-
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
తెలుగుమ్మాయి శోభిత ధూళిపాళ టాలీవుడ్, బాలీవుడ్లోనే కాదు ఏకంగా హాలీవుడ్లోనూ ఆఫర్ అందుకుని అక్కడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ మధ్య వెకేషన్కు వెళ్లగా.. తెలుగు హీరో నాగచైతన్య కూడా తన వెంటే ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసిందీ బ్యూటీ. 'ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ దట్స్ ఓకే' అని రాసుకొచ్చింది. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని దానర్థం.కప్ ఆఫ్ చాయ్/చైసాధారణంగా కప్ ఆఫ్ టీ అంటారు. కానీ శోభిత కప్ ఆఫ్ చాయ్ అని పేర్కొంది. దీంతో కొందరు నెటిజన్లు చైతన్యను ప్రస్తావిస్తూనే చై అని రాసిందని అభిప్రాయపడుతున్నారు. టీకి బదులుగా చాయ్/ చై అని రాయడం దేనికో అని కామెంట్స్ చేస్తున్నారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ పోస్ట్కు స్పందిస్తూ.. నేను కూడా నా విషయంలో అలాగే ఫీలవుతుంటాను అని రాసుకొచ్చాడు.కెరీర్శోభిత కెరీర్ విషయానికి వస్తే.. గూడచారి, మేజర్ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైంది. రామన్ రాఘవన్ 2.0, పొన్నియన్ సెల్వన్ 1, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించింది. మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సితార అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) చదవండి: 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు -
Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. సుమారు 25ఎళ్లుగా లైమ్లైట్లో ఒక హీరోయిన్ కొనసాగడమంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైనా అవకాశాలు లేక తమ సినిమా కెరియర్కు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం తెలుగు హిందీ కన్నడం భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్న త్రిష నేడు (మే4న) 41వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్గా తనేంటో చాటిచెప్పింది. అలా అదే ఏడాదిలో 'జోడి' (తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రన్కు స్నేహితురాలిగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్తో సూర్యతో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు 'మౌనం పెసియదే' తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి 'నీ మనసు నాకు తెలుసు' తో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్తో తెలుగు ప్రేక్షకులకు త్రిష బాగా కనెక్ట్ అయ్యారు.వర్షంతో మార్పు2004లో ప్రభాస్తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్లో త్రిష చేరిపోయారు.త్రిషకు బాగా నచ్చే హీరోలుతెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం ఆమె దక్కింది. స్టార్డమ్ని పట్టించుకోను అని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్గా లియో సినిమాలో మెప్పించిన త్రిష, ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్, వెంకటేశ్, ఆమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్లలో సిమ్రన్, ఏంజలినా జోలి అంటే ఆమెకు చాలా ఇష్టం.త్రిషపై ఉన్న వివాదాలుఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు.2016లో ఒకసారి తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్గా కమల్హాసన్ ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆమెను బాధపెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది.ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ, ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నింటినీ అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే, తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీగా ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి.కోట్ల రూపాయల ఆస్తులుహీరోయిన్గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కొ సినిమాకు సుమారు. రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. హైదరాబాద్లో కూడా త్రిషకు రూ. 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో కొన్నిప్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. రూ. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు సుమారుగా రూ. 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడాబెట్టినట్లు తెలుస్తోంది. -
'జో' సినిమా కాంబో రిపీట్.. ఈసారి ఎలాంటి స్టోరీ అంటే..
గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్లో విడుదలైన సినిమా 'జో'. హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇందులో రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించారు. వారిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా కోలీవుడ్లో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. కాగా ఇంతకుముందు హరి ముత్తయ్య వంటి దర్శకులతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన డ్రమాటిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మణికంఠన్ కందస్వామి సమర్పణలో రూపొందుతున్న నూతన చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.ఇందులో నటుడు రియోరాజ్, నటి మాళవిక మనోజ్ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. బ్లాక్ షిప్ కలైయరసన్ తంగవేలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్లాక్ షీప్ ఆర్జె విగ్నేష్, షీలా రాజకుమార్, డైరెక్టర్ ఏ వెంకటేశ్, గజరాజన్, జాన్సన్ దివాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధేశ్ మాణిక్ ఛాయాగ్రహణం, సిద్ధికుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పెళ్లయిన మగవాళ్ల సమస్యలను స్త్రీలు కూడా అంగీకరించేలా తెరకెక్కిస్తున్న కథాచిత్రమని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. కాగా దీనికి బ్లాక్ షీప్ సంస్థ సహనిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
ట్రెండింగ్ బీజేపీ నేత బయోపిక్లో స్టార్ హీరో
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బయోపిక్ ఉందా..? అందులో నటుడు విశాల్ అన్నామలై పాత్రలో నటించనున్నారా..? వంటి ప్రశ్నలు రాష్ట్రా వ్యాప్తంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. తమిళనాడులో బీజేపీ అధ్యక్ష పగ్గాలను అన్నామలై చేపట్టిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీకి ఒక గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. అన్నామలై రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారన్నది గమనార్హం. ఆయన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తికి మించి శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి అన్నామలై జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో అన్నమలై పాత్రలో విశాల్ నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. విశాల్ తాజాగా నటించిన రత్నం చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. తాజాగా ఆయన తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డిటెక్టివ్ 2 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో ఆయన 2026 ఎన్నికల పట్టికలో తన పేరు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వాగ్దాటి, ఆయన పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ నటుడు విశాల్ పేర్కొనడం గమనార్హం. కాగా అన్నామలై ఎలా పోలీస్ అధికారి అయ్యారు? ఆ తర్వాత ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించారు? వంటి ఆయన జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. -
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement