తాజాగా తన 64వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి 96, మెయ్యళగన్ చిత్రాల ఫేమ్ ప్రేమ్కుమార్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటి రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
యముడు విజయం సాధించాలి: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రతి ఏడాది వందల చిత్రాలొస్తున్నా, అందులో కొంతమందికి మాత్రమే సక్సెస్ వస్తోంది. చిన్న సినిమాలు ఈ మధ్య అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. జగదీష్ ఆమంచి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షక. శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్లో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలను కే మ్యూజిక్ సీఈఓ ప్రియాంక, బెక్కెం వేణుగోపాల్, మల్లిక విడుదల చేశారు. ఈ సందర్భంగా జగదీష్ ఆమంచి మాట్లాడుతూ–‘‘ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఈ పాయింట్తో ‘యముడు’ తీశాం’’ అని పేర్కొన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కెమెరామెన్ విష్ణు, శ్రావణి శెట్టి, మల్లిక, ఆకాష్, భవానీ రాకేష్, స్క్రీన్ ప్లే రైటర్ శివ కోరారు. -
కబడ్డీ నేపథ్యంలో...
విజయ రామరాజు, సిజారోజ్ జోడీగా నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ సినిమా టీజర్ని డైరెక్టర్ హను రాఘవపూడి విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ–‘‘12 ఏళ్ల వయసులో అర్జున్ చక్రవర్తిగారి వద్దకు నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు.ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. అలా ఆ కథే నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. ఈ సినిమాకి 46 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అని తెలిపారు. విజయ రామరాజు మాట్లాడుతూ– ‘‘నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్తో ప్రయాణం చేసి, కబడ్డీ నేర్చుకుని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించాను’’ అన్నారు శ్రీని గుబ్బల. ఈ కార్యక్రమంలో సిజ్జా రోజ్, సంగీత దర్శకుడు విగ్నేష్ భాస్కరన్, కెమెరామెన్ జగదీష్, నటుడు దుర్గేష్ మాట్లాడారు. -
'ఎప్పటికీ నేను మీ బక్కోడు'.. తెలుగులో అనిరుధ్ అదిరిపోయే స్పీచ్!
విజయ్ దేవరకొండ వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఇక రిలీజ్కు మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ఈవెంట్కు కింగ్డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో మాట్లాడి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.అనిరుధ్ మాట్లాడుతూ..'ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. గత 12 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను మీ కొడుకులా చూసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్నే.. అలాగే మీ బక్కోడు..' అంటూ తెలుగులో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Once again Proved Telugu audience >>>> Any industry 🥵🥵🔥🔥#VijayDeverakomda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/S6eUwfUqLq— Srinivas (@srinivasrtfan) July 28, 2025 -
విజయ్ దేవరకొండతో ఫ్యాన్స్ మీట్.. బిర్యానీతో పాటు సెల్ఫీలు
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన అభిమానులతో కొంత సమయం పాటు సరదాగ గడిపారు. తను నటించిన కొత్త సినిమా కింగ్డమ్ విడుదల సందర్భంగా వారందరినీ కలుసుకున్నారు. అందుకు వేదికగా హైదరాబాద్లోని సారథి స్టూడియో నిలిచింది. తమ అభిమాన హీరోను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్లో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులే పాల్గొన్నారు. వాస్తవంగా ఆయన్ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతారని తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ కూడా వారిని ఎంతమాత్రం నిరూత్సాహపరచలేదు. అక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ అందరితో ఫోటోలు దిగారు. వారందరూ కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా.. చికెన్తో పాటు బగారా అన్నం రెడీ చేపించారు. తమ పట్ల విజయ్ చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అయ్యారు. నేడు (జులై 28) కింగ్డమ్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. సాయింత్రం 5గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విజయ్ ఫ్యాన్స్ పాల్గొననున్నారు.‘కింగ్డమ్’ చిత్రం జులై 31న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటి వరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.ఫోటో షూట్ అయ్యాక ఫ్యాన్ కీ అన్నంపెట్టడం🫡👌🏻అన్నదానం కీ మించింది ఏది లేదు🥹❤️ఫుడ్ టెస్ట్ అదిరింది సూపర్ థాంక్స్ @TheDeverakonda అన్న❤️🫂#KingDom #VijayDeverakonda pic.twitter.com/LwCYRikqIn— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) July 28, 2025 -
అత్యాచారం చేస్తామంటూ నటి రమ్యకు హీరో ఫ్యాన్స్ హెచ్చరిక
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య)పై దర్శన్ అభిమానులు ట్రోలింగ్కు దిగారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ బూతులతో విరుచుకపడుతున్నారు. ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ మెసేజులు చేస్తున్నారు. రేణుకస్వామికి బదులుగా నిన్ను (రమ్య) హత్య చేసి ఉంటే బాగుండేదని మరికొందరు దర్శన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించనున్నారు.ఈ అంశంపై ఇండియా టుడేతో ప్రత్యేకంగా రమ్య ఇలా మాట్లాడింది. 'బెంగళూరు కమిషనర్ ఈ రోజు నాకు సమయం ఇస్తున్నారు, కాబట్టి నేను వెళ్లి ఆయన్ను కలుస్తాను. నేను నా న్యాయవాదులను కూడా ఇప్పటికే సంప్రదించాను. ఎవరైతే నా కుటుంబంపై ట్రోల్ చేస్తున్నారో వారందరిని గుర్తించాము. నన్ను అసభ్యంగా బూతులు తిట్టేవారి సోషల్ మీడియా ఖాతాలను క్రోడీకరించాం. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాము' అని ఆమె వివరించారు.మహిళా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో కొందరు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని నటి రమ్య చెప్పారు. సమాజంలో ఇలాంటి చర్యలు చాలా బాధాకరమన్నారు. మహిళలను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాంటి వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడంతోనే వారు ఇలా రెచ్చిపోతున్నారని చెప్పింది. ఒక బలమైన మహిళను ఎదుర్కొవాలంటే మొదట ఆమె క్యారెక్టర్ను దెబ్బకొట్టేలనే పన్నాగంతో కొందరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని రమ్య పేర్కొంది.గతంలో దర్శన్పై చేసిన కామెంట్ వల్లనే..లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. తన ప్రియురాలిని సోషల్మీడియాలో తిట్టాడని రేణుకస్వామిని హత్య చేసి దర్శన్ పెద్ద తప్పు చేశాడని ఆమె చెప్పింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు..? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదంటూ పలుమార్లు దర్శన్ను రమ్య తప్పుబట్టింది. -
తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. టీజర్ రిలీజ్
స్పోర్ట్స్ డ్రామాలు సరిగా తీయాలే గానీ మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అలా గతంలో వచ్చిన 'జెర్సీ', 'భాగ్ మిల్కా భాగ్' తదితర చిత్రాల తరహాలో ఇప్పుడు తెలుగులో ఓ మూవీని తెరకెక్కించారు. అదే 'అర్జున్ చక్రవర్తి'. కబడ్డీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్ర టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా)1985,87,89 ప్రాంతంలో భారత్ తరఫున ఆడి గుర్తింపు దక్కని ఓ కబడ్డీ ప్లేయర్ స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. టీజర్ చూస్తుంటే స్టోరీతో పాటు విజువల్స్ ఇంప్రెసివ్గా అనిపించాయి. లీడ్ యాక్టర్గా చేసిన విజయ్ రామరాజు ఆకట్టుకున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతానికి టీజర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.కేవలం నిమిషం టీజర్తోనే 'అర్జున్ చక్రవర్తి' ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. భావోద్వేగాలు, బలమైన కథ, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రాబోయే సినిమాల్లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో పాటు విజయ్ సేతుపతి 'సార్ మేడమ్', ఉసురే లాంటి డబ్బింగ్ చిత్రాలు.. సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. నితిన్ 'తమ్ముడు' ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే ఇదొక్కటే స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. దీనితో పాటు బకైటి అనే హిందీ సిరీస్ కొంతలో కొంత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మరి శుక్రవారంనాడు సడన్గా ఓటీటీల్లో కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 28 నుంచి ఆగస్టు 03 వరకు)నెట్ఫ్లిక్స్ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) - జూలై 28ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29WWE: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ సిరీస్) - జూలై 30యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) - జూలై 31గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్) - జూలై 31లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31మార్క్డ్ (జులు సిరీస్) - జూలై 31తమ్ముడు (తెలుగు సినిమా) - ఆగస్టు 01అమెజాన్ ప్రైమ్లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 28చెక్ (తెలుగు సినిమా) - జూలై 28హాట్స్టార్అడ్డా ఎక్స్ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) - జూలై 28క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 29బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 28పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్) - ఆగస్టు 02సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) - ఆగస్టు 01ఆపిల్ ప్లస్ టీవీచీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01జీ5బకైటి (హిందీ సిరీస్) - ఆగస్టు 01(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!) -
ఓటీటీలో క్రిష్ ప్రాజెక్ట్.. 'అరేబియా కడలి' రిలీజ్పై ప్రకటన
'అరేబియా కడలి' వెబ్ సిరీస్ విడుదలపై ప్రకటన వచ్చేసింది. అమెజాన్ ఒరిజినల్ సిరీస్లో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సత్యదేవ్, ఆనంది జంటగా నటించారు. ఈ సిరీస్లో రెండు గ్రామాల మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి పొరపాటున వెళ్లి, అక్కడ బంధీ అవ్వడం ఆపై వారు ఎలా తిరిగొచ్చారనేది కథాంశం. ఈ వెబ్ సిరీస్కు క్రిష్ జాగర్లమూడి రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించారు.'అరేబియా కడలి' వెబ్ సిరీస్ ఆగష్టు 8న విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం తండేల్ కాన్సెప్ట్లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్తో సినిమా తెరకెక్కించారని సమాచారం.time and tide wait for none, neither does their fate 🌊#ArabiaKadaliOnPrime, New Series, August 8@ActorSatyaDev @anandhiactress @DirKrish @DirectorSuryaVV @NagavelliV @firstframe_ent pic.twitter.com/5ACNKK4XHG— prime video IN (@PrimeVideoIN) July 28, 2025 -
రెడ్ కలర్ చీరలో కృతి శెట్టి.. అక్కడ మాత్రం ఫుల్ బిజీ (ఫోటోలు)
-
విశ్వంభర స్పెషల్ సాంగ్లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.తెలుగులో తొలిసారి..సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్లో విలనిజం పండించిన మౌనీ రాయ్ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. నిమిషానికి లక్షల్లో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.విశ్వంభర ఆలస్యం?నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు -
పిల్లలకు 'లింగ, యాత్ర' పేర్లు ఎందుకు పెట్టానంటే: ధనుష్
ప్రతిభ ఉంటే చాలు ఎలాంటి రంగంలోనైనా సరే రాణించవచ్చని జాతీయ నటుడు ధనుష్ నిరూపించాడు. చూడగానే ఆకట్టుకునే రంగు అతనిలో లేదు. అందుకే మొదటి సినిమాతోనే తీవ్రంగా ట్రోలింగ్కు గురయ్యాడు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయితే ఏంటి..?, ఓటమి సమయంలో ఎలా నిలబడాలో తనకు తెలుసు. అసలు నటనంటే ఏంటో తెలీదు. కానీ, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. ధనుష్ బలం ఏంటో మొదట గుర్తించింది తన తండ్రే.. నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వెంకటేష్ ప్రభు కస్తూరిరాజా ఎవరు..? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు తక్కువ. అది ఆయన స్క్రీన్నేమ్. చెఫ్ కావాలని ధనుష్ కోరుకున్నాడు. కానీ, తండ్రి కస్తూరి రాజాకు మాత్రం కుమారుడిని హీరో చేయాలని బలమైన కోరిక ఉంది. దీంతో తండ్రి మాటను కాదనలేక 'తుల్లువదో ఇలమై' (Thulluvadho Ilamai) సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. 2002 మే 10న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, హీరో ఏంటి ఇలా ఉన్నాడంటూ ధనుష్పై విమర్శలు వచ్చాయి. కేవలం కథలో బలం ఉంది కాబట్టి సినిమా ఆడిందని ధనుష్కు ఎంతమాత్రం నటన రాదంటూ విమర్శించారు. అయితే, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని ఆయన బలంగా ముందుకు సాగాడు. ఎక్కడ మాటల పడ్డాడో అక్కడే తనను మెచ్చుకునేలా నిలబడాలని రెండో సినిమాపై గురి పెట్టాడు.ధనుష్ నటించిన రెండో సినిమా 'కాదల్ కొండెయిన్'.. తన అన్నయ్య సెల్వ రాఘవన్ తెరకెక్కించాడు. ఈ సినిమా కోలీవుడ్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ధనుష్ నటనకు తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. మొదటి సినిమాను విమర్శించిన వారే ధనుష్ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ విజయం వెనుక ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ శ్రమ ఎక్కువ ఉంది. ధునుష్ నుంచి మంచి నటనని రాబట్టుకునేందుకు ఒక్కోసారి ధనుష్ని రాఘవన్ కొట్టేవారట. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పారు. అన్నయ్య వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ పలుమార్లు ఆయన పంచుకున్నారు. ఇదే చిత్రాన్ని అల్లరి నరేశ్ హీరోగా తెలుగులో ‘నేను’గా తెరకెక్కించారు.వరుసగా రెండు విజయాలు దక్కడంతో ధనుష్ పేరు వైరల్ అయిపోయింది. కోలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్లోనూ ఛాన్సులు దక్కించుకున్నారు. బాలీవుడ్లో రంజనా, షబితాబ్ వంటి సినిమాలతో ప్రశంసలు అందుకున్నారు. ఆపై హాలీవుడ్లో 'ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'తో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు వారికి 'రఘువరన్ బీటెక్' డబ్బింగ్ మూవీతో గుర్తింపు పొందారు. ఇలా అంతర్జాతీయ స్థాయికి ధనుష్ చేరుకున్నారు. టాలీవుడ్లో ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల ఏకంగా సార్, కుబేర వంటి డైరెక్ట్ చిత్రాలతో తెలుగులో నటించారు. ధనుష్ అంటే కేవలం నటుడు మాత్రమే అనకుంటే పొరపాటే.. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత కూడా.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ‘వై దిస్ కొలవెరి’ పాటను కేవలం ఐదు నిమిషాల్లో రాశారు.కొత్త చరిత్రను లిఖించిన ధనుష్ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు . సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను ధనుష్ లిఖించాడు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ (అసురన్) ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు.ధనుష్ పిల్లల పేర్లు 'యాత్ర- లింగ' వెనుక స్టోరీధనుష్ రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య (రజనీకాంత్ కుమార్తె)తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ధనుష్ని ఆమె ఇంటర్య్వూ చేశారు. అక్కడి నుంచి మొదలైన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అయితే, కొంత కాలం క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ధనుష్ మొదటి నుంచి శివభక్తుడు కావడంతో తన పిల్లలకు లింగ, యాత్ర అని పేర్లు పెట్టుకున్నారు. షూటింగుల నుంచి కాస్త తీరిక దొరికినప్పుడల్లా ఆయన ఎక్కువ శైవక్షేత్రాలకు వెళ్తుంటారు. తనను నడిపించేది శివయ్యే అంటూ ఆయన పలుమార్లు చెప్పుకున్నారు. ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం వంటి ఆలయాలకు తరుచూ వెళ్లడం ఆయనకు ఇష్టం. చాలా సార్లు గిరిప్రదక్షణ కూడా చేసినట్లు ధనుష్ చెప్పారు. అలాగే తను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు సొంతూరులోని (తేనీ జిల్లా - మల్లింగాపురం) ఉన్న కస్తూరీ మంగమ్మ ఆలయానికీ ఆయన వెళ్లడం విశేషం. -
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
జయసుధ (Jayasudha) తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు వంటి ప్రముఖులతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లిగా, అత్తగా సహాయక పాత్రలు పోషిస్తోంది. వెండితెరపై తిరుగులేని నటిగా కీర్తి గడించిన ఈమె జీవితాన్ని 2017లో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది. అదే ఆమె భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య! ఈ ఘటనతో ఆమె కొంతకాలంపాటు డిప్రెషన్కు వెళ్లిపోయింది.అదే నాన్న బాధనితిన్ అలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాన్ని అతడి తనయుడు, నటుడు నిహార్ కపూర్ (Nihar Kapoor) వెల్లడించాడు. నిహార్ కపూర్ మాట్లాడుతూ.. నాన్నకు చిన్నవయసులోనే డయాబెటిస్ వచ్చింది. అయితే ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. జిమ్కు వెళ్లేవాడు. అయితే నాన్న నిర్మాతగా తీసిన సినిమాలు కొన్ని ఆడాయి. కొన్ని ఫెయిలయ్యాయి. అసలేవి చేసినా సక్సెస్ అవడం లేదు. ఓ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మధ్యలోనే ఆగిపోయింది. నాశనం చేస్తున్నానా?మరో సినిమా బాలీవుడ్ నిర్మాత ఎత్తుకుపోయాడు.. ఇలా చాలా విషయాలు ఆయన్ని ఎంతగానో బాధపెట్టాయి. నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్లో ఉన్నవారికి.. నా వల్ల నా చుట్టూ ఉన్నవాళ్లు బాధపడతారు. వారి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను వంటి ఆలోచనలు వస్తాయి. నాన్న విషయంలో అదే జరిగింది. ఏళ్ల తరబడి డిప్రెషన్లో ఉన్నారు. 10 ఏళ్లుగా అదే మాటచనిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. చచ్చిపోతానని దాదాపు 10 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఒకరోజు ముంబైలో తన బంగ్లాపై నుంచి దూకాడు. నిజానికి ఇది జరగడానికి ముందే ఓ ఫంక్షన్కు వెళ్లాలని కొత్త బట్టలు కొన్నాడు. అంతలోనే ప్రాణం తీసుకున్నాడు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి అమ్మకు చాలా సమయం పట్టింది అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. నిహార్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాలో నటించాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్! -
హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
తమిళగ వెట్రి కళగం నేత, సినీ నటుడు విజయ్ నివాసంతో పాటు సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపై చెన్నై విమానాశ్రయంలో కూడా బాంబులు ఉన్నట్టుగా బెదిరింపుల కాల్స్ వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. సీఎం స్టాలిన్, విజయ్ నివాసాలతో పాటు విమానశ్రయం వద్ద సెక్యూరిటీ పెంచారు. భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే, వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.విజయ్ నివాసం పరిసరాలలో, సీఎం నివాసం పరిసరాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో సోదాల అనంతరం భద్రతను పెంచారు. ఇప్పటికే విమానాశ్రయానికి పలుమార్లు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. హీరో విజయ్కు ఇప్పటికే రెండుసార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అజిత్, రజనీకాంత్ వంటి స్టార్స్ కూడా గతంలో ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత నేపంథ్యంలో వచ్చిన సమాచారంపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!
బుల్లితెర యాంకర్ నుంచి వెండితెర నటిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) రంగస్థలం, పుష్ప, పుష్ప 2, ప్రేమవిమానం, రజాకార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఫ్లాష్బ్యాక్, వోల్ఫ్ అనే తమిళ మూవీస్లో యాక్ట్ చేస్తోంది. సినిమాల్లో బిజీ అవడంతో బుల్లితెరకు గుడ్బై చెప్పేసి వెండితెరపైనే సెటిలైపోయింది.అనసూయపై ట్రోలింగ్అయితే అనసూయ ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపై అనసూయ నెగెటివ్ కామెంట్స్ చేసినప్పటి నుంచి అతడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే 40 ఏళ్ల వయసున్న తనను ఆంటీ అని పిలవొద్దని చెప్తున్నా సరే సోషల్ మీడియాలో నెటిజన్లు తనను పదేపదే ఆంటీ అని పిలుస్తూ చిరాకు తెప్పిస్తూనే ఉన్నారు.అంతమందిని బ్లాక్ చేశాఈ ట్రోలింగ్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ స్పందించింది. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను వారిని వెంటనే బ్లాక్ చేస్తాను. అలా దగ్గరదగ్గర 3 మిలియన్ల మందిని బ్లాక్ చేశాను. వారి కామెంట్లకు కౌంటర్ ఇచ్చినప్పటికీ.. ఒకానొక సమయంలో అదంతా భరించలేకపోయాను. నా జీవితంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే నువ్వు లేవు, ఇకమీదట కూడా రావు అనుకుని బ్లాక్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. 3 మిలియన్స్ 30 లక్షలని తెలుసా?'3 మిలియన్స్ అంటే మూడు వేలు అనుకుందేమో 30 లక్షలని ఎవరైనా చెప్పండ్రా..', 'చెప్తే నమ్మేటట్లుండాలి.. హీరోయిన్లకే 30 లక్షల మంది జనాలు మెసేజ్ చేయరు, అలాంటిది నీకు అంతమంది మెసేజ్, కామెంట్స్ చేశారంటే నమ్మాలా?', 'ఇవన్నీ చేయడం కన్నా నీ అకౌంట్ డిలీట్ చేస్తే అయిపోతుందిగా!', '3 మిలియన్ల జనాల్ని బ్లాక్ చేస్తూ పోయానంటున్నారు, అంత ఖాళీగా ఉన్నారా?' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు తనకు ఇన్స్టాగ్రామ్లో 16 లక్షల ఫాలోవర్లు ఉంటే 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేసిందని ప్రశ్నిస్తున్నారు.చదవండి: పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్ -
పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). 32 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ సీతారామం చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఠాగూర్కు అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా సీతారామం చిత్రం తమిళంలోనూ అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. దీంతో కోలీవుడ్లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఏమైందో ఏమోకానీ, ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ చేజార్చుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమ ఆమె వైపు చూడడం లేదు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో డకాయిట్ మూవీలో యాక్ట్ చేస్తోంది. అదేవిధంగా అల్లు అర్జున్ సరసన నటించే మరో లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్నది తన చిన్న వయసు నుంచే కల అని పేర్కొంది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా చిత్ర పరిశ్రమపైనే ఉందని, సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వాలని తెలిపింది.చదవండి: కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్ -
అనంతపురంలో సినీనటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
కామాఖ్య ప్రారంభం
సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రల్లో నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాకు చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, కెమెరా: రమేశ్ కుశేందర్ రెడ్డి. -
జెట్ స్పీడ్తో..!
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగాఅనిల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్తో జరుగుతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి–నయనతారపాల్గొనగా ఓపాటను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితోపాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే వెంకటేశ్పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి–వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
యాక్షన్ స్టార్ట్
గోండు తెగల నేపథ్యంలో రష్మికా మందన్నా లీడ్ రోల్లో ‘మైసా’ చిత్రం ఆరంభమైంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్తపాత్రను రష్మిక చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈపాన్ ఇండియా మూవీని అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.ఆదివారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అతిథిగాపాల్గొన్న దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేసి, తొలి షాట్కు గౌరవ దర్శకత్వం చేశారు. ‘‘హై ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
మాస్ కథకి సై?
హీరో నాగచైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రానుందా? అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానమే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగచైతన్యకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారని, అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.అలాగే తనకు ‘మజిలీ’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్వాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగచైతన్య. మరి... ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో నాగచైతన్య సినిమా ముందుగా సెట్స్కు వెళ్తుంది? లేకపోతే ఈ ఇద్దరు దర్శకులతో నాగచైతన్య సమాంతరంగా రెండు సినిమాలూ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు నాగచైతన్య. ఇది నాగచైతన్య కెరీర్లోని 24వ చిత్రం. దీంతో నాగచైతన్య కెరీర్లోని 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారు అవుతారో అనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్లో నెలకొంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
బుల్లితెర నటి లహరి రాఘవేందర్ (Actress Lahari Raghavendar) తల్లిగా ప్రమోషన్ పొందింది. శనివారం (జూలై 26) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. దీంతో అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లహరి రాఘవేందర్.. కోయిలమ్మ సీరియల్లో సింధుగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కళ్యాణ వైభోగం, కన్యాదానం, రాధమ్మ కూతురు, అమ్మ, అల వైకుంఠపురములో వంటి పలు ధారావాహికలు చేసింది. ఉద్యోగం, సీరియల్స్పలు షార్ట్ ఫిలింస్లో కూడా నటించింది. అయితే లహరి కొంతకాలంగా సీరియల్స్కు దూరంగా ఉంటూ వస్తోంది. అందుకుగల కారణాన్ని ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. నేను ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే సీరియల్స్ చేశాను. దాదాపు ఐదేళ్లపాటు రెండింటినీ మ్యానేజ్ చేశాను. షూటింగ్ గ్యాప్స్లో ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునేదాన్ని. అమ్మ నన్ను కష్టపడి చదివించినప్పుడు ఉద్యోగం మానేయడం కరెక్ట్ కాదనిపించింది.చీప్గా చూస్తున్నారనే..ఇకపోతే సీరియల్స్లో ఏమైపోయిందంటే, బెంగళూరు నుంచే ప్రతి ఒక్కరినీ తీసుకునిరావడం మొదలైంది. దాంతో ఇక్కడున్నవారికి డిమాండ్ తగ్గిపోయింది. నేను అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. ఇతర భాషల నుంచి వచ్చే నటీనటుల కోసం ఇక్కడున్న మాకు పారితోషికం తగ్గించడమేంటి? మమ్మల్ని చీప్గా చూడటమేంటి? అనిపించి ఓ సీరియల్ కూడా వదిలేసుకున్నాను. ఒక్కమాటైనా చెప్పకుండా..వేరే సీరియల్స్లో మంచి పాత్రలు పడ్డాయి, కెరీర్ బాగుంది కదా అని నా ఉద్యోగాన్ని వదిలేసుకుంటే చివరకు నాకే షాకిచ్చారు. నాకు ఒక్కమాటైనా చెప్పకుండా ఓ సీరియల్లో నుంచి సడన్గా తీసేశారు. అది నాకు నచ్చలేదు. ఇవన్నీ చూశాక.. ఇక చాలు, సీరియల్స్ ఆపేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తిరిగి మళ్లీ ఉద్యోగంలో చేరాను అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Dr Shruthis Women & Maternity (@dr_shruthis_women_maternity) View this post on Instagram A post shared by Lahari Sanju (@lahari_raghavendar) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య -
'బాహుబలి' పళని 'వన్ బై ఫోర్' రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా 'వన్ బై ఫోర్'. టెంపర్ వంశీ, ఆర్ఎక్స్ 100 కరణ్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమాకు 'బాహుబలి'కి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన పళని దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. వన్ బై ఫోర్.. ఓ యాక్షన్ క్రైమ్ డ్రామా. నోరు జారితే జరిగే పరిణామాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్పే కథే ఈ సినిమా. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాతలు చెప్పారు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?) -
తల్లి కాబోతున్న సోనియా.. సీమంతం వేడుకలో బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ షోతో నెగెటివిటీ, పాపులారిటీ ఒకేసారి సంపాదించింది సోనియా ఆకుల (Soniya Akula). పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీలతో ఆమె వ్యవహరించిన తీరు జనాలకు అంతగా నచ్చలేదు. దీంతో ఫినాలే వరకు రాకుండానే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అయితే బిగ్బాస్ హౌస్లో ఉండగానే ఎంటర్ప్రెన్యూర్ యష్ వీరగోనిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది.ఏడాది తిరగకముందే గుడ్న్యూస్షో నుంచి బయటకు వచ్చిన వెంటనే అతడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతేడాది డిసెంబర్లో యష్-సోనియా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బిగ్బాస్ కంటెస్టెంట్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిరోజుల క్రితమే సోనియా ఓ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే తను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. నేడు (జూలై 27న) ఆమె సీమంతం ఘనంగా జరిగింది. సీమంతం ఫంక్షన్లో కీర్తిఈ వేడుకకు బుల్లితెర నటి కీర్తి భట్, ఆమెకు కాబోయే భర్త విజయ్ కార్తికేయన్తో కలిసి వెళ్లింది. తల్లి కాబోతున్న సోనియాకు చీర బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీర్తి.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కాబావకు శుభాకాంక్షలు.. హ్యాపీ సీమంతం. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. త్వరలో రాబోయే బుజ్జిపాప కోసం ఈ పిన్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చింది. రెండో పెళ్లిఇది చూసిన అభిమానులు వీరి ప్రేమాభిమానులు చూసి ముచ్చటపడిపోతున్నారు. కాగా యష్ వీరగోనికి గతంలో పెళ్లయింది. ఓ బాబు కూడా ఉన్నాడు. చాలాకాలం క్రితమే భార్యకు విడాకులిచ్చే ఒంటరిగా ఉంటున్నాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్ -
కింగ్డమ్పై రష్మిక ట్వీట్.. ముద్దు పేరేంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
గతేడాది పుష్ప-2తో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపించనుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కింగ్డమ్ ట్రైలర్ను విజయ్ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.Rushhielu ❤️Enjoy this one - #Kingdom 🤗— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2025 -
ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ బాబు 30వ సినిమా
-
శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్
శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్ చేస్తే.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో శ్రావణమాసం సందర్భంగా మటన్ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్శ్రావణంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య -
'మహావతార్ నరసింహ' థియేటర్స్ హౌస్ఫుల్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడులైంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివర్స్లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. కానీ, మొదటిరోజునే మంచి టాక్ రావడంతో మెల్లిగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంటుంది.యానిమేటెడ్ రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. 'మహావతార్ నరసింహ' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మహావతార్ నరసింహ'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్ కథను, అశ్విన్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్ శ్యామ్ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) చివరగా తండేల్ సినిమాతో మెప్పించాడు. ఈ సినిమాతో పాటు ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సాయిపల్లవిని ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తుంటాడు. అయితే రియల్ లైఫ్లో భార్య శోభిత ధూళిపాళను అలా ముద్దుగా పిలుస్తానంటున్నాడు నాగచైతన్య. తాజాగా చై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. శోభితతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా..అతడు మాట్లాడుతూ.. షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడిపలేకపోతున్నాను. మా మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతాం. ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేస్తాం. సినిమాలకు, షికార్లకు వెళ్లినా ఆ క్షణాలను ప్రత్యేకంగా మార్చుకుంటాం. ఈ మధ్యే తనకు రేస్ట్రాక్పై డ్రైవింగ్ నేర్పించాను. రేసింగ్ నాకొక థెరపీలా పనిచేస్తుంది.పిల్లలతో గడపాలనుందినాకంటూ పెద్ద కోరికలు లేవు. 50 ఏళ్లు వచ్చేసరికి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరో, ఇద్దరో పిల్లలు కావాలనుకుంటున్నాను. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా.. కూతురు పుడితే తన ఇష్టాలను ప్రోత్సహిస్తాను. పిల్లలతో సమయం గడపాలనుంది. చిన్నప్పుడు నేనెలా ఎంజాయ్ చేశానో.. ఇప్పుడు పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పుకొచ్చాడు. చైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్యకు ఆరో నెల -
పాటతో పూర్తయిన 'విశ్వంభర'..!
-
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమా మేకింగ్, గ్రాఫిక్స్ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది. రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్లోని లీలామహల్, వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ థియేటర్స్ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు.'లీలామహల్' నుంచి వీరమల్లు ఔట్విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రీసెంట్గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు. జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24న ఇక్కడ సినిమా చూశారు. ప్రీమియర్తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. కానీ, రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి 'జూనియర్' సినిమాను ప్రదర్శించారు. వీకెండ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది. ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు. ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ చేయవచ్చు. కానీ, మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం.. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ 'వీరమల్లు'కు వుంది. కానీ, అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు. ఇలా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్, జూనియర్ చిత్రాలను ప్రదర్శించడం విశేషం. ఒక స్టార్ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ అవుతుంది. వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ అభిమానులతో కాన్ఫిరెన్స్ కాల్స్ మాట్లాడారు. అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. -
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
తమిళ నటుడు పొన్నాంబళం.. తెలుగులో ఘరానా మొగుడు (1992)లో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పాందారు. ముఖ్యంగా ప్రతి నాయకుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. తమిళంలో రజనీకాంత్ , కమలహాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ,నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించాడు. అలాంటి నటుడు ఇటీవల అనారోగ్యానికి గురై కఠినమైన వైద్య చికిత్సలు పొందుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యను ఎదుర్కొన్న పొన్నాంబళం వైద్య చికిత్సలకు కూడా డబ్బు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. దీంతో సహాయం కోసం అభ్యర్థించడంతో పలువురు నటులు ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు. ముఖ్యంగా చిరంజీవి, రాధిక శరత్ కుమార్, ధనుష్ , రజనీకాంత్ వంటి స్టార్స్ పొన్నాంబళం వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. కాగా పొన్నాంబళం ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నాలుగేళ్లలో 750కి పైగా ఇంజెక్షన్లు చేయించుకున్నట్లు చెప్పారు. రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి తన ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారని చెప్పారు. తనకు వచ్చిన ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. తను ఎక్కువగా మద్యం సేవించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెప్పారన్నారు. అయితే, చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం ఆపేశానన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్ని వాపోయారు. అయితే మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నానని, ఆ సమయంలో చాలా బాధ అనుభవించానని పొన్నంబళం పేర్కొన్నారు. మద్యం ఎప్పటికీ హనికరం అంటూ జీవితంలో తాను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఆయన అభ్యర్థించారు. -
విచిత్రమైన షరతు!
ఇండస్ట్రీకి ‘నో డేటింగ్’ కండిషన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, అభిమానులు గుడి కట్టేంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది.నిధి నిజానికి హైదరాబాద్లోనే 1992 ఆగస్టు 17న పుట్టింది. చిన్నతనం కూడా అక్కడే గడిచింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది. అందుకే హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సునాయాసంగా మాట్లాడగలుగుతుంది.తన తొలి సినిమా ‘మైఖేల్ మున్నా’ కోసం, ఏ హీరోయిన్ ఒప్పుకోని షరతును అంగీకరించింది. సినిమాలో నటిస్తున్నంతవరకూ ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాజ్ పెట్టారు. ‘‘అప్పట్లో కెరీర్ కావాలి, డబ్బులు అవసరం. కాబట్టి సరేనన్నాను’’ అని నవ్వుతూ చెబుతుంది నిధి.తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. కాని తమిళంలో శింబు, ఉదయనిధి స్టాలిన్, జయం రవిలతో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్తో ‘రాజాసాబ్’ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది.పూజా హెగ్డే తర్వాత, నాగ చైతన్య, అఖిల్– అన్నదమ్ములు ఇద్దరితోనూ నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ నిధి.ఫిబ్రవరి 14, వాలెంటైన్ ్స డే రోజున తమిళనాడులో అభిమానులు ఆమె విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, గుడి కట్టినట్టు వార్తలు, ఫొటోలు వెలుగులోకి రావడం చూసి, షాక్ అయిందట!హైదరాబాద్లోని బషీర్బాగ్లో నిధి అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఉంది. ‘హైదరాబాద్ మించిన ఫన్ ప్లేస్ ప్రపంచంలో లేదనిపిస్తుంది’ అని అంటుంది నిధి. అంతేకాదు, నగరంలో దాదాపు 15 వేల మంది బంధువులు ఉన్నారట!బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలనే కోరిక. కాని, ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ఫేస్బుక్లో అందమైన ఫోటోలు పెడుతూ, ఎవరైనా దర్శకుడు కాంటాక్ట్ చేస్తాడేమో అని ఎదురు చూసేది. ఆ ఆశే ఆమెను మోడలింగ్, అందాల పోటీల వైపు తీసుకెళ్లింది. తర్వాత హీరోయిన్ గా మారింది.కాలేజీలో ఓ అబ్బాయి ‘నీవు చాలా అందంగా ఉన్నావు’ అన్నాడు. వెంటనే చేతిలో ఉన్న యాపిల్ అతని మీదకు విసిరి, ‘నన్ను అంత మాట అంటావా!’ అంటూ అరిచిందట! ఇప్పుడు అభిమానులు పొగుడుతున్నప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటుందట! -
బిజీ బిజీగా...
విలక్షణ నటుడు సాయి కుమార్ వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు. నటుడిగానూ యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాను. ఈ ఏడాదితో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం సంతోషంగా ఉంది.ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ ‘సంబరాల యేటిగట్టు’, నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, ‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాది రాజా’, కోన వెంకట్గారితో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డిగారితో ఓ చిత్రం, మా అబ్బాయి ఆదితో కలిసి ‘ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమాలు చేస్తున్నాను. కన్నడలో ‘చౌకీదార్’, ‘సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర’, శివ రాజ్కుమార్గారి సినిమాలో నటిస్తున్నా. తమిళ్లో ‘డీజిల్’, విక్రమ్ ప్రభుతో ఓ చిత్రం చేస్తున్నాను. దేవా కట్టా ‘మయసభ’, క్రిష్ ‘కన్యా శుల్కం’ వంటి వెబ్ సిరీస్లలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ఈ హీరోయిన్కు అప్పట్లో ఫుల్ క్రేజ్.. ఇలా మారిపోయిందేంటి!
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్లో అగ్ర కథానాయికగా స్టార్డమ్ అందుకుంది. కానీ, అందరిలాగే పెళ్లి కాగానే నటనకు గుడ్బై చెప్పి ఇంటికే పరిమితమైంది. 2009 తర్వాత మరే చిత్రంలోనూ కనిపించనేలేదు. ఇంతకీ ఆ కథానాయిక మరెవరో కాదు మాళవిక (Actress Malavika).పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైమాళవిక అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్ (Shweta Konnur Menon). చాలా బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంద్రముఖి చిత్రాల్లో నటించింది. తమిళంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ పాత్రల్లోనూ కాదనకుండా యాక్ట్ చేసింది. 2007లో సుమేశ్ మీనన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య రీఎంట్రీకి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అయిపోయిందేంటి?పుష్పలో సమంతలా 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' వంటి ఐటం సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అప్పట్లో నాజూకుగా ఉన్న మాళవిక ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్న ఈమె.. ఇంతలా లావైపోవడంతో అభిమానులు వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. మాళవిక ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ -
Samantha: పచ్చబొట్టు చెరిగిపోలేదులే..
హీరోయిన్గా సమంత (Samantha Ruth Prabhu) వెండితెరకు పరిచయమైన చిత్రం ఏమాయ చేసావె (Ye Maaya Chesave Movie). నాగచైతన్య హీరోగా నటించాడు. 2010లో వచ్చిన ఈ ప్రేమకథాచిత్రంతోనే వీరి లవ్కు పునాది పడింది. తొలి చిత్రమే బ్లాక్బస్టర్ కావడంతో సామ్కు బోలెడంత గుర్తింపు వచ్చింది. అందుకే ఈ స్పెషల్ చిత్రానికి గుర్తుగా సామ్.. YMC (ఏ మాయ చేసావే) టాటూను మెడపై వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో స్పెషల్ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.పచ్చబొట్టు మాయం?ఇదే కాదు. చై ప్రేమకు గుర్తుగా కూడా ఓ పచ్చబొట్టు వేయించుకుంది. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆ టూటూ తొలగించుకుంది. ఇటీవల ఓ వీడియో YMC పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా పూర్తిగా చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆ పేరు అలాగే చెక్కుచెదరకుండా ఉంది.విడాకులునాగచైతన్య-సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా ఉండే ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. చై.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్ కూడా.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే.. సమంత చివరగా శుభం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతోనే తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ వెబ్సిరీస్తో పాటు మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: నా భార్య కండీషన్.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్ -
నా భార్య కండీషన్.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్
సూపర్ స్టార్ మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ (Athadu Movie Re Release) క్లాసిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేశ్బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మా బ్యానర్లో 2005 ఆగస్టు 10న అతడు సినిమా రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ మూవీ కోసం ఓ ఇంటి సెట్ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సెట్ తీసేశారుదాదాపు 90 శాతం సీన్లు అదే సెట్లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్ను చాలా మంది వాడుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం. ‘అతడు’ మూవీ కోసం మహేశ్బాబు చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకు వచ్చింది.చాలా డబ్బుసెన్సార్ వాళ్లు ‘అతడు’ మూవీ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. నాకు ఈ చిత్రంలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు. ‘నాకు వేషం ఇవ్వండి అని ఎవరినీ అడగొద్దు’ అంటూ మా ఆవిడ నాకొక కండీషన్ పెట్టారు. భార్య కండీషన్అందుకే ఇంత వరకు ఎవ్వరినీ నేను వేషం అడగలేదు. మహేశ్బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ‘అతడు’ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక ‘అతడు’ గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇందులో నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబును అనుకున్నాం. కానీ, ఆయన అందరికీ నేను హీరోగా మాత్రమే గుర్తుండాలి అంటూ ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది’ అని అన్నారు.4k వర్షన్మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. ఈ రీ రిలీజ్ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ .. ‘‘అతడు’ మూవీని ఫిల్మ్లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.చదవండి: టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి! -
ఒక్కపూట భోజనం.. మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్నా: ఏడ్చేసిన నటి
చిత్రపరిశ్రమలో రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడే చేతినిండా అవకాశాలున్నట్లనిపిస్తుంది. అంతలోనే ఖాళీ చేతులతో అవకాశాలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది. వయసుపైబడ్డ నటీనటుల పరిస్థైతే మరీ దుర్భరంగా ఉంటుంది. తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతుంటారు. నటి గుంటూరు మహాలక్ష్మి (Actress Guntur Mahalaxmi)కి అలాంటి దుస్థితే వచ్చింది. ఈమె ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రంలో యాక్ట్ చేసింది.రూ.4 లక్షల అప్పుతాజాగా నటి మహాలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1998లో సీరియల్స్లోకి వచ్చాను. రెండు, మూడు సినిమాలు కూడా చేశాను. రూ.3 లక్షల అప్పుతో హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఆ అప్పు రూ.4 లక్షలై కూర్చుంది. కొన్ని సినిమాలు, సీరియల్స్లో చేసిన పనికి సరిగా డబ్బులివ్వడం లేదు. నాకసలే మోకాలి నొప్పి ఉంది. దానికి సర్జరీ చేయాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. దానికితోడు కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.అమ్మ కోసం వెళ్లిపోయాఇండస్ట్రీలో సెటిలయ్యే సమయంలో అమ్మ కిందపడి కాలుచేయి విరిగింది. అమ్మను చూసుకోవడం కోసం నటనను వదిలేసి ఊరెళ్లిపోయాను. అమ్మ చనిపోయిన కొద్దిరోజులకు ఇక్కడికి వచ్చేశాను. నాకు ఓ తమ్ముడు ఉండేవాడు. అతడి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. తను కూడా ఈమధ్యే చనిపోయాడు. అమ్మ, తమ్ముడు.. ఇద్దర్నీ నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు అప్పులపాలై చాలా కష్టాలుపడుతున్నాను. మంచినీళ్లతో కడుపు నింపుకుని..హైదరాబాద్ వచ్చాక కడుపు మాడ్చుకున్న రోజులెన్నో ఉన్నాయి. మంచినీళ్లు తాగి పడుకునేదాన్ని. ఎన్నోసార్లు పస్తులున్నాను. ప్రస్తుతం ఒక్కపూట భోజనమే చేస్తున్నా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మహాలక్ష్మి.. నువ్వొస్తావని, సత్యం, రుతురాగాలు వంటి పలు సీరియల్స్ చేసింది. హరిహర వీరమల్లు మూవీలో జాతర సీన్లో యాక్ట్ చేసింది. రంగస్థలం, గేమ్ ఛేంజర్ సహా దాదాపు 50 చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది. ప్రస్తుతం డ్రాగన్, ఫౌజీ, శంబాల చిత్రాల్లో నటిస్తోంది. శంబాలలో తనకు మంచి డైలాగులున్నాయని, ఈ మూవీతోనైనా తగిన గుర్తింపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్
కొత్త సినిమాలు వస్తున్నా సరే పాత చిత్రాలను ఇంకా రీరిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్బాబు హీరోగా నటించిన క్లాసిక్ మూవీ అతడు (Athadu Movie Re Release)ను వచ్చే నెలలో మళ్లీ విడుదల చేస్తున్నారు. మహేశ్ బర్త్డే రోజైన ఆగస్టు 9న అతడు రీరిలీజ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పటికే సినిమాలకు దూరం..ఈ సినిమాలో శోభన్బాబు నటించాల్సిందని, కానీ ఆయన రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు. మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. అప్పటికే శోభన్బాబు సినిమాలు చేయడం ఆపేశారు. అతడు మూవీలో నాజర్ వేసిన క్యారెక్టర్ శోభన్బాబు వేస్తే బాగుంటుందనిపించింది. డైరెక్టర్ త్రివిక్రమ్తో చెప్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? అన్నాడు. అప్పటికే మేము హైదరాబాద్ వచ్చేశాం. ఆయన చెన్నైలోనే ఉన్నారు. నేను నేరుగా అడగడానికి మొహమాటపడి మేకప్మెన్ రామును పిలిచాను. ఖాళీ చెక్..ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి రాముతో చెన్నై పంపించాం. రెమ్యునరేషన్ తనకెంత కావాలనుకుంటే అంత రాసుకోమన్నాం. దాని గురించి బేరమాడాలనుకోలేదు. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే ఆ పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతుంది, సినిమాకు విలువ వస్తుందనుకున్నాను. కానీ శోభన్బాబు (Sobhan Babu) ఫోన్ చేసి.. సారీ, మురళీ మోహన్గారు, ఏమీ అనుకోవద్దు. హీరోగానే గుర్తుండిపోవాలిఎవరైనా శోభన్బాబు అని గుర్తు చేసుకోగానే హీరోగా అందంగా, టిప్టాప్గా కనిపించాలే తప్ప తండ్రిగా, తాతగా, రోగిష్టిగా వారికి గుర్తు రాకూడదు. అలాంటి క్యారెక్టర్లు నేను చేయదల్చుకోలేదు. మీరేం అనుకోవద్దు. ఇది కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది, లేకపోతే మీరు తీయరు. నాకు ఇచ్చిన పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది, లేకుంటే మీరు నన్ను అడగరు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను చేయలేనని తిరస్కరించారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ -
ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ
హిట్టు కోసం ఆరాటపడుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అతడు కింగ్డమ్ మూవీపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ తమిళ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.సినిమా వల్లే..విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా వల్ల సమాజంలో నాకంటూ పేరుప్రఖ్యాతలు వచ్చాయి. జనాల ప్రేమ దొరికింది. సినిమాల్లోకి రాకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలుసు. అలాంటి జీవితం నాకొద్దు. కానీ సినిమాల్లో మునిగిపోయి పర్సనల్ లైఫ్ను మిస్ అవుతున్నాను. మన లైఫ్లో బంధాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. గత రెండేళ్లలోనే నాకు వీటి విలువ బాగా తెలిసొచ్చింది. గర్ల్ఫ్రెండ్కు నో టైమ్ఈ రెండుమూడేళ్లలో నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. అమ్మానాన్నకు సమయం కేటాయించలేదు. గర్ల్ ఫ్రెండ్కు కూడా కాస్తైనా టైం ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్తో కూడా గడపలేదు. ఇవన్నీ నన్ను బాధిస్తుండేవి. సడన్గా ఒకరోజు నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఇలా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని పద్ధతి మార్చుకున్నాను. కుటుంబసభ్యులతో పాటు నా జీవితంలో ఉన్న అందరికీ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.ప్రేమలో..కాగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ రష్మిక మందన్నాతో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. చాలాసార్లు తాను సింగిల్ కాదని హింటిచ్చాడు. విజయ్, రష్మిక.. ఛాన్స్ దొరికినప్పుడల్లా వెకేషన్కు చెక్కేస్తుంటారు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.చదవండి: తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ
సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'దక్ష'. హారర్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీకి వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా శుక్రవారం(జూలై 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె పద్ధతిలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. 'దక్ష' స్టోరీ విషయానికొస్తే.. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. మరి చివరకు ఏమైంది? ఎవరు బతికారు అనేదే మిగతా స్టోరీ.ఈ మూవీనే కాదు ఈ వారం చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో 'రోంత్' అనే పోలీస్ డ్రామా హాట్స్టార్లో.. షో టైమ్, మార్గన్ మూవీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో.. సోలో బాయ్, సారథి చిత్రాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోంత్, షో టైమ్, మార్గన్ కచ్చితంగా చూసే లిస్టులో ఉంటాయి. (ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
తిరుమలలో ఒకప్పటి హీరోయిన్.. గుర్తుపట్టారా?
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. తమదైన యాక్టింగ్తో అలరిస్తూ ఉంటారు. ఈమె కూడా అలానే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడేమో సీరియల్స్ చేస్తోంది. మరి ఈ హింట్స్ బట్టి ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు నిరోషా. ఇప్పటి జనరేషన్కి అయితే అస్సలు తెలియకపోవచ్చు. కానీ 90ల్లో తెలుగు సినిమాలు చూసిన వాళ్లు మాత్రం ఈమెని ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో ముద్దుల మామయ్య, నారీనారీ నడుమ మురారి, సింధూర పువ్వు, స్టూవర్టుపూరం పోలీస్ స్టేషన్ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. తర్వాత తర్వాత మూవీస్ చేసింది గానీ హిట్స్ అందుకోలేకపోయింది. తెలుగులో చివరగా 2019లో వచ్చిన 'నువ్వు తోపు రా' అనే మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)ఈమె వ్యక్తిగత విషయాలకొస్తే.. శ్రీలంకలోని కొలంబోలో పుట్టి పెరిగింది. కానీ తమిళ సినిమాలతో నటిగా మారింది. 1988 నుంచి ఇప్పటివరకు నటిస్తూనే ఉంది. కాకపోతే సినిమాలు చాలావరకు తగ్గించేసింది. గతేడాది రిలీజైన రజినీకాంత్ 'లాల్ సలామ్'లోనూ ఈమె నటించింది. గతంలో తెలుగులో పలు సీరియల్స్ కూడా ఈమె చేసింది. ప్రస్తుతం తమిళంలో సీరియల్స్ చేస్తోంది.1995లో నటుడు రాంకీని ఈమె పెళ్లి చేసుకుంది. అతడు కూడా తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో కనిపించాడు. గతేడాది రిలీజైన 'లక్కీ భాస్కర్'లో హీరో సహాయపడే ఆంటోని పాత్ర చేసింది ఈయనే. ఇక నిరోషాకు ఒకప్పటి హీరోయిన్, నటి రాధిక బంధువు అవుతుంది. తాజాగా ఈమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఒకప్పటి హీరయిన్ నిరోషా కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్) -
సినీ నిర్మాత, హీరోను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు, నిర్మాత మాన్ సింగ్ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. 'సో లాంగ్ వ్యాలీ' అనే హిందీ చిత్రాన్ని మాన్ సింగ్ దర్శత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఆపై ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జులై 25న చిత్ర యూనిట్తో కలిసి ముంబైలోని సినీపోలిస్ థియేటర్కు మాన్ సింగ్ వచ్చారు. ఆ సమయంలో నటి రుచి గుజ్జర్ ఆవేశంతో తనకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలంటూ చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిర్మాత, నటుడు మాన్ సింగ్ తనకు రూ. 25 లక్షలు బాకీ ఉన్నాడని రుచి గుజ్జర్ పేర్కొంది. ఆ డబ్బు ఇవ్వాలంటూ అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఈ క్రమంలో చెప్పు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నం చేయగా.. ఆమెను నిలువరించేందుకు చిత్ర సహ నిర్మాత కరణ్ అడ్డుపడ్డాడు. ఆ చిత్ర నిర్మాతలు గాడిదలపై కూర్చున్నట్లు చిత్రీకరించబడిని కొన్ని ప్లకార్డులను ఆమె ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలంగా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని మాన్ సింగ్పై పోలీసులకు రుచి గుజ్జర్ ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ ఆల్బమ్లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.నటి రుచి గుజ్జర్ ప్రధానంగా మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించిన ఆమెకు పాపులారిటీ వచ్చింది. 2023 మిస్ హర్యానాగా నిలిచిన ఈ బ్యూటీ ఈ ఏడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. View this post on Instagram A post shared by Bollywood News (@bolly_newssss) View this post on Instagram A post shared by SpotlightBollywood (@spotlightbolly) -
ఐవీఎఫ్ దినోత్సవంలో సినీనటి లయ సందడి (ఫొటోలు)
-
'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' భారీ అంచనాలతో జులై 24న విడుదలైంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, ప్రీమియర్ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా 'వీరమల్లు' విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు, ప్రీమియర్ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 47 కోట్ల నెట్ వరకే పరిమితం అయింది. రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ. 56.29 కోట్ల నెట్ కలెక్షన్స్కు చేరుకుంది. అయితే, డే-2 మరింత దారుణమైన కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది.చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు, రెండోరోజు అంటూ కలెక్షన్స్ మేకర్స్ ప్రకటిస్తారు. కానీ, 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే, బాక్సాఫీస్ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే 'సాక్నిల్క్' మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పేర్కొంది. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 8.79 కోట్ల నెట్ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది. బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్, మొదటిరోజు రూ. 34.75 కోట్ల నెట్, రెండో రోజు రూ. 8.79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56.29 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ. 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. -
ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ కావడంతో ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ ఇచ్చింది. -
హీరోను వదిలేసి నన్ను మాత్రమే 'ఐరన్ లెగ్' అన్నారు: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతిహాసన్కు తొలి విజయం దక్కింది టాలీవుడ్లోనే. తెలుగులో తన మూడో చిత్రంగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అయితే, ఈ సినిమాకు ముందు అమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఛాన్సులు రావేమో అనుకుంటున్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి పిలుపు రావడం ఆపై భారీ హిట్ అందుకోవడం జరిగిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను ఐరన్ లెగ్ అని మాట్లాడిన వారందరూ ఆ సమయంలో ఒక విషయాన్ని గుర్తించలేదని శ్రుతిహాసన్ చెప్పారు.'తెలుగు పరిశ్రమలో నేను నటించిన మొదటి రెండు చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో నాపై ఐరన్ లెగ్ ట్యాగ్ వేశారు. కానీ, ఆ రెండు చిత్రాల్లో నేను నటించింది ఒకే హీరోతోనే అనే విషయాన్ని అప్పుడు ప్రజలు గుర్తించలేదు. నన్ను మాత్రం ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటప్పుడు ఐరన్ లెగ్ అని హెళన చేయడం ఎందుకు..? నావి ఐరన్ లెగ్స్, గోల్డెన్ లెగ్స్ కాదు... నా కాళ్లు నాకు వదిలేయండి. అలా ఎవరినీ హెళన చేస్తూ విమర్శలు చేయకండి' అంటూ శ్రుతిహాసన్ పేర్కొంది.శ్రుతిహాసన్ తెలుగులో వరుసగా 'సిద్ధార్థ్'తో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించారు. అయితే, అవి భారీ డిజాస్టర్గా మిగిలిపోయాయి. ఆ తర్వాతి ఏడాదిలోనే గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ సినిమా 'కూలీ'లో శ్రుతిహాసన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. -
'సోలో లైఫే సో బెటర్'.. పెళ్లిపై నిత్యా మీనన్ కామెంట్
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. నటుల్లోనే కాకుండా నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్(Nithya Menen) ఒకరు. రీసెంట్గా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు.. అంటే మరో మూడేళ్లలో 40ని టచ్ చేస్తారన్నమాట. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానానికి చేరుకున్న ఈ మలయాళీ భామ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే తిరుచిట్ర ఫలం (తిరు) చిత్రంలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా విజయ్సేతుపతికి జంటగా నటించిన తలైవన్ తలైవి చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని చెప్పారు. అలా చిన్న వయసులోనే ఒంటరి తనం అలవాటు అయ్యిందన్నారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తర్వాత ఈమె ధనుస్కు జంటగా నటించిన ఇడ్లీ కడై చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో పెళ్లి జరిగినా.. జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. -
ఆగస్టులో సుందరకాండ
నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్కుమార్ హీరోయిన్లు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. జూలై 25న నారా రోహిత్ బర్త్డే సందర్భంగా ‘సుందరకాండ’ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘ఈ చిత్రంలో హీరో జీవితంలోని వివిధ దశల్లోని రెండు ప్రేమకథలను చూపిస్తున్నాం. శ్రీదేవితో మొదటి ప్రేమ, వృతి వాఘానితో కలిసి రెండో ప్రేమకథని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
విశ్వంభరకు బై బై
‘విశ్వంభర’ సినిమా షూటింగ్కు చిరంజీవి బై బై చెప్పారు. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.తాజాగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్లో చిరంజీవి, బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పాల్గొనగా చిత్రీకరించిన ఓ స్పెషల్ సాంగ్తో ‘విశ్వంభర’ సినిమా చిత్రీకరణ ముగిసింది. చిరంజీవి, మౌనీ రాయ్లతో పాటు వంద మంది డ్యాన్సర్స్ ఈ పాటలో పాల్గొన్నారు. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇక ఈ ‘విశ్వంభర’ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ పని పూర్తి కాగానే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై ఓ స్పష్టత వస్తుంది. ఈ సినిమా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
సెప్టెంబరులో సెట్స్కి...
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా (‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్కాస్ట్ వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ‘స్పిరిట్’ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని విజయ్ దేవరకొండ కోరగా.. ‘‘సెప్టెంబరు నుంచి ‘స్పిరిట్’ సెట్స్కి వెళుతుంది. షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్గా పూర్తి చేస్తాం’’ అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానమిచ్చారు సందీప్ రెడ్డి.ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటిస్తారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్స్, టీ–సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ ఈ చిత్ర నిర్మాతలు. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం తొమ్మిది భాషల్లో విడుదల కానుంది. -
'స్క్విడ్ గేమ్లో బాహుబలి'.. తెగ నవ్వులు తెప్పిస్తోన్న వీడియో!
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఇప్పటికే మూడు సీజన్స్ రిలీజ్ కాగా.. అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. అయితే ఈ సిరీస్లో మన సినీతారలు నటిస్తే ఎలా ఉంటుందో చూపించే వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఏఐ సాయంతో పలువురు స్టార్స్తో స్క్విడ్ గేమ్ సిరీస్ వీడియోలు రూపొందించారు.అయితే మన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి- స్క్విడ్ గేమ్ కలిపి చూస్తే ఎలా ఉంటుంది. మీకు కూడా అలా చూడాలని అనిపిస్తోందా? అయితే ఈ వీడియో మీ కోసమే చేసినట్లు ఉంది. బాహుబలి- స్క్విడ్ గేమ్ సీన్స్ను కలిపి ఓ వీడియోను రూపొందించారు. బాహుబలి ఇన్ స్క్విడ్గేమ్ అంటూ సినిమా, వెబ్సిరీస్ను కలిపి క్రియేట్ చేసిన క్రాస్ ఓవర్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. బాహుబలిలోని ప్రభాస్, కట్టప్ప స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించిన విధానం నవ్వులు తెప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి. -
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ రెండు నెలల క్రితమే నూతన గృహ ప్రవేశం చేసింది. తమ జీవితంలో మరో అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా తమ కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టుకుంది. కొత్తింట్లో సంప్రదాయ పద్ధతిలో హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం నిర్వహించింది.అయితే గృహ ప్రవేశం మరో సంప్రదాయ శుభకార్యం నిర్వహించింది. తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మన ఆధ్యాత్మిక, వైదిక సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా అనసూయ మరో సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. మన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రకృతి ఒడిలో కూర్చోబెట్టి నలుగు పెట్టి మరి స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.మన పూర్వీకులు/పెద్దలు మనల్ని అనుసరించమని చెప్పినా సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు పాటించాలని తెలిపింది. మన ఆచారాలను అనుసరించడంలో వచ్చే అపరిమితమైన విలువ, సారాంశం, అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని పోస్ట్ చేసింది. పిల్లలు పుట్టిన తొలినాళ్లలో ఈ ఆచారాలు పాటించానని తెలిపింది. మరోసారి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది అనసూయ. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
పెళ్లి చేసుకోలేదు.. తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికైనా..
ఆనందం సినిమా హీరోయిన్ గుర్తుందా? రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్ అయింది. ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.రీఎంట్రీకి రెడీ..పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్వుడ్కు షిఫ్ట్ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. తీవ్ర అనారోగ్యంతో సమస్యలు2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.పెళ్లి చేసుకోలేదుఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్గానే ఉంచింది.చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్ -
'దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు'.. జ్యోతిరాజ్ సందీప్ క్లారిటీ!
కొరియాగ్రాఫర్ ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ సందీప్ గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్బాస్ కంటెస్టెంట్గా తన భర్త పాల్గొన్నప్పుడు ఫుల్ సపోర్ట్గా నిలిచింది. అయితే కొన్నిసార్లు అభిమానులతో వివాదాలు కూడా కొని తెచ్చుకుంది. ప్రస్తుతం డ్యాన్స్ అకాడమీలో బిజీగా ఉన్న జ్యోతిరాజ్ సందీప్ ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం జనరేషన్లో భార్య, భర్తల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది. మా ఇద్దరిని చూసినప్పుడు అబ్బా.. ఎంత అద్భుతమైన జంట అని అందరూ అనుకుంటారు.. కానీ దాని వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని మాట్లాడింది.నేటి సమాజంలో పెళ్లి, ప్రేమ, విడాకులు, భార్య-భర్తల రిలేషన్స్ గురించి వీడియోలో ప్రస్తావించింది. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తగ్గి ఉంటేనే బంధాలు బలంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్లో కొత్త జంటలు విడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు కూడా తగ్గకపోవడమేనని అని వివరించింది. ఇక్కడ తగ్గడం అంటే మన ఇష్టాలను త్యాగం చేయడమే.. కానీ ఆ త్యాగంలో కూడా ప్రేమను వెతుక్కోవచ్చని సలహా ఇచ్చింది. అయితే జ్యోతిరాజ్ మాటలను కొందరు సమర్థించగా.. మరికొందరేమో వ్యతిరేకించారు. దీంతో మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ మరో వీడియో పోస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.జ్యోతిరాజ్ తన వీడియోలో మాట్లాడుతూ..'మొన్న నేను చేసిన వీడియోకు బాగా రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది కాల్ కూడా చేశారు. అయితే కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయని ఘాటుగా స్పందిస్తున్నారు. దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. చాలామంది మొగుళ్లను వదిలేస్తున్నారు. అలా అని చెప్పి మగవాళ్లందరు సుద్దపూసలని నేను చెప్పట్లేదు. ఇప్పటికీ ఆడవాళ్లలో బంగారు తల్లులు, బంగారు పెళ్లాలు ఉన్నారు. ఫ్యామిలీ, పిల్లల కోసం చదివిన చదువులను కూడా త్యాగం చేసినవాళ్లు ఉన్నారు. నేను అలాంటి వారి గురించి మాట్లాడట్లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులు కష్టపడి పెంచితే.. చిన్నచిన్న కారణాలతో విడిపోయి ఇంట్లో ఉంటే వాళ్లు బాధపడతారు. ఎంతోమందిని చూసిన తర్వాత నేను ఆ వీడియో చేశా. దానికి మీరు ఏదేదో ఊహించుకుని నా మనసులో ఏదో బాధ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఈ ప్రపంచంలోనే మోస్ట్ లక్కీయస్ట్ వైఫ్ని. మా ఆయనకు నేనంటే పిచ్చి.. మా ఆయనంటే నాకు పిచ్చి.. మేమలా ఫిక్సయ్యాం. తగ్గాలంటే చేతులు కట్టుకుని నిలబడాలని కాదు.. ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండాలి. అదే నా ఇంటెన్షన్' అని తన వ్యాఖ్యలపై ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది. ఈ కాలంలో భార్య, భర్తల రిలేషన్స్ గురించి గొప్పగా చెప్పారంటూ జ్యోతిరాజ్పై కొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) View this post on Instagram A post shared by Jyoti Raj (@jyothiraj_sandeep) -
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్లో కనిపించాడు. -
చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున (Nagarjuna Akkineni) దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. అగ్రనటుడు నాగార్జున కుమారుడైన హీరో నాగ చైతన్య–సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గైర్హాజరుఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరు అవుతారని ఆమె తరఫు న్యాయవాది గుర్మిత్సింగ్ కోర్టుకు సూచించారు. దీంతో విచారణను ఈనెల 28కు వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది.ఏం జరిగింది?నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి కేటీఆర్ కారణమన్నారు. నాగార్జున, చైతన్య కలిసి.. సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని, అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందని ఆరోపణలు చేయడం పెను సంచలనమైంది. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే తనకుగానీ, తన కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పలేదంటూ.. నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ -
'జూనియర్' టైటిల్ వీడియో సాంగ్.. కిరీటి డ్యాన్స్ అదుర్స్
వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'జూనియర్'.. జులై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కిరీటి డ్యాన్స్ అని నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో పాటలు ట్రెండ్ అయ్యాయి. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటించగా జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారి సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్లో కిరీటి డ్యాన్స్ బాగుందని ప్రసంశలు పొందాడు. అలాంటి సాంగ్ను మీరూ చూసేయండి. -
హరి హర వీరమల్లు మొదటిరోజు కలెక్షన్స్..!
-
'మడిసన్నాక కూసంత కలాపోసనుండాల'.. నేటికీ ఈ డైలాగ్స్ ఫేమస్
'ముత్యాల ముగ్గు' సినిమా తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్గా నిలిచిపోవడంతో పాటు ఒక సువర్ణ అధ్యాయానికి ప్రారంభమని చెప్పవచ్చు. బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ మాటలతో 1975లో విడుదలైన ఈ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి. ఈ సినిమాకు రావు గోపాలరావు పాత్రనే ఒక ఊపిరి, జీవం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ముత్యాల ముగ్గు సినిమా, సామాజిక సమస్యలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఇందులో సూరపనేని శ్రీధర్, సంగీత, కాంతారావు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, నూతన్ ప్రసాద్ వంటి స్టార్స్ నటించారు.ముత్యాల ముగ్గు విజయానికి కారణం ఇదే1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు తెలుగు సినిమాల్లో క్లాసిక్గా నిలిచింది. దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్కు తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని‘ముత్యాల ముగ్గు’ నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్థారణలు లేకుండా ఆమెను కారడవులకు సాగనంపడం ఈ నేటికీ సమాజంలో కొనసాగుతూనే ఉంది. అనుమానించడం మగవాడి వంతు. శిక్ష వేయడం అతడి అధికారం. కాని అనుమానించిన రాముడే మచ్చను మిగుల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడుగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ‘ముత్యాల ముగ్గు’ విజయం సాధించింది. ‘లవ కుశ’ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవ కుశ మల్లేనే పెద్ద విజయం సాధించింది.ముత్యాల ముగ్గులో ప్రత్యేకత ఏంటిలైట్లు వాడకుండా శాటిన్ క్లాత్తో ఔట్ డోర్ సన్నివేశాలను అందంగా తీసిన ఇషాన్ అర్యా ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. అంత వరకు లౌడ్ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు చూపిన సాఫ్ట్ విలనీ ఒక ఫ్యాక్టర్. కుత్తుకలు కోసే వాడు కూడా మామూలు మనిషిలానే ఉంటాడని అతడికీ కళాపోషణ ఉంటుందని అతడూ తన కూతురిని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది. ‘అలో అలో అలో’... ‘ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ’... ‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు’ వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకట రమణ రచన ఒక ఫ్యాక్టర్. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్లా చూపించిన బాపు దర్శకత్వం మరో ఫ్యాక్టర్.ఈ సినిమాలో మనుషులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఒక పాత్ర పోషిస్తాడు. సీతమ్మనురాముడితో కలిపిన హనుమంతుడు ఈ సినిమాలో పిల్లల ఊహలలో ఆలంబనగా నిలిచి వారికే కాదు ప్రేక్షకులకు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనకు ప్రతీకగా ఒక కోతి పిల్లల భుజాల మీద ఎప్పుడూ ఉంటుంది. అదే సినిమాలో అల్లు రామలింగయ్యను శిక్షిస్తుంది. రాముడి నగలను కాజేయ బోయిన అల్లు రామలింగయ్య మీద కోతి దాడి చేస్తుంది. అప్పటి నుంచి అతడికి అందరూ కోతుల్లాగా కనిపించే మానసిక జాడ్యం వస్తుంది. ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చేసిన అల్లు రామలింగయ్య చప్పట్లు కొట్టించుకుంటారు. అలాగే కనిపించేది కొన్ని క్షణాలే అయినా ‘కాలుకెంత చేయికెంత కాలేజీ సీటుకెంత కన్సెసన్ ఏమైనా ఉందా?’ అంటూ చిటికెలు వేస్తూ మాడ వెంకటేశ్వరరావు కూడా అందరికీ గుర్తుండిపోతాడు.అన్నట్టు ఈ సినిమాను ఎన్.టి.రామారావు చూసి సంగీత, శ్రీధర్ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ ‘మా పెళ్లిరోజులు గుర్తొచ్చాయి బ్రదర్’ అని ముళ్లపూడితో అన్నారట.‘ముత్యాల ముగ్గు’లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ల తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే. ఈ డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ?ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల.ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది. నాకు మనుషులమీదే నమ్మకంపోయింది. (ముక్కామలతో కాంతారావు)సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. ( కాంతారావుతో సంగీత) -
ఓటీటీలో 'మార్గన్'.. సడెన్గా తెలుగు స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్: ది బ్లాక్ డెవిల్' తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. చిత్రపరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి జూన్ 27న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు.మార్గన్ సినిమా అమెజాన్ ప్రైమ్లో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. నేటి (జులై 25) నుంచి తెలుగు, తమిళ్ వర్షన్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖ ఓటీటీ సంస్థ 'టెంట్కొట్ట'లో ఈ చిత్రం రన్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.కథ ఏంటి..?నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు.కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే. -
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'కు బాయికాట్ దెబ్బ గట్టిగానే తగిలింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఏ చిత్రం బతికి బట్ట కట్టలేదని మరోసారి నిరూపితం అయింది. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమాకు కష్టాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్, లైలా, రిపబ్లిక్, మట్కా వంటి చిత్రాలు బాయికాట్ దెబ్బతో మొదటిరోజే కనిపించకుండా పోయాయి. ఇప్పుడు హరిహర మీరమల్లు కూడా మొదటిరోజే ప్యాకప్ చెప్పే పరిస్థితి వచ్చింది. సినిమాలు చేసుకోండి. కానీ, ఆ వేదికలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాల కలెక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్హరిహర వీరమల్లును ఎలాగైనా నిలబెట్టాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ, సినిమా వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడటం.. ఆపై ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరుష వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వైఎస్సార్సీపీ అభిమానులు భగ్గుమన్నారు. #BoycottHHVM హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారు. ఈ దెబ్బ గట్టిగానే వీరమల్లుకు గుచ్చుకుంది. ఈ చిత్రం ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఏకంగా మూడు రోజులు ప్రచారంలోనే మునిగిపోయారు. వరుస మీడియా సమావేశాలు ఆపై సోషల్మీడియా ఇన్ఫ్లూయన్సర్లతో సెల్ఫీలు వంటివి గట్టిగానే చేశారు. కేవలం ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్ల ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది.పుష్ప2 సినిమా మొదటిరోజు కలెక్షన్స్ (294 కోట్లు) దాటేస్తామని చెప్పుకున్న పవన్ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి మొదటిరోజు రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే 'వీరమల్లు' రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 47 కోట్లు మాత్రమేనని ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి ఆపై 700 వందలకు పైగా ప్రీమియర్ షోలు వేస్తేనే కలెక్షన్స్ ఇలా ఉంటే... ఎలాంటి బెనిఫిట్స్ లేకుంటే 'వీరమల్లు' పరిస్థితి ఊహించుకోవడమే కష్టమని చెప్పవచ్చు.వీరమల్లుకు బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్ వస్తే.. మొదటిరోజు రూ. 34.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని సాక్నిల్క్ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. పుష్ప2 హిందీ వెర్షన్ మొదటి రోజున రూ. 72 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ రికార్డ్ను 'వీరమల్లు' మొత్తం కలెక్షన్స్తో కూడా టచ్ చేయలేకపోయాడు. -
బూజు దులపనున్నారా.. తెరపైకి సీక్వెల్ సినిమా
కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇండియన్ (భారతీయుడు). 1996లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే కాంబినేషన్లో ఇండియన్– 2 చిత్రాన్ని రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొంటూ దాదాపు నాలుగేళ్ల పాటు నిర్మాణాన్ని జరుపుకుంది. 2024 లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. కాగా దీనికి సీక్వెల్ను నిర్మించనున్నట్లు ఇండియన్– 2 చిత్ర నిర్మాణ దశలోనే పేర్కొన్నారు. అయితే ఇండియన్ –2 చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఇండియన్– 3 రావడం అసాధ్యమేనే ప్రచారం జరిగింది. ఆ చిత్రం గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కడం విశేషం. ఇండియన్ –3 చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఈచిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు శంకర్ వర్గాలను సంప్రదించగా ఇండియన్ –3 చిత్ర నిర్మాణానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా ఈ చిత్రాన్ని అయినా శంకర్ ప్రేక్షకులను రంజంపజేసే విధంగా తెరకెక్కిస్తారా..? అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం గేమ్ చేంజర్, తమిళ చిత్రం ఇండియన్– 2 పూర్తిగా నిరాశపరిచాయి. అదే విధంగా కమలహాసన్ కూడా ఇండియన్– 2, థక్ లైఫ్ చిత్రాలతో ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ సంస్థ మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఈ ముగ్గురికి ఇప్పుడు హిట్ చాలా అవసరం కావడం గమనార్హం. అందుకే ఇండియన్3 ప్రాజెక్ట్ బూజు దులుపేందుకు సిద్ధం అవుతున్నారట. -
ఆటా పాటా
పెద్దితో కలిసి ఆటాపాటాతో బిజీ కానున్నారట జాన్వీ కపూర్. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ అండ్ రూరల్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్, ఓ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు బుచ్చిబాబు.కాగా ఈ వారంలో ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో జాన్వీ కపూర్ పాల్గొంటారని తెలిసింది. రామ్చరణ్ – జాన్వీలపై ఓ పాటతో పాటు, లవ్ ట్రాక్, కీలక టాకీ పార్ట్ తీయనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. శివ రాజ్కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. అది అమానవీయ చర్య మహారాష్ట్రలోని ఓ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్పై గోకుల్ ఝా అనే వ్యక్తి చేసిన అమానుష దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిపై పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. ‘‘ఇది చాలా అమానవీయమైన చర్య. అలాంటి వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే. ఆ ఘటనను ఖండించి, అతడిని శిక్షించక పోతే అది మనకే సిగ్గుచేటు’’ అని ఇన్స్టాలో షేర్ చేశారు జాన్వీ. ఇక గోకుల్ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. -
గ్యాంగ్స్టర్స్ భూతాలైతే..!
నటి జెనీలియాను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లనున్నారట రామ్గోపాల్ వర్మ. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్, దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్’. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్ కోసం జెనీలియాను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పారని బాలీవుడ్ సమాచారం. ఈ హారర్ కామెడీ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే హైదరాబాద్లో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోందట.ఇక ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను ప్రకటించారు రామ్గోపాల్ వర్మ. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ చని పోతారు. ఆ చని పోయిన గ్యాంగ్స్టర్స్ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్స్టర్స్ పోలీసులను ఎలా ఇబ్బంది పెడతారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా కథ అని సమాచారం. -
తెలుగు యువ దర్శకుడికి కోడిరామకృష్ణ అవార్డ్
టాలీవుడ్ యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ఈ ఏడాది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికృష్ణకు యువ ప్రతిభ డైరెక్టర్ అవార్డ్ అందజేశారు. ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో కథలతో సాయికృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ అవార్డు, ఆయన కథ రచన, దిశానిర్దేశం, స్క్రీన్ప్లే రంగాల్లో చూపించిన సృజనాత్మకతకు గుర్తింపుగా దక్కించుకున్నారు. ఇటీవల ఆయన రూపొందించిన నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ సినిమాలకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ద్వారా యువ దర్శకులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోడిరామకృష్ణ ఫిల్మ్ ఫౌండేషన్కు, తుమ్మలపల్లి రామసత్య నారాయణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ – "ఇది కేవలం ఒక అవార్డ్ కాదు.. నా మీద ఉన్న నమ్మకానికి గుర్తింపు.. తెలుగు సినిమా కోసం ఇంకా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేయాలని ఉంది. నా టీమ్, నటీనటులు, టెక్నీషియన్లు, ప్రేక్షకులందరికీ ఇది అంకితం." అని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమానికి హీరో సుమన్, డైరెక్టర్ రేలంగి, నీహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. -
హరిహర వీరమల్లుపై ట్రోలింగ్.. పంచతంత్రం సీరియల్ బెటర్!
హరిహర వీరమల్లు (Harihara Veeramallu Movie).. ఐదేళ్ల కిందట మొదలైన సినిమా! ఎన్నో ఆలస్యాల తర్వాత జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లుకు ఎటువంటి బజ్ లేకపోయేసరికి హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోషన్ చేసుకుంది. అసలే నిర్మాత పెట్టిన డబ్బులు వస్తాయో, లేదోనన్న భయంతో నిలువునా వణికిపోతున్నాడు. ఏం లాభం?అతడి బాధ అర్థం చేసుకుందో, ఏమోకానీ కెరీర్ను పక్కనపెట్టి మరీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంది నిధి. తననలా చూశాక పవన్ కల్యాణ్కు బుద్ధి వచ్చినట్లుంది. సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్న నిధిని చూస్తే సిగ్గేసిందంటూ వెంటనే ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయినా లాభం లేదనుకోండి, అది వేరే విషయం!(చదవండి: హరిహర వీరమల్లు మూవీ రివ్యూ)అభిమానులకే నచ్చట్లేదుపవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా అనగానే అభిమానులు నానా హడావుడి చేశారు. కానీ సాయంత్రమయ్యేసరికి దాదాపుగా సైలెంట్ అయిపోయారు. కొందరు అభిమానుల నుంచి కూడా సినిమాకు నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుంది వారి పరిస్థితి! హరిహర వీరమల్లు వరస్ట్గా ఉంది.. ఓజీ సినిమాకు చూసుకుందాంలే అని వారే ఒప్పేసుకుంటున్నారు.పేలవమైన వీఎఫ్ఎక్స్ముఖ్యంగా రూ.250 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు వీఎఫ్ఎక్స్ కూడా దానికి తగ్గట్లే ఉండాలి. కానీ ఈ చిత్రంలో కొన్ని పేలవమైన గ్రాఫిక్స్ సినీప్రియులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. సినిమా అంత కలగూర గంపలా కనిపిస్తుంది. సినిమా కంటే తక్కువ.. సీరియల్ కంటే ఎక్కువ అని నెటిజన్లు హరిహరవీరమల్లును ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పవన్.. కోహినూర్ వజ్రాన్ని తేవడం ఏమో కానీ ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత తలనొప్పి అందించారు. బహుశా అందుకునేమో.. నిర్మాత రత్నం ఈ సినిమా హిట్టయితేనే పార్ట్ 2 ఉంటుందని థియేటర్ బయట నెమ్మదిగా జారుకున్నాడు. Done with my show #HHVM 🦅 Meeru ikkada review lu ichinantha worst ga aithe ledu antha kanna daridram ga undi💥 pic.twitter.com/NJLv3nEZ0f— 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 𝐈𝐜𝐨𝐧🗡️ (@icon_trolls) July 23, 2025Panchatantram 1episode>#HHVM whole movie 🤣— 🅰️llu🅰️rjun🔥mb🦁ntr🐯 (@BiBrfvr111388) July 24, 2025మిమ్మల్ని ఎవరూ ఆపాల్సిన పని లేదు మార్నింగ్ షోస్ కి మీరే ఆగిపోయారు 😂😂#HariHaraVeeeraMallu #DisasterHariHaraVeeraMallu pic.twitter.com/NyhOAQH8q8— Graduate Adda (@GraduateAdda) July 24, 2025#HHVM review raddam anukunna..Kani review rayadam kosam movie chudali anna kuda bhayam ga undi😭We wait for OG🫡— Telugu Meme Club (@telugumemeclub) July 24, 2025Cinema ki Thakkuva serial ki ekkuva 🍪🐶#HHVM #HHVMReview— GL 𝗔𝗔 DIATOR (@Gowthureddy_) July 24, 2025Manaki #OG undi idi #HHVM already decide ina output average ga untadi anukunnam kani worst ga undi feenini moyalsina pani ledu #OG lekkalu anni sarichestadi— NimmakuruNatukodi (@brolaughsalot) July 24, 2025Aurangzeb: ఎవరు నువ్వు ? చార్మినార్ దగ్గర ఏం పని ? Veera Mallu: నేను చార్మినార్ లోనే పుట్టాను....#HHVM #HariHaraVeeraMallu pic.twitter.com/mBBtePsyvK— 2.0 (@alanatiallari) July 23, 2025చదవండి: నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు -
వరలక్ష్మీ శరత్కుమార్ భర్త సర్ప్రైజ్.. కోట్ల విలువైన కారు గిఫ్ట్..! (ఫోటోలు)
-
బాబాయ్ సినిమాను పట్టించుకోని రామ్ చరణ్.. ఆ మెగా హీరోలు మాత్రం!
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. దాదాపు ఐదేళ్లపాటు షూటింగ్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచి ఈ చిత్రం కోసం నిరీక్షించిన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని రిలీజ్కు ముందు హల్చల్ చేశారు. కానీ తొలి ఆట నుంచే ఊహించని విధంగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఉత్సాహంగా థియేటర్కు వెళ్లిన అభిమానులు.. బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఆ జోష్ కనిపించలేదు. దీంతో తొలిరోజే వీరమల్లుకు పెద్ద షాక్ తగిలినట్లే అర్థమవుతోంది.అయితే హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో మెగా హీరోలంతా పవన్ కల్యాణ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ సినిమా సక్సెస్ కావాలంటూ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ తారలు వీరమల్లు చిత్రం రిలీజ్ వేళ మద్దతుగా పోస్టులు పెట్టారు.అయితే మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా రిలీజ్కు ముందు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ రోజు మాత్రమే పోస్ట్ పెట్టిన చెర్రీ.. హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎలాంటి విషెస్ చెప్పలేదు. దీంతో బాబాయ్ సినిమాకు చెర్రీ పోస్ట్ పెట్టకపోవడంపై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు పెద్ది సినిమాతో బిజీగా ఉండడం వల్లే కుదరక పోయి ఉండొచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాబాయ్ చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.The Power Storm we've all been waiting for is finally coming to the big screens in just a few hours.. Wishing my guru @PawanKalyan mama, a historic blockbuster with #HariHaraVeeraMallu 🔥@DirKrish garu’s foundation for a powerful story, along with the commendable efforts of… pic.twitter.com/iR7MYcuYtZ— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 23, 2025 It's Veera's Time 🔥Wishing the team of #HariHaraVeeraMallu all the success❤️A lot of hearts gone into this, hoping for a powerful blockbuster! 👊Super excited to watch Kalyan babai again on the Big Screen!! Power storm is coming! ❤️ pic.twitter.com/mHVHcXr45B— Varun Tej Konidela (@IAmVarunTej) July 23, 2025 -
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల తర్వాత రిలీజైంది. క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ చిత్రం చివరికి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ముగించారు. అభిమానుల భారీగా అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ ఫ్యాన్స్ సైతం సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలను అందుకోవడంతో హరిహర వీరమల్లు విఫలమైనట్లు తెలుస్తోంది.అయితే అభిమానుల సంగతి పక్కనపెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం చేసిన కామెంట్స్ మరింత హాట్టాపిక్గా మారాయి. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ సమాధానమిచ్చారు. హరిహర వీరమల్లు పార్ట్-2 గురించి ప్లాన్ చేస్తున్నారా? అని ఓ ఛానెల్ రిపోర్టర్ నిర్మాతను అడిగారు. దీనికి రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అయ్యాకే దాని గురించి అలోచిస్తాం అని అన్నారు. ఏఎం రత్నం సమాధానం చూస్తే ఆయనకే ఈ సినిమా హిట్ కావడంపై డౌట్ ఉన్నట్లు అర్థమవుతోంది. తమ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న ఆత్మవిశ్వాసం నిర్మాతకు లేదంటే హరిహర వీరమల్లుకు పెద్ద షాకే. ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశలో ఉండడంతో నిర్మాత కామెంట్స్తో హరిహర వీరమల్లు హిట్ కావడంపై ఆశలు ఇక లేనట్లే.కాగా.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏంతమేరకు కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.Appude Guess Cheyalsindi, We did a Mistake pic.twitter.com/b7hGjkbqMi— Shiva Akunuri (@AkunuriShivaa) July 23, 2025 -
టాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా దీపిక ప్లాన్స్
-
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
-
హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు
-
నటుడు 'విజయ్ దేవరకొండ'కు మరోసారి ఈడీ నోటీసులు
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11న హాజరుకావాలని సూచించింది. విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్ను జులై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. -
నటుడు జయం రవి పిటిషన్ కొట్టివేత
ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్ (జయం రవి). ఈయన భార్యతో వివాహ రద్దు కేసు కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయని కనిష్కతో ప్రేమాయణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిని నిజం చేసే విధంగా నటుడు రవిమోహన్ గాయనీ కనిష్కతో ఆలయాలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈయన గాయని కనిష్కతో కలిసి సంగీత కచేరిలో భాగంగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ మంత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే రవిమోహన్ తన సంస్థకు రెండు చిత్రాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని, అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు, అయితే ఆయన తమ సంస్థకు చిత్రాలు చేయకుండా వేరే సంస్థలకు చేస్తున్నారని, అడ్వాన్స్ తిరిగి చెల్లించమని కోరినా , ఇవ్వడం లేదని బాబీ టచ్ గోల్ల్ యూనివర్సల్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నటుడు రవిమోహన్ కూడా తాను కేటాయించిన కాల్షీట్స్ను వాడుకోకుండా వృథా చేసినందుకు గానూ ఆ సంస్థే తనకు నష్ట పరిహారంగా రూ.9 కోట్లు చెల్లించాలని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిగింది. కాగా తాజాగా న్యాయస్ధానంలో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసు పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ, నటుడు రవిమోహన్ పిటిషన్ను కొట్టి వేసింది. అంతే కాకుండా నటుడు రవిమోహన్ రూ.5.9 కోట్లకు సంబంధించిన పత్రాలను 4 వారాలలోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. -
హరి హర వీరమల్లు నటి నిధి అగర్వాల్ (ఫొటోలు)