Tollywood
-
వారణాసిలో ఫైట్
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ టైమ్ ట్రావెల్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్ను వారణాసి అండ్ టీమ్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. గత ఏడాది నవంబరులో ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్.ఈ వీడియోలో మహేశ్బాబు ఎంట్రీ సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశాలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారట. ఈ ఫైట్ ఎపిసోడ్ ‘వారణాసి’కి ఎంతో కీలకమైనదని తెలిసింది. కాగా, ఈ చిత్రం కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా వారణాసి సెట్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సెట్లోనే తాజా ఫైట్ షూట్ జరుగుతోందని టాక్. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. -
కొత్త భాష మాట్లాడాను: శ్రీ విష్ణు
‘‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒక పీరియడ్ సినిమా. 90లలో జరిగిన ఒక ఘటనకి ఫిక్షన్ జోడించి కోన వెంకట్గారు ఒక అద్భుతమైన కథని సిద్ధం చేశారు. ఈ చిత్రం కోసం ఒక కొత్త భాషను మాట్లాడాను... దాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్పై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ఒరియా పిల్ల...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్ని శనివారం నిర్వహించారు.ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. షూటింగ్ సమయంలో నాతో పాటు అందరూ చాలా సరదాగా పని చేశాం’’ అన్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘శ్రీ విష్ణు ఈతరం ఆల్రౌండర్. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో పని చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.‘కామ్రేడ్ కళ్యాణ్’ వంద శాతం విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది’’ అన్నారు జానకి రామ్. ‘‘ఈ సినిమాలో మంచి వినోదంతో పాటు చక్కని సంగీతం ఉంది’’ అని వెంకటకృష్ణ కర్నాటి చెప్పారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, నటుడు షైన్ టామ్ చాకో, లిరిక్ రైటర్ భాస్కరభట్ల, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, రచయిత బీవీఎస్ రవి మాట్లాడారు. -
నాన్నకు ప్రేమతో
నాన్న అంటే ఓ భావోద్వేగం... నాన్న అంటే నమ్మకం... నాన్న అంటే భరోసా... నాన్న అంటే సూపర్ హీరో... నాన్న అంటే ప్రేమకు నిర్వచనం... ఆ ప్రేమ అనంతం.. అందుకే సిల్వర్ స్క్రీన్పై కూడా ఫాదర్ ఎమోషన్ ఎవర్ గ్రీన్. వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కాసులు వర్షం కురిపిస్తారు. అందుకే ఫాదర్ ఎమోషన్తో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఉంది. మరి... ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఫాదర్ ఎమోషన్స్తో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ కాకాజీ చిరంజీవి ‘డాడీ’ సినిమా గుర్తుందిగా..! ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో తండ్రీకూతుళ్ల ఎమోషన్ భావోద్వేగభరితంగానే సాగుతుంది. ఇక చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’లోనూ ఫాదర్–డాటర్ ఎమోషనల్ సీక్వెన్స్ ఆడియన్స్ను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఓకే చేశారట చిరంజీవి.‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్ రవీంద్ర కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ సీక్వెన్స్లు అద్భుతంగా ఉంటాయని తెలిసింది. కథలో చిరంజీవి, అనశ్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారని టాక్. కోల్కతా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.తొలి షెడ్యూల్ షూటింగ్ను హైదరాబాద్లో, రెండో షెడ్యూల్ను పొల్లాచ్చిలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైందని తెలిసింది. ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్స్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.కూతురు కోసం..! కూతురు కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు హీరో నాగార్జున. ఏం చేశారు? అనేది ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో చూడొచ్చని తెలిసింది. నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘కింగ్ 100’. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. నాగార్జున కెరీర్లోని ఈ 100వ సినిమాలో టబు, సుష్మితా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టెక్నాలజీ సాయంతో పాతికేళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నాగార్జున కనిపించనున్నట్లు తెలిసింది.ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు... ఈ ‘కింగ్ 100’ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు కూడా నటిస్తారని తెలిసింది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్’ చిత్రంలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉన్న విషయం ఆ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది.ఇరుముడి రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రధానంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా చైల్డ్ ఆర్టిస్టు నక్షత్ర నటిస్తోంది.రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెర పాలెం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘విక్రమార్కుడు’లో మంచి ఫాదర్–డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే.ఇటు స్పిరిట్... అటు సలార్... దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలు ‘అర్జున్ రెడ్డి, యానిమల్’. ఈ రెండు చిత్రాల్లోనూ అంతర్లీనంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. ఈ తరహా ఎమోషనల్ బాండింగ్ సందీప్ తాజా చిత్రం ‘స్పిరిట్’లోనూ కనిపించనుందని తెలిసింది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్, ప్రకాష్రాజ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని భోగట్టా.ప్రకాష్రాజ్ సైతం పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా నుంచి తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’వచ్చింది. ఈ చిత్రంలో దేవ పాత్రలో నటించారు ప్రభాస్.తొలి భాగంలో ప్రభాస్ తండ్రి పాత్ర గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ రెండో భాగంలో దేవ తండ్రి ధారా ప్రస్తావన పెద్ద స్థాయిలో ఉంటుందని తెలిసింది. సలార్ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవ–ధారాల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలైట్గా ఉంటాయని తెలిసింది. వచ్చే ఏడాది ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి డ్రాగన్ అయితే కొడుకు లూగర్?ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో డ్రాగన్, లూగర్... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారని, కథ రీత్యా సినిమాలో డ్రాగన్, లూగర్లు తండ్రీ కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, అన్షుమాన్, సిద్ధాంత్ గుప్తా, బిజు మీనన్, ఖుష్బూ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవర, వర... ఇలా తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. ఈ సినిమాకు సీక్వెల్గా ‘దేవర 2’ రూపొందనుంది. ‘దేవర’ని నిర్మించిన కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ రెండో భాగాన్ని కూడా నిరిస్తారని చెప్పోచ్చు.తండ్రి... ఇద్దరు కొడుకులు! అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇందులో తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నారని తెలిసింది. ఇలా అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. దీపికా పదుకోన్, మలయాళ నటి ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని తెలిసింది. ఈ ‘రాక’ చిత్రంలో రష్మిక, అల్లు అర్జున్ల క్యారెక్టరైజేషన్స్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 డిసెంబరులో రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇతర భాషల్లో రూపొంది, తెలుగు తెరకూ రానున్న కొన్ని చిత్రాల్లోనూ తండ్రి ఎమోషన్ ప్రధానాంశంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే... ⇒ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల వల్ల విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానాంశంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ‘జన నాయకుడు’ ఉండబోతున్నట్లు ట్రైలర్లోని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్, మమితా బైజు తండ్రీ కుమార్తెలుగా నటించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, ప్రియమణి, నాజర్, సునీల్, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు సూపర్ హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’ ఆధారంగా ‘జన నాయకుడు’ సినిమా తీశారనే వార్తలు ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించారు. ⇒ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇదో ఫాదర్ ఎమోషన్తో అల్లుకున్న సినిమా కథ అని టైటిల్ స్పష్టం చేస్తోంది . ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ విజయ్ ప్రకాష్ తండ్రి సర్దార్. సమాజం నిందిస్తున్నట్లు తన తండ్రి ఓ దేశద్రోహి అనే భావనలో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ విజయ్ప్రకాష్. కానీ సర్దార్ ఒక ఇండియన్ స్పై ఏజెంట్ అని, నిజమైన దేశభక్తుడు అని విజయ్ప్రకాష్ ఆ తర్వాత తెలుసుకుంటాడు. తండ్రి బాటలోనే తాను ఇండియన్ స్పై ఏజెంట్గా మారతాడు. మరి... నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ‘సర్దార్’ సినిమాలో చూడాలి. విజయ్ప్రకాష్, సర్దార్... ఇలా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన తమిళ సినిమా ‘సర్దార్’. 2022లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ చిత్రదర్శకుడు పీఎస్ మిత్రన్, హీరో కార్తీ కలిసి ‘సర్దార్2’ సినిమాని కూడా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్జె సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ⇒ షారుక్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న హిందీ సినిమా ‘కింగ్’. నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లైన షారుక్, సుహానా ఖాన్ ‘కింగ్’ సినిమాలోనూ ఫాదర్–డాటర్ రోల్స్లో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్గా నటిస్తుండగా రాణీ ముఖర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. అలాగే ఇది సుహానా ఖాన్ నటిస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. సిల్వర్ స్క్రీన్పై తన డెబ్యూ మూవీలోనే తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఏ కుమార్తెకు అయినా ఇంతకంటే స్పెషల్ ఏం ఉంటుంది? నిజంగా యాక్టర్గా సుహానా లక్కీ అని చెప్పవచ్చు.⇒ ఆహార కల్తీ అనేది చిన్నారుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అన్న అంశం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. కూతురి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తండ్రి చేసిన అసాధారణమైన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో శ్రేయాస్ తల్పాడే నటించగా, న్యాయవాది పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మించారు. ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైదానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషిలు సహ–నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంగీతం: మంగేష్ ధాక్డే. ⇒ కుమార్తెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఏదైనా మంచి బహుమతి ఇస్తాడు? కానీ ఓ తండ్రి తన కుమార్తె చేతికి గన్ ఇచ్చాడు. ఎవర్నో చంపిన తర్వాత హ్యాపీ బర్త్ డే చెప్పాడు. నిజంగా అతను ఆమెకు తండ్రేనా? లేక తండ్రిలా ఆ అమ్మాయిని పెంచి, తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడా? అనేది హిందీ సినిమా ‘ఆల్ఫా’లో చూడాలి. ఆలియా భట్, శార్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆల్ఫా’. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు.– ముసిమి శివాంజనేయులు -
షాకింగ్ డెసిషన్.. మనసుకు విశ్రాంతి కావాలి
స్వతహాగా అసోం అమ్మాయి అయినప్పటికీ తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాయదు లోహర్. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మనసుకు విశ్రాంతి కావాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)'సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. శరీరానికి ఇచ్చినట్లే మనసుకూ విశ్రాంతి కావాలి. స్క్రీన్కి దూరంగా ఉండి నాతో నేను ఎక్కువ టైం గడపాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి ప్రేమ చూపించిన వాళ్లకు థ్యాంక్స్. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నా' అని కాయదు పోస్ట్ పెట్టింది.తెలుగులో 'అల్లూరి' మూవీతో హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అలా తెలుగు, తమిళ, మలయాళంలో పలు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే తమిళంలో ఇమ్మోర్టల్, తెలుగులో 'ప్యారడైజ్' చేస్తోంది. మరి కెరీర్ పరంగా బాగానే ఉన్న టైంలో ఇలా సోషల్ మీడియాకు ఎందుకు బ్రేక్ ఇచ్చిందో?(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండస్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ రిలీజ్ టైంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్రమే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్టపోతున్నాయని తెలిపారు.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?)హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్ఫార్మ్స్, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అంత హిట్ సినిమాను కూడా ఇండస్ట్రీ పెద్దలు రానివ్వడం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. భరత్ భూషణ్.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని షెరాజ్ కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో బహిరంగంగా మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని షెరాజ్ తెలిపారు. పరిస్థితులు మారకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను విడిచి ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.(ఇదీ చదవండి: ఇన్స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?) -
ఇన్స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో సమంత 'మా ఇంటి బంగారం'కి పర్లేదనిపించే టాక్ వచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.13 కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సరే ఈ విషయం పక్కనబెడితే మూవీలో సమంత అదరగొట్టేసినప్పటికీ ఈమె ఫ్రెండ్ కిరణ్మయి పాత్ర చేసిన నటి కూడా ఆకట్టుకుంది. 'లెట్స్ కమాన్' అంటూ అందరినీ నవ్విస్తోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఇన్ స్టా, యూట్యూబ్లో తన ప్రతిభ చూపిస్తూ చాలామంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలానే 'మా ఇంటి బంగారం'లో సమంత స్నేహితురాలిగా మంజూష ముక్కవిల్లి అవకాశం దక్కించుకుంది. పాతతరం నటీమణులైన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో గుర్తింపు మంజూష చాలానే తెచ్చుకుంది.ఓ రోజు డైరెక్టర్ నందిని రెడ్డి అనుకోకుండా మంజూష రీల్ పడింది. దీంతో ఈమెని పిలిపించి ఆడిషన్ తీసుకుంది. మూడుసార్లు ఆడిషన్ చేసి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్కి ఎంపిక చేసింది. నందిని రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్న మంజూష.. ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది.లాడ్జిలో ఉంటూ తెల్లవారుజామునే వంటలు చేసొచ్చి ఫ్రెండ్ సమంతకు రహస్యంగా చేరవేసి ఆమెను గట్టెక్కించే పాత్రలో మంజుష భలే నటించింది. ఓవైపు అమాయకంగా మరోవైపు గడుసుతనం ప్రదర్శించే సీన్స్లో ఈమె యాక్టింగ్ తెగ నవ్విస్తోంది. ఇదే తొలి సినిమా అయినప్పటికీ చాలా సహజంగా పాత్రలో సెట్ అయిపోయి, అనుభవమున్న నటిలా హావభావాలు పలికించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్లోనే ఉంటున్న ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?) View this post on Instagram A post shared by Manjusha Mukkavilli (@manju_kuttilu) -
23 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో సోనాలి బింద్రే సందడి..!
-
‘నాగబంధం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రతి తుఫాను వెనుక...
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఎన్బీకే111’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.శుక్రవారం (జూన్ 19) కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్బీకే 111’ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘ప్రతి తుఫాను వెనుక ఓ కారణం ఉంటుంది’ అంటూ కాజల్ పాత్ర స్వభావాన్ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో తెలియజేసే ప్రయత్నం చేసింది యూనిట్. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఈ పుడమికి కావలి నువ్వు
గోపీచంద్ హీరోగా నటిస్తున్న చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వీర జయధీర...’ అంటూ సాగే తొలి పాటను శనివారం విడుదల చేశారు.‘ఓ వీర... జయధీర.., ఓ వీర... ధ్రువతార.., పయనించే శిఖరం నువ్వేరా... ప్రవహించే సమరం నువ్వేరా.., ఈ పుడమికి కావలి నువ్వురా... ఆ కడలికి కంచెవు నువ్వురా... గగనానికి గొడుగైనావురా... అయినా నువ్వే ఒంటరి...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన పాడారు. ‘‘క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ‘భరత వర్ష’ మూవీ ప్రతి ప్రమోషనల్ కంటెంట్తో అంచనాలను పెంచుతూనే ఉంది.‘వీర జయధీర...’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్ఫుల్ పాటగా నిలుస్తుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మథనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్. -
రేవంత్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్-1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్. రామ్ భరదరం దర్శకత్వం వహిస్తున్నారు.లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్, ఫ్యామిలీస్ని ఆకట్టుకొనేలా సినిమా తీయనున్నట్లు దర్శకుడు రామ్ భరదరం చెప్పుకొచ్చారు. సింగపూర్లో సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు. హైదరాబాద్, చీరాలలో టాకీ పార్ట్ తీయబోతున్నారు. -
సడన్గా ఓటీటీకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో దృశ్యం-3తో పాటు దురంధర్-2 కూడా మరో ఓటీటీకి వచ్చేసింది. అంతేకాకుండా తెలుగు కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్-3,రవిబాబు రేజర్ మూవీ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఒక్క రోజే స్ట్రీమింగ్కు వచ్చేశాయి.తాజాగా మరో మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మరీచిక సడన్గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ ఏడాది మే 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాకు సతీశ్ కసెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించారు. #Mareechika (Telugu)Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026 -
మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?
-
సమంతకు ప్రెగ్నెన్సీ.. అందుకే అలా కనిపించారా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ సామ్ హిట్ కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇదే సమయంలో సమంతపై సోషల్ మీడియాలో రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. మా ఇంటి బంగారం ప్రమోషన్ల తర్వాత సామ్పై ఓ టాక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఆమెను చూస్తుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలుస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదే నిజమైతే సమంత ఫ్యాన్స్కు ఆనందం డబుల్ అని పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత టీమ్ నుంచి ఎలా స్పందన రాలేదు.చీరకట్టు వల్లే..ముఖ్యంగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లకు సమంత చీరకట్టులోనే హాజరయ్యారు. ఏ ఈవెంట్కు నిండు చీరలో అందంగా కనిపించారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఈవెంట్స్కు చీరలో వెళ్లడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సామ్ సంప్రదాయబద్ధంగా శారీలో కనిపించడం ప్రెగ్నెన్సీ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. కొందరైతే నెటిజన్ ఏకంగా సామ్ బేబీ బంప్తో ఉందని.. అందుకే కనిపించకుండా శారీలోనే ప్రమోషన్లలో పాల్గొన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రూమర్స్పై సమంత కానీ.. ఆమె టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో సామ్- రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. -
నాన్స్టాప్ నవ్వులు ఆరంభం
వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘వెంకీఅనిల్5 అండ్ ఎన్కేఆర్ఏఆర్ 2’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్కు జోడీగా కృతి శెట్టి నటించనున్నారు. జీ స్టూడియోస్, అర్చన, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.గురువారం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కలిసి నిర్మాత సాహు గారపాటికి స్క్రిప్ట్ అందించారు.‘‘దర్శకుడు అనిల్ రావిపూడి శైలితో కూడిన నాన్స్టాప్ నవ్వులు, వినోదంతో కూడిన సినిమా ఇది. వెంకటేశ్, కల్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. వచ్చే సంక్రాంతి పండగ సీజన్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఎంటర్టైనింగ్ మూవీస్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని ఆరంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
'గాసిప్' నుంచి 'సిప్పు సిప్పు' సాంగ్ రిలీజ్
హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్పై యతి నిర్మిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో సోషల్ సెటైర్గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ఈ చిత్రం తీస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా సిప్పు సిప్పు అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ డాన్స్ ట్రాక్కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగర్ మాళవిక పాడింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తీస్తున్నారు. -
వెంకీ-అనిల్ మూవీ లాంఛ్.. రాఘవేంద్రరావు తీరుపై విమర్శలు..!
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో మరో చిత్రం రానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీ కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశ్ను హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రోజే అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ లాంఛ్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహుర్తపు షాట్కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్ షాట్కి డైరెక్షన్ చేసిన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్కు కారణమైంది. హీరోయిన్ కృతి శెట్టి భుజంపై తన చేయి పెట్టి మరి మాట్లాడుతూ కనిపించారు. దర్శకత్వం వరకు ఓకే కానీ.. యంగ్ హీరోయిన్ భుజంపై చేతులు వేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో హీరోయిన్తో ఆయన వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్ పేరున్న డైరెక్టర్ ఇలా వ్యవహరించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. #VenkyAnil5 Begins🎬Venkatesh, Keerthy Suresh, Kalyan Ram, Kriti Shetty. pic.twitter.com/a9iSg28COA— Christopher Kanagaraj (@Chrissuccess) June 18, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)
-
వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ లాంఛ్.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్(ఫోటోలు)
-
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
రాజీవ్ కనకాల చెప్పాడు.. నా గర్వంతో చాలా కోల్పోయా: చిత్రం శీను
ఒకే ఒక్క సినిమా అతని కెరీర్నే మార్చేసింది. ఏకంగా ఆ సినిమా పేరుతోనే ఆయన పిలిచేలా చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఒక్క మూవీతో కెరీర్ మార్చడమే కాదు.. ఒక నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నటుడు ఎవరని అనుకుంటున్నారా? అతనే ఉదయ్ కిరణ్ మూవీ చిత్రంతో ఫేమస్ అయిన శీను.. అలియాస్ చిత్రం శీను.చిత్రం శీను అంటే కేవలం కమెడియన్ మాత్రమే.. నటుడిగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కూడా రాణించారు. పొలిమేర చిత్రాల తర్వాత గతేడాది మేఘన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చిత్ర శీను తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన గర్వం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని షాకింగ్ రివీల్ చేశారు.ఒకసారి రాజీవ్ కనకాల నాతో ఓ స్థలం కొంటున్నానని నాతో చెప్పారని చిత్రం శీను తెలిపారు. నేను మణికొండలో ప్లాట్ తీసుకుంటున్నా.. నువ్వు కూడా తీసుకో అని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయనను నేను బావ అని పిలిచేవాడిని.. అప్పుడు నేను చిరంజీవి ఎక్కడ ఉంటారు.. జూబ్లీహిల్స్లో కదా.. నేను కూడా అక్కడే కొంటానని రాజీవ్తో చెప్పానని అన్నారు. నేను సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటాననే గర్వంతో ఉండేవాడినని శీను తెలిపారు. అప్పుడు నా వయసు కేవలం 23 ఏళ్లేనని.. అవగాహన లేకనే అలా మాట్లాడానని చిత్రం శీను వివరించారు. తినడానికి అన్నం లేక..తినడానికి అన్నం లేని రోజులు కూడా చూశానని చిత్రం శీను అన్నారు. బీరు బాటిల్స్ అమ్ముకుని టిఫిన్ చేసిన రోజులు ఎదుర్కొన్నానని శీను వెల్లడించారు. ఇంద్రలోక్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ వద్ద బీర్ బాటిళ్లను తీసుకెళ్లి అమ్ముకుడేవాన్ని అని తెలిపారు. ఆ తర్వాత న్యూస్ పేపర్ వేయడం ద్వారా కొంత చిల్లర డబ్బులు వచ్చేవని చిత్రం శీను తన ఎదుర్కొన్న బాధలను పంచుకున్నారు. -
మహేష్ బాబు, వంగా మూవీ సెట్స్ పైకి ఎప్పుడంటే
-
రమ్యకృష్ణ సెకండ్ లవ్.. ఇలా షాకిచ్చిందేంటి?
ఓటీటీలు వచ్చాక ఇబ్బడిముబ్బడిగా సినిమాలు, సిరీస్లు క్యూ కడుతున్నాయి. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తున్నాయి. అయితే ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యే సినిమాల్లో కేవలం చిన్న హీరోల చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్ల విషయానికొస్తే పెద్దగా స్టార్స్ కనిపించరు. కొంత పేరున్న నటీనటులే ఉన్నప్పటికీ అగ్రతారలెవరు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేసిన సందర్భాలు చాలా తక్కువే.కానీ ఇప్పుడంతా సీన్ మారిపోయింది. ఒకప్పటి స్టార్స్ సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం ఓటీటీల్లోకి అరంగేట్రం చేస్తోంది. దీంతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ సెకండ్ లవ్. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. సెకండ్ లవ్ అంటే ప్రేమ, వ్యామోహం అనే కాన్సెప్ట్తోనే ఈ సిరీస్ ఉండనుందని టైటిల్ వింటేనే అర్థమవుతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏదేమైనా రమ్యకృష్ణ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ అభిమానులు షాకవుతున్నారు. -
21 ఏళ్లైనా ‘అపరిచితుడు’ మ్యాజిక్ ఎందుకు తగ్గలేదు?
ఒక సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. కానీ చాలా అరుదుగా వచ్చే కొన్ని చిత్రాలు మాత్రం కాలాన్ని దాటి తరాల తరబడి చర్చల్లో నిలుస్తాయి. అలాంటి చిత్రమే అపరిచితుడు. 2005 జూన్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సంచలన చిత్రం నేటితో 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే రెండు దశాబ్దాలు గడిచినా ‘అంబి(ramanujam)’ బాధ, ‘అన్నియన్’(aparichitudu )ఆగ్రహం, ‘రేమో’ స్టైల్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో తాజాగా ఉండటం విశేషం.సాధారణంగా హీరో విలన్ను కొట్టి గెలిచే కథలే ఎక్కువగా వచ్చిన కాలంలో దర్శకుడు శంకర్ పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకున్నారు. దేశాన్ని నాశనం చేసేది కేవలం అవినీతి రాజకీయ నాయకులే కాదు.. బాధ్యత లేకుండా ప్రవర్తించే సామాన్య ప్రజలూ అని ఆయన చూపించిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, విధుల్లో నిర్లక్ష్యం చూపించడం వంటి రోజూ జరిగే విషయాలనే కథకు కేంద్రబిందువుగా మార్చారు.ఈ చిత్రానికి అసలైన బలం విక్రమ్ నటన. చట్టాన్ని నమ్మే అమాయకుడైన రామానుజం, ఫ్యాషన్ ప్రపంచంలో విహరించే రేమో, తప్పు చేసిన వారిని భయంకరంగా శిక్షించే అపరిచితుడు.. ఇలా మూడు విభిన్న వ్యక్తిత్వాలను ఒకే సినిమాలో చూపించి విక్రమ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో గొప్ప పెర్ఫార్మెన్స్లలో దీనిని ప్రస్తావిస్తారు.సినిమాలోని శిక్షల సన్నివేశాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. పురాణాల్లో చెప్పిన గరుడ పురాణ శిక్షలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. థ్రిల్లర్, సైకాలజీ, సామాజిక సందేశం.. ఈ మూడు అంశాలను శంకర్ ఒకే కథలో మేళవించడం చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.అప్పటి భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్గా కూడా కొత్త ప్రమాణాలు సృష్టించింది. విదేశాల్లో చిత్రీకరించిన పాటలు, అద్భుతమైన సెట్లు, హారిస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.తెలుగులో ‘అపరిచితుడు’గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, టెలివిజన్లో ప్రసారమైన ప్రతిసారీ మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియా యుగంలో కూడా ‘రామానుజం’ మీమ్స్, ‘అపరిచితుడు’ డైలాగులు వైరల్ అవుతుండటం ఈ సినిమా ప్రభావానికి నిదర్శనం. 21 ఏళ్లు గడిచినా ‘అపరిచితుడు’ కేవలం ఒక సినిమా కాదు... మన సమాజం మారిందా లేదా? అని ఇప్పటికీ ప్రశ్నిస్తున్న అద్దం. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైపోయింది. ఈ ఏడాది ఇప్పటికే రష్మికతో పాటు పలువురు నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు హీరోయిన్లు ప్రెగ్నెన్సీ లాంటి శుభవార్తలు కూడా చెప్పేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది. బేబీ బంప్తో భర్తతో కలిసి చేసిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)గుజరాత్కి చెందిన పూజా ఝావేరి.. 2015లో 'భమ్ భోళేనాథ్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి 'ద్వారక', సుమంత్ అశ్విన్ 'రైట్ రైట్', రవితేజ 'టచ్ చేసి చూడు',47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు, మిక్స్ అప్ తదితర టాలీవుడ్ చిత్రాలు చేసింది.2024లో ఎన్నారైని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి న్యూయార్క్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూజా ఝావేరి.. భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్తో తీసుకున్న వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత) View this post on Instagram A post shared by Pooja J Jhaveri (@iampoojajhaveri) -
మెగాఫోన్ పడుతున్న మన హీరోలు!
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లో మల్టీ టాలెంటెడ్ అనే పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. గతంలో కేవలం నటనకే పరిమితం అయ్యేవారు హీరోలు, హీరోయిన్లు. అయితే ఇప్పటి హీరోలు కేవలం నటనకి మాత్రమే పరిమితం కావడం లేదు. యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరేమో తమ సినిమాలకు తామే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సరైన హిట్స్ లేనప్పుడు తమకు సరిపడా కథలను రాసుకుని హిట్ అందుకున్న హీరోలూ ఉన్నారు. మరికొందరేమో స్వీయ కథని సిద్ధం చేసుకోవడంతో పాటు తామే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించి, హిట్స్ అందుకున్నారు కూడా.అయితే ఇటీవల ఎక్కువ మంది హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి సొంత నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతలుగా మారారు కూడా. సొంత ప్రొడక్షన్ హౌస్లు నెలకొల్పిన వారిలో కొందరు హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం పలువురు హీరోలుగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తుండగా, మరికొంత మంది స్వీయ నిర్మాణంలో హీరోలుగా నటిస్తున్నారు. ఈ లిస్ట్లో తెలుగులో అక్కినేని నాగార్జున, రామ్ పోతినేని, వడ్డే నవీన్, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో పాటు హీరోయిన్ సమంత ఉన్నారు. ఇక కన్నడ నుంచి యశ్, తమిళ్ నుంచి విశాల్, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ వంటి కథానాయకులు కూడా ఉన్నారు. ఇలా ఆన్ సెట్ ఆర్టిస్టులుగా ఆఫ్ సెట్ దర్శకులుగా నిర్మాతలుగా బిజీగా ఉన్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.నూరవ చిత్రానికి నిర్మాతగానూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ (1986) సినిమాతో హీరోగా పరిచయమై, నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు తన సతీమణి అన్నపూర్ణ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్యానర్ను నెలకొల్పి పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్పై నాగార్జున కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర రావు మరణానంతరం కూడా అన్నపూర్ణ స్టూడియోస్పై తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు నాగార్జున.తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న వందో చిత్రాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్పైనే నిర్మిస్తున్నారు. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్. హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతుండటం విశేషం. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు.ఈ మూవీలో నాగార్జునతో కలిసి నటిస్తున్నారు టబు. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ’ (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో సర్ప్రైజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్ను మేకర్స్ అనుకుంటున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి... హీరో విశ్వక్ సేన్ ముచ్చటగా మూడోసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఫలక్నూమా దాస్’. ఈ మూవీకి కథ అందించడంతో పాటు హీరోగా నటించారు విశ్వక్ సేన్. ఈ చిత్రాన్ని ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. 2019 మే 31న విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. డైరెక్టర్గా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు విశ్వక్ సేన్. ఆ తర్వాత హీరోగా బిజీ అయిన ఆయన దర్శకత్వం వహించిన ద్వితీయ చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రాన్ని కూడా ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. 2023 మార్చి 22న విడుదలైన ఈ చిత్రం విజయం అందుకుంది. అనంతరం కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన విశ్వక్ ముచ్చటగా మూడోసారి దర్శకత్వం చేపట్టారు. ఆయన హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కల్ట్’. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ ఇతర ΄ాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.హైదరాబాద్లో నిర్వహించిన ‘కల్ట్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్’ సినిమా తీశాను. ‘ఫలక్నూమా దాస్’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను’’ అని పేర్కొన్నారు. తారక్ సినిమాస్ బ్యానర్పై సందీప్ కాకరాల నిర్మించిన ‘కల్ట్’ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. హీరోగా, నిర్మాతగా రీ ఎంట్రీ ‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ (Vadde Naveen) ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఎటాక్’. 2016 ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత సుమారు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించడం విశేషం. ఈ మూవీ ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్పై వడ్డే నవీన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. వినోదాత్మకంగా, భావోద్వేగాలతో ఉండే ఈ చిత్రం వడ్డే నవీన్ నటనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందంటూ యూనిట్ పేర్కొంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వడ్డే నవీన్ మాట్లాడుతూ– ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాని టీం అంతా ఇష్టపడి చేశారు. ఈ పదేళ్లలో టెక్నికల్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ బలంగా ఉంటుంది. మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. బంగారంతో మళ్లీ నిర్మాతగా... ‘ఏమాయ చేసావె’ (2010) సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు సమంత. తొలి మూవీతోనే హిట్ అందుకుని, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారామె. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సమంత ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని నెలకొల్పిన ఆమె తొలి చిత్రంగా ‘శుభం’ మూవీని నిర్మించారు. 2025 మే 9న విడుదలఅయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న సమంత నిర్మించిన ద్వితీయ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించారు.‘ఓ బేబి’ వంటి హిట్ మూవీ తర్వాత సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘మా ఇంటి బంగారం’. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు(సమంత భర్త), హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్తో రూపొందిన ఈ మూవీ నుంచి విడుదలైన లుక్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ–‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నందినీగారు, రాజ్ గారు ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో ఎమోషన్, యాక్షన్, డ్రామా, కామెడీ... ఇలా అన్ని వాణిజ్య అంశాలుంటాయి. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రత్యేకించి నా అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాతగా తొలి అడుగు ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018), ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ (2022) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో యశ్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో యశ్ హీరోగా నటించడంతో పాటు నిర్మించడం విశేషం. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ మూవీ నిర్మించారు. ఈ మూవీని ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మార్చి నుంచి జూన్ 4కి రిలీజ్ పోస్ట్పోన్ అయినప్పటికీ మరోసారి వాయిదా పడింది. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.‘‘సినిమాకాన్లో ‘టాక్సిక్’ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత అక్కడ వచ్చిన స్పందన చూశాక వరల్డ్ వైడ్గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యులను కాంటాక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో జూన్ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన మరో విడుదల తేదీని త్వరలోనే చెబుతాం’’ అని యశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘టాక్సిక్’ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. తొలిసారి దర్శకత్వం... హీరో విశాల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. ఇప్పటివరకూ హీరోగా ఆడియన్స్ని మెప్పించిన ఆయన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆర్.బి. చౌదరి నిర్మించిన 99వ సినిమా ‘మకుటం’. బుధవారం విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై క్రేజ్ని పెంచింది. ‘‘స్టైలిష్, విజువల్ ట్రీట్లా ‘మకుటం’ మూవీని తెరకెక్కించారు. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఆయన కెరీర్లోనే క్రేజీ ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలబెట్టాయి. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్గా నిలవబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఇండస్ట్రీ వర్గాలో భారీ అంచనాలున్నాయి. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. జూలైలో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్ ప్రకటించింది. పైన పేర్కొన్న హీరోలు మాత్రమే కాదు.. మరికొంత మంది హీరోలు, హీరోయిన్లు కూడా నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. తొలిసారి మెగాఫోన్తో... ‘దేవదాసు’ (2006) సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రామ్ పోతినేని. వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ద్వారా హీరోయిన్ ఇలియానా కూడా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే తనదైన డ్యాన్సులు, నటనతో హిట్ అందుకున్నారు రామ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన తొలిసారి మెగాఫోన్ పడుతున్నారు. ఈ సినిమా కోసం సొంతంగా కథ రాసుకున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాతగా మారారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్పై రూపొందనున్న ‘ర్యాపో 23’ మూవీని రామ్ బర్త్డే సందర్భంగా మే 15న ప్రకటిస్తూ.. ఈ చిత్రంలో రామ్ పోషించనున్న వీర పాత్రని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘‘రామ్ పోతినేని తన కెరీర్లో మరో కీలక అడుగు వేయబోతున్నారు.నటుడిగా తన వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చిన ఆయన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో తొలిసారి లిరిసిస్ట్గా మారి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు.. గాయకుడిగానూ తన వాయిస్ని వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన 23వ చిత్రం ‘ర్యాపో 23’తో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. స్టైలిష్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వీర పాత్రలో రామ్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని లుక్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.డైరెక్టర్గానూ... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమా ద్వారా తెలుగులో హీరోగా పరిచయం అయ్యారు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ఈ సినిమాకి కథ అందించడంతో పాటు స్క్రీన్ప్లే అందించారు కిరణ్. 2021 ఆగస్టు 6న విడుదలైన ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (2022) సినిమాకి కథ అందించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే కేఏ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ని స్థాపించి, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమా నిర్మించారు కిరణ్. ఈ ఏప్రిల్ 17న ఈ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు తన కెరీర్లో తొలిసారి మెగా ఫోన్ పట్టారు కిరణ్. ఆయన హీరోగా, కథా రచయితగా, స్క్రీన్ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు.జాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో దేవికా భట్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందుతోన్న సినిమా ఇది. యూత్ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు కిరణ్. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో పాటు తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారాయన. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది’’ అని మేకర్స్ తెలిపారు. హీరోగానే కాదు... దర్శకుడిగానూ... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘క్రిష్’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కథానాయకుడిగా ఆయన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి మిల్ గయా’. 2003 ఆగస్టు 8న రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం ‘క్రిష్’. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోనూ హృతిక్ రోషన్ హీరోగా నటించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మరో చిత్రం ‘క్రిష్ 3’. రాకేష్ రోషన్– హృతిక్ రోషన్ కాంబినేషన్లోనే తెరకెక్కిన ఈ చిత్రం 2013 నవంబరు 1న రిలీజై, హిట్ అందుకుంది.ఈ ఫ్రాంచైజీలో రానున్న తాజా చిత్రం ‘క్రిష్ 4’. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు హృతిక్ రోషన్. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి మూడు సినిమాలకు తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా ‘క్రిష్ 4’కి మాత్రం హృతిక్ రోషన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనుండటం విశేషం. ‘క్రిష్ 4’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ‘క్రిష్ 4’ ఈ ఏడాదిలో సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. 2027లో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట హృతిక్ రోషన్. – డేరంగుల జగన్ మోహన్ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్లు రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)కొత్త బంగారులోకం, హ్యాపీడేస్ సినిమాలతో అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. మధ్యలో చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. బిగ్బాస్ షో తర్వాత మళ్లీ కాస్తంత పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన చిత్రమే 'కానిస్టేబుల్'. గతేడాది అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.'కానిస్టేబుల్' విషయానికొస్తే.. శంకరపల్లి అనే ఊరిలో కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. అయితే ఈ ఊరిలో చాలామంది హత్యకు గురవుతూ ఉంటారు. కాశీ మేనకోడలిని కూడా చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుందెవరు? సీరియల్ కిల్లర్ని కాశీ పట్టుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
400 కోట్లు.. ఇన్ని పైసలుతో ఏం చేస్తావ్ పెద్ది.?
-
రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.?
-
వెంకీ- అనిల్ కాంబో.. ఈ సారి డిఫరెంట్ టైటిల్..!
ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే టాలీవుడ్ అనిల్ రావిపూడి మాత్రమే. ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్గారు మూవీతో బ్లాకబస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది వెంకీమామతో హిట్ కొట్టిన అనిల్.. ఈసారి మెగాస్టార్తోనూ జతకట్టి సక్సెస్ అయ్యారు. అదే కాన్ఫిడెన్స్తో వెంకీమామతో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్లీ సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాకు టైటిల్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి తగ్గట్టుగానే తన మూవీ టైటిల్ ఉండాలని అనిల్ రావిపూడి ఫిక్సయ్యారని టాక్. ఈ మూవీకి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాలీవుడ్ లేటేస్ట్ టాక్. ఈ టైటిల్ చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ ఏంటో అర్థమవుతోంది. సంక్రాంతి తగ్గట్టుగానే ఈ మూవీకి టైటిల్ ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ మూవీలో కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. -
ది రాజాసాబ్, పెద్ది రికార్డ్స్ బ్రేక్.. బన్నీ క్రేజ్ చూశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో మాత్రమే కాదు.. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప సినిమాల తర్వాత బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా బన్నీకి టాలీవుడ్ తర్వాత అత్యధిక ఫ్యాన్స్ ఉన్నది మలయాళంలోనే. కేరళలో అల్లు అర్జున్ అంటే తమ సొంతవాడిలా భావిస్తారు. ఆయనను ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు. అంతలా మలయాళీల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన హ్యాపీ మూవీ రీ రిలీజ్ చేశారు. 4కె వర్షన్లో ఈ సినిమా విడుదల చేయగా కేరళలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.1.10 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇది చూస్తుంటే కేరళలో బన్నీ క్రేజ్ ఏంటో అర్థమైపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల రికార్డులను హ్యాపీ మూవీ దాటేసింది.గతేడాది రిలీజైన ది రాజాసాబ్ మూవీ కేరళ వసూళ్లను హ్యాపీ అధిగమించింది. మలయాళంలో ప్రభాస్ ది రాజాసాబ్ కేవలం రూ.23 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. రీ రిలీజ్లోనూ అల్లు అర్జున్ మూవీ రికార్డ్ సృష్టించడం విశేషం. అదే క్రమంలో రామ్ చరణ్ పెద్ది కేరళ వసూళ్లను సైతం హ్యాపీ మూవీ దాటేసింది. పెద్ది మూవీ కేరళ వ్యాప్తంగా కేవలం రూ.72 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ది రాజాసాబ్, పెద్ది మూవీస్ సాధించలేని రికార్డులను బన్నీ రీ రిలీజ్ మూవీతోనే కొట్టేశాడు. ఇది చూసిన అభిమానులు అల్లు అర్జున్ మరోసారి తన స్టామినాను నిరూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
ఆ టైమ్లో నాలో అహంకారం పెరిగింది: సమంత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకులను పలకరించనుంది. తన సొంత బ్యానర్లో ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో సామ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒక సమయంలో స్టార్డమ్ అనే మత్తుకు బానిసయ్యానని సమంత చెప్పుకొచ్చింది. తన సినిమాలు వరుస హిట్స్ కావడంతో నాలో అహంకారం కూడా మెల్లగా పెరుగుతూ వచ్చిందని సామ్ పేర్కొంది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి స్టార్డమ్ దక్కడం నాకే ఆశ్చర్యంగా అనిపించిందని వెల్లడించింది. ఓకే ఏడాదిలో ఐదు సినిమాలు చేశా.. అన్నీ హిట్ కావడంతో నాది ‘గోల్డెన్ లెగ్’ అని అందరు అనేవారని గుర్తు చేసుకుంది. అలా నాపై ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నా.. నటిగా నా కెరీర్లో ముగింపు ఉండదనుకున్నానని సామ్ తెలిపింది.అయితే అనారోగ్యం, సినిమాలకు బ్రేక్ రావడం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సమంత తెలిపింది. అప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెల్లడించింది. విరామం తర్వాత తన జీవితం, కెరీర్ను కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొంది. కాగా.. 2022 నుంచి సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన నెల రోజుల్లోపే ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. మరికొన్ని సినిమాలు ఏకంగా వారాల్లోపే స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో లేటేస్ట్ తెలుగు సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.ఈ విషయాన్ని ఆహా సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై దినేష్ కుర్ర నిర్మించగా.. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీ కథేంటంటే..ట్రైన్ జర్నీలో పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే క్రైమ్ కథాంశంగా రూపొందించారు. సస్పెన్స్, లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్తో ఈ మూవీ కథేంటో ముందే పరిచయం చేశారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. A story filled with emotions, relationships, and unforgettable moments is ready to reach your screens!#ThankYouSubbarao starts streaming on @ahavideoIN from June 18th.https://t.co/JvRngv6wYhDon't miss this heartwarming entertainer!#ThankYouSubbaraoOnAha@KurraP68246… pic.twitter.com/ODQe1g7LcD— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 15, 2026 -
‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు)
-
విశ్వంభరకు దారేది?.. అదొక్కటే కనిపిస్తోంది..!
మెగా అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. వరుస వాయిదాలతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ తేదీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారంలో ఉన్నా.. అదేం జరిగేలా కనిపించడం లేదు.ఆ తర్వాత ఆగస్ట్లో విశ్వంభర రిలీజ్ కావొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి దాకా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఏడాది విశ్వంభర వచ్చే అవకాశముందా అనే డైలామాలో అభిమానులు ఉన్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో రాకపోతే.. విశ్వంభరకు ఉన్న ఛాన్స్ దసరా. ఆ తర్వాత డిసెంబర్, సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సింది. ఆ రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందువల్లే విశ్వంభరకు దసరా మాత్రమే కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక దసరా మిస్సయిందంటే డిసెంబర్లో ఏదో ఒక వారంలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకనైనా మేకర్స్ పక్కా ప్లాన్తో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్డేట్స్ ఇస్తూ మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాల్సిన అవసరముంది. కాగా.. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయింది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
'మూవీ రిలీజ్ తర్వాత ట్రైలర్..' జూనియర్ ఎన్టీఆర్ ఫిదా
దాదాపు 94 ఏళ్ల వయసులో డైరెక్షన్ అంటే ఎవరికైనా అసాధ్యమే. అదేం కాదంటూ సింగీతం శ్రీనివాసరావు నిరూపించాడు. వయసులో సెంచరీ కొట్టినా కూడా దర్శకత్వం చేయొచ్చనే సంకేతాలిచ్చాడు. ఇదంతా చూస్తుంటే సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చో అన్నది మనకు అర్థమైపోతోంది. తాజాగా సింగ్ గీతం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరికొత్త ప్రయోగంతో తన దర్శకత్వ టాలెంట్ను ఈ వయసులోనూ చూపించారు.దీంతో ఈ మూవీపై టాలీవుడ్ అగ్రతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, కమల్ హాసన్ ఈ సినిమాను అభినందించారు. తాజాగా ఈ లిస్ట్ మన యంగ్ టైగర్ కూడా చేరిపోయారు. సింగ్ గీతం ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్.. సింగీతం శ్రీనివాసరావును కొనియాడారు. ఈ మూవీ తన హృదయానికి హత్తుకుందన్నారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ.. "నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన చిత్రం సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలి, సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంతటా అదరగొట్టారు. ప్రతి సన్నివేశానికీ మ్యాజిక్ తీసుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆయన 40 ఏళ్ల కలను నెరవేర్చడం దైవ వరమే. వైజయంతి ఫిల్మ్స్ కలిసి సింగీతం గారికి మీరిచ్చిన అద్భుతమే ఈ చిత్రం. చిత్ర బృందానికి నా అభినందనలు. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే.. మూవీ విడుదలైన తర్వాత ట్రైలర్ విడుదల చేయడం అతిపెద్ద ఆశ్చర్యం. ఈ ట్రైలర్ మీ అందరికీ అందించడం నాకు దక్కిన గౌరవం. థియేటర్లలోకి వెళ్లి సినిమాను ఆస్వాదించండి." అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇందులో శాలిని కొండేపూడి, అహల్య, అయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బంగారు గనులు ఉన్న కుబేరపురం అనే గ్రామంలో జరుగుతుంది. సంపద కోసం గనులను అమ్మి, చెట్లను నరికివేయాలన్న గ్రామస్తుల ప్రణాళికను వ్యతిరేకించే ఒక యువతి కథే సింగ్ గీతం. ఈ పోరాటంలో ఆమెకు ఒక యువకుడు మద్దతుగా నిలుస్తాడు. కానీ గ్రామ దేవత శాపం కారణంగా గ్రామస్తులు సాధారణ సంభాషణలకు బదులుగా.. కేవలం పాటల ద్వారా మాత్రమే మాట్లాడుకోవడంతో వారి పోరాటం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ మూవీ కథ. #SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.https://t.co/V3I1C0jAth @ThisIsDSP, you nailed it throughout! You brought magic to every…— Jr NTR (@tarak9999) June 15, 2026 -
పెద్దిలో కొత్త సీన్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఆమె రోల్ అచియ్యమ్మ పాత్రపై విమర్శలొచ్చాయి. జాన్వీ కపూర్ సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో జాన్వీ కపూర్పై సన్నివేశాలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్స్ను మూవీ నుంచి తొలగించారు.అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించిన పెద్ది మేకర్స్ మరి కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. కొత్త వర్షన్లో జాన్వీ కపూర్ పాత్రపై రెండు సన్నివేశాలు, సీనియర్ నటుడు జగపతి బాబుకు సంబంధించిన ఓ సీన్ ఉంటుందని ప్రకటించారు. కొత్తగా సీన్స్ యాడ్ చేసి పెద్దిని థియేటర్లలో రన్ చేయనున్నారు. కొత్త సన్నివేశాలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తాయని మేకర్స్ ప్రకటించారు. సక్సెస్ మీట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేశాం. ఈ బుధవారం నుంచి కొత్త సీన్స్ జోడిస్తాం. మేము మొత్తం మూడు సన్నివేశాలను చేర్చాం. హీరోయిన్కు సంబంధించిన సన్నివేశాలు.. అలాగే జగపతి బాబు కోసం ఓ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాలు అచియ్యమ్మ పాత్రకు మరింత భావోద్వేగ లోతును తీసుకొస్తాయి. జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నా" అని బుచ్చి బాబు సానా అన్నారు. -
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
-
గ్రీన్ సిగ్నల్?
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న విడుదల కానుంది. దీంతో తన తర్వాతి సినిమా కోసం వరుసగా కథలు వినే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ.ఇప్పటికే దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదట. కాగా తమిళ దర్శకుడు హరి ఓ యాక్షన్ కథను సిద్ధం చేశారని, ఈ స్క్రిప్ట్కి హీరోగా రవితేజ అయితే బాగుంటుందని ఆయన భావించారట. ప్రస్తుతం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా.తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘సింగం’ సినిమాలతో దర్శకుడు హరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మరి.. హరి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
డిసెంబరులో...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్స్టోరీ మూవీ ‘ఫౌజి’. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ సినిమా కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.కాగా ‘ఫౌజి’ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో దసరాకు రిలీజ్ కావడం లేదని తెలిసింది. డిసెంబరు మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో దేశభక్తి అంశాలు ఉండటంతో ఆగస్టు 15కి ‘ఫౌజి’ టీజర్ను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.మరి.. ‘ఫౌజి’ డిసెంబరులోనే థియేటర్స్కు వస్తుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ‘కల్కి 2’ రిలీజ్ డేట్పై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే. -
'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుందని అన్నారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. తండ్రి, తనయుల ఘనత..!
రామ్ చరణ్ పెద్ది మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల రాబట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా ఘనత సాధించింది.తండ్రి, తనయుల అరుదైన రికార్డ్..అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సైతం బాక్సాఫీస్ వద్ద నిలిచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓకే ఏడాది తండ్రి, తనయులు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్ల సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Peddi grosses over 393 CRORES WORLDWIDE IN 11 DAYS 🔥🔥Running successfully all over in its second week 💥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/bayNZVZzB3— PEDDI (@PeddiMovieOffl) June 15, 2026 -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)
-
నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
అలా వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా, పాగల్, రెడ్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో అలరించిన బ్యూటీ నివేదా పేతురాజ్. 2023లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీలో కనిపించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన సింగ్ గీతంలో మెరిసింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అనుకున్నాననని తెలిపింది. 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి తన ప్లాన్ అంతా రాంగ్ రూట్లోనే వెళ్లిందని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సింగ్ గీతంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. కానీ నాగ్ అశ్విన్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. లేదంటే ఇప్పటికే హిమాలయాల్లో ఉండేదాన్నేమోనని కామెంట్స్ చేసింది. కాగా.. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. నాగ్ అశ్విని నిర్మించారు.చదవండి: పెళ్లి రద్దుపై తొలిసారి స్పందించిన హీరోయిన్ -
పెద్ది సక్సెస్.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో అతడేనా?
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో మహేశ్బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
ఓటీటీల్లో ఏకంగా 14 సినిమాలు.. ఆ మూవీపైనే అందరి కళ్లు..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మై అమెరికాస్ స్వీట్హార్ట్స్ (వెబ్సిరీస్:సీజన్3) జూన్ 16డ్రింకింగ్ బడ్డీస్ -(హాలీవుడ్ మూవీ) జూన్ 15ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సిరీస్)- జూన్ 18వాయిస్మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19జియో హాట్స్టార్కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16 సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు వెబ్సిరీస్) జూన్ 19అమెజాన్ ప్రైమ్యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21లయన్స్ గేట్ ప్లే..అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19సోని లివ్..అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19 -
రామ్ చరణ్ తో మరో మూవీ..?
-
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అది సింగీతంగారి గొప్పతనం: నాగ్ అశ్విన్
‘‘సింగ్ గీతం’కి పని చేసిన ప్రతి ఒక్కరి నిజాయితీ తెరపై కనిపించింది. అలాంటి మ్యాజిక్ను ప్లాన్ చేసి చేయలేం. ‘మహానటి’ తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా ఇదే. అది సింగీతంగారి గొప్పతనం’’ అన్నారు నాగ్ అశ్విన్ . అయాన్ , అహల్యా బుమ్రూ, షాలిని కొండెపూడి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన గోల్డెన్ బ్లాక్బస్టర్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతంగారిని కలిశాను. లెజెండరీ ఫిల్మ్ మేకర్ అయిన ఆయన్ను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండి΄ోయే మెమరీ. కానీ ఆ జర్నీ ఇంత దూరం వస్తుందని ఊహించలేదు. ఆయన కలకు తెర రూపం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తామే పాటలు పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాకు మరో దర్శకుడు సంకల్ప్.94 ఏళ్ల దర్శకుడు, 24 ఏళ్ల దర్శకుడు కలిసి అందమైన మ్యాజిక్ను సష్టించారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా బాగుంది. సింగీతంగారు ఏడేళ్ల క్రితమే నాకీ కథ చె΄్పారు. చాలామంది నిర్మాతలను కలిసినా కుదర్లేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ రూపంలో అది సాధ్యమైంది’’ అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఎప్పటినుంచో మంచి మ్యూజికల్ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ‘సింగ్ గీతం’తో నెరవేరింది. సింగీతంగారి 40 ఏళ్ల కల ఈ సినిమా. ఈ కలలో మేం భాగం కావడం హ్యాపీగా ఉంది.ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్గారు. ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్ అవుతాయి, డబ్బులు, పేరు తెస్తాయి. కానీ ఒక క్రియేటర్కు నిజమైన సంతృప్తినిచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. నాకలాంటి సంతృప్తినిచ్చిన సినిమా ‘సింగ్ గీతం’’ అని చె΄్పారు. ‘‘సింగీతంగారిలాంటి లెజెండరీ దర్శకుడి సినిమాకి పని చేయడం మా అదృష్టం’’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్, నటీనటులు నివేదా పేతురాజ్, అహల్య, శాలిని, అయాన్, రాహుల్ రవీంద్రన్, బెనర్జీ, శివన్నారాయణ తదితరులు పేర్కొన్నారు. -
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది.నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్మ్యాన్తో ప్రేమలో ఉన్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన) -
లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?
రామ్ చరణ్ 'పెద్ది' ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. దీంతో సందడి మరికొన్నిరోజులే ఉంటుంది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటనేది చూడాలి. మరోవైపు చరణ్ తర్వాత మూవీ గురించి కూడా అప్పుడే సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. సుకుమార్తో చేయబోయే చిత్రం ఎప్పుడు మొదలవ్వొచ్చు? అనేది మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)రామ్ చరణ్, సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీళ్ల కాంబోలోని రెండో మూవీ గురించి చాన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇప్పుడు 'పెద్ది' రిలీజైపోవడంతో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులకు కుతుహలం కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు.'పెద్ది' షూటింగ్ చివరిదశలో చరణ్ చేతికి గాయమైంది. కట్టుతోనే ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు సదరు గాయానికి సర్జరీ చేయనున్నారు. అలా దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. మరోవైపు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమా కోసం స్టోరీ ఇంకేం సిద్ధం చేయలేదు. దసరా లోపు స్టోరీ, స్క్రీన్ ప్లే ఓ కొలిక్కి రావొచ్చని అంటున్నారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం ఆరాటపడే సుక్కు.. దసరా కల్లా పూర్తి చేస్తాడా అనేది చూడాలి?'పుష్ప' సినిమాల తర్వాత చరణ్ ప్రాజెక్ట్పైనే సుకుమార్ పనిచేస్తున్నప్పటికీ.. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాదిలో పూర్తయితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముంటుంది. లేదంటే మాత్రం మరో ఏడాది పట్టేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే రామ్ చరణ్కి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి సుకుమార్కి తప్పితే మరో దర్శకుడికి చరణ్ కమిట్మెంట్ ఇవ్వలేదు. అలానే పాన్ ఇండియా దర్శకులు కూడా ఎవరూ ఖాళీ లేనట్లే ఉన్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటం సాంగ్ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు) -
జాన్వీ క్యారక్టర్ ఎక్సలెంట్
-
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్లు కూడా స్ట్రీమింగ్లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!) -
మాట నిలబెట్టుకున్న విరోష్ జంట.. పుట్టిన గడ్డ కోసం..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నెరవేర్చారు. తన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటలో విద్యార్థులకు సాయం అందించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 9,10 తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. తన స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్ తుమ్మన్పేట పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించారుతాజాగా ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ పేరిట ఎంపికైన జాబితాను విడుదల చేశారు. ఈ లిస్ట్లో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. ఈ ఉపకార వేతనాలతో దాదాపు 180 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. ఈ ఏడాది తన సొంతూరిలో పర్యటించిన విజయ్ దేవరకొండ విద్యార్థులకు మాటిచ్చారు. ఇవాళ అఫీషియల్గా తన మాటను నెరవేర్చారు. హీరో విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామానికి చేస్తున్న సేవపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సొంతూరిపై తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాయల సీమ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. We are on our way to Thummanpet. The little village where my Father was born. In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours. To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana. Here is a… pic.twitter.com/wLNSr4ZZHe— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026 -
'రాముడి పాత్రకు సుశాంత్ను మించినవారు లేరు'.. సోదరి ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తు చేసుకుంది. ఇవాళ సుశాంత్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. కాలం గడిచినా తన సోదరుడి ఉనికి ఇంకా తమతోనే ఉందని శ్వేత రాసుకొచ్చింది. నువ్వు లేకుండా ఆరేళ్లయినా నువ్వు జీవించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ శ్రీరాముడిలా ఉన్న ఏఐ ఫోటోను షేర్ చేసింది.శ్వేత తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆరేళ్ల కాలం గడిచిపోయింది.. అయినా కొన్ని ఆత్మలు కాలానికి అతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అతను ఎలా మరణించాడో కాకుండా.. ఎలా జీవించాడో గుర్తుంచుకోవాలనుకన్నా.. అతను జిజ్ఞాస, కరుణ, గౌరవంతో నిండిన వ్యక్తి' అని అభివర్ణించారు. ఎవరైనా సరే చాలా గౌరవించేవాడని శ్వేత తెలిపింది. కరుణ, దయ లేకపోతే విజయానికి అర్థం లేదని తన చుట్టూ ఉన్నవారికి నేర్పించాడని ఆమె రాసుకొచ్చారు. అందుకే తన సోదరుడు జీవితమే తనకు ఆదర్శమని ఆమె అన్నారు. రాముడిలా సుశాంత్ సింగ్ రాజ్పుత్..నితేష్ తివారీ రామాయణం టీజర్ విడుదలైన తర్వాత.. సుశాంత్ను శ్రీరాముడిగా ఊహించకున్నానని తెలిపింది. రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన అమూల్యంగా భావించే విలువలకు ప్రతీక అని పేర్కొంది. మర్యాద, కరుణ, గౌరవం, ధైర్యం, సత్యం సీతామాతపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ రాముడి పాత్రకు సంబంధించిన అమాయకత్వం, స్వచ్ఛత, ఔన్నత్యం సుశాంత్ కనిపించాయని అన్నారు. ఈ రోజుల్లో భాయ్ పోషించినంత అద్భుతంగా రాముడి పాత్రను ఎవరూ పోషించలేరని కూడా శ్వేత అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. View this post on Instagram A post shared by ♾️Shweta Singh Kirti (@shwetasinghkirti) -
'పెద్ది కథ వెనక నా అసలు ఉద్దేశం అదే'.. డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది మూవీ కథపై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న ఉదేశం అదేనని వెల్లడించారు. చిరంజీవితో చిట్ చాట్ సందర్భంగా పెద్ది కథ చెప్పడం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలిపారు. ఈ జనరేషన్కు ఆదర్శంగా నిలవాలనే ఈ కథ చేశానని బుచ్చిబాబు చెప్పారు. పిల్లలకు స్కూల్లో కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు.. వెనక గ్రౌండ్ కూడా ఉండాలన్నదే నా ఉద్దేశమన్నారు.దీనిపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయన్నారు. ఇక నుంచైనా పిల్లలకు క్రీడల కోసం సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారని.. ఈ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉందని చిరు తెలిపారు. -
'నాకు కెపాసిటీ ఉంది.. అలాంటి కథలు వస్తే చేస్తా'
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, కథల ఎంపికపై తన అభిప్రాయం పంచుకున్నారు. పెద్ది టీమ్తో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం తనతో చాలాసార్లు నా సినిమాల కథల గురించి మాట్లాడారని అన్నారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేశావని మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కమర్షియల్ వైపు వెళ్లిపోతున్నావని అన్నారని మెగాస్టార్ తెలిపారు.నీలో ఒక కమల్ హాసన్, రజినీకాంత్, బాలచందర్ లాంటి ఉన్నారని నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. దంగల్, చక్ దే లాంటి సినిమాలు చూసి.. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని అనిపించిందని చెప్పానని వెల్లడించారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను? అని అన్నానని చెప్పారు. దంగల్ తరహాలోనే పెద్ది సినిమా కూడా ఉందని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రంలో ఆడపిల్లలతో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందన్నారు. -
నాకు కథే ముఖ్యం: తిరువీర్
‘‘నాకు ఎప్పుడూ కథే ముఖ్యం. కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది. ‘ఓ..! సుకుమారి’ చిత్రంలో కూడా కథ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ అద్భు తంగా ఉంటాయి. నేను నటించిన ‘మసూద’ సినిమాని పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అలాంటి విజయమే ‘ఓ..! సుకుమారి’ చిత్రానికి కూడా దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని తిరువీర్ తెలిపారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జోడీగా నటించారు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ అయిన తర్వాత నేను సైన్ చేసిన మొదటి సినిమా ‘ఓ..! సుకుమారి’. హీరోయిన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమాకి చాలా కనెక్ట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు. ‘‘చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. ‘‘ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయి’’ అని భరత్ దర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ కుషేందర్, నటులు జీవన్, గవి రెడ్డి మాట్లాడారు. -
మాస్ పోలీస్
వెండితెరపై తమ అభిమాన హీరో మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తే థియేటర్స్లో ఆ హీరో ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేస్తాయి. అన్యాయం చేస్తున్న విలన్స్ను పోలీస్ ఆఫీసర్ గెటప్లో హీరో రఫ్ఫాడిస్తుంటే థియేటర్స్ విజిల్స్, చప్పట్ల సౌండ్స్తో మారుమోగి పోతాయి. మరి... థియేటర్స్లో ఈ మాస్ వైబ్రేషన్ను క్రియేట్ చేసి, ప్రేక్షకులను అలరించేందుకు ఖాకీ చొక్కా వేసుకుని, లాఠీ పట్టిన వెండితెర మాస్ పోలీస్లపై ఓ లుక్ వేయండి.మళ్లీ వస్తున్నాడు ముత్తువేల్ పాండియన్ పోలీస్ స్టోరీస్ అంటే రజనీకాంత్కు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతున్నట్లుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు (దర్బార్, జైలర్, వేట్టయాన్) రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా వెండితెరపై కనిపించారు. ఆయన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ పోలీస్ ఆఫీసర్గానే నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘జైలర్’. ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటించారు.ఫ్లాష్బ్యాక్ సీన్స్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. ఈ ‘జైలర్ 2’ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటించారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ‘జైలర్’ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మోహన్లాల్ ‘జైలర్ 2’ చిత్రంలోనూ నటించారు.కొత్తగా ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ ఈ సినిమాలో భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ రోషన్ నార్త్కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. తొలుత ఈ పాత్రకు షారుక్ ఖాన్ను అనుకున్నారు. కానీ ఫైనల్గా హృతిక్ రోషన్ ఓకే అయ్యారు. దాదాపు నలభై సంవత్సరాల క్రితం రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా హృతిక్ రోషన్ నటించారు. మళ్లీ ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్–హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.సంక్రాంతికి వస్తారా! సిల్వర్ స్క్రీన్పై సింగమ్ అంటే సూర్య అని ఇట్టే చెప్పేస్తారు యాక్షన్ సినిమా లవర్స్. పోలీస్ ఆఫీసర్గా ‘సింగమ్’ సిరీస్ సినిమాల్లో సూర్య తన యాక్టింగ్తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. నిజానికి ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకంటే ముందే, ‘కాక్క కాక్క’ అనే ఓ తమిళ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సినిమానే వెంకటేశ్ హీరోగా తెలుగులో ‘ఘర్షణ’గా రీమేక్ అయ్యింది. ఇలా... సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించిన ప్రతిసారీ ఆ సినిమా హిట్ అయి పోతుంది. కాగా సూర్య ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో సూర్యది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని కూడా సమాచారం. నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ యువ నటుడు, ‘ప్రేమలు, లోక: చాప్టర్ 1’ చిత్రాల ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. సూర్య కెరీర్లోని ఈ 47వ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుందనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక కొంత కాలంగా వరుస సినిమాల వైఫల్యాలతో ఇబ్బందిపడిన సూర్య ఇటీవల ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘కరుప్పు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాపై ఆయన ఫ్యాన్స్లో, తమిళ ఇండస్ట్రీలో అంచనాలున్నాయి.తొలిసారి పోలీస్ ఆఫీసర్గా... సిల్వర్ స్క్రీన్పై ప్రభాస్ కటౌట్ పోలీస్ ఆఫీసర్గా సూపర్బ్గా సూట్ అవుతుంది. ఆరడుగుల ప్రభాస్ పోలీస్ గెటప్లో స్క్రీన్పై కనిపిస్తే, ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. థియేటర్స్లో విజిల్స్ మోత మోగి పోతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘స్పిరిట్’లో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవల ప్రభాస్ పోలీస్ గెటప్ ఉండగా, ఓ థియేటర్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్ను హైదరాబాద్లో చిత్రీకరించారు. భూషణ్కుమార్, ప్రణయ్రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా కాంచన, ప్రకాష్రాజ్, వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిర్చి’ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటించారు ప్రభాస్, నదియా. ‘స్పిరిట్’ సినిమా కోసం మళ్లీ నదియా, ప్రభాస్ కలిసి నటిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమా చారం. అలాగే ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్స్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే ప్రభాస్ కనిపిస్తారు. కానీ ఈ చిత్రంలో ప్రోఫెసర్గానూ, గ్యాంగ్స్టర్గానూ ప్రభాస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.10 సంవత్సరాలు... 55 ట్రాన్స్ఫర్స్ ‘పెళ్లి, చాలా బాగుంది, మా బాలాజీ, మనసిచ్చి చూడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. కాగా, యాక్టర్గా కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే పాత్రలో వడ్డే నవీన్ నటించారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు.కమల్తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. పది సంవత్సరాల్లో 55 సార్లు ట్రాన్స్ఫర్ అయిన కానిస్టేబుల్ త్రిమూర్తులు కొన్ని ఇబ్బందుల్లో పడతాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నాటి కేసును సాల్వ్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ కేసుకు, త్రిమూర్తులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా కథనం అని తెలిసింది. ఇక ఈ సినిమాతో నిర్మాతగా మారారు వడ్డే నవీన్.పవర్ఫుల్ పోలీస్ ‘కూలీ నెంబరు 1, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల... వైకుంఠపురములో..’ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేశారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో టబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ సంయుక్త, దునియా విజయ్కుమార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటీవల ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో డీసీపీ (డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్)గా టబు కనిపించారు. ఈ చిత్రంలో బెగ్గింగ్ మాఫియాను అరికట్టే మిషన్ను టేకప్ చేస్తారట ఆమె. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఫుల్ మాస్వెండితెరపై ఇప్పటివరకు ఎక్కువగా బ్యూటిఫుల్ హీరోయిన్గానే కనిపించారు సాయి పల్లవి. ధనుష్ ‘మారి 2’, నాని ‘ఎమ్సీఏ’ సినిమాల్లో మాత్రం సాయి పల్లవి క్యారెక్టర్లో చిన్నపాటి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి ఫుల్ మాస్ అవతార్లో కనిపించేందుకు ఆమె సిద్ధమయ్యారని తెలిసింది. ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్నారు. మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కాగా, ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ వపర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్లో కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. వెండితెరపై పోలీస్ ఆఫీసర్గా కనిపించేందుకు ఆమె శిక్షణ కూడా తీసుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. అలాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కూడా పోలీస్ అధికారి పాత్రలోనే కనిపిస్తారట. అంతేకాదు... మమ్ముట్టి పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. హిట్ 4 తెలుగు సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ సిరీస్ సినిమాల్లో హీరో పోలీస్ ఆఫీసర్గానే కనిపిస్తారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడివి శేషు, ‘హిట్ 3’లో నాని పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ఇక ‘హిట్ 3’ ఎండింగ్లో ‘హిట్ 4’ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తారని స్పష్టం చేసింది యూనిట్. అయితే ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. మరోవైపు ‘హిట్’ సిరీస్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఓ లవ్స్టోరీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఇలా దర్శకుడు కల్యాణ్తో కార్తీ, హీరో రోషన్తో శైలేష్ వారి వారి సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ‘హిట్ 4’ సినిమా సెట్స్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.బొగ్గు గనుల నేపథ్యంలో...! తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్, ఆడుకలం నరేన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో బొగ్గు కుంభకోణాలకు సంబంధించిన దోషులను పట్టుకునే పోలీస్ ఆఫీసర్గా సంయుక్త నటించారని తెలిసింది.అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాలో హైలైట్గా ఉంటాయని తెలిసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను ‘ది బ్లాక్గోల్డ్’ సినిమాలో ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ చిత్రయూనిట్ పేర్కొంది. యోగేష్ కేఎమ్సీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.వీరే కాదు... మరికొంతమంది హీరో, హీరోయిన్లు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారని తెలిసింది. మరికొందరు పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చే కథలను వింటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
మాస్ ఎంట్రీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్బాబు (హీరో మహేశ్బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు.చలసాని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ మూవీ జూలై 9న విడుదల కానుంది. ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరోగా జయకృష్ణ నిలుస్తున్నారు. కృష్ణ ఆదేశాల మేరకు స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో, ప్రోడక్షన్ విభాగంలో శిక్షణ పొందారు జయకృష్ణ. అదే విధంగా అమెరికా వెళ్లి నటనతో పాటు హీరోకి అవసరమైన అన్నిటిలో పక్కా ట్రైనింగ్ తీసుకున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సిల్వర్ స్క్రీన్పై జయకృష్ణ మంచి మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారని స్పష్టం చేసింది. అలాగే టీజర్ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మూవీ నుంచి విడుదలైన జయకృష్ణ లుక్స్, టీజర్లోని డైలాగులు, నటన చూస్తుంటే ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్బాబులా కనబడుతున్నాడని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. తప్పనిసరిగా కృష్ణ, మహేశ్బాబుల వారసత్వాన్ని నిలబెట్టే హీరో అవుతాడని, ‘శ్రీనివాస మంగాపురం’తో గ్యారెంటీగా సక్సెస్ అందుకుంటాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. -
మనం డైెరెక్టర్తో విజయ్ దేవరకొండ.. వర్కవుట్ అవుతుందా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ గండకోటలో జరిగింది. ఈ షెడ్యూల్లో దాదాపు వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తున్న కథ కావడంతో ఎక్కువ శాతం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో మన టాలీవుడ్ హీరో జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ను మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అరుదైన కాంబోగా నిలవనుంది. కాగా.. విక్రమ్ కుమార్ తెలుగులో మనం, ఇష్క్ థ్యాంక్ యూ, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలను తెరకెక్కించారు. Rumour Mill: Vijay Deverakonda x Vikram Kumar? 👀Reports suggest that #VijayDeverakonda may team up with Vikram Kumar for a new pan-India project, reportedly backed by Maddock Films. While there's no official confirmation yet, the prospect of the 24 director collaborating with… pic.twitter.com/kqAR9sfPoS— Movie_Reviews (@MovieReview_Hub) June 13, 2026 -
హైదరాబాద్లో భారీ వర్షం.. తమన్ లైవ్ కన్సర్ట్ రద్దు
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక లైవ్ కన్సర్ట్ రద్దయింది. భారీ వర్షాల కారణంగా బీజీఎం కింగ్ తమన్ ఆధ్వర్వంలో జరగాల్సిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కాన్సర్ట్ను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఈవెంట్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.భారీ వర్షంతో వేదిక వద్ద పెద్దఎత్తున నీరు నిలిచి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. అందుకే ఈవెంట్ను పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్లో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. It’s Heartbreaking for Me & My 56 Member Team To Work on this #OgtourIndia .. from last 45 days Tirelessly Taking all the Feedback backs In A positive Manner We as a Team Took all the Good Energy in this World to Make this Concert happen In a Positive Manner . Sometimes It has…— thaman S (@MusicThaman) June 13, 2026 #OGTourIndia show which was supposed to happen today was cancelled due to heavy rains and a storm!! #Thaman pic.twitter.com/C642kt20Wo— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) June 13, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. తొమ్మిది రోజుల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లుతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ సాధించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల మార్కును దాటింది. ఈ వసూళ్లతో ఈ ఏడాదిలోనే దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా, రన్నర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించింది. అయితే జాన్వీ రోల్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ను మేకర్స్ తొలగించారు. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. #Peddi is SOUTH INDIA'S NO.1 GROSSER OF 2026 🔥🔥Collects a gross of over 366 CRORES WORLDWIDE in 9 days ❤🔥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/hVo5QJIBaQ— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026 -
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
మంగ్లీ ఎంట్రీ ఫిక్స్.. బిగ్ బాస్ హౌస్ లో మోత మోగనున్న ఫోక్ సాంగ్స్
-
కరుప్పు బ్లాక్ బస్టర్.. సూర్య పై కన్నేసిన రావిపూడి
-
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
గంగ యాక్షన్
విలన్స్ను రఫ్ఫాడిస్తున్నాడు గంగ. ఏ రేంజ్లో, ఏ స్టైల్లో అనేది ‘భోగి’ సినిమాలో చూడాలి. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ చిత్రంలో గంగ పాత్రలో శర్వానంద్, కందుల సులోచనా రాణిగా అనుపమా పరమేశ్వరన్, మందారంగా డింపుల్ హయాతి నటిస్తున్నారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామంలో ఈ సినిమా కథనం సాగుతుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె నిర్మించిన భారీ సెట్లో ఈ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. శర్వా రిస్కీ స్టంట్లతో తన నటనలోని సరికొత్త కోణాన్ని చూపించనున్నారు.దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేశారు. క్లైమాక్స్ చిత్రీకరణ షెడ్యూల్ దాదాపు 20 రోజులపాటు సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది. -
సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
సామాన్యులకు వెల్కమ్.. బిగ్బాస్ అగ్నిపరీక్షకు రెడీనా?
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్ మరోసారి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్లో ఆసక్తి పెంచేశారు.అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్బాస్ ఛాన్స్ కొట్టేయండి. -
సునీత తనయుడి కొత్త మలుపు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన తాజా చిత్రం కొత్త మలుపు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ మూవీగా రూపొందించారు. తాజాగా ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కొత్త మలుపు కథేంటంటే..జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాశ్). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కొత్త మలుపు కథ.ఎలా ఉందంటే..ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి మంచి ఫీల్ను కలిగిస్తుంది. పల్లెటూరి విజువల్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి సందడి, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి కామెడీ మంచి ఎంటర్టైనింగ్గా అనిపించాయి.రెండో అర్ధభాగంలో కథ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో డైరెక్టర్ ఇందులో చూపించారు. ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమనే మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే ఒక్క డైలాగ్లో తన స్టోరీ సారాంశం చెప్పేశారు.ఎవరెలా చేశారంటే.. కమల్ పాత్రలో ఆకాశ్ అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ భైరవి వరలక్ష్మి పాత్రలో మెప్పించింది. రఘుబాబు, పృథ్వీ తమ కామెడీ టైమింగ్తో గోదావరి యాసలో అలరించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. ఇక సాంకేతికత విషయానికొస్తే యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంది. సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్లో మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
గోపిచంద్ యాక్షన్ మూవీ.. టైటిల్ ఇదే
టాలీవుడ్ హీరో, మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. -
పెద్ది టీమ్కు మెగా ప్రశంసలు
రామ్ చరణ్ పెద్ది టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్లో పంచుకుంది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. A MEGA APPRECIATION 💥Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/0aN2EgDNtD— PEDDI (@PeddiMovieOffl) June 12, 2026 -
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్లో క్రేజీ అప్డేట్
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్ను తీసుకుని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్లో జీవీ ప్రకాశ్ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే అప్డేట్స్తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗And we had a blast pulling off this fun concept...A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026 -
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్కు వచ్చి తెరకెక్కించడం సవాల్తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
వరలక్ష్మి, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.ఈ సినిమా కథేంటంటే..గర్భిణి మహిళ హత్యతో ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్లంతా చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేశారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే.డైరెక్టర్ సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్కు హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో మిస్టిరీయస్ అంశాల్లో ప్రేక్షకులను మెప్పించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్లో ఎక్కువగా ట్విస్ట్లు ఆడియన్స్ను థ్రిల్కు గురి చేస్తాయి.ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసుల్లో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలం. సంజీవ్ సస్పెన్స్తో పాటు థ్రిల్లింగ్ కలిగించే కథను అందించారు. అయితే కొన్ని సీన్స్ బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అక్కడక్కడ కథలో లాజిక్ మిస్సయినట్లు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..నవీన్ చంద్ర తన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా మెప్పించారు. వరలక్ష్మి శరత్కుమార్ మరోసారి తన టాలెంట్ను ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్, విజయభాస్కర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్ను విజువల్గా బాగా తీర్చిదిద్దారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. అనుగోజు రేణుకా బాబు కొన్ని సీన్స్ మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పెద్ది మానియా.. చికిరి సాంగ్కు చిందులేసిన వరుడు
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మానియా నడుస్తోంది. ఈనెల 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.345 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే పాజిటివ్ తెచ్చుకున్న ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అయితే ఈ మూవీలోని సాంగ్స్ అభిమానులను ఓ ఊపు ఊపేశాయి. రైరై రారా అంటూ సాగే పాటతో పాటు చికిరి చికిరి సాంగ్కు ఫ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశారు. పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇటీవల జరిగిన పెద్ది ఈవెంట్లో ప్రదర్శించారు. పెద్ది సాంగ్స్ అంతలా ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.తాజాగా చికిరి చికిరి సాంగ్కు ఓ వరుడు స్టెప్పులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తన కాబోయే సతీమణి ముందే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Cringe 😬😬 anipinchadam ledhaa #Peddi pic.twitter.com/MiHFAwWZu2— AVM (@AvmNews7) June 11, 2026 -
కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)
-
‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
-
ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇసాకపట్నం. టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ సిరీస్లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్టైటిల్స్తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. -
ఆ రోజుల్లో రొమాన్స్ కామన్.. ఇప్పుడేమో వేధింపులు: పెద్ది వివాదంపై మధుబాల
రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్తో పాటు.. వివాదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ఓవర్ గ్లామర్ సీన్స్ అన్ని తొలగించారు. డైరెక్టర్ బుచ్చి సైతం క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్ సన్నివేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా విమర్శలు రావడంతో ఆ సీన్స్ మూవీ నుంచి తీసేశారు. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించారు. తాజాగా ఈ లిస్ట్లో మరో నటి కూడా చేరిపోయింది. సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని నటి మధుబాల అన్నారు. గతంలో చాలా సినిమాల్లో శృంగారభరిత సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. అప్పుడు రాని అభ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.ఈ సందర్భంగా 1991లో తాను నటించిన ఫూల్ ఔర్ కాంటే చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్ టీజింగ్ తేసే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రంలో కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్స్ రొమాంటిక్గా చిత్రీకరించారని మధు వివరించారు. కానీ ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదని వెల్లడించారు. ఆ దశాబ్దంలోనే అతిపెద్ద హిట్లలో ఒక చిత్రంగా నిలిచిందని మధుబాల అన్నారు. పాత సినిమాల్లో శృంగార భరిత సన్నివేశాలు ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నారు. అప్పట్లో చాలా అరుదుగా విమర్శలు వచ్చేవని తెలిపారు. ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను ప్రేమ వ్యక్తీకరణగా చూసేవారని మధుబాల తెలిపారు. ఆ సినిమాలో తన పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే ప్రేమలో పడుతుందని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా.. వేధింపులుగా చూస్తున్నారని చెప్పారు. సినిమాలు తరచుగా సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయని మధు అన్నారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఈవ్-టీజింగ్ సీన్స్ ఆమోదించేవారని.. కానీ ఇప్పుడు వేధింపులుగానే చూస్తున్నారని ఆమె అన్నారు. సినిమా అనేది సమాజంతో ముడిపడి ఉందని.. మారుతున్న సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మధుబాల అన్నారు. -
పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
-
రామ్ చరణ్ పెద్ది.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మెప్పించింది.ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. BOX OFFICE CHAMPION 💥💥#Peddi collects a gross of over 345 CRORES WORLDWIDE in 7 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/5p6FrjrmUv— PEDDI (@PeddiMovieOffl) June 11, 2026 -
'కార్నర్ సీట్.. ఓయో రూమ్.. ఈ రోజుల్లో అంతే'..అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీవాన మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ రోజుల్లో లవ్ గురించి మాట్లాడారు. నేటి తరం లవ్ అంటే జనాల్లేని థియేటర్లకు వెళ్లి.. కార్నర్ సీట్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రెండుసార్లు షాపింగ్ చేశాక.. నేరుగా ఓయో రూమ్లోనే ఎండ్ అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి యువత ప్రేమ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి.ఇది విన్న హీరో విశ్వక్ సేన్.. అంటే ఏంటి సార్ నాకు తెల్వదు అంటూ ఫన్నీగా మాట్లాడారు. మీకు ఎవరితో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను చూశారని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు.. వాళ్లకు మనవలు, మనవరాలు కూడా ఉన్నారంటూ సరదాగా మాట్లాడారు.కాగా.. హర్షిత్, స్మేహ ప్రధానపాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం దీవాన. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏఏఏ సినిమాస్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అరవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. #VishwanSen: ఈరోజు మీ Oneside Love Story చెప్పాలి...#AlluArvind: ఒక్కటా... రెండా... 😂ఈ మధ్య LOVE:జనం లేని సినిమాలకి వెళ్ళి...2 Shopping లు చేసుకొని..OYO లో End అవుతుంది.. pic.twitter.com/Kv4KvS17sQ— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2026 -
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
దర్శక శిఖరానికి ప్రముఖుల నివాళి
ప్రముఖ దర్శకుడు భారతీ రాజా బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అవి వారి మాటల్లోనే...భారతీరాజా గారి ప్రతిభ, ఆయన సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి, వారి ఎదుగుదలకు, సినీ పరిశ్రమ మనుగడకు కారణమైన మహోన్నత వ్యక్తి. ఆయన సృష్టించిన అద్భుత దృశ్యకావ్యాలను ఎప్పటికీ మరువలేం. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు చూడాలనుకున్నాను... కోలుకుంటారని భావించాను. ఆయన జీవించి ఉన్నప్పుడు చూడలేక పోవడం బా«ధగా మిగిలింది. – రజనీకాంత్భారతీయ సినిమా గొప్ప కథకుల్లో ఒకరైన భారతీరాజాగారిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన శాశ్వతంగా నిలిచిపోయే సినిమా కవిత్వంగా మార్చారు. భారతీరాజాగారి సినిమాలు తరాలుగా సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలోని ‘ఆరాధన’ చిత్రంలో పులిరాజు పాత్రలో నటించే అదృష్టం నాకు కలిగింది. – చిరంజీవిభారతీరాజాగారి మరణం బాధగా ఉంది. ఆయనతో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో నా స్నేహం, ఆయన కళ ఎప్పటికీ జీవించే ఉంటాయి. – కమల్హాసన్ప్రజలకు నాతో ఎలాంటి అనుబంధం ఉందో, భారతీరాజాగారితోనూ అలాంటి అనుబంధమే ఉంది. ఈ రెండూ వేర్వేరు కాదు. దేశాన్ని, దేశ ప్రజలను, కళాకారులను ప్రేమించడమే నా జన్మ హక్కు... అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. – ఇళయరాజాతన సహజమైన, రాజీపడని కథనంతో సినిమా రంగంలో విప్లవం సృష్టించిన నిజమైన మార్గదర్శకులు భారతీ రాజాగారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన వెండితెరపైకి తీసుకు వచ్చిన వాస్తవికత ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని ప్రత్యక్షంగా చూడటం, అలాగే వాటిని వేడుక గా జరుపుకోవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. – రాజమౌళిగ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలు, టీనేజర్స్ మధ్య ఉండే ఆకర్షణలు... వంటి అంశాలను చూపించడంలో భారతీ రాజాగారి శైలి ప్రత్యేకమైనది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్తోనూ ప్రేక్షకులను మెప్పించారు. – పవన్ కల్యాణ్భారతీ రాజాగారు తన దూరదృష్టి, అద్భుతమైన కథాంశాలు, భారతీయ సినిమాకు అందించిన విశేష సేవలతో ఎప్పటికీ నిలిచిపోయే ఒక నిజమైన లెజెండ్. – అల్లు అర్జున్ భారతదేశానికి అతి పెద్ద మహిళా సూపర్ స్టార్ శ్రీదేవిని అందించడమే కాకుండా, సత్యజిత్ రేగారి వాస్తవికతను, ముఖర్జీగారి పాత్రలను, చటర్జీగారి సందర్భోచిత హాస్య శైలిని అద్భుతంగా మిళితం చేశారు భారతీ రాజాగారు. అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని రకాల జానర్స్లో ఎంతో సహజత్వంతో కూడిన సినిమాలను రూపొందించిన నిజమైన అద్భుత దర్శకుడు ఆయన. – రామ్గోపాల్ వర్మతమిళ గ్రామాల్లోని ప్రేమను, జీవకళను మీలాగా మరెవ్వరూ తెరపై ఆవిష్కరించలేరు. నా సంగీతాన్ని దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామాలకు చేర్చినందుకు, అక్కడి ప్రజల జీవన గాథలను ప్రపంచానికి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. – ఏఆర్ రెహమాన్నన్ను సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మా అమ్మ అయితే, మరొకరు నా గురువు భారతీ రాజాగారు. ఒక సంవత్సరం వ్యవధిలో ఈ ఇద్దర్నీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. నా హృదయం బాధతో భారంగా అనిపిస్తోంది. భారతీ రాజాగారి, మా అమ్మగారి జ్ఞాపకాలు, వారు నేర్పిన జీవితపాఠాలు నా జీవితాంతం నాతోనే ప్రయాణిస్తాయి. – రాధికా శరత్కుమార్భారతీరాజాగారు చనిపోయారని తెలిసినా ఓ షూటింగ్లో ఉండటం వల్ల నేను, అలీగారు చెన్నైకి వెళ్లలేకపోయాం. నా తొలి చిత్రం ‘సీతాకోక చిలుక’లో నేను, అలీగారు కలిసి పని చేశాం. ఇన్నేళ్లకు భారతీరాజాగారు మనల్ని వదిలి వెళ్లే సమయంలో మేమిద్దరం కలిసి నటిస్తుండటం మాటల్లో చెప్పలేను. ఈ రోజు ముచ్చర్ల అరుణ అనే నేను నటిగా జనాలకు తెలుసు అంటే అందుకు కారణం భారతీ రాజాగారే. – అరుణఈ రోజు నేను ఒక నటిగా ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం భారతీ రాజాగారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానుల హృదయాలపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు. – రేవతినన్ను సినీ రంగానికి పరిచయం చేసిన భారతీ రాజాగారిని కోల్పోవడం ఎంతో ఆవేదనగా ఉంది. – సుకన్య -
'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి రామ్ చరణ్ రిప్లై
అల్లు అర్జున్ పెద్ది రివ్యూకు రామ్ చరణ్ స్పందించారు. మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం మాకు టీమ్కు చాలా ప్రత్యేకమన్నారు. మీ సినిమా రాకా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇటీవల పెద్ది వీక్షించిన అల్లు అర్జున్ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులతో అలరించాడని అన్నారు. నా బ్రదర్ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్ నిజమైన అర్హుడని ప్రశంసించారు. జాన్వీ కపూర్, జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. చరణ్ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు.ఇక పెద్ది సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Thank you, Bunny @alluarjun ❤️Your wishes mean a lot to me and the entire #Peddi team.Lots of love. Looking forward to #Raaka ❤️ https://t.co/I3cq8lmhf5— Ram Charan (@AlwaysRamCharan) June 10, 2026 -
రామ్ చరణే వచ్చాడు.. మీరెందుకు రారు మేడం?.. వరలక్ష్మిపై డైరెక్టర్ ఫైర్
సినీ నటి వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని సినిమా ప్రమోషన్స్కు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. నిర్మాతల బాధలు తనకు తెలుసని అన్నారు. ఈ బాధ ఆమెకు కూడా తెలుసన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం మూడు నెలలు డబ్బింగ్కు రాకుండా ఆపేశారని ఆరోపించారు.డబ్బులు తీసుకుని ప్రెస్మీట్కు రాకపోవడమేంటని సంజీవ్ ప్రశ్నించారు. ప్రెస్మీట్కు రమ్మని నేను ఆమెను అడుక్కున్నానని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూవీ షూటింగ్కు ఆమె సహకరించారు.. కానీ ప్రమోషన్స్ ఎగ్గొట్టడం కరెక్ట్ కాదన్నారు. ఆమెకు షూటింగ్లో చేతికి గాయం అయితే కూడా మేమే కాంప్రమైజ్ అయ్యామని తెలిపారు.రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పెద్ది మూవీ కోసం ప్రమోషన్స్లో పాల్గొన్నారని సంజీవ్ గుర్తు చేశారు. మీడియా ముందుకొచ్చి రామ్ చరణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు చాలా గ్రేట్.. ఇటీవల సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారని అన్నారు. మీరెందుకు రారు వరలక్ష్మి శరత్కుమార్ గారు అని ఆమెను డైరెక్టర్ ప్రశ్నించారు. డబ్బుల కోసం మాత్రం ఆమె మేనేజర్ రోజు కాల్ చేస్తాడని.. ఆమె మాత్రం ప్రమోషన్స్కు రాదన్నారు. కాగా.. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో పోలీస్ కంప్లైంట్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది వివాదం.. జాన్వీ కపూర్ రోల్పై ఆదా శర్మ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్లో రామ్ చరణ్ పెద్ది వివాదం హాట్ టాపిక్గా మారింది. జాన్వీ కపూర్ సీన్స్పై అభ్యంతరాలు రావడంతో మూవీ టీమ్ ఇప్పటికే వాటిని తొలగించింది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్షమాపణలు కోరారు. అభ్యంతరకర సీన్స్ను తొలగించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నిత్యామీనన్, జయా బచ్చన్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ కూడా స్పందించింది.హీరోయిన్లు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఆదా శర్మ సూచించింది. అయితే తాను ఇంకా పెద్ది సినిమా చూడలేదని తెలిపింది. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడడం సరికాదని పేర్కొంది. కానీ పాత్రల ఎంపిక అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ బాధ్యత కేవలం నటీమణులదే కాదని.. నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆదా శర్మ అభిప్రాయపడింది.కాగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం జాన్వీ కపూర్ రోల్పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆమెను కేవలం గ్లామర్ చూపించేందుకు మాత్రమే పెట్టారా? అని విమర్శించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్ మరింత ఓవర్గా ఉండడంతో మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు. -
బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇవాళ బాలయ్య బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఎన్బీకే111 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్లో నోట్లో సిగరెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్పై ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఈ ఫైట్ సీన్ చూస్తుంటే మరో యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీతో ఫైట్ సీన్ మరి ఓవర్గా అనిపిస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. -
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల -
భారతీరాజా ఇక లేరు
-
వరుస కష్టాలు.. నాకు ఎందుకింత క్షోభ?: శ్రీజ కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల తన కష్టాలపై తొలిసారి పెదవి విప్పింది. చాలాకాలంపాటు తను అనుభవించిన బాధను బయటకు చెప్పుకుంది. ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటకు వచ్చేశానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. "నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నాను? అని చాలారోజులు నాలో నేనే మథనపడ్డాను. ఆలోచనల్లో క్లారిటీనేను బాధితురాలిని అని బాధపడుతూ కూర్చున్న నేను నెమ్మదిగా ఆ భావన నుంచి బయటకు వచ్చాను. మన జీవితమేంటి.. ఇలా ఉంది! అని బాధపడటానికి బదులుగా దాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం? అని తెలుసుకోవడమే అసలైన మార్పు అని తెలుసుకున్నాను. 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' వల్ల నాలో ఆ మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో క్లారిటీ వచ్చింది. జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో తెలుసుకున్నాను.తప్పు తెలుసుకున్నా..ఒకప్పుడు నా లైఫ్లో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ధారించాయనుకున్నాను. కానీ, అది తప్పని తెలుసుకున్నాను. బాధ నాలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదని తెలిసొచ్చింది. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంటే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గుండె లోతుల్లో బాధను అనుభవించిన తాను ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానంది. ఈ పోస్ట్కు నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "మై సూపర్ ఉమెన్" అని కామెంట్ పెట్టింది.పెళ్లిశ్రీజ కొణిదెల 2007వ సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్ను పెళ్లి చేసుకుంది. ఏడాది తిరిగేలోపు వీరికి కూతురు నివృతి జన్మించింది. కానీ కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2011లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి పుట్టింటికి తిరిగొచ్చేసింది. 2014లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. 2016లో నటుడు కల్యాణ్ దేవ్ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి 2018లో కూతురు నవిష్క జన్మించింది. కానీ ఈ దాంపత్య జీవితం కూడా ఎంతోకాలం సాగలేదు. 2022లో వీరు విడిపోయారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) చదవండి: R సెంటిమెంట్.. భారతీరాజా గురించి ఈ విషయాలు తెలుసా? -
కూల్ కూల్గా... బిజీ బిజీగా...
హమ్మయ్యా... వేసవి ముగుస్తోంది. ఇప్పటి వరకూ భగ భగమంటూ తన ప్రతాపం చూపించిన సూర్యుడు ఇప్పుడు కాస్త చల్లబడుతున్నాడు. ఎండల తీవ్రత కారణంగా ఇప్పటి వరకూ సినిమా చిత్రీకరణల్లో కాస్త ఆచి తూచి పా ల్గొన్న నటీనటులు ఇప్పుడు వేగం పెంచారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ సందడి నెలకొంది.ప్రస్తుతం పలు సినిమాలు హైదరాబాద్తో పా టు పరిసరప్రాంతాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ఓ వైపు నాగార్జున, వెంకటేశ్, రవితేజ వంటి సీనియర్ హీరోలతో పా టు మరోవైపు ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, శ్రీవిష్ణు వంటి యంగ్ హీరోలు ప్రస్తుతం తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏయే చిత్రాల షూటింగ్స్తో కూల్ కూల్గా... బిజీ బిజీగా ఉన్నారో చూద్దాం....అల్యూమినియం ఫ్యాక్టరీలో...అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘నా సామి రంగా’. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. 2025లో ఆయన హీరోగా మిస్ అయినప్పటికీ ‘కూలీ, కుబేర’ వంటి సినిమాల్లో కీలక పా త్రల్లో కనిపించారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్లో వందో చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు.సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే భారీ హడావుడి ఉంటుంది. కానీ, ఈ చిత్రం విషయంలో చిత్రబృందం చాలా గోప్యత పా టిస్తోంది. ఎలాంటి అధికారిక ప్రకటన, హడావుడి లేకుండానే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగార్జునతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్లో నాగార్జున కనిపించనున్నారు.సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతున్నారు. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై మళ్లీ 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు. తమ అభిమాన హీరోని ‘శివ’, ‘హలో బ్రదర్’ నాటి లుక్లో చూస్తామంటూ అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు సినిమా ప్రేమికుల్లో ఈ మూవీపై క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని టాక్. నాగార్జున కెరీర్లోనే వందో చిత్రంగా ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పా త్రల్లో మెరుస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు. ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే ‘కింగ్ 100, లాటరీ కింగ్, కింగ్ 100 నాటౌట్’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.రాజేంద్ర నగర్లో... హీరో దగ్గుబాటి వెంకటేశ్ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ అయింది. ఈ మూవీ ద్వారా రూ. 300 కోట్ల క్లబ్లోకి చేరారు వెంకటేశ్. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్గారు’ సినిమాలో కీలకమైన వెంకీ గౌడ పా త్రలో సందడి చేశారు వెంకటేశ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీనిధీ శెట్టి హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీ నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పా టు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం తాజా షెడ్యూల్లో నిమగ్నం అయింది. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో షూటింగ్ జరుపుకుంటోంది.వెంకటేశ్తో పా టు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన త్రివిక్రమ్... తొలిసారి ఆయన్ను డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని వెంకటేశ్ తన ఖాతాలో వేసుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. డబుల్ ధమాకా.... వరుస పా న్ ఇండియా ప్రాజెక్ట్స్తో జెట్ స్పీడ్లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన ప్రస్తుతం ‘ఫౌజీ, స్పిరిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ముఖ్యమైన పా త్రలుపోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ మూవీ తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పా ల్గొనకపోయినప్పటికీ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ విడుదల కానుంది. ⇒ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పా న్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్. ప్రకాశ్రాజ్ కీలక పా త్రపోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్స్, టీ–సిరీస్ బ్యానర్స్పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘స్పిరిట్’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని అజీజ్ నగర్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో హీరో ప్రభాస్ పా ల్గొంటున్నారు. ఆయనతో పా టు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారట సందీప్ రెడ్డి వంగా. ‘‘స్పిరిట్’ చిత్రంలో తన కెరీర్లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు ప్రభాస్. ఈ మూవీని తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్ రెడ్డి. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పా టు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శంషాబాద్లో... మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా పా న్ ఇండియన్ మూవీ ‘వారణాసి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ మూవీలో రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభ అనే ప్రతినాయకుడి పా త్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ జరుపుతున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పా టు కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన క్యారెక్టర్పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్కు అత్యద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో రామాయణం ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది కూడా.ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేయడం చర్చనీయాంశం అయింది. ‘‘రాముడికి, కుంభ కర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ‘వారణాసి’. టైటిల్ టీజర్లో కుంభ కర్ణుడు, రాముడు, ఆంజనేయుడి తోక, తోక మీద రథం కనిపించాయి కదా... ఈ ఎపిసోడ్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాని షేక్ చేస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. డ్రాగన్ టైమ్ ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రానా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గు΄్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భిమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇతర కీలక పా త్రలుపోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పా న్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చేసిన ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది.‘దేవుడు నాకు ఓ గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం’, ‘నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు... మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి.. ΄÷రపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్లో ఉన్నాయి. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ప్రాంతంలోని అంతర్జాతీయ అఫీమ్ (ఓపియం) అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పా త్రలో అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్–ఇన్–చీఫ్గా కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. నవ్వులు డబుల్ హీరో శ్రీ విష్ణు సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుంటాయి. ఆయన నుంచి వచ్చిన పలు సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. హీరో శ్రీవిష్ణు– డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. 2023 జూన్ 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదం అందించడంతో పా టు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పా త్రలుపోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పా టు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు. ‘సామజ వరగమన’ చిత్రానికి మించి డబుల్ వినోదాన్ని అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు.యాక్షన్... ఎమోషన్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 34’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ మూవీ ద్వారా హీరోయిన్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్–అనార్కలితో పా టు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట వెంకట్.‘‘గోపీచంద్ 34’ చిత్రం ద్వారా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్ను రూపొందించారు. గోపీచంద్ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్తో కూడిన పా త్రలో చూపిస్తున్నారు ఆయన. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పా త్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్రతో పా టు సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శివ నిర్వాణ. ఈ నెల 3న విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధానంగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ ఉంది. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్... వంటి అంశాలు అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూపోషించని విభిన్నమైన పా త్రను ‘ఇరుముడి’లోపోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది.– డేరంగుల జగన్ మోహన్ -
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సిద్ధుగాడి లవ్ స్టోరీ
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్లోజరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. -
జాన్వీ కపూర్ సీన్స్ కట్.. పెద్ది మేకర్స్ సాహసం చేస్తున్నారా?