breaking news
Tollywood
-
స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తున్నాడు.ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. (ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్) -
'మైండ్తో ఆలోచించండి.. ఇలాంటి ట్రాప్లో పడొద్దు': టాలీవుడ్ నటి
సోషల్ మీడియా వచ్చాక వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను తీసుకొచ్చి సోషల్ మీడియా ఖాతాలో నింపేస్తున్నారు. ఇంకేముంది ఇదే అదునుగా చేసుకున్న కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. సెలబ్రిటీల పేర్లను వినియోగిస్తూ పెద్ద స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి పేరుతో కొందరు కేటుగాళ్లు స్కామ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కొందరు తన పేరును వాడి డొనేషన్స్ స్వీకరిస్తున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే నార్సింగ్ పీఎస్ ఫిర్యాదు చేశానని ప్రగతి వెల్లడించింది. నా అభిమానులు దయచేసి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందరూ కూడా చదువుకున్న వాళ్లే ఉన్నారు.. కొంచే మైండ్ పెట్టి ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పలువురు అమౌంట్ పంపి స్క్రీన్ షాట్స్ను షేర్ చేసింది ప్రగతి. ఇప్పటికే చాలామంది డబ్బులు కూడా పంపారని.. చిన్న మొత్తాలు కావడంతో పోలీసులు సైతం చర్యలు తీసుకోవడానికి ఆలస్యం జరుగుతోందని అన్నారు. ఐదు రోజుల క్రితమే చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) -
శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే యూత్ఫుల్ సినిమాలే గుర్తొస్తాయి. తను తీసిన మూవీస్తో చాలామంది కొత్తవాళ్లని నటీనటులుగా పరిచయం చేశాడు. అయితే వారిలో నిలబడి స్టార్స్ అయినవాళ్లు కొందరైతే.. క్రేజ్ వచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోలేకపోయిన వాళ్లు మరికొందరు. ఈ బ్యూటీ కూడా రెండో టైప్. ఈమె ఎవరు? తెలుగులో ఏ మూవీస్లో నటించింది? ఇప్పుడేం చేస్తోంది?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జరా షా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈమె మోడలింగ్ చేసింది. మంచి పేరు తెచ్చుకుంది. అలా దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడటంతో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఓ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. నాగరాజు పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ లక్ష్మిగా నటించింది. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. అలా ఈమెకు నాగార్జున 'భాయ్', అనుష్క 'రుద్రమదేవి' చిత్రాల్లో నటించే అవకాశమొచ్చింది.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)అలానే పైరేట్స్ 1.0, ఐతే 2.0 అనే తెలుగు సినిమాల్లోనూ జరా షా నటించింది. కానీ తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాత తగ్గిపోయింది. చేసిన మూవీస్ ఫెయిల్ కావడంతో ఈమె పూర్తిగా నటనని పక్కనబెట్టేసింది. అలానే మోడలింగ్ కూడా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అడపాదడపా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. సినిమాలో పాత్రకు ప్రస్తుతం ఈమెని చూస్తే కచ్చితంగా పోల్చలేరు. అంతలా డిఫరెన్స్ కనిపిస్తుంది. తాజాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాకు 13 ఏళ్లు పూర్తయిందని పోస్టర్ షేర్ చేయడంతో ఈమె మరోసారి టాపిక్ అయింది.ఇకపోతే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో లీడ్ రోల్స్ చేసిన అభిజిత్, సుధాకర్, జరా షా తదితరులు తర్వాత కాలంలో కనుమరుగైపోయారు కానీ ఇదే మూవీలో విలన్ గ్యాంగ్ వైపు కనిపించిన నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, శ్రీముఖి తదితరులు పెద్ద స్టార్స్ అయిపోయారు. ఇదే మూవీలో ఈషా రెబ్బా, శ్రీ విష్ణు కూడా నటించారు. ఇప్పుడు వీళ్లు హీరోహీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్) -
చిరంజీవితో 'మిరాయ్' దర్శకుడు సినిమా
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్... దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందాడు. సుమారు పదేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఆయన మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ, దర్శకుడిగా కాదు.వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. త్వరలోనే సెట్స్ మీదకు ఈ ప్రాజెక్ట్ వెళ్లనుంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ ఘట్టమనేని చేయబోతున్నారు. మెగాస్టార్తో తొలిసారి ఆయనకు ఛాన్స్ రావడంతో ఆయన సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, ఎక్స్ప్రెస్ రాజా,ధమాకా, కార్తీకేయ, చిత్రలహరి వంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తాజాగా విడుదలైన మిరాయ్ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా కార్తిక్ కావడం విశేషం. సినిమాటోగ్రాఫర్గా కార్తీక్కు మంచి గుర్తింపు ఉంది. దర్శకుడిగా పనిచేస్తూనే ఆయన తన కెమెరాకు కూడా పని చెప్తారు. డైరెక్టర్గా తొలిచిత్రం సూర్య వర్సెస్ సూర్య తర్వాత మిరాయ్తో భారీ హిట్ అందుకున్నారు. -
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు: మారుతి
హారర్ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు. పిచ్చిమాటలు, బూతులుతాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడుచొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను. రూ.400 కోట్లతో రాజాసాబ్బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి. చిల్లర పనులు చేయొద్దుఅందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
ప్రముఖ దర్శకుడికి డాక్టరేట్ ప్రదానం
ప్రముఖ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ గౌరవ డాక్టరేటు పొందారు. చెన్నైలోని ప్రముఖ యూనివర్సిటీ వేల్స్ ఇన్స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్కు గౌరవ డాక్టరేట్లను వారు ప్రదానం చేశారు. వడచెన్నై, అసురన్, విడుదలై, ఆడుకాలమ్,కాక్క ముట్టై వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనంతరం క్రికెట్లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్కు కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేశ్, రిజిస్ట్రారర్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గతంలొ ఇదే యూనివర్సిటీ నుంచి మెగా హీరో రామ్ చరణ్ కూడా గౌరవ డాక్టరేట్ పొందారు. -
కాపీరైట్.. ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఇళయరాజా : రజనీకాంత్
సినీ జీవితంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఇళయరాజా పేరును భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. అనంతరం ఆయన్ను జ్ఞాపికతో సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి వంటి స్టార్స్ పాల్గొన్నారు.ఇళయరాజా తన 50ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు చూశారని సీఎం స్టాలిన్ అన్నారు. కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా జీవితం చెబుతుందన్నారు. ఆయన సంగీతం విజయ ప్రస్థానానికి ప్రేరణ అందించడమే కాకుండా బాధలను కూడా ఓదార్చుతోందని సీఎం తెలిపారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఇళయరాజా పేరుతో ఒక పురస్కారం అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు.SP బాలు, ఇళయరాజా వివాదంపై రజనీ వ్యాఖ్యలు'ఇళయరాజా పాటలు నేడు చాలా సినిమాల్లో ఉపయోగిస్తున్నారని రజనీకాంత్ అన్నారు. దీంతో పలు సినిమా మేకర్స్పై కాపీరైట్ చట్టం ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇళయరాజా తను స్వరపరచిన పాటలపై కాపీరైట్ హక్కులు తనకే ఉన్నాయని.. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆ పాటలు మళ్లీ పాడకూడదని కోరారు. దీంతో బాలు కూడా మళ్లీ ఎక్కడా ఆ పాటలు పాడలేదు. కానీ, కోవిడ్ సమయంలో SPB మరణించినప్పుడు, ఇళయరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందే విలవిల ఏడ్చారు. గతంలో తన సోదరుడు, కూతురు, భార్య మరణించిన సమయంలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టలేదు. కానీ బాలు కోసం ఏడ్చేశారు. వారి మధ్య స్నేహం ఎంత బలమైనదో ఇదొక్కటి చాలు.' అని రజనీకాంత్ అన్నారు. -
ఆండ్రీతో ఫస్ట్ మీట్.. రాంగ్ ఫ్లైట్ బుక్ చేశా: శ్రియా శరణ్
టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించిన బ్యూటీ శ్రియా శరణ్. ఆ తర్వాత రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. తాజాగా మరోసారి మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న శ్రియా శరణ్ తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆండ్రీ కోస్చీవ్తో తన ప్రేమకథ గురించి శ్రియ శరణ్ ఓపెన్ అయింది. ఆండ్రీని మొదటిసారి కలిసేందుకు మాల్దీవులకు వెళ్లానని శ్రియా పంచుకుంది. అయితే ఫస్ట్ మీట్ కావడంతో టెన్షన్లో రాంగ్ ఫ్లైట్ బుక్ చేశానని తెలిపింది.శ్రియా మాట్లాడుతూ.. "నా డైవింగ్ ట్రిప్ ఏప్రిల్లో ఉంది. కానీ మార్చిలో నేను మాల్దీవులకు వెళ్లాను. అక్కడ దిగినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానని గ్రహించా. అక్కడ నేను ఒంటరిగా ఉన్నా. ఆ సాయంత్రం ఒక పడవ మాల్దీవులకు దక్షిణంగా వెళుతోందని నాకు తెలిసి అందులో వెళ్లా. అదొక అందమైన సూర్యాస్తమయం. అక్కడ నాకు ఎవరు తెలిసినవారు లేకపోవడంతో ఒంటరిగా ఉన్నా. భయపడి డెక్ మీద నిలబడి ఉన్నా. అదే సమయంలో తిరిగి చూడగానే ఆండ్రీ నా వెనకే ఉన్నాడు. అలా మేము మొదటిసారి కలుసుకున్నాం" అని గుర్తు చేసుకుంది.అయితే తన సినిమా దృశ్యం చూసిన తర్వాత ఆండీ కోస్చీవ్ నన్ను చూసి భయపడ్డాడని వెల్లడించింది. ఆండ్రీకి, తనకు మొదట్లో ఒకరి గురించి ఒకరు ఏమీ తెలియదని.. అయినా మా రిలేషన్ చాలా అందంగా అనిపించిందని శ్రియ తెలిపింది. అలా డైవింగ్కు వెళ్లామని.. మాట్లాడుకుంటూనే మా ఇద్దరి మధ్య డేటింగ్ ప్రారంభమైందని పంచుకుంది. తాను మొదట రష్యన్ భాషలో చెడు పదాలు నేర్చుకున్నానని శ్రియ శరణ్ చెప్పింది. కానీ ఇప్పుడు తన కుమార్తె రాధా శరణ్ కోస్చీవ్తో కలిసి భాషను సరిగ్గా నేర్చుకుంటున్నానని నవ్వుతూ మాట్లాడింది. అంతేకాకుడా ఆండ్రీకి హిందీ బాగా అర్థమవుతుంది.. అదృష్టవశాత్తూ ఆండ్రీ భారతదేశానికి వచ్చాడని పేర్కొంది. కాగా.. శ్రియా శరణ్ 2018లో ఆండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్?
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..మాస్క వెనక రహస్యంసమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్లో సెటిలయ్యాడు.అన్ని ఉద్యోగాల్లో..ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్లో టీచర్గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారు.యాక్సిడెంట్2017లో హరీశ్కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్తోనే బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్లో కొనసాగడం కష్టమే!చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
రూ. 200 కోట్లు నష్టం.. రెమ్యునరేషన్ కూడా రిటర్న్: ఆమిర్ఖాన్
లాల్ సింగ్ చడ్డా చిత్రంతో రూ. 200 కోట్టు నష్టాలను ఎదుర్కొన్నట్లు తాజాగా ఆమిర్ఖాన్ చెప్పారు . 2022లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీకి ఆమిర్, అతడి మాజీ భార్య కిరణ్రావ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ముందు ఆమీర్ నటించిన ప్రతి సినిమా మినిమమ్ రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. అయితే, లాల్ సింగ్ చడ్డా మూవీకి వచ్చిన నష్టాల గురించి తాజాగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.'ఒక నిర్మాతగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఏదైనా సినిమా ప్రారంభిస్తే లాభాల కంటే నష్టాలు రాకుంటే చాలు అనే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. కానీ, లాల్ సింగ్ చడ్డా మూవీ బడ్జెట్ విషయంలో పొరపాటు చేశాను. వరుస విజయాలు నాకు దక్కడం వల్ల ఈ మూవీ విషయంలో కాస్త అతి నమ్మకం ఏర్పడింది. దీంతో బడ్జెట్పై ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. అందుకే నష్టపోయాను. దంగల్ సినిమాకు రూ. 390 కోట్లు ఇండియాలోనే వచ్చాయి. దీంతో లాల్ సింగ్ చడ్డాకు రూ. 200 కోట్లు వస్తాయని అంచనా పెట్టుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు.ఒక సినిమా రూ. 120 కోట్లు చేస్తుందని అనుకుంటే అప్పుడు మీ బడ్జెట్ రూ. 80 కోట్లు దాటకూడదు. ఇలా ప్లాన్ ఉంటే సేఫ్గా ఉంటాం. ఇలాంటి ప్రణాళిక లాల్ సింగ్ చడ్డా సమయంలో చేయలేదు. దీంతో రూ. 200 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాం. ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కువగా ట్రావెలింగ్కు ఖర్చు అయింది. చైనాలో తెరకెక్కించిన ఒక భారీ సీన్ ... ఎడిటింగ్లో తొలగించాం. ఆ ఖర్చు అంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.' అని అన్నారు.ఈ సినిమాకుగానూ ఆమిర్ రెమ్యూనరేషన్ రూ.50కోట్లు తీసుకున్నాడు. అయితే, ఆ మొత్తం సొమ్ముని వదులుకుని తన సహ నిర్మాతలకు తిరిగిచ్చేశారు. వారికి నష్టాన్ని తగ్గించాలనుకునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమిర్ భారీగానే నష్టపోయారు. ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్గా నటించగా ప్రముఖ తెలుగు నటుడు నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. -
2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)కు 38 ఏళ్లు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా దానికింకా టైముంది అని ఆ ప్రశ్నను దాటవేస్తూ ఉంటాడు. తాజాగా హైదరాబాద్లో ఓ సదస్సుకు హాజరైన సాయి దుర్గ తేజ్కు మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. అందుకు సాయిదుర్గ తేజ్ స్పందిస్తూ.. నాది చాలా విషాదకరమైన స్టోరీ.. 2023లో నాకు బ్రేకప్ జరిగింది. ఇప్పటివరకు అయినవాటిలో ఇదే చాలా బాధాకరమైన బ్రేకప్. మీడియా వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది. నా పెళ్లి నేనే ప్రకటిస్తాసినిమా హిట్టయింది, నెక్స్ పెళ్లే.. ఆ అమ్మాయితో వెడ్డింగ్, ఈ అమ్మాయితో వెడ్డింగ్ అంటూ నానా రకాల పుకార్లు సృష్టించారు. దానివల్లే మా ప్రేమ విఫలమైంది. ఆమె నా కాలేజీ గర్ల్ఫ్రెండ్.. తను ఆ పుకార్లు చూసి తట్టుకోలేకపోయింది. ఎక్కువగా ఆందోళన చెందింది. దాంతో బ్రేకప్ జరిగిపోయింది. కాస్త మీ అందరూ కాస్త సైలెంట్గా ఉంటే నా పెళ్లి వార్త నేనే ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చాడు.పిల్లలకు సమయం కేటాయించాలిఇంకా మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లలతో పేరెంట్స్ ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. చాట్ జీపీటీ, ఏఐ అంటున్నారు. నాకు మాత్రం మా అమ్మే నా ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు.. ఇలా వీళ్లతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. పిల్లలకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. నేను నా సెకండ్ క్లాస్ లవ్స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని ఆమె ఇచ్చారు. ఇకపోతే తెలంగాణలో కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నాను. వారి చదువు, పోషణ అన్నీ చూసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.అప్పట్లోనూ ఓ బ్రేకప్ స్టోరీకాగా 2023లో విరూపాక్ష సినిమా రిలీజ్ సమయంలోనూ తన పర్సనల్ లైఫ్ గరించి మాట్లాడాడు తేజ్. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పటినుంచి అమ్మాయిలంటేనే భయమేస్తుందన్నాడు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ తన తల్లి పేరు వచ్చేలా తప నేమ్ను సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
మలయాళం థ్రిల్లర్ సినిమా 'సూత్రవాక్యం' రివ్యూ
మలయాళంలో బడ్జెట్ తక్కువ కంటెంట్ ఎక్కువ ఉండేలా సినిమాలను నిర్మిస్తుంటారు. ఈ మధ్య మలయాళం నుంచి వచ్చిన చిత్రాలు తెలుగులో కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి మూవీస్ ఓటీటీలో మంచి ఆదరణతో దూసుకెల్తున్నాయి. దీంతో తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. తాజాగా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం" (Soothravakyam) మలయాళంలో మంచి విజయం అందుకుంది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో కూడా విడుదలైంది. ఇందులో దసరా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా అద్భుతంగా నటించాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషించారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.కథేంటి..?పోలీస్ స్టేషన్కు నేరాలు చేసినవాళ్లతో పాటు ఆ నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి..? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు..? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనతో "సూత్రవాక్యం" తెరకెక్కించారు. క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్ ఆఫీసర్. నిమిషా (విన్సీ లోషియస్) మ్యాథ్స్ టీచర్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు. ఈ సినిమా కథ అంతా వీరి చుట్టే ఎక్కువగా ఉంటుంది. క్రిస్టో జేవియర్ తన విధులతో పాటు పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. అయితే, అక్కడి పిల్లలు స్కూల్కు వెళ్లకుండా క్రిస్టో చెబుతున్న పాఠాలు వినేందుకు మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ విషయం నిమిషా టీచర్కు నచ్చదు. దీంతో తన ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేస్తుంది. అతని దగ్గరికి 11వ తరగతి చదివే ఆర్య (అనఘా) కూడా ట్యూషన్కు వస్తుంది. ఆమె అన్నయ్య అయిన వివేక్ (దీపక్ పరంబోర్) ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయం గురించి ఒకసారి వివేక్కు క్రిస్టో జేవియర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయినా అతనిలో మార్పు రాదు. ఇంతకు తన చెల్లి మీద వివేక్కు ఎందుకు కోపం..? ఆమెపై దాడి చేసి ఎక్కడికి వెళ్లిపోయాడు..? ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ ఎలా చనిపోతాడు..? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మరో యువతి మర్డర్ కేసు ఎలా బయట పడింది..? రెండు హత్యల వెనుక ఉన్నదెవరు..? ఎంతో ఉత్కంఠతో సాగిన విచారణలో క్రిస్టో జేవియర్ ఫైనల్గా హంతకులను ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మలయాళం సినిమా కథలు మొదట చాలా నెమ్మదిగా మొదలవుతాయి. సూత్రవాక్యం మూవీ కూడా అంతే.., అయితే, కాస్త ఒపికతో ఫస్ట్ 20 నిమిషాలు చూస్తే ఆ తర్వాత చాలా ఉత్కంఠతో ఈ చిత్రాన్ని చూస్తారు. సినిమా ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు కాన్సెప్ట్ మొదలౌతుంది. దానికి ఒక టీజర్ బాధ పడటం వంటి సీన్లు ఎంగేజ్ చేస్తాయి. స్టోరీ మధ్యలో ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఒక బావి స్టోరీ ఆసక్తిగా చెప్పడం వంటి సంఘటనలు పర్వాలేదనిపిస్తాయి. కథలో వివేక్ మరణంతో సినిమా పరుగులు పెడుతుంది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ను పంచుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. వివేక్ హత్య కేసు విచారణలో ఉండగానే మరో యువతి మర్డర్ కేసు బయటకు వస్తుంది. ఇలాంటి ట్విస్ట్లు సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయి. అమెజాన్ ప్రైమ్లో ఉన్న సూత్రవ్యాక్యం కేవలం 1 గంటా 52 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉంది. కుటుంబంతో పాటుగా చూడొచ్చు. -
ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
ఎప్పుడూ ఏదో ఒకరకమైన గొడవలతో మంచు ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ, ఈ మధ్య సినిమాల అప్డేట్స్తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య విష్ణు 'కన్నప్ప', నిన్న మనోజ్ 'మిరాయ్', నేడు లక్ష్మి, మోహన్బాబుల 'దక్ష' సినిమాల అప్డేట్స్ నడుస్తున్నాయి. చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కన్నప్పలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్కు రెడీ అయిన దక్షపుష్కరకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్కు మిరాయ్తో భారీ విజయం దక్కింది. మంచు లక్ష్మి కూడా తన తమ్ముళ్లలాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఓ సీక్రెట్ను బయటపెట్టేసింది. అలా అనుకుంటే జీవితం నరకం'మనోజ్ కమ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి. అవి ముగిసిపోతే బాగుండు అని అందరూ అనుకుంటారు. కానీ, జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మనోజ్.. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంతదూరం వచ్చాడు. అయితే మనోజ్కు, నాకు వయసవుతుంది.. కానీ, మా నాన్నకు వయసవ్వడం లేదు. ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. లీక్ చేసిన మంచు లక్ష్మి(అంతలోనే నాలుక్కరుచుకున) అఫీషియల్గా వచ్చిందా? లేదా నేనే లీక్ చేశానా? సరే పోనీ.. నాని ఏమీ అనుకోడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు.. తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ వయసులో చాలామంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి, నేను ఇంతకంటే ఎక్కువ చేయను అని బిల్డప్ ఇస్తుంటారు.చాలాకాలం తర్వాత విలన్గాకానీ, నాన్నగారు అలా చేయరు. ఆయన సెట్స్కు వస్తే ఒక చిన్నబిడ్డలా ప్రవర్తిస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్' అని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చింది. కాగా దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మోహన్బాబు విలన్గా నటించనున్నారని ప్రచారం జరిగింది. మంచు లక్ష్మి కామెంట్స్తో ఇప్పుడది నిజమని రుజువైంది.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
సక్సెస్ చూసి 12 ఏళ్లు.. నా ఫ్యామిలీని నిలబెట్టారు: మనోజ్ ఎమోషనల్
విజువల్ వండర్గా తెరకెక్కిన మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. శనివారం (సెప్టెంబర్ 13) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. రుణపడి ఉంటా..ఇలాంటి సక్సెస్ మీట్లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కమ్బ్యాక్ ఎప్పుడని అడిగేవారుఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్ మీడియాలో.. అన్నా, కమ్బ్యాక్ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్బ్యాక్ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది. నా కుటుంబాన్ని నిలబెట్టారుఇలాంటి సమయంలో డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ నన్ను నమ్మారు. కార్తీక్లాంటి దర్శకుడు, టెక్నీషియన్ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'మహావతార్ నరసింహ' 50 రోజులు పూర్తి
'మహావతార్ నరసింహ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్స్ నిండిపోయాయి. ఈ మూవీ ఆఫ్ సెంచరీ కొట్టడంతో డిలీటెడ్ సీన్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికీ ఎన్ని థియేటర్స్లలో రన్ అవుతుందో కూడా పేర్కొంది.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 200 థియేటర్స్ పైగానే 50 రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఆపై ఇప్పటి వరకు ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా బుక్మైషోలో రోజుకు సుమారు 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ 50రోజుల్లో బుక్మైషో ద్వారా సుమారు 67 లక్షలకు పైగానే టికెట్లు కొనుగోలు చేశారు. -
వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్
-
చాలా బాధపడ్డాను.. సోషల్మీడియాకు గుడ్బై చెప్పిన ఐశ్వర్య
మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. ఇకనుంచి తాను ఎలాంటి పోస్ట్లు. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్ చేయనని చెప్పింది. మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్-2 వంటి చిత్రాలతో ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్తో సంబరాల ఏటి గట్టు చిత్రంలో ఆమె నటిస్తుంది.సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇలా చెప్పుకొచ్చింది. ' ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియా చాలా ముఖ్యం. ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.., కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించాను. ఈ క్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. ఈ నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. అయితే, అది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలోని దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్మీడియా దోచుకుంది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తీసివేసింది. ఒక మహిళగా, సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా నేను జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం ఎంచుకున్నట్లు అనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.నాలోని కళాకారిణిని, నాలో దాగిన అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్కు పూర్తిగా దూరంగా ఉంటాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయనుకుంటున్నా.. ఎక్కువ సినిమాలలో నటించగలనని ఆశిస్తున్నాను. నేను మంచి సినిమాలు చేస్తూనే ఉంటా.. మునుపటిలాగా నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ప్రేమతో మీ ఐశ్వర్య లక్ష్మి.' అంటూ షేర్ చేసింది. View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
ఆ తెలుగు మూవీలో హీరోయిన్గా చేస్తానన్నా.. కాజల్కు ఇచ్చారు!
శివ మనసులో శృతి (2012) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ మద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తొలి సినిమాతోనే బాగా క్లిక్ అవడంతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కొత్త జంట, రారా.. కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ, ఎవరు.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఆచార్య మూవీలో సానా కష్టం అనే స్పెషల్ సాంగ్లోనూ తళుక్కుమని మెరిసింది. హీరోయిన్ ఛాన్స్ అడిగాఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించిన రెజీనా ప్రస్తుతం మాత్రం తమిళ, హిందీ భాషల్లో బిజీ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ అ సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను, లేదంటే అందులోనే బలమైన పాత్ర అడిగాను. అందుకాయన హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే కాజల్ను సంప్రదించినట్లు చెప్పాడు. సరే, పర్లేదని మరో (మీరా) పాత్ర ఇవ్వమన్నాను. అది కూడా లేదంటే మాత్రం నేను సినిమా చేయనని తెగేసి చెప్పాను.జాట్లో ఆ పాత్ర కోసం అడిగారుజాట్ సినిమాలో గోపీచంద్ మలినేని నాకు పోలీసాఫీసర్ పాత్ర ఆఫర్ చేశాడు. కథ మొత్తం విన్నాక నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను. ఎందుకంటే అంతకుముందెన్నడూ అలాంటి పాత్ర చేయలేదు. అలా జాట్ సినిమాలో భారతిగా కనిపించాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా.. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 మూవీ చేస్తోంది. హిందీలో ద వైఫ్స్, సెక్షన్ 108 సినిమాల్లో నటిస్తోంది.చదవండి: హనుమాన్ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్! ఫస్ట్డే కలెక్షన్స్ -
బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?
ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. హీరోయిన్గా రితికా నాయక్, విలన్గా మంచు మనోజ్, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.ఫస్ట్డే కలెక్షన్స్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది హనుమాన్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్ బద్ధలు కొట్టింది. మిరాయ్ మూవీ నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్ నిలిచింది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. BRAHMAND DAY 1 💥💥💥27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 #SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥Experience '𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥' in cinemas now 💥North America by @ShlokaEnts @peoplecinemas Superhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 Blockbuster Vibes & Grateful Smiles 🤩🤩🤩Team #MIRAI shares overwhelming joy for the BRAHMAND BLOCKBUSTER ❤️🔥❤️🔥❤️🔥Experience India's Most Ambitious Action Adventure Only On the Big Screens 💥💥💥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/OxOzGeWKbr— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
ఎస్తర్ ప్రకటన.. రెండో పెళ్లి గురించేనా?
సినీ నటి ఎస్తర్ నోరోన్హ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒక ఫోటోను షేర్ చేసి త్వరలో శుభవార్త చెబుతానంటూ పంచుకుంది. దీంతో అభిమానులు కూడా పెళ్లి గురించే ఉంటుంది అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్ కాలనీ,డెవిల్,టనెంట్ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్లో కూడా మెప్పించిన ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గతంలో తెలిపింది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్లేనని తెలుస్తోంది.కొత్త ప్రకటన అంటూ ఒక ఫోటోతో ఎస్తర్ ఇలా పంచుకుంది. 'జీవితంలో నాకు మరో అందమైన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అద్భుతాలను ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పుట్టినరోజున నాపై మీ అందరూ ప్రేమతో ఆశీర్వాదాలను కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీతో ఒక "ప్రత్యేక ప్రకటన" పంచుకోబుతున్నాను. త్వరలోనే ప్రకటిస్తాను. దయచేసి వేచి ఉండండి.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె రెండో పెళ్లి గురించి చెబుతుందని ఆందరూ ఆశిస్తున్నారు.రెండో పెళ్లి గురించి గతంలో ఎస్తర్ ఏం చెప్పిందంటే..టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ తన గ్లామర్తో కుర్రకారును అదరగొట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నాను. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
సాయిపల్లవి చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్
కోలీవుడ్లో నటుడు శింబుది ప్రత్యేక స్థానం. విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నా, అపజయాలను ఎదుర్కొన్నా, ఆయన క్రేజే వేరు. 50 చిత్రాలకు చేరుకున్న ఈయన తాజాగా కొన్ని క్రేజీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ కథా చిత్రం అని చిత్ర వర్గాల సమాచారం. వెట్రిమారన్కు దర్శకుడిగా ఒక ప్రత్యేక బాణి ఉంది. ఆయన కథలన్నీ సమాజంలోంచి, ముఖ్యంగా అట్టడుగు జనాల జీవితాలను ఆవిష్కరించేవిగా ఉంటాయి. కాగా ఇంతకుముందు ధనుష్ హీరోగా ఉత్తర చెన్నై నేపథ్యంలో వడచెన్నై అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా మరోసారి అదే నేపథ్యంలో మరో కోణంలో శింబు హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇది శింబు కథానాయకుడుగా నటిస్తున్న 49వ చిత్రం అవుతుంది. ఇందులో ఈయనకు జంటగా పూజాహెగ్డే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ప్రస్తుతం హిందీలో ఏక్ దిన్ చిత్రాన్ని పూర్తి చేసి, రామాయణ 1, 2 చిత్రాలను చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె మళ్లీ తమిళంలో నటించనున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
కథ విని షాకయ్యా: రాజేంద్రప్రసాద్
‘‘దర్శకుడు చిరంజీవి ‘నేనెవరు?’ చిత్ర కథ చెప్పినప్పుడు షాకయ్యా. ఇంత గొప్ప కథను కరెక్ట్గా తెరకెక్కించగలడా? అని సందేహపడ్డాను. కానీ, షూటింగ్కి వెళ్లాక అతను ఎంత జీనియస్ అన్నది అర్థం అయింది. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఈ సినిమాతో వారికి మంచి విజయం సొంతం కావాలి. నేను నటించిన మంచి సినిమాల్లో ‘నేనెవరు?’ ఒకటిగా నిలిచిపోతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తెలిపారు. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెవరు?’. సరికొండ మల్లికార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు–సకినాన భూలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు.హైదరాబాద్లో నిర్వహించిన ‘నేనెవరు?’ ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్కి హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, దర్శకుడు వి.సముద్ర అతిథులుగా హాజరై, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప ఆర్టిస్టుతో ‘నేనెవరు?’ చిత్రం రూపొందించే చాన్స్ లభించడం మా అదృష్టం. దసరాకి మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.చదవండి: దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు -
'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్
'మిరాయ్' సినిమా మంచు మనోజ్ టాలెంట్ను బయటకు తెచ్చింది. తన సత్తా ఏంటో ఈ చిత్రంలో చూపించాడు. గతంలో ఆయన నటించిన చాల సినిమాలు ప్రత్యేక గుర్తింపును పొందాయని చెప్పవచ్చు. వేదం, నేను మీకు తెలుసా, ఒక్కడు మిగిలాడు, ప్రయాణం వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తనలో మంచి నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు తెలిపాడు. అయితే, కుటుంబంలో వివాదాలు, తన వ్యక్తిగత కారణాల వల్ల సరైన సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మిరాయ్లో మహావీర్ లామా పాత్రలో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే తన అమ్మగారు నిర్మలా దేవి ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను మనోజ్ పోస్ట్ చేశారు.'మిరాయ్ విజయం మా అమ్మ అందరికంటే ఎక్కు గర్వంగా ఫీల్ అయింది. దీన్ని సాధ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న నా ప్రియమైన వారితో ఇలా సంతోషాన్ని పంచుకోవడం మరింత చిరస్మరణీయంగా ఉండిపోతుంది. ప్రతి సినిమా ప్రేమికుడికి మీరు చూపించే అపారమైన ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ఆయన తెలిపారు. మిరాయ్లో మంచు మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. మనోజ్ మాత్రమే చేయగలిగే పాత్ర అనేలా ఉంటుంది. ఈ సినిమా అతనికి మరిన్ని ఛాన్స్లు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు.మంచు కుటుంబంలో వివాదాల తర్వాత వారందరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మనోజ్ సోదరుడు మంచు విష్ణు కూడా మిరాయ్ యూనిట్ టీమ్ కోసం ఒక ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబం ఒక్కటి కాబోతుందని వారి అభిమానులు సంతోషిస్తున్నారు.My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025 -
‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలోని తన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కాల్పుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు .అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. -
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం
టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ బయోగ్రఫీని బుక్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మీ అండ్ మై పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పుస్తకం రాసేందుకు ఎందరో నాకు స్పూర్తినిచ్చారని అన్నారు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని.. లెక్చరర్గా పనిచేశాకే.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. నటరాజ ఆశీర్వాదంతో 1200 సినిమాల్లో నటించానని వెల్లడించారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..' నేనెందుకు ఆత్మకథ రాశాను అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎటువంటి పొలిటికల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. నాకు వెంకయ్య నాయుడు ఎంతో స్పూర్తి. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. మీమ్స్ బాయ్గా కూడా మార్చారని' అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..' యువకుడిగా ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చా. నాకు మీడియాతో ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రహ్మానందం జీవిత చరిత్ర పుస్తకం హిందీ, ఇంగ్లీష్లో విడుదలైంది. భారత దేశ చలనచిత్రలో ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన కనిపిస్తే అందరూ ఆనంద పడేస్తారు. ఎప్పటికీ అందరికీ బ్రహ్మానందం ఫేవరేట్. ఆయన సినిమాలు చూస్తే జనం ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ ప్రతిఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి, ఆదరించాలి, దాంతో పాటూ ఇతర భాషలు నేర్చుకోవాలి. దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరం. ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఇంగ్లీష్ అవసరం. భారత అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా 2035 నాటికి ఇండియా ఎదగటం ఖాయం' అని అన్నారు. Pleased to launch the autobiography of renowned film comedian & Padmashri awardee, Shri Brahmanandam Me and मैं in English & Hindi at the Foreign Correspondents Club of South Asia in New Delhi this evening. Shri Brahmanandam’s long career in movies spanning more than 3 decades… pic.twitter.com/xrf1y7mqpn— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 12, 2025 -
'పరదా' పవర్ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
అనుపమ పరమేశ్వరన్ చాలారోజులు తర్వాత తెలుగులో చేసిన సినిమా 'పరదా'. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమక్ష ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే, ఈ మూవీలో ప్రేక్షకులను మెప్పించిన ఒక వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అంటూ సాగే ఈ పాట ఆందరినీ ఆలోచింపజేస్తుంది. వనమాలి రిచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా, సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
మిరాయ్ పై అంచనాలు పెంచేసిన ప్రభాస్..!
-
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్.. స్పందించిన రష్మిక!
టాలీవుడ్లో కొన్నేళ్లుగా ఈ జంటపై రూమర్స్ ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎక్కడా కనిపించినా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు కథనాలొచ్చాయి. ఇంతకీ ఆ జంట ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ లవ్ బర్డ్స్గా పేరున్న రష్మిక, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మాత్రమే వచ్చాయి. వీటిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.అయితే ఈ సారి ఏకంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని కథనాలొచ్చాయి. ఇటీవల సైమా అవార్డుల వేడుకలకు హాజరైన రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. దీంతో హీరోయిన్ రష్మిక తన చేతి వేలి ఉంగరంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం నా సెంటిమెంట్ ఉంగరమని.. తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ చెప్తానని తెలిపింది. కాగా.. ఈ ఏడాది ఛావా, కుబేర సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. -
సొంత ఇళ్లు వాళ్లకు ఇచ్చేసి అద్దె ఇంట్లోకి రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ తన సినీ జీవితం కంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ట్రస్ట్ ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సహాయం, విద్యా సహాయం వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. అనాథ పిల్లలకు ఆశ్రయ, ఆహారం, విద్య, సంరక్షణ వంటి విషయంలో ఆయన అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమం కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా రాఘవ లారెన్స్ సోషల్మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. 'మీ అందరితో కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. నా సినిమా కాంచన- 4 అధికారికంగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మీలో చాలా మందికి తెలిసినట్లుగా.., నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ నేను ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిసిందే. ఈ క్రమంలోనే నా మొదటి ఇంటిని పిల్లల కోసం ఉచిత విద్య పాఠశాలగా మారుస్తున్నాను. ఈ విషయం ప్రకటించడానికి నేను నిజంగా సంతోషస్తున్నాను.ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకమైనది. నేను డ్యాన్స్ మాస్టర్గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు ఇది. తరువాత, నేను దానిని అనాథాశ్రమ పిల్లల కోసం గృహంగా మార్చాను. ఆ సమయంలో కుటుంబంతో నేను అద్దె ఇంటిలోకి మారాను. ప్రస్తుతం నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఇంటిని మరోసారి ఒక లక్ష్యానికి అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది. నేను ప్రారంభిస్తున్న ఉచిత పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు కూడా నా ఇంట్లో పెరిగిన బిడ్డే కావడం విశేషం. నేను చేరదీసిన బిడ్డ ఇప్పుడు చదువుకుని తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఈ విషయం నాకు మరింత సంతోషంగా, గర్వంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.Kanchana 4 is rolling and halfway through — I’m Happy to Announce That I’m Transforming My First Home into a Free School for Children with my Kanchana 4 Advance - with the First Teacher Being a Child Who Grew Up in my home 🙏 I’m so delighted to share some exciting news with… pic.twitter.com/qvcCYQruGE— Raghava Lawrence (@offl_Lawrence) September 11, 2025 -
మిరాయ్ సినిమా.. ప్రేక్షకుల రియాక్షన్స్ ఇదే!
-
విరామం ఇస్తున్నాను.. అనుష్క ట్వీట్ వైరల్
హీరోయిన్ ప్రాధాన్య చిత్రాల విషయంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ట్రెండ్ సెట్ చేశారు. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటేడ్ కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి ఘాటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా స్టోరీ ప్రేక్షకులను థియేటర్కు రప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఆమె ఒక నోట్ రాసి ట్వీట్ చేశారు.కొవ్వొత్తి వెలుగులో నీలిరంగు కాంతి దూరంగా కనిపించినట్లు.. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండబోతున్నాను. సరైన జీవితాన్ని గుర్తుచేసుకోవడానికి, ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మరిన్న కథలతో ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పటికీ అందరూ చిరునవ్వుతోనే ఉండండి. ప్రేమతో మీ అనుష్క శెట్టి.' అంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు.క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. మూవీ బాగాలేదని విమర్శలు వచ్చినప్పటికీ అనుష్క శెట్టి నటనను మాత్రం అందరూ ప్రశంసించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాత్ర గురించి కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టిని, మీరు ఇంకా ఏదైనా పాత్ర చేయాలనుకుంటున్నారా అని మీడియా వారు అడిగారు. దీనికి నటి, "నేను పూర్తిగా ప్రతికూల పాత్రను చేయాలనుకుంటున్నాను. బలమైన పాత్ర వస్తే, నేను ఖచ్చితంగా ప్రతికూల పాత్రను చేస్తాను" అని చెప్పారు.Love.... always forever ❤️ pic.twitter.com/ALRfMrvpK0— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2025 -
కిష్కింధపురి మూవీ హిట్టా.. ఫట్టా..!
-
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
-
మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)
-
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్కు వచ్చారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్గా నటించి, ఆడియన్స్ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, సునీల్తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్గా నటించారు. హిందీలో ఎన్టీఆర్కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్హాట్గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
ఐసీయూలో ఉన్నాడు.. సాయానికి ముందుకు రండి: మంచు మనోజ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మన రామచంద్రకు సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామచంద్ర ఐసీయూలో ఉన్నారని.. ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేసి మీ ప్రేమ, మద్దతు తెలపాలని మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. రామచంద్ర ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపరిచారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని గతంలో రామచంద్ర వెల్లడించారు.కాగా.. 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.Urgent 🚨 Namasthe All🙏🏻 Our dearest Rama Chandra garu is fighting for his life in the ICU. Now is the time for us to come together. Please show your love and support by contributing whatever you can even if it’s just 1 rupee.Details: Kalaga NarayanaGPay & PhonePe:…— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 11, 2025 -
వరుణ్ తేజ్కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
'సిద్ధు జొన్నలగడ్డ' కొత్త సినిమా.. రొమాంటిక్ టీజర్ చూశారా?
'తెలుసు కదా' సినిమా నుంచి క్లాసిక్ టీజర్ విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆయన నటించిన మూవీ జాక్ నిరుత్సాహపరిచింది. దీంతో ‘తెలుసు కదా’ మూవీపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించారు. -
'కిష్కింధపురి' ట్విస్ట్.. సినిమా చూసిన వారి టాక్ ఇదే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కిష్కింధపురి'.. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.'కిష్కింధపురి' ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని AAA ముల్టీప్లెక్స్లో ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడిని చెబుతున్నారు. ఫస్టాఫ్ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ను తెరపై అంతే చక్కగా చూపించారు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ జానర్ బాగా సెట్ అయిందనే చెప్పాలి. సూపర్గా నటించి మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది. -
ఓటీటీలో సెన్సేషనల్ హిట్ సినిమా 'సైయారా'
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సైయారా'(Saiyaara) ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) జంటగా 'సైయారా'తో బాలీవుడ్కు పరిచయమ్యారు. వీరిద్దరూ క్రిష్, వాణి పాత్రలతో యూత్ను మెప్పించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా విడుదలైన 'సైయారా' నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12న ఓటీటీలోకి రానుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది. అందుకే ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో భారీ ఫైట్స్ లేవు. పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కేవలం ఎమోషన్ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. -
మల్లెపూల ఎఫెక్ట్.. అస్ట్రేలియా అధికారులకు నటి లేఖ
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు ఆమె మెల్బోర్న్ ఎయిర్పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ. 1.14లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు. "జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది. దానిని నేను ఏమీ దాచలేదు. కానీ, నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్పోర్ట్లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి. బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు. 28రోజుల్లో చెల్లించాలని కోరారు' అని ఆమె చెప్పారు.ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు. 'జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను. వారు మాఫీ చేయకపోతే రూ. 26వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్లో చదివాను. ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ' అని ఆమె అన్నారు.ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..?బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు. -
అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. నాకు ఇష్టమైన జానర్👻 టీనేజ్లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కౌశిక్ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. హారర్ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ని సెట్గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్ డిజైనర్ రాధాకృష్ణగారు సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు. కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్కి ద బెస్ట్ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. 👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్ కలిసి సినిమా చేస్తాం.చదవండి: బిగ్బాస్: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
ఫిల్టర్ లేకుండా డింపుల్ హయాతి.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
బయ్యర్లకు రూ. 4 కోట్లు రిటర్న్ చేసిన నిర్మాత?
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా (Mazaka) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్ కాలేదు. దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్ దండ నిర్మించారు. రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే, ఈ సినిమా చాలామంది బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే బయ్యర్లు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్మాతలతో ఢీల్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీ నష్టాలు వస్తే కొంత నిర్మాతల నుంచి రిటర్న్ ఉండేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు.మజాకా మూవీని కొనుగోలు చేసిన బయ్యర్స్ను నిర్మాత రాజేశ్ దండ ఆదుకున్నారంటూ ఒక వార్త సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మజాకా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్స్ కొనుగోలు చేశారు. విడుదల తర్వాత కూడా సినిమా బాగుందని టాక్ వచ్చింది. కానీ, కమర్షియల్గా అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. ఆ డబ్బు తిరిగివ్వాలని నిర్మాతను చాలారోజులుగా బయ్యర్తు అడుగుతూ వచ్చారట. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని వారికి చెల్లించారని తెలుస్తోంది.ప్రస్తుతం నిర్మాత రాజేశ్ దండ మరో సినిమాతో రానున్నారు. కిరణ్ అబ్బవరంతో కే రాంప్ (K-Ramp) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ మూవీకి లైన్ క్లియర్ కావాలంటే బయ్యర్లతో ఉన్న వివాదం సెటిల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేశారని టాక్. -
‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.నేడు అర్ధరాత్రి ( సెప్టెంబర్ 11) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.కథేంటి..?వైజాగ్ పోర్ట్లో కింగ్పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ. -
అమ్మ అడుగుపెట్టగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు
మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి ఈవెంట్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా ఉందా? అని సుస్మితను అడిగారు. దీనికి సుస్మిత స్పందిస్తూ ఇవాళ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.సుస్మిత మాట్లాడుతూ..'ఇవాళే మన శంకర వరప్రసాద్గారు మూవీ సాంగ్ షూట్ చేశాం.. అక్కడికి అమ్మ కూడా రావడంతో నాన్న స్టెప్ అటు ఇటు అయింది. నాన్న సరిగ్గా డాన్స్ చేయలేకపోయారు. అమ్మ సెట్లో అడుగుపెట్టడంతో ఆ ఎఫెక్ట్ నాన్నపై పడిందని' పంచుకుంది. మీకు ఏదంటే భయమని సుస్మితను అడగ్గా.. మనకి భయపెట్టడం తప్ప.. భయపడటం ఏమీ ఉండదని సమాధానమిచ్చింది. కాగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి చిత్రం ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
వీడు మంచి స్టూడెంట్.. ఎగ్జామ్ పాసవుతాడు: కిష్కింధపురి డైరెక్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..' మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను. అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం. అస్సలు కంగారు లేదు.. మూవీ చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు.. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు.. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది. కచ్చితంగా డిస్టింక్షన్లో పాసవుతామనే నమ్మకం ఉంది' అని అన్నారు. -
అల్లుడిని చూసి మురిసిపోతున్న నిహారిక.. బ్లాక్ శారీలో బిగ్బాస్ బ్యూటీ దివి!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్..విదేశాల్లో చిల్ అవుతోన్న నటి మంజు వారియర్..వరుణ్ తేజ్ కుమారుడితో నిహారిక కొణిదెల పిక్..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..హాలీవుడ్ పాపలా పోజులిచ్చిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
బిగ్బాస్ హౌస్లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్!
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్బాస్లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్తో హౌస్ను హీటెక్కించారు బిగ్బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్మేట్స్ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్బాస్ ప్రోమో చూసేయండి.Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ స్టార్ దంపతులు వరుణ్ తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. లావణ్య బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్- లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అటు అభిమానులు, సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా వరుణ్ జంటకు విషెస్ చెప్తున్నారు.లవ్ మ్యారేజ్వరుణ్-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్ సినిమాలో తొలిసారి జంటగా నటించారు. తర్వాత అంతరిక్షంలోనూ యాక్ట్ చేశారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్లో ఉన్నారు. తర్వాత పెద్దలనొప్పించి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ చివరగా గతేడాది మట్కా సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం #VT15 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. Our little man 🩵🩵🩵10.09.2025 pic.twitter.com/dFTCFFPl9o— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2025 View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
పుష్ప 3 స్టోరీ లీక్ అయ్యిందా..? అసలు సుకుమార్ ప్లాన్ ఏంటి ?
-
'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా
కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహా' అనే యానిమేషన్ సినిమా సంచలనం సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి రికార్డ్స్ కొల్లగొడుతోంది. ఇప్పుడు దీన్ని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ తెలుగులోనూ ఓ మూవీ తీసేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ)ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తన కొత్త మూవీని ప్రకటించింది. హనుమంతుడి జీవితం ఆధారంగా 'వాయుపుత్ర' పేరుతో ఈ త్రీడీ యానిమేషన్ సినిమాని తీస్తున్నారు. 'కార్తికేయ', 'కార్తికేయ 2', 'తండేల్' లాంటి హిట్ చిత్రాలు తీసిన చందు మొండేటి.. ఈ యానిమేషన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.నరసింహా అవతారం ఆధారంగా 'మహావతార్' మూవీ తీశారు. జనాల్ని భక్తి పారవశ్యం చెందేలా చేశారు. ఇప్పుడు 'వాయుపుత్ర' పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని యానిమేషన్ రూపంలో చూపించబోతున్నారని అనిపిస్తుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో నటీనటుల్ని పక్కనబెట్టి ఇలా పురాణాల్లోని క్యారెక్టర్స్ ఆధారంగా యానిమేషన్ మూవీస్ మరిన్ని వస్తాయేమో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ)మన చరిత్ర, ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడిది ప్రత్యేక స్థానం. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు.. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం.. భారీస్థాయిలో త్రీడీ యానిమేషన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. -
హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ
ఎన్ని సినిమాలు చేసినా సరే నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. మరోవైపు అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. అదీ తనకు నచ్చిన పాత్రలు అయితేనే.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)ఇటీవల మలయాళంలో మోహన్ లాల్కు జంటగా 'తుడరుమ్' మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓనం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.మమ్ముట్టి నటిస్తే స్వాగతించలేదా? అని సదరు దర్శకుల్ని తాను ప్రశ్నించినట్లు శోభన చెప్పారు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి.. రీసెంట్గా 'కాదల్ ది కోర్' అనే సినిమా చేశారు. ఇందులో స్వలింగ సంపర్కుడిగా (హిజ్రా) నటించడం విశేషం. దీంతో హిజ్రా పాత్రలో నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు శోభన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలో నటించడం చాలా కష్టమని చెప్పిన ఈమె.. అందుకు రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా శోభనని హిజ్రాగా నటింపజేయడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే టాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి గానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడట్లేదు. అయితే హిట్ లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. మరోవైపు మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు షాకింగ్ ఛాలెంజులు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్గా నిర్మాత నాగవంశీ ఇలానే ఛాలెంజ్ చేసి ఎంత ట్రోలింగ్కి గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.కొన్ని నెలల క్రితం 'భైరవం'తో వచ్చిన బెల్లంకొండ.. ఫ్లాప్ చవిచూశాడు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే హీరో చేసిన కామెంట్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)'రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి సినిమాలో లీనమయ్యే సత్తా ఈ 'కిష్కింధపురి'కి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే చాలు మనం సక్సెస్ అయినట్లే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా' అని బెల్లంకొండ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో ఏం చేస్తాడో చూడాలి?బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన ఈ హారర్ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పాడుబడిన రేడియో స్టేషన్, అక్కడికి వెళ్లిన కొందరు ఔత్సాహికులు, కాసేపటికి దెయ్యం ఎంటర్, తర్వాత ఏమైంది? అనే కాన్సెప్ట్తో తీసిన మూవీలానే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
సస్పెన్స్... థ్రిల్
సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోహిణి’. సంగ కుమార్ దర్శకత్వంలో కేవీ నరసింహ రాజు సమర్పణలో కుశాల్ రాజు నిర్మించారు. ఆనంద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్, ట్రైలర్ విడుదల వేడుకని హైదరాబాద్లో నిర్వహించారు. సంగ కుమార్ మాట్లాడుతూ–‘‘యూనిట్లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే మా సినిమా త్వరగా పూర్తయింది.రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమాకు బలం’’ అని తెలి పారు. ‘‘త్వరలోనే విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు కుశాల్ రాజు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ వంటి అంశాలు మా చిత్రంలో చాలా ఉన్నాయి’’ అన్నారు సన్నీ కునాల్. ‘‘దాసరి వెంకటరమణగారి పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉంటాయి’’ అని సమర్పకుడు కేవీ నరసింహ రాజు తెలి పారు. -
ఏటిగట్టుపై యాక్షన్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ‘‘రూ. 125 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది.పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్ స్టార్తో ఈ షెడ్యూల్లో తేజ్ తలపడతారు. మా చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నాం... సమ్మె కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ తెలిపింది. -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
నా మిత్రురాలికి ఆల్ ది బెస్ట్.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్పై బన్నీ ప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.అల్లు అర్జున్ రియాక్షన్పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు. Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FFWishing the film immense success. Best wishes to director…— Allu Arjun (@alluarjun) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
తెలుగు సినిమా టైటిల్ చెప్పండి చాలు.. లక్ష రూపాయలు మీకే!
సినిమా పేరు చెప్పండి.. లక్ష రూపాయలు మీకే. ఏంటి మూవీ పేరు లక్ష రూపాయలిస్తారా?అని అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే.. మీ మెదడుకు పదునుపెట్టి టైటిల్ ఏంటో పట్టేయండి.. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఐఎంవై అనే టైటిల్తో రూపొందిస్తున్నారు.ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఓం గమ్ గణపతయే నమహా అంటూ సాగే భక్తి పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ను మేకర్స్ ప్రారంభించారు. ఐఎంవై మూవీకి తెలుగులో టైటిల్ పేరు కరెక్ట్గా చెప్పినవాళ్లకు లక్ష రూపాయల బహుమతి అందించనున్నారు. అంతేకాకుండా టాప్-10 క్రియేటివ్ టైటిల్స్ పంపినవారికి సైతం రూ.5 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ లక్ష రూపాయలు నగదు గెలుచుకోవాలనుకుంటే ఈనెల 13వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్కు వాట్సాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివిటీతో లక్ష రూపాయలు సొంతం చేసుకోండి.కాగా.. ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్ బ్యానర్లో కె శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by K Shankar (@sanjeevaniproductionss) -
ఎన్నో అవమానాలు.. ఈ స్థాయికి వస్తాననుకోలేదు: నిర్మాత ఎమోషనల్
అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.15 సినిమాలుతన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో "యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ" చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ బర్త్డే ఎంతో స్పెషల్ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!! తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు... ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు. -
ఎనిమిది భాషల్లో మిరాయ్ రిలీజ్.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించనున్నారు.తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025 -
టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమా 'ఏ మాస్టర్ పీస్': మూవీ టీమ్
శుక్ర, మాటరాని మౌనమిది తదితర సినిమాలు తీసిన దర్శకుడు పూర్వాజ్ లేటెస్ట్ మూవీ 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సినిమాని మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశా. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ని, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఓ అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ పూర్వాజ్ చెప్పుకొచ్చారు. -
వీడియోలు తొలగించండి.. ఢిల్లీ హైకోర్టుకు ఐశ్వర్య రాయ్
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని వెంటనే వాటిని నిర్మూలించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. AI- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు.ఐశ్వర్య రాయ్ పిటిషన్ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఐశ్వర్య తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి కోర్టులో బలంగానే వాదించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఐశ్వర్య పేరును ఉపయోగించి పలు వస్తువులను అమ్ముతున్న అనేక వెబ్సైట్ల వివరాలను కోర్టుకు అందించారు. aishwaryaworld.com అనే ఒక వెబ్సైట్ను సూచిస్తూ.. ఆమె నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే అది "ఐశ్వర్య రాయ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్" అని చెప్పుకుంటున్నారని సేథి అన్నారు.ఒకరి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఆమె పేరు, ఫోటోలు ఉపయోగించబడుతున్నాయని న్యాయవాది సందీప్ సేథి కోర్టులో లేవనెత్తారు. ఒక పెద్దమనిషి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది చాలా నీచమైన పని అంటూ న్యాయవాది ఫైర్ అయ్యారు. దీంతో న్యాయస్థానం కూడా ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఆమె చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్సైట్లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే URL లింక్లను పూర్తిగా తొలగించడానికి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్
బిగ్బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్బాస్ హౌస్లో ఎవరైతే కిచెన్లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
దోశ 'కింగ్' బయోపిక్లో మోహన్లాల్!
పీ రాజగోపాల్.. ఈ పేరు దేశవ్యాప్తంగా పరిచయమే.. తమిళనాడులో శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. కోట్ల రూపాయలు సంపాధించాడు. అయితే, తన జాతకాల పిచ్చి వల్ల ఒక మహిళ జీవితం నాశనం కావడం ఆపై అతని జీవితం కూడా అగ్గిలో కాలిపోయింది. ఇప్పుడు అతని బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ చిత్రంలో నటించేందుకు స్టార్ హీరో అంగీకరించినట్లు తెలుస్తుంది.జై భీమ్, వేట్టాయాన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. తాజాగా ఈ దర్శకుడు తన మూడవ చిత్రానికి సిద్ధమయ్యాడు. సరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ జీవిత ఇతివత్తంతో చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో రాజగోపాల్, జీవజ్యోతి అనే మహిళ మధ్య జరిగిన ప్రేమ పోరాటం, రాజగోపాల్ జైలు పాలైన సంఘటనలు ప్రధానాంశంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. దీనికి దోసెకింగ్ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఇందులో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ను నటింపజేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జంగ్లి పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం మోహన్లాల్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దోసెకింగ్ చిత్రంలో నటించడానికి మోహన్ లాల్ ఓకే చెబుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.జ్యోతిష్యం పిచ్చి.. దహించేసిన 'కామాగ్ని'‘శరవణ భవన్’ పి.రాజగోపాల్ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది.జీవజ్యోతితో పెళ్లి కోసం..జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. అతనికి 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది.ట్యూషన్ మాస్టర్తో ప్రేమజీవజ్యోతి పి.రాజగోపాల్ను తన గార్డియన్గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి,శాంతకుమార్ ఒప్పుకోలేదు.జీవజ్యోతి భర్త హత్యజీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్తో శాంతకుమార్ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది.ఒంటరి పోరాటంరాజగోపాల్కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. -
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్హౌస్ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కాజల్ అగర్వాల్కు టాలీవుడ్లో భారీగానే అభిమానులు ఉన్నారు. కన్నప్పలో చివరిసారిగా కనిపించిన ఆమె బాలీవుడ్ రామాయణలో నటించనుంది. అయితే, ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయింది.'నేను ప్రమాదానికి గురైనట్లు కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. ఇక లేనని కూడా! కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. వాటిని చూసిన తర్వాత నేను ఎంతో నవ్వుకున్నాను. అంతకు మించిన ఫన్నీ న్యూస్ ఏమీ ఉండదు. పూర్తిగా అవాస్తవం ఉన్న వార్తలను వైరల్ చేయాల్సిన పనిలేదు. దేవుని దయవల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్' అంటూ ఆమె పోస్ట్ చేసింది.కాజల్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతోందని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి వచ్చాయో , అవి ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియాల్సి ఉంది. కానీ, కాజల్ స్వయంగా సకాలంలో వివరణ ఇవ్వడం ఆమె అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించింది.I’ve come across some baseless news claiming I was in an accident (and no longer around!) and honestly, it’s quite amusing because it’s absolutely untrue. 😄By the grace of god, I want to assure you all that I am perfectly fine, safe, and doing very well ❤️I kindly request…— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 8, 2025 -
సంక్రాంతి 2026కి సినిమాల జాతర.. మూవీస్ లిస్ట్ ఇదే
-
'మిరాయ్' కోసం శంకర్ మహదేవన్.. పవర్ ప్యాక్డ్ సాంగ్ వచ్చేసింది
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు. -
ఆకతాయిల నుంచి హీరోయిన్ను కాపాడిన స్టార్ హీరో ఫ్యాన్స్
ఒక్కో సారి చిత్ర యూనిట్కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే' ఎదుర్కున్నారు. తమిళ్లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్ విళిగళ్.. ఈ చిత్రాన్ని సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ 'నీమా రే' చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు. -
డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
-
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు
-
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
ఆ రోజే మాస్ జాతర?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ ఇద్దరూ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారని టాక్. కాగా, ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్లీ ‘మాస్ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుందని, ఈ దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి... వార్తల్లో ఉన్నట్లుగా ఆ రోజే వెండితెరపై మాస్ జాతర కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే. -
తెలుసు కదా.. బై బై!
‘తెలుసు కదా’ యూనిట్కు బై బై చెప్పారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర షూట్ను పూర్తి చేశారు రాశీ ఖన్నా.ఈ సందర్భంగా ‘తెలుసు కదా’ సినిమా ప్రయాణం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ –‘‘కెమెరాలు ఆగి పోయిన తర్వాత కూడా మర్చి పోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలు కలగలిసిన ప్రయాణం ఇది. ఇందులో నాతో పాటు నడిచిన చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్లా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
వచ్చిన కాసేపటికే ఎలిమినేషన్.. బిగ్బాస్లో 'బాక్స్' డ్రామా
కోపపు నీడలో పెరిగిన తన ఆవేశమే అస్తిత్వంగా మారిపోయింది. సినిమా సామ్రాజ్యంలో చోటు దక్కింది. అందరూ ద్వేషించడానికి ఇష్టపడే పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయాడు. అందరూ ద్వేషించే దారిలో నడుస్తుండగా ఓ ప్రశ్న ఎదురైంది. దానికిచ్చిన సమాధానంతో అతడి జీవితమే మారిపోయింది. కన్నతల్లి చేయూతనిచ్చింది. దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడేవాళ్లు.ఆవేశంతో రాజ్యమేలిన వ్యక్తి మనసు ఏలేందుకు ముందుకొస్తున్నాడు. ఓ గిఫ్ట్ బాక్స్తో హౌస్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ బాక్స్ తీసుకెళ్లేందుకు వీల్లేదన్నారు. అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ బాక్స్ కూడా నా శరీరంలో ఒక భాగం అని, దాన్ని వదిలేసి వెళ్లలేనన్నాడు. అలాగైతే బాక్స్ తీసుకోమని ఇంటికెళ్లిపోమంటే అందుకు క్షణం ఆలోచించకుండా సరేనని తలూపాడు.పోనీ, ఆ బాక్స్ వెనక సీక్రెట్ ఏంటో చెప్పి, ఆ చైన్ మెడలో వేసుకుని వెళ్లమంటే కూడా అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ స్టేజీపై ఆ రహస్యాన్ని బయటపెట్టలేనన్నాడు. దాంతో అతడిని స్టేజీపై నుంచి బయటకు పంపించారు. కానీ మరికాసేపటికే భరణిని లోనికి పంపించారు. అయితే ఇక్కడ ఇంకాస్త డ్రామా పండించే ఛాన్స్ ఉన్నాసరే బిగ్బాస్ ఎందుకో త్వరగానే భరణిని త్వరగా లోపలికి పంపించేయడం మాత్రం కాస్త అసంతృప్తిగా అనిపించింది.అప్పట్లో 'చిలసౌ స్రవంతి' సీరియల్తో విలన్గా చేసి అందరినీ భయపెట్టిన భరణి.. తర్వాత ఎన్నో సినిమాలు చేసినా సరే 'స్రవంతి' విలన్గానే గుర్తుండిపోయాడు. ఇప్పడు బిగ్బాస్ షోలోకి వచ్చి తనని తాను మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఎన్ని వారాల పాటు ఉంటాడో చూడాలి?The house is ready for him!💥 Bharani enters the Bigg Boss 9 house, bringing high voltage drama & fun-filled chaos ❤️🔥The house doors are open! 🏠 Catch the Grand Launch of #BiggBossSeason9 Playing Now only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/J6EmKjrds1— JioHotstar Telugu (@JioHotstarTel_) September 7, 2025 -
పెళ్లిరోజు స్పెషల్.. భర్తతో సాయిపల్లవి చెల్లెలు ఇలా (ఫొటోలు)
-
ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
-
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్
-
సారీ అమ్మ.. నిహారిక పోస్ట్ వైరల్..!
-
బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్? మూవీపై ప్రశాంత్ వర్మ క్లారిటీ
-
జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదన్నట్లు జోరుగా షూటింగ్స్ చేస్తారు స్టార్స్. అలాంటివారికి హఠాత్తుగా బ్రేక్ వస్తే... ఓ నాలుగైదు రోజులు బాగానే ఉంటుంది. కానీ దాదాపు 20 రోజులు బ్రేక్ వస్తే... ఎప్పుడెప్పుడు షూటింగ్స్కి పోదామా అని వెయిట్ చేస్తారు. తెలుగు చలన చిత్ర కార్మికుల సమ్మె కారణంగా ఆ మధ్య దాదాపు 20 రోజులు బ్రేక్ రావడం, ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ మొదలు కావడంతో ‘జోరుగా హుషారుగా షూటింగ్కి పోదమా’ అంటూ భాగ్యనగరంలో కొందరు స్టార్స్ షూటింగ్స్తో బిజీ అయ్యారు. ఆ విశేషాలు...స్పీడుగా శంకరవరప్రసాద్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి, గాడ్ఫాదర్’ చిత్రాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో వెంకటేశ్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్యాథరిన్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. కాగా ఆగస్టు 5న ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ సినీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది.తాజాగా ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవితో పాటు ఈ చిత్రంలోని కీలక తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్లోనే చిరంజీవి–వెంకటేశ్ కాంబినేషన్లో కూడా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని, వీరి కాంబినేషన్లోనే ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా చిత్రీకరించాలని ఈ చిత్రదర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని తెలిసింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.అయితే కార్మికుల సమ్మె కారణంగా ఒక షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యమైంది కనుక ఇకపై పెద్దగా బ్రేక్స్ లేకుండా స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను నిలపాలని ఈ చిత్రయూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఈ చిత్రంలో శంకరవరప్రసాద్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన పాత్ర ఉంటుంది. చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెంకటేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. చలో గ్రీస్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్, నిధీ అగర్వాల్ హీరోయిన్లు్లగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే గ్రీస్ వెళ్లనుందట ‘ది రాజాసాబ్’ చిత్రయూనిట్. అక్కడ పాటలు చిత్రీకరించనున్నారట.ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్ చూసొచ్చారట. ఈ గ్రీస్ షెడ్యూల్తో ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని సమాచారం. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా విశ్వప్రసాద్ ఇటీవల వెల్లడించారు. ఇక ‘ది రాజాసాబ్’ సినిమాలో సంజయ్ దత్, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తాత–మనవళ్లుగా సంజయ్ దత్–ప్రభాస్ కనిపిస్తారని టాక్.విదేశాలకు డ్రాగన్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగు తోందని తెలిసింది. ఎన్టీఆర్ షూట్లో పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ను ప్రశాంత్ నీల్ విదేశాల్లో ప్లాన్ చేశారని, ఈ దిశగా ఏర్పాట్లు కూడా మొదలై పోయాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో ఉంటుందని, ముఖ్యంగా కోల్కత్తా ప్రస్తావన ఉంటుందని తెలిసింది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. మాస్ జడల్... ఒక హిట్ కాంబినేషన్లో మళ్లీ సినిమా రూ పొందితే ఎన్ని అంచనాలు ఏర్పడతాయో అన్నీ ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఉన్నాయి. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత ఆ చిత్రకథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూ పొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్లో ఓ లుక్లో నాని రెండు జడలు వేసుకుని కనిపించారు. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.కాగా... సినిమాలో నాని వేసుకునే జడలకు, ఈ చిత్రదర్శకుడు శ్రీకాంత్ ఓదెల జీవితానికి చిన్న కనెక్షన్ ఉందట. శ్రీకాంత్ ఐదో తరగతి వరకూ అతని తల్లి ఇలా రెండు జడలు వేసి స్కూల్కి పంపించేవారట. ఇది మాత్రమే కాదు... నాని క్యారెక్టర్కి జడలు వేయడం వెనక వేరే కారణం ఉందట. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని ఆ మ«ధ్య ఓ సందర్భంలో శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక జడల్ పాత్రలో నాని ఫుల్ మాస్గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది. టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. శంకర్పల్లిలో... హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతుంటారు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలు కమిట్ అవడంతో పాటు సెట్స్పైకి తీసుకెళుతుంటారాయన. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్). కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ కాకుండా ఉండేలా కథను సిద్ధం చేశారట కిశోర్ తిరుమల.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్కి సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ కొనసాగుతోందట. రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కిశోర్ తిరుమల. శరవేగంగా ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసి, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉందట యూనిట్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు.‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు ఫిల్మ్నగర్లో వినిపిస్తున్నాయి. ముచ్చింతల్లో... రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది.ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా, ఆయన వీరాభిమాని పాత్రలో రామ్ నటిస్తున్నారు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్స్టాప్గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ని హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొద్ది రోజులు షూటింగ్స్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముచ్చింతల్లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట పి. మహేశ్బాబు. వివేక్–మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘పప్పీ షేమ్...’ అంటూ సాగే పాటని ఈ నెల 8న విడుదల చేయనున్నారు. మిస్టిక్ థ్రిల్లర్... ‘తండేల్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నారు హీరో నాగచైతన్య. అంతేకాదు... తొలిసారి ఆయన వంద కోట్ల క్లబ్లో చేరారు. అలాంటి హిట్ మూవీ తర్వాత నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ (2023) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్గా రూ పొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్ రూ పొందించారు మేకర్స్. ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఈ లుక్ కోసం ఆయన శారీరకంగా కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కూడా. అలాగే మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర ముఖ్యమైన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట కార్తీక్ వర్మ. మాదాపూర్లో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాలతో ఆయనకంటూ ప్రత్యేకమైన మేనరిజమ్ని, యూత్లో మాంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారాయన. సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్లో జరుగుతోంది. సిద్ధు శైలి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ చిత్రంలో మనసుని హత్తుకునే భావోద్వేగాలు, అనుబంధాలు కూడా ఉంటాయట. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే... ఈ దీపావళికి సిద్ధు జొన్నలగడ్డ నవ్వుల మతాబులు పేల్చనున్నారన్నమాట. కొనసాగుతున్న సంబరాలు సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా రూ పొందుతున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ (2024) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఎస్వైజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది.ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ‘బ్రో’ సినిమా 2023 జూలై 28న విడుదలైంది. అప్పటి నుంచి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు సాయిదుర్గా తేజ్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి కానందున మరోసారి విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బూత్ బంగ్లాలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా (2023) తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూ పొందుతోన్న ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారి పోయారు అఖిల్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్. కాగా ఈ సిని మాలో హీరోయిన్గా తొలుత శ్రీలీల ఫిక్స్ అయ్యారు. కార ణాలు తెలియదు కానీ ఆమె స్థానంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారని టాక్. ముచ్చింతల్లో మహా కాళి ‘హను–మాన్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని, అదే స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారాయన. ఈ యూనివర్స్లో వచ్చిన తొలి చిత్రం ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలవగా, తాజాగా రూ పొందుతోన్న సినిమా ‘మహా కాళి’. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఇది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూ పొందుతోంది. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్న లుక్ వైరల్గా మారింది. మరి... ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి ఉండాలి. పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో సందడి సందడిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రాముడిగా..?
మహేశ్బాబు వెండితెరపై రాముడిగా కనిపించనున్నారట. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నెల రోజులకు పైనే ఉంటుందట. అయితే చిన్న గ్యాప్ రావడంతో ప్రస్తుతం మహేశ్బాబు హైదరాబాద్ చేరుకున్నారని, త్వరలోనే మళ్లీ నైరోబీకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథనం విభిన్న కాల మానాల్లో జరుగుతుందని, ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో రాముడి పాత్రలో మహేశ్బాబు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 120కి పైగా దేశాల్లో ఈ చిత్రం 2027లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
మిరాయ్ కథకు ఆ స్కోప్ ఉంది: దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ– ‘‘ఏడేళ్ల క్రితమే ‘మిరాయ్’ ఐడియా పుట్టింది. ఈ సినిమా పూర్తిగా కల్పితం. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ ఉంది.ఈ తొమ్మిది గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నించగా, వీటిని మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు? అన్నదే ‘మిరాయ్’ సినిమా కథ. ఈ చిత్రంలో తల్లి–కొడుకుల బలమైన ఎమోషన్ కూడా ఉంది. తల్లి–కొడుకులుగా శ్రియ– తేజ నటించారు. ఆధ్యాత్మిక భావనలు గల అంబిక (శ్రియ పాత్ర పేరు) తన ఆశయం నెరవేరడానికి తన కొడుకుకి ఎలా మార్గనిర్దేశకత్వం చేసింది? అన్నది సినిమాలో చూడాలి. తేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్ల్యాండ్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు.మనోజ్ రోల్ కథలో చాలా బలంగా ఉంటుంది. హీరోని గైడ్ చేసే అగస్త్య మునిగా జయరామ్, తాంత్రిక గురువుగా జగపతిబాబు నటించారు. జటాయు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. ట్రైలర్లో కనిపించే పక్షి సీక్వెన్స్ ఇది. ఈ పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. రియల్ లొకేషన్స్లో ఈ సినిమాను చిత్రీకరించాం. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయ్ల్యాండ్... మొత్తం ఆసియా అంతా తిరిగేశాం. ఈ చిత్రంలో ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. శ్రీలంకలో తేజపై ట్రైన్ నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం మన ఇతిహాసాల్లోనో, పురాణాల్లోనో ఉందనే నమ్మకంతో ఈ సినిమా కథ చేశాను.చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇతిహాస కథలు, పాత్రలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ఈ అంశాలన్నింటినీ కథలో ఆసక్తికరంగా బ్లెండ్ చేయడం అనేది నాకు సవాల్గా అనిపించింది. ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే అయింది. అయినా విశ్వ ప్రసాద్గారు చాలా స పోర్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే లోకల్గా చేస్తున్నారు.సినిమాలో వీఎఫ్ఎక్స్ బాగుండాలంటే ఒకటి మన దగ్గర డబ్బులు ఉండాలి లేదా మన దగ్గర టైమ్ ఉండాలి. మాకు టైమ్ ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. హరి గౌర సినిమాను ఎలివేట్ చేసే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ఫ్రాంచైజీ బిల్డ్ చేసే స్కోప్ ఉన్న కథ ‘మిరాయ్’. ఈ సినిమా విజయంపై అది ఆధారపడి ఉంటుంది. ఇక దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఏదన్నా ఐడియా ఉన్నప్పుడు వేరేవాళ్లకు కథలు కూడా ఇస్తున్నాను’’ అని అన్నారు. -
కామెడీ షురూ
హీరో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న 65వ సినిమా షురూ అయింది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ‘నరేశ్ 65’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టారు.దర్శకుడు వీఐ ఆనంద్ ఫస్ట్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ఠ, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్ను నిర్మాతలకు అందజేశారు. ‘‘యునిక్ కాన్సెప్ట్స్తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ నరేశ్ తన కొత్త చిత్రం ‘నరేశ్ 65’తో తిరిగి కామెడీ జానర్లోకి వచ్చారు. ఈ సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఫ్యాంటసీ, కామెడీ బ్లెండ్తో సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి. -
ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక
ప్రతి ఏడాది నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. 13వ సైమా అవార్డు వేడుకని దుబాయ్లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్ పో సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు.‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ‘సైమా’ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. ‘సైమా’ నుంచి ఆయన అందుకున్న ఐదో అవార్డు ఇది. ‘సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అల వైకుంఠపురములో (2021), పుష్ప (2022)’ వంటి చిత్రాలకుగాను ఇప్పటికే ఆయన నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డ్స్ అందుకున్నారు.ఇక ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటిగా రష్మికా మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీతదర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్గా శంకర్బాబు అవార్డులు అందుకున్నారు. ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సి. అశ్వనీదత్, ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును కమల్హాసన్, ఉత్తమ సహాయ నటి అవార్డును అన్నా బెన్లకు ప్రదానం చేశారు. ఇదే చిత్రానికి ఉత్తమ సహాయనటుడి అవార్డుకు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు.హీరో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికిగాను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయని శిల్పారావు అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటి (క్రిటిక్స్) మీనాక్షీ చౌదరి... ఇంకా పలు విభాగాల్లో పలువురు తారలు అవార్డులు అందుకున్నారు.‘పుష్ప 3’ ఉంటుంది: ఇదే వేదికపై ‘పుష్ప 3’ ఉంటుందా? అని సుకుమార్ని యాంకర్ అడగ్గా... అల్లు అర్జున్ వైపు చూశారాయన. ఆ తర్వాత ‘ఉంటుంది’ అని స్పష్టం చేశారు సుకుమార్. -
మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.మహేశ్ బాబుకి ఏఎమ్బీ, అల్లు అర్జున్కి ఏఏఏ, రవితేజకు ఏఆర్టీ, విజయ్ దేవరకొండకు ఏవీడీ పేరుతో మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆసియన్ సునీల్తో కలిసి ఈ హీరోలందరూ థియేటర్ బిజినెస్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ రంగంలోకి రాబోతున్నారట. త్వరలో లాంఛనంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు)అయితే పైన చెప్పిన హీరోలందరికీ మల్టీప్లెక్స్లు తెలంగాణలోనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్.. తన ఏఏఏ సినిమాస్ని వైజాగ్లోనూ లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆంధ్రాలోనే ఏఆర్సీ(ARC) సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం చర్చలో దశలో ఉందని, త్వరలో ఎక్కడ నిర్మించాలనేది ఫిక్సవుతారని టాక్ వినిపిస్తోంది. మరి బన్నీలానే చరణ్ కూడా వైజాగ్లోనే థియేటర్ నిర్మిస్తాడా? లేదంటే విజయవాడ, తిరుపతి లాంటి ఆప్షన్స్ చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఘోరమైన దెబ్బ పడింది. దీంతో 'పెద్ది' హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి 2' ఇంటర్వెల్ చూసి భయపడ్డా..: సందీప్ రెడ్డి వంగా) -
శ్రీదేవికి తక్కువ పారితోషికం.. నిర్మాతలే రాజమౌళికి ఎక్కించి చెప్పారు!
బాహుబలి సినిమా (Bahubali Movie)తోనే పాన్ ఇండియా ట్రెండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ను ఏలాయి. దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తరణకు బాహుబలి తోడ్పడింది. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి (Sridevi) నటించాల్సిందట!ఇప్పటికీ నా దగ్గరే..శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నారు. మరి అదెందుకు కార్యరూపం దాల్చలేదన్నదానిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) స్పందించాడు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సినిమా కోసం ఆమె చెప్పిన సూచనలు విన్నాక ఆయనకు శ్రీదేవిపై గౌరవం రెట్టింపైంది. కానీ, నిర్మాతల వల్ల ఆ సినిమా తను చేయలేకపోయింది.చాలా తక్కువ పారితోషికంరాజమౌళి మా ఇంటికి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గది నుంచి బయటకు వెళ్లగానే నిర్మాతలు ఎంటరయ్యేవారు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు శ్రీదేవి తీసుకున్నదానికంటే కూడా తక్కువే ఇస్తామన్నారు. ఆమె చిన్న నటి కాదు కదా! తనవల్ల సినిమాకు కూడా ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. తమిళం, హిందీలోనూ కొంత పాపులారిటీ వస్తుంది. అలాంటప్పుడు నా భార్యను ఒక మెట్టు దిగి సినిమా చేయమని నేనెందుకు చెప్తాను?రివర్స్లో చెప్పారుకానీ నిర్మాతలు మాత్రం రాజమౌళికి అంతా రివర్స్లో చెప్పారు. హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తనే కావాలంటోందని చాడీలు చెప్పారు. మేము అడిగిందొక్కటే.. మా పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు పెద్ద షెడ్యూల్ పెట్టుకోమన్నాము. అంతకుమించి పెద్ద డిమాండ్లేమీ చేయలేదు. కానీ నిర్మాతలు రాజమౌళికి వేరేవిధంగా ఎక్కించారు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఇలాంటి పుకార్లు సృష్టించాడు. తను ప్రొఫెషనల్గా ఉండదని కామెంట్ చేశాడు. రూ.10 కోట్ల డిమాండ్?అదే నిజమైతే రాకేశ్ రోషన్, యష్ చోప్రా, రాఘవేందర రావు.. వీళ్లందరూ తనతో ఎలా పని చేశారు? ఆమెను అన్ప్రొఫెషనల్ అని ఎలా అంటారు? అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా బాహుబలి రిలీజైన సమయంలో శ్రీదేవి డిమాండ్లపై పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకుగాను రూ.10 కోట్లు, 10 ఫ్లైట్ టికెట్స్, హోటల్లో ఓ అంతస్తు మొత్తం తనకే కావాలని శ్రీదేవి డిమాండ్ చేసిందని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కామెంట్స్ విని బాధపడ్డ శ్రీదేవి.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కి పైగా సినిమాలు చేశాను. అలాంటి డిమాండ్లు చేసే ఈ స్థాయికి చేరాననుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండేదాన్నా? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నిర్మాతలే రాజమౌళికి ఇలా నాగురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు! కానీ, ఇలా పబ్లిక్గా మాట్లాడకపోయుంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేసింది. దీంతో రాజమౌళి సైతం పబ్లిక్గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడ్డాడు. కాగా శ్రీదేవి 2018లో మరణించింది. బాహుబలి విషయానికి వస్తే మొదటి భాగం 2015లో రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.చదవండి: నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ -
ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన వాటిలో 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అనుష్క 'ఘాటీ'కి నెగిటివ్ టాక్ రాగా.. తమిళ డబ్బింగ్ 'మదరాసి' యావరేజ్ అనిపించుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు వచ్చాయి. అవి కాకుండా మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రాలు? ఎందులోకి వచ్చాయి?'ఆదిత్య విక్రమ వ్యూహ' పేరుతో తీసిన ఓ తెలుగు చిత్రం నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తొమ్మిది మందిని హత్య చేసి, జైలుకెళ్లిన ఓ ఖైదీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీంతో వాడిని పట్టుకునేందుకు హీరోలిద్దరూ కలిసి ఓ మిషన్ చేపడతారు. తర్వాత ఏమైంది? హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే మిగతా స్టోరీ. శ్రీ హర్ష, అరవింద్ ప్రధాన పాత్రలు పోషించగా.. శ్రీహర్షనే దర్శకత్వం కూడా వహించాడు.(ఇదీ చదవండి: ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?) అలానే 2021 డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'బుల్లెట్ సత్యం'. దేవ్ రాజ్, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పడు ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. బుల్లెట్ సత్యం చేసిన రాజకీయం ఏంటనేదే మూవీ స్టోరీ. కుటుంబ బంధాలతోపాటు రాజకీయ నేరాలు, థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉన్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 18న రిలీజైన 'జగమెరిగిన సత్యం' సినిమా.. థియేటర్లలో పెద్దగా నిలబడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తెలంగాణలోని ఓ చిన్న ఊరిలో సత్యం (అవినాష్ వర్మ) అనే యువకుడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్తో దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: 46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్) -
అల్లరి నరేష్ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన నాగ చైతన్య (ఫొటోలు)
-
ధూమ్ 4 లో ప్రభాస్, ఎన్టీఆర్..? LCU లోకి రామ్ చరణ్..?
-
బిగ్బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్తో తేల్చేసిందిగా!
తిన్నాతిరం పడతలే, ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటత్తుండు, నా పేరే ఎల్లమ్మ.. వంటి పాటలతో యూట్యూబ్లో నెస్సేషన్ అయింది ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ (Nagadurga Gutha). నాలుగేండ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకుంది. పద్నాలుండేగ్ల వయసులో పేరిణి నాట్యం నేర్చుకుంది. నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం కూడా స్థాపించింది. లాక్డౌన్లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫోక్ సాంగ్స్ క్వీన్ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్లో అందంగా స్టెప్పులేసింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్లో నటించే ఛాన్స్ వచ్చిందట! అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్గా అడిగారట! కానీ ఆ అవకాశాలను తిరస్కరించిన నాగదుర్గ.. నటన అంటే ఇష్టమే కానీ నాట్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల అని చెప్పుకొచ్చింది. పీహెచ్డీ పట్టా చేతికొచ్చాకే సినిమాల గురించి ఆలోచిస్తానన్న ఈమె కలివి వనం అనే ఒకే ఒక్క సినిమాలో మాత్రం నటిచింది.బిగ్బాస్పై ఆసక్తి లేదుఇంతలో నాగదుర్గ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొననుందని ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై నాగదుర్గ స్పందించింది. తాను బిగ్బాస్ 9వ సీజన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ షోకి వెళ్లాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని తెలిపింది. కాబట్టి ఈ ప్రచారానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టమని కోరింది. అయితే త్వరలోనే ఓ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.చదవండి: దృశ్యం నటుడు కన్నుమూత -
70 శాతం పూర్తి.. 'స్పిరిట్'పై షాకింగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి
ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి దర్శకులు సందీప్ రెడ్డి వంగా అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యానిమల్ సినిమా తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు.స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి ఇలా అన్నారు. ' ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేశాం. గతంలో యానిమల్ సినిమా సమయంలో కూడా షూటింగ్ కంటే ముందే 80శాతం బీజీఎమ్ వర్క్ పూర్తి చేసి.. ఆ తర్వాతే సెట్స్ మీదికి వెళ్లాం. ఇలా చేయడంలో వల్ల సీన్ ఎలాంటి ఔట్పుట్ వస్తుందో తెలిసిపోతుంది. ఆపై సమయంతో పాటు ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా తగ్గుతుంది. ప్రభాస్తో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. పాన్ ఇండియా రేంజ్ హీరో అనే ఫీలింగ్ ఆయనలో కనిపించదు. త్వరలో ప్రభాస్తో కలిసే వస్తాం' అంటూ సందీప్ చెప్పారు.ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీపర్పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్లా కనిపిస్తారని సమాచారం. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ కోసం పనిచేస్తున్నారు. యానిమల్లో కొన్ని పాటలతో పాటు రావణాసుర, డెవిల్ తదితర సినిమాలకూ ఆయన సంగీత వహించారు."70% of the BGM is already done 🔥💥#Prabhas is a very transparent and very sweet person to work with. We’ll start shooting very soon."- #SandeepReddyVanga | #Spiritpic.twitter.com/P6nbFGkaPk— Whynot Cinemas (@whynotcinemass_) September 6, 2025 -
ఓటీటీలో 'సు ఫ్రమ్ సో'.. అఫీషియల్ ప్రకటన
కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రమ్ సో'(Su From So Movie) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి.శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి కథ, దర్శకత్వం జేపీ తుమినాడ్ అందించారు. తెలుగులో ఆగష్టు 8న మైత్రీ మూవీ మేకర్స్ వారు విడుదల చేశారు.కన్నడలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన 'సు ఫ్రమ్ సో' చిత్రం.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ చిత్రం జియోహాట్స్టార్ (JioHotstar)లో సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ఆ ఓటీటీ సంస్థ అప్కమింగ్ సినిమా జాబితాలో 'సు ఫ్రమ్ సో'ను చేర్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఏకం రూ.40కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.కథేంటి?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
సైమా అవార్డ్స్-2025 విజేతలు (ఫొటోలు)
-
టికెట్ ధరలపై జీఎస్టీ.. ప్రధానికి నాగ్ అశ్విన్ విజ్ఞప్తి
కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల చిత్రపరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది. అయితే, ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ సోషల్మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కాస్త మార్పులు చేస్తే చాలామందికి లాభం చేకూరుతుందన్నారు.కొత్త జీఎస్టీ మార్పుల ప్రకారం రూ. 100 లోపు టికెట్లను కొనుగోలు చేసే వారిపై 5 శాతం జీఎస్టీ పడుతుంది. గతంలో 12 శాతం ఉండేది. అయితే, రూ. 100 మించి టికెట్ ధర ఉంటే రూ. 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఇదే విషయంలో ప్రధానిని నాగ్ అశ్విన్ విజ్ఞప్తి చెశారు. ప్రస్తుతం చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రూ.100 లోపు ధరలతో టికెట్లు విక్రయిస్తున్నారని దీంతో ఎక్కువ మందికి లాభాదాయకంగా ఉండదన్నారు. 5 శాతం జీఎస్టీ శ్లాబ్ని కేవలం రూ.100 లోపు టికెట్లకే కాకుండా.. రూ.250 వరకూ పొడిగిస్తే బాగుంటుందని ఆయన కోరారు. -
దుబాయ్లో 'సైమా' అవార్డ్స్.. మెరిసిన సినీ తారలు (ఫోటోలు)
-
లక్కీఛాన్స్.. స్టార్ హీరోతో మీనాక్షి చౌదరి
సినిమా ఎల్లలు దాటి చాలా కాలమైంది. అది సినీ తారలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రయోజనంగా మారింది. ఒక భాషల్లో అవకాశాలు తగ్గాయనుకుంటే వెంటనే మరో భాష నుంచి పిలుపు వస్తోంది. నటి మీనాక్షిచౌదరికి అలాంటి అదృష్టమే పట్టిందిప్పుడు. టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చివరిగా ఈమె తెలుగులో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని సాధించింది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాలేదు. ఇక తమిళంలోకి విజయ్ ఆంటోని హీరోగా నటించిన కొలై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత సింగపూర్ సెలూన్, విజయ్కు జంటగా ది గోట్ చిత్రాల్లో నటించారు. విజయ్కు జంటగా నటించే అవకాశం వచ్చినప్పుడు బాగా ప్రచారం పొందారు. కానీ, చిత్రంలో ఆమె పాత్ర మాత్రం పరిమితమే అయ్యింది. దీంతో ఇక్కడ కూడా అవకాశాలు అడుగంటాయి. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ వరించిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. ఈయన నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లీకడై చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం హిందీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ధనుష్ పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. దీని తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తన 55వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో ధనుష్కు జంటగా నటి మీనాక్షిచౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అదే విధంగా ఒక హిందీ చిత్రంలోనూ మీనాక్షిచౌదరి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చిరు, ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ?
-
సైమా అవార్డ్స్-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
దుబాయ్లో సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుక ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్తో సైమా గౌరవిస్తుంది. 2024లో సెన్సార్ అయిన చిత్రాలకు సంబంధించి తాజాగా విన్నర్స్ జాబితాను విడుదల చేశారు. గత పన్నేండేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. సెప్టెంబర్ 6న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్స్ దక్కించుకున్నారు. అయితే, ఉత్తమ చిత్రంగా 'కల్కి' నిలిచింది.సైమా విజేతలు.. వారి వివరాలు* ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ* ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)* ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్) * ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2) * ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)* ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్) * ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి) * ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి) * ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)* ఉత్తమ గేయ రచయిత 'చుట్టమల్లే' పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: శిల్పారావ్ (దేవర) 'చుట్టమల్లే' పాట కోసం* ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప2) 'పీలింగ్స్' పాట* ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (కల్కి) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర) * ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2) * ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్ ఇమాని (35 ఒక చిన్నకథ)* ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి) -
ఇప్పుడే ప్రారంభించాను!
సిసినీ ఇండస్ట్రీలో నటుడిగా 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు హీరో నాని. ‘అష్టా చమ్మా’ (2008 సెప్టెంబరు 5న రిలీజ్) చిత్రం ద్వారా నాని నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. స్వాతి, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య తారలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.‘‘మీ అందరి ప్రేమతో 17 ఏళ్ళు పూర్తయ్యాయి. నేను ఇప్పుడే ప్రారంభించాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని. ఇక ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో వేసిన సెట్స్లో జరుగుతోంది.ఈ చిత్రం నుంచి నాని పోస్టర్ను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానుంది. -
అక్షయ్ కుమార్ భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్లు
భారీ వర్షాలతో పంజాబ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నం చేశాయి. అయతే, తాజాగా బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన వంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అయితే, దానిని తాను విరాళం అనుకోవడంలేదని పేర్కొన్నారు. డొనేషన్ అనే పదం తనకు నచ్చదని తెలిపారు. ఇతరులకు డొనేట్ చేసేందుకు నేనెవరిని..? అంటూనే ఇలా సాయం చేయడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి అదృష్టంగా భావిస్తుంటానని తెలిపారు. -
'మైత్రి మూవీ మేకర్స్'పై ఇళయరాజా కేసు
అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్పై సంగీత దర్శకులు ఇళయరాజా మద్రాస్ కోర్టులో కేసు దాఖలు చేశారు. తన సంగీతంలో వచ్చిన పాటలను అనుమతి లేకుండా ఈ సినిమాలో ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇళయరాజా న్యాయవాదులు తెలిపారు.తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్లో నటుడు అజిత్ కుమార్తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారు.., అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఆపై ఏడు రోజుల్లోగా సినిమా నుంచి పాటను తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇళయరాజా న్యాయవాదులు కె. త్యాగరాజన్, ఎ. శరవణన్ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.అయితే, ఆ పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. కానీ, అసలు యజమాని ఎవరో వెల్లడించలేదని న్యాయవాదులు అంటున్నారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను పలు సినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలని వారు కోరారు. ఇప్పటివరకు ఉపయోగించుకున్న వారు తగిన పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కేసు సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సెంథిల్కుమార్ ముందు విచారణకు రానుంది. -
హిట్ ఫ్రాంచైజీ చిత్రం 'ట్రాన్: ఏరీస్' ట్రైలర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం 'ట్రాన్: ఏరీస్'.. దర్శకుడు జోయాకిమ్ రోన్నింగ్ తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్, ట్రైలర్ను డిస్నీ విడుదల చేసింది. సైన్స్ ఫిక్షన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ట్రాన్ (1982), దాని సీక్వెల్ ట్రాన్: లెగసీ (2010) తర్వాత వస్తున్న మూడవ చాప్టర్ ఇది. ఈ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 10, 2025న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.డిజిటల్ ప్రపంచం నుండి రియల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అధునాతన ప్రోగ్రామ్ ఏరీస్ ఒక ప్రమాదకరమైన మిషన్లో నడిచే కథ ఇది. ఇదే మానవజాతి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I.) జీవుల మధ్య మొదటి భేటీగా నిలుస్తుంది. ఈ చిత్రంలో జారెడ్ లేటో ప్రధాన పాత్రలో నటించగా, గ్రెటా లీ, ఎవాన్ పీటర్స్, హసన్ మినహాజ్, జోడీ టర్నర్-స్మిత్, గిల్లియన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ నటీనటులు కనిపించనున్నారు. -
రెడ్హ్యాండెడ్గా పోలీసులకు చిక్కిన హీరోయిన్
బెంగాలీ నటి 'అనుష్క మోనీ మోహన్ దాస్'(41) పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగాలీ సినీ పరిశ్రమలో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో నటించి ఆమె గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఆమెను మహారాష్ట్రలోని ఠాణే జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుష్క మోనీ(Anushka Moni mohan Das) కొంతమంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్తో ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే వ్యభిచార కూపంలో చిక్కుకున్న మరో ఇద్దరు నటీమణులను కూడా రక్షించారు. ఈ ఘటన బెంగాలీ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆమెపై గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.మొదట కస్టమర్స్ రూపంలో అనుష్క మోనీని పోలీసులే సంప్రదించారు. ఒక మాల్లో వారి నుంచి ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143(3) కింద, మానవ అక్రమ రవాణాకు సంబంధించి, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. రక్షించబడిన మహిళలను షెల్టర్ హోమ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార మూఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు ACP బల్లాల్ తెలిపారు. -
శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒక కంపెనీకి సంబంధించి పెట్టుబడుటు పెట్టేందుకు తన నుంచి రూ. 60 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్థిక నేరాల విభాగానికి (EOW) చెందిన అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం శిల్పాశెట్టి దంపతుల ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూతబడిన ఆ కంపెనీ ఆడిటర్ను కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు దేశం విడిచిపోకుండా ఉండేందుకు వారికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని తెలుస్తోంది.2015- 2023 సమయంలో షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీ కంపెనీకి డైరెక్టర్స్గా శిల్పాశెట్టి దంపతులు ఉన్నారు. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా పెట్టుబడులు పెట్టాలని దీపక్ కొఠారిని కోరడంతో అతను రూ. 60 కోట్ల మేరకు నిధులు వారికి అందించాడు. ఇదే విషయాన్ని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీలో ఎక్కువ వాట ఉన్న శిల్పాశెట్టి 2016లో హామీ కూడా ఇచ్చారన్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత ఆ కంపెనీ దివాలా కూడా తీయడం జరిగిందని చెప్పారు. -
ఒకే అపార్ట్మెంట్లో ఇద్దరు భార్యలతో నటుడు.. పోలీసులకు ఫిర్యాదు
తమిళ నటుడు శరవణన్పై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. జైలర్, రాయన్, మేడమ్ సార్ వంటి చిత్రాలతో ఆయన తెలుగు వారికి కూడా పరిచయమే.. 1990లో వైదేహి వందాచ్చు అనే తమిళ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత, పొండాట్టి రాజ్యం, అభిరామి, మామియార్ విడు మొదలగు పలు చిత్రాల్లో నటించిన నటుడు శరవణన్. ఆ తరువాత క్యారెక్టర్గా పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. కాగా 2003లో సూర్యశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే, 2015 నుంచి సహజీవనం సాగిస్తున్న శ్రీదేవి అనే యువతిని 2018లో శరవణన్ రెండో వివాహం చేసుకున్నారు. కాగా వీరు స్థానిక మాంగాడు సమీపంలోని మౌలివాక్కంలో ఉన్న ఒకే భవనం మొదటి అంతస్తులో శరవణన్ మొదటి భార్య కింద భాగంలో రెండో భార్యతో శరవణన్ కలిసి నివసిస్తున్నారు. కాగా ఆవడి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు శాఖ ప్రజాసమస్యల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న నటుడు శరవణన్ మొదటి భార్య తన భర్తపై హత్యా బెదిరింపు ఫిర్యాదు చేశారు.అందులో తాను శరవణన్ 1996 నుంచి 2003 వరకు సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు రెండో భార్య శ్రీదేవి చెప్పారు. అప్పట్లో తాను కస్టమ్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేదానినని దీంతో పలుమార్లు తాను ఆర్థికంగా శరవణన్ను ఆదుకున్నానని చెప్పారు. అలాంటిది ఆయన తనకు ఇప్పుడు అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. రెండో పెళ్లి చేసుకున్న శరవణన్ ఆమెతో కలిసి తనకు హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారని ఆరోపించారు. ఇదేవిధంగా తనకు జీవన భరణిగా రూ. 40 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Wow Tamizhaa (@wowtamofficial) -
సమంత దుబాయ్ వీడియో.. రాజ్ నిడిమోరు భార్య పోస్ట్ వైరల్!
కొద్ది నెలలగా సమంత సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. శుభం మూవీ తర్వాత ఆమెపై ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సామ్ సైతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతోనే ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. గతంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీరిద్దరిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం సమంత ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లింది. ఆ తర్వాత తన సోషల్ మీడియాలోఓ వ్యక్తి చేతిని పట్టుకున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ నేపథ్యంలోనే రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. 'తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి' అంటూ కొటేషన్ షేర్ చేసింది. అంతేకాకుండా 'నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత, రాజ్ దుబాయ్ వీడియో రిలీజ్ తర్వాతే ఆమె ఈ పోస్టులు పెట్టింది.కాగా.. రాజ్ నిడిమోరు.. శ్యామలిని 2015లో వివాహమాడారు. కొద్ది నెలలుగా సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. అయినప్పటికీ వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్పై అధికారికంగా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే వస్తే రాజ్ డైరెక్షన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2,స సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో సమంత నటించింది. ప్రస్తుతం వీరిద్దరు రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సామ్.. 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను గతేడాది పెళ్లాడారు. -
అభిమానులకు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిపోయారు. పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ను షేక్ చేశారు. దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్కు తెలుగులో మాత్రమే కాదు.. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా మాలీవుడ్లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో మన ఐకాన్ స్టారే.ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మీ శ్రేయస్సు, శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Heartfelt Onam wishes to all Malayalis!May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025 -
ఓనం పండుగ లుక్ లో మెరిసిపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫోటోలు)
-
కమెడియన్కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవల పక్షవాతం రావడంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు.వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అతడికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్.. మనం సైతం సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్నారు. సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో రామచంద్ర నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఆనందం, సొంతం, దుబాయి శీను, కింగ్, లౌక్యం వంటి పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు. పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. View this post on Instagram A post shared by Manamsaitham _kadambari kiran (@kadambarikiran) చదవండి: మజిలీ తర్వాత మారిపోయా.. లవ్స్టోరీ మిస్సవుతున్నా: చై -
'రాజమౌళి సార్ మాస్టర్ అయితే.. మేమంతా విద్యార్థులం'.. నిర్మాత కామెంట్స్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజమౌళి అంటే నాకు గౌరవమని కరణ్ జోహార్ వెల్లడించారు. ఒక సినిమాను మరో మూవీతో పోల్చవద్దన్నారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్కు హాజరైన ఆయన.. దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సార్ ఒక మాస్టర్ అయితే.. మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులమని కరణ్ జోహార్ అన్నారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో విజువల్ వండర్ మూవీ మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. -
మజిలీ తర్వాత మారిపోయా.. లవ్స్టోరీ మిస్సవుతున్నా..: నాగచైతన్య
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగచైతన్య (Naga Chaitanya). జోష్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చి నేటికి (సెప్టెంబర్ 5) 16 ఏళ్లు పూర్తవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. కొన్నిచోట్ల తడబడ్డా రెట్టింపు వేగంతో ముందుకు వచ్చి సూపర్ హిట్లు కొట్టాడు. తాజాగా తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.సినిమానే నా జీవితంఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. వెనక్కు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉంది. సినిమానే నా జీవితం అని అర్థమవుతోంది. మొదట్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు కష్టంగా అనిపించేది. కానీ రానురానూ పరిణతి పెరిగింది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని పరీశీలిస్తున్నాను. ఫలితాన్ని కాకుండా, సినిమా నుంచి వచ్చిన అనుభవంతో ముందుకు వెళ్లాలని నాన్న చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపించాయి.అక్కినేని ఫ్యామిలీ అంటేనే..మజిలీ, లవ్స్టోరీ సినిమాలు చేశాక నా ఆలోచనా విధానమే మారిపోయింది. అక్కినేని కుటుంబం అంటేనే ప్రేమమయం. తాత మొదలుకొని మేం చేసిన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వ్యక్తిగతంగా నాక్కూడా లవ్ స్టోరీలంటేనే ఇష్టం. ఈ మధ్య వాటిని బాగా మిస్ అవుతున్నా.. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఆతృత కంటే కూడా ఆరునెలలు లేటైనా మంచి సినిమాతోనే రావాలనుకుంటున్నాను.ట్రోలింగ్..సోషల్ మీడియా అనగానే ట్రోలింగ్ అని చాలామంది భయపడతారు. కానీ అక్కడ మన గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. నన్ను ప్రేమించేవాళ్లు, విమర్శించేవాళ్లు.. ఇద్దరూ ఉంటారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటాను అని చై చెప్పుకొచ్చాడు. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు.చదవండి: 9 వారాల వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. వీడియో -
దణ్ణం పెట్టినా, బ్రతిమిలాడినా అడియన్స్ థియేటర్ కు రారు.
-
‘గామా’ అవార్డ్స్..మెరిసిన 'కోర్ట్'మూవీ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)
-
బిగ్బాస్ తెలుగు సీజన్-9.. కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్నది ఎవరంటే?
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్బాస్ వచ్చేస్తున్నాడు. ఈ ఆదివారం నుంచే బిగ్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కోసం కామన్ కేటగిరి నుంచి అగ్ని పరీక్ష పేరుతో కంటెస్టెంట్స్ను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఐదు నుంచి ఆరుమందిని ఎంపిక చేస్తారని సమాచారం..ఇక బిగ్బాస్పై రివ్యూలు చేస్తోన్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నది రివీల్ చేశారు. ఇది అఫీషియల్ కాకపోయినా.. కాస్తా అటు.. ఇటు కూడా వీరిలో కొందరైనా ఉండొచ్చు. ఆదిరెడ్డి అనలైసిస్ ప్రకారం రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లానీ లాంటి సెలబ్రీటీలు ఉండొచ్చని అంచనా వేశారు.అలాగే కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఐదు నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. వారిలో మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆదిరెడ్డి అంచనా వేశారు. ఈ లిస్ట్లో ఉన్నవారంతా బిగ్బాస్ హౌస్లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే ఏడో తేదీ వరకు ఆగాల్సిందే. కాగా.. సెప్టెంబర్ 7న బిగ్బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరించనున్నారు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
9 వారాల వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. వీడియో పోస్ట్ చేసిన మెగా కోడలు
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు చేసింది. గురు పౌర్ణమి రోజున ప్రారంభించిన సాయిబాబా వ్రతం పూర్తి చేసుకుంది. తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశానని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వ్రతాన్ని లతా సిస్టర్తో(క్లీంకార నర్సు) కలిసి ప్రారంభించినట్లు తెలిపింది.ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ..' గురు పూర్ణిమ నాడు ప్రారంభమైన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింగి. శాంతి, విశ్వాసం, స్వస్థతతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్సు లతా సిస్టర్తో కలిసి ప్రారంభించా. నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఆశీర్వదించినందుకు బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. మీ కృపతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నా. అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఈ రోజు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాము. జై సాయిరామ్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఈ టీచరమ్మలు చాలా స్ట్రిక్ట్ (ఫోటోలు)
-
అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ఘాటి.. ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందంటే?
అనుష్క (Anushka Shetty) నటించిన లేటేస్ట్ యాక్షన్ డ్రామా ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత అనుష్క లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ ఇవాళే థియేటర్లలో విడుదలైంది.ఇప్పటికే కొన్ని చోట్ల మార్నింగ్ షోలు పడగా.. ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఘాటి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని.. శీలావతిగా అనుష్క అదరగొట్టేసిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో క్రిష్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. బీజీఎం సూపర్గా ఉందని.. ఫైట్ సీన్స్లో అదరగొట్టేశారని చెబుతున్నారు. అలాగే ప్రీ క్లైమాక్స్తో పాటు క్లైమాక్స్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫర్ఫెక్ట్ రివేంజ్ డ్రామా అని.. ట్రైన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్లో ఫుల్ మీల్స్ ఖాయమని.. రెబల్ క్వీన్ అనుష్క క్లైమాక్స్లో అదరగొట్టేసిందని అంటున్నారు. విక్రమ్ ప్రభు తన పాత్ర హైలెట్గా ఉందంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుష్కను కాటేరమ్మతో పోలుస్తున్నారు. మరికొందరైతే యావరేజ్గా ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం ఉండదు.#Ghaati#GhaatiReviewAnushka acting 🥵 Overall rating : 2.5/3 ONE TIME WATCH pic.twitter.com/JKpQCutoGq— Ch VD (@dhfmvd1109) September 5, 2025 Kaateramma 🔥🔥 🔥 #Ghaati #GhaatiReview pic.twitter.com/H3xFZldsY0— AitheyEnti (@AitheyEntii) September 4, 2025 The second half of #Ghaati is masterfully narrated from #AnushkaShetty's character 🔥🔥Anushka absolutely shines, elevating every moment with her powerhouse performance! 🔥👏🌟 great BGM good moveRating🌟🌟🌟/5#AnushkaShetty #GhaatiOnSept5th #GhaatiReview #VikramPrabhu https://t.co/4PLtqvVsuh pic.twitter.com/63tS5SXAuW— satya krishna (@satyakrish9999) September 4, 2025 #Ghaati #GhaatiReview 2nd half started flat with a backstory but gone high with crazy fight episodes"REBEL QUEEN" 🥳Just #AnushkaShetty Screen Presence is enough🔥 REVOLUTIONARY REVENGE DRAMA✅Pre climax had a little lag but full meals with the climax💯OVERALL: 3️⃣/5️⃣ https://t.co/hB6Zof5Qsz pic.twitter.com/31vCMzHbr3— 🍸𝕍𝕠𝕕𝕜𝕒 𝕎𝕚𝕥𝕙 𝕍𝕒𝕣𝕞𝕒🍸 (@enzoyy_pandagow) September 4, 2025 #Ghaati Neat delivers a stellar first half! 🚀 The stage is perfectly set for an explosive second half. 🎬Anushka Shetty and #VikramPrabhu shine effortlessly in their roles. 👏👏 That train sequence? Pure 🔥🔥🔥!#AnushkaShetty #GhaatiOnSept5th #GhaatiReview https://t.co/LRp2pK1lFk pic.twitter.com/5ZM8bw4QfH— satya krishna (@satyakrish9999) September 4, 2025 #GhaatiReview Amazing First Half 🔥🔥🔥New and interesting story from Krish..He is Back💯💯Loved the concept of Ghaati'sSheelavathi & Desi Raju 👌🏻👌🏻Superb Music and BGM✅Waiting For LadyRebels Rampage in the second half.......... https://t.co/EQt6aza9xR— 🍸𝕍𝕠𝕕𝕜𝕒 𝕎𝕚𝕥𝕙 𝕍𝕒𝕣𝕞𝕒🍸 (@enzoyy_pandagow) September 4, 2025 -
రజనీకాంత్గారు క్లాస్ తీసుకున్నారు: మంచు మనోజ్
తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా, మంచు మనోజ్ మరో ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంచు మనోజ్ చెప్పిన విశేషాలు. ⇒ తేజ చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. క్యూట్గా ఉండేవాడు... బుగ్గలు గిల్లేసేవాడిని. ఓ సందర్భంలో మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు తమ్ముడూ సినిమా చేద్దామని అన్నాను. ‘నిజమా? అన్నా’ అని ‘మిరాయ్’ గురించి చెప్పాడు. దర్శకుడు కార్తీక్గారు కథ చెప్పారు. నచ్చి, ఈ సినిమా చేశాను. ⇒ ‘మిరాయ్’లో పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాను. వారసత్వం, లేజీనెస్ని ఏ మాత్రం సహించని క్యారెక్టర్ నాది. కథ రీత్యా తొమ్మిది గ్రంథాలు నా దగ్గరకు వస్తే, నా తలతో కలిసి పది తలల రావణుడిని అవుతాను. వాటి కోసం ఏం చేశాను? అన్నదే కథ. ఒక రకంగా మోడ్రన్ రావణాసురుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లడు. దర్శకుడు నా క్యారెక్టర్ను స్పెషల్గా డిజైన్ చేశారు. ‘మిరాయ్’ నాకు మంచి కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ⇒ ‘మిరాయ్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. శ్రీరాములవారి ప్రస్తావన, 9 పుస్తకాల బ్యాక్డ్రాప్, ఇతిహాస కోణాలు... ఇవన్నీ బాగుంటాయి. ఈ సినిమా కోసం తేజ చేసిన హార్డ్వర్క్ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది. మేమిద్దరం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశాం. హైదరాబాదులో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ఉన్న బడ్జెట్లోనే కార్తీక్గారు హాలీవుడ్ స్థాయి సినిమా తీశారు.విశ్వప్రసాద్ రాజీ పడకుండా నిర్మించారు. ఇక ‘కూలీ’ సినిమాకు ముందు మా ఇంట్లో రజనీకాంత్గారిని కలిశాను. ‘మిరాయ్’ ట్రైలర్ చూశారు. ఆయనకు నచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు ఎనర్జీనిచ్చాయి. ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని రజనీకాంత్ గారు క్లాస్ తీసుకున్నారు. ⇒ ‘డేవిడ్ రెడ్డి, రక్షక్’ సినిమాలు చేస్తున్నాను. ఇంటెన్స్ యాక్షన్ చిత్రాలు ఇవి. ఇక ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం రావాల్సినప్పుడు వస్తుంది. అలాగే డార్క్ కామెడీ ఫిల్మ్ ‘వాట్ ద ఫిష్’ ఎప్పుడొచ్చినా చాలా బాగుంటుంది. కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కథల కోసం చూస్తున్నాను. ‘నేను మీకు తెలుసా’ టీమ్తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. నటుడిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను... కథలు వింటున్నాను. -
కలలే కలలే...
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కలలే కలలే..’ అంటూ సాగే మెలోడీపాటని ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘లవ్లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లవ్లో లేని వాళ్లు ఊహించుకోండి.. మ్యాజికల్ మెలోడి వస్తోంది..’ అంటూ కిరణ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, సహ నిర్మాత: బాలాజీ గుట్ట. -
'మైనస్ 8 డిగ్రీల వద్ద షూట్ చేశాం'.. కెమెరామెన్ జగదీష్ చీకటి
అర్జున్ చక్రవర్తి చిత్రం కెమెరామెన్ జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్గా మూవీని తెరకెక్కించిన జగదీష్ పనితనం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు సాధించినట్లు జగదీశ్ తెలిపారు. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్ ఎన్నో ప్రాజెక్టులకు పనిచేశానని వెల్లడించారు. అలా చేస్తున్న సమయంలోనే ‘జత కలిసే’ మూవీకి అవకాశం వచ్చిందన్నారు. ఆ సమయంలోనే ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్ నుంచి ‘భైరవ గీత’ లాంటి చాలా ప్రాజెక్ట్లు వచ్చాయని తెలిపారు.మన ఇండియాలో గొప్ప టెక్నీషియన్లు ఉన్నారని.. హాలీవుడ్ స్థాయికి ధీటుగా మనం తీస్తున్నామని జగదీశ్ అన్నారు. ‘అర్జున్ చక్రవర్తి మూవీకి ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్లోనే షూటింగ్ చేశామని తెలిపారు. సౌండ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా కూడా దర్శకుడి విజన్కు తగ్గట్టుగా ఉండాలని.. అప్పుడే రిజల్ట్ బాగా వస్తుందని వెల్లడించారు. దర్శకుడి విజన్ను అర్థం చేసుకోవాలి.. అలా నాకు దర్శకుడితో సింక్ కానప్పుడు ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానన్నారు.కాశ్మీర్లో మైనస్ 8 డిగ్రీల వద్ద షూటింగ్ చేశామని జగదీశ్ తెలిపారు. మేం అనుకున్న దానికింటే విజువల్స్ అద్భుతంగా వచ్చాయని.. ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించిందన్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్కి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. మా కష్టానికి గుర్తింపుగా అర్జున చక్రవర్తికి అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయని తెలిపారు. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయన్నారు. -
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన లేటేస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టన్నెల్. ఈ చిత్రంలో అథర్వ మురళి హీరోగా నటించారు. ఈ సినిమాకు రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా టాలీవుడ్లోనూ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అథర్వ ముపళి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12న తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాలో అశ్విన్ కాకుమాను విలన్గా నటించారు. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని ఇప్పటికే యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
అఖండ-2 రిలీజ్ డేట్ లీక్ చేసిన బాలయ్య.. అప్పుడైనా వస్తుందా?
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా కోసం అఖండ-2ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.దీంతో బాలయ్య సినిమా ఇంకెప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా అంతకుముందే డిసెంబర్లోనే రానుందా అని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అఖండ-2 విడుదల తేదీని ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.(ఇది చదవండి: అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?)తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ మూవీ రిలీజ్ డేట్పై హింట్ ఇచ్చేశారు. డిసెంబర్ తొలివారంలోనే అఖండ-2 రానుందని చెప్పేశారు. అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ లెక్కన డిసెంబర్ 5న శుక్రవారం కావడంతో అదే రోజు రిలీజ్ కావొచ్చని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ రోజైనా రిలీజవుతుందా? లేదంటే సంక్రాంతికి పోస్ట్పోన్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.#Akhanda2 కొత్త రిలీజ్ డేట్ బయటపెట్టిన బాలయ్య 🔱🔥#NandamuriBalakrishna #TeluguFilmNagar pic.twitter.com/uOKb4sZcFn— Telugu FilmNagar (@telugufilmnagar) September 4, 2025 -
అంత భయం దేనికి? విజయ్ దేవరకొండకు కౌంటర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆంగ్ల భాష ఆధిపత్యం గురించి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడాడు. చాలా ఏళ్ల క్రితం పాశ్చాత్యులు మన దేశానికి వచ్చి వారి భాషను మనపై రుద్దడం వల్లే ఇప్పటికీ ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతున్నామన్నాడు. దానివల్లే హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోందని, ఫలితంగా వారి బడ్జెట్లు, నటీనటుల పారితోషికాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నాడు. అందుకే హాలీవుడ్లో ఎక్కువ..హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఒక్క సినిమాకు తనకంటే వంద రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఎక్కువమంది ఆయన భాష (ఇంగ్లీష్)లో సినిమాలు చూడటం వల్లే ఇది సాధ్యమైందన్నాడు. కాబట్టి దక్షిణాది సినిమాలు బాలీవుడ్లో విస్తరించినట్లే.. భారతీయ సినిమాలు కూడా పశ్చిమ దేశాల్లో ఎక్కువగా విస్తరించాలని అభిప్రాయపడ్డాడు. విజయ్ అభిప్రాయాన్ని కొందరు విదేశీయులు ఏకీభవించలేదు. వారిలో కంటెంట్ క్రియేటర్ ఫర్హాన్ ఒకరు. హీరోపై అసహనంఅయితే విజయ్ను తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో చేయగా దాన్ని డిలీట్ చేయించాడని అసహనం వ్యక్తం చేశాడు. ఒక యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో నా వీడియో డిలీట్ చేయించాడు.. నేను చెప్పే కథ ద్వారా తనెవరో మీరే తెలుసుకోండి.. ఒక సింహం, పులి కలిస్తే వచ్చేది 'లైగర్'.. నాకు అర్జున్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. తనెప్పుడూ సమయానికి రెడీగా ఉండడు (అర్జున్ రెడ్డి) అంటూ ఆ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పకనే చెప్పాడు.నేను ఏకీభవించలేదుఎక్కువమంది ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలుంటాయి, ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉంటాయి.. వారి సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతాయి అని సదరు హీరో అన్నాడు. దాన్ని నేను ఏకీభవించలేదు. విదేశాల్లో కూడా అనేక భాషలున్నాయి. చాలా భాషల్లో తక్కువ బడ్జెట్తో వచ్చిన చిత్రాలు హిట్లు కొడుతున్నాయి. కానీ భారీ బడ్జెట్తో తీసిన ఆయన సినిమా మాత్రం విజయవంతం కాలేకపోయింది అని చెప్పాను. అంతే.. దాన్ని తట్టుకోలేక డిలీట్ చేయించాడు.సినిమాఇప్పుడా వీడియోను సోషల్ మీడియాలో మళ్లీ అప్లోడ్ చేస్తే కచ్చితంగా తీసేయిస్తాడు. మరీ ఇంత అభద్రతాభావానికి లోనైతే ఎలా? ఎవరో ముక్కూమొహం తెలియని వ్యక్తి విమర్శించినా తట్టుకోలేవా? అని ప్రశ్నించాడు. ఇకపోతే అతడు విజయ్ను విమర్శిస్తూ చేసిన వీడియో ఒకటి యూట్యూబ్లో ఇంకా అలాగే ఉంది. కాగా విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, గీతా గోవిందం, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్, కింగ్డమ్ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Farhan Balaporia (@farhan_balaporia) చదవండి: అఫీషియల్: ఓటీటీలో 'కూలీ' రిలీజ్ ఎప్పుడంటే? -
అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత
కొందరు దర్శకనిర్మాతలు కొన్ని సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. ఆర్య సినిమాలో కూడా ఓ డైరెక్టర్, ఓ నిర్మాత చిన్న సీన్లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను తాజాగా ఓ ఈవెంట్లో ప్రదర్శించారు. అది చూసిన నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తనలో తానే నవ్వుకున్నాడు. 20 ఏళ్ల కింద షూట్ చేసిన ఆ సన్నివేశం తాలూకు జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు. నా భార్య తిట్టిందిబన్నీ వాసు మాట్లాడుతూ.. ఆర్య సినిమా చివరి రోజు షూటింగ్.. ఆరోజు ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు రాలేదు. దాంతో దిల్ రాజు ఆఫీస్ క్యాషియర్ శ్రీధర్, వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు, నేను.. ముగ్గురం నటించాం. సుకుమార్గారిదే ఆలోచన.. మీరు ముగ్గురూ వేస్ట్గా పడున్నారు కదా.. ముందుకు రండి అని మాపై సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్ చూశాక మా ఆవిడ చాలా తిట్టింది. అప్పటినుంచి నేను ఎక్కడా కనబడలేదు. ఈ మధ్య మిత్రమండలి సినిమా కోసం నాతో ఏదో రీల్ చేయించారు. అది చూశాక కచ్చితంగా నేనే ట్రోల్ అవుతానని అనిపించి ఆ రీల్ బయటకు వదల్లేదు అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.నిర్మాతగా..కాగా బన్నీ వాసుది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయమవగా వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అలా అతడు గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేరాడు. తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో పార్ట్నర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఈమధ్యే స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరిట కొత్త బ్యానర్ ప్రారంభించాడు. ఈ బ్యానర్పై బన్నీ వాసు.. మిత్ర మండలి సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సీన్ లో ఉంది దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్ , ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు. 😃#LittleHearts #Aarya pic.twitter.com/bmvACGNF8s— Suresh PRO (@SureshPRO_) September 3, 2025 చదవండి: తండ్రి కాబోతున్న యంగ్ హీరో -
నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా!
పిల్లలు ఎక్కడికి వెళ్లినా సరే జాగ్రత్త అని చెప్తుంటారు పేరెంట్స్. అందులోనూ వాతావరణం సరిగా లేనప్పుడు టూర్లు, ట్రిప్పులు అని బయటకు వెళ్తే కాస్త కంగారుపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తిరిగొచ్చేస్తారా? అని ఎదురుచూస్తుంటారు. చెప్పిన మాట వినకుండా ట్రిప్పులో ఏమైనా సాహసాలు చేసేందుకు ఒడిగట్టారని తెలిస్తే ఇంటికొచ్చాక తల్లి చేతిలో అక్షింతలు పడటం ఖాయం!సారీ అమ్మమెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) పరిస్థితి కూడా అంతే! తాజాగా ఆమె తన ట్రిప్కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఓ జలపాతానికి దగ్గరగా వెళ్లి సంతోషంతో గెంతులేసింది. 'నేను సురక్షితంగా ఇంటికి వచ్చేయాలని మా అమ్మ నాకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ నేనేమో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, సారీ అమ్మ' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు నిహారిక వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. ఈ సరదా వీడియో నెట్టింట వైరల్గా మారింది.నటిగా, నిర్మాతగా..నిహారిక కొణిదెల నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా! ఒక మనసు, సూర్యకాంతం, డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్, మద్రాస్కారన్ మూవీస్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్పై ఓటీటీలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. హలో వరల్డ్ సిరీస్లో నిహారిక నటించింది కూడా! నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే తొలి సినిమా థియేటర్లో రిలీజ్ చేయగా ఇది బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తన బ్యానర్లో మరో మూవీ రూపుదిద్దుకుంటోంది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: అనుష్క కోసం ప్రభాస్ ఎంట్రీ.. 'ఘాటీ' స్పెషల్ గ్లింప్స్ -
'ఆల్కహాల్' కోసం నరేశ్, సత్య పంచ్ డైలాగ్స్ (టీజర్)
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ విడుదలైంది. ఇందులో రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. దర్శకుడు మెహర్ తేజ్ మంచి కామెడీ టైమింగ్ పంచ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో నరేశ్, సత్యల మధ్య వచ్చిన కామెడీ పంచ్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో నిహారిక ఎన్ఎమ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. -
అనుష్క కోసం ప్రభాస్ ఎంట్రీ.. 'ఘాటీ' స్పెషల్ గ్లింప్స్
అనుష్క (Anushka Shetty) నటించిన ఘాటీ సినిమా కోసం ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. అనుష్క యాక్షన్ సీన్స్కు సంబంధించిన గ్లింప్స్ను ఆయన విడుదల చేశారు. స్వీటీ సినిమా ప్రమోషన్ కోసం బాహుబలి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.కొన్ని కారణాలవల్ల ఘాటీ సినిమా ప్రమోషన్స్కు అనుష్క దూరంగా ఉన్నారు. అయితే, ఫోన్ ద్వారా ఆమె ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తాజాగా ఘాటీ కోసం సడెన్గా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత బజ్ క్రియేట్ కానుంది. -
తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ హీరో
నటుడు అదిత్ అరుణ్ (త్రిగుణ్) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య సీమంతం వీడియోను తాజాగా పంచుకున్నాడు. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా సరే టాలెంట్ను నమ్ముకుని వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. మొదట కథ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. రీసెంట్గా లైన్ మ్యాన్, ఉద్వేగం వంటి చిత్రాలతో మెప్పించారు.త్రిగుణ్ 2023 సెప్టెంబర్లో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వారి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. దీనికంటే ముందు నివేదిత సీమంతం కూడా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన పంచుకున్నారు.చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్మెన్ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Adith Eswaran (@adith_officiall) -
రూ. 9 వేల కోట్ల కలెక్షన్స్.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమా 'లిలో అండ్ స్టిచ్' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. మే 23న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు భారత అభిమానుల కోసం స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉండనుందని మొదట ప్రకటించారు. అయితే, ఇప్పుడు సడెన్గా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.'లిలో అండ్ స్టిచ్' చిత్రాన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్, రైడ్బ్యాక్ సంయుక్తంగా నిర్మించాయి. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించారు. 2002లో ఇదే టైటిల్తో విడుదలైన సినిమాకు లైవ్-యాక్షన్ రీమేక్గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 3 నుంచి జియోహాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటనలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ భాషలలో మాత్రమే విడుదల కానుందని జియోహాట్స్టార్ మొదట చెప్పింది. తన టాలీవుడ్ సబ్స్క్రైబర్లను నిరాశపరచకూడదని సడెన్గా తెలుగు వర్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది.'లిలో' జీవితం కోట్ల కలెక్షన్స్ రాబట్టిందిప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 8800 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘లిలో అండ్ స్టిచ్’ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యానిమేటెడ్ క్లాసిక్ లైవ్ యాక్షన్ సినిమాలో మైయా కీలోహా, సిడ్నీ అగుడాంగ్, క్రిస్ సౌండర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్న లిలో అనే అమ్మాయి జీవితంలోకి స్టిచ్ అనే గ్రహాంతరవాసి ఎంటర్ అవుతుంది. వారిద్దరి మధ్య స్నేహం మొదలౌతుంది. దీంతో లిలో జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరి హృదయాన్ని తాకే చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంది. -
స్పిరిట్ స్టోరీ లీక్.. సరికొత్తగా ప్రభాస్
-
రెస్టారెంట్ మూసివేత.. అసలు విషయం చెప్పిన శిల్పా శెట్టి
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) తన రెస్టారెంట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. తనకు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు కూడా చేశారు. ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్ 'బాస్టియన్'ను ఆమె ప్రారంభించింది. మొదటి బ్రాంచ్నే క్లోజ్ చేస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, తాజాగా ఆమె ఒక వీడియోతో రియాక్ట్ అయింది.‘బాస్టియన్’ రెస్టారెంట్ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వేల ఫోన్స్ వస్తున్నాయని నటి శిల్పా శెట్టి చెప్పింది. అయితే, దానిని పూర్తిగా మూసివేయడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. బాంద్రాలోని బాస్టియన్ రెస్టారెంట్ మాకు రూట్ లాంటింది. ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో.. ఇప్పుడు బాస్టియన్ కూడా మాకు కొత్త ఫలాన్ని అందించనుంది. ఇదే ప్రదేశంలో 'అమ్మకై' (AMMAKAI) పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలు అందించనున్నాం. నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. మీకు ఇష్టమైన 'బాస్టియన్' కూడా ఉంటుంది. అయితే, బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో ప్రారంభించబోతున్నాం. కాబట్టి బాస్టియన్ క్లోజ్ చేశాం అనే ప్రచారంలో నిజం లేదు. నా సోదరుడు, భాగస్వామి రంజీత్ బింద్రా వీటికి CEOగా ఉన్నారు. ఇవన్నీ అతని ఆలోచన నుంచి వచ్చిన మంచి నిర్ణయాలు. బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతాయి.' అని ఆమె క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు: 'కొత్త లోక' నిర్మాతలు
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన తాజా సినిమా ‘కొత్త లోక’ (Kotha Lokah) టాలీవుడ్లో కూడా విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సూపర్ యోధగా నటించి మెప్పించింది. ఫాంటసీ థ్రిల్లర్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కన్నడ ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు చెప్పారు.'లోక చాప్టర్1: చంద్ర' చిత్రంలో ఒక సంభాషణ కన్నడ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. 'ఈ సినిమాలో ఒక పాత్ర చెప్పిన సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మాకు సమాచారం వచ్చింది. దీనికి మేము చింతిస్తున్నాము. పొరపాటున జరిగినప్పటికీ మేము బాధ్యత వహిస్తున్నాం. ఈ సంభాషణను వీలైనంత త్వరగా తొలగిస్తాం లేదా సవరిస్తాం. మా వల్ల జరిగిన తప్పుకి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాం' అని తెలిపారు. -
హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు - రాజమౌళి సినిమా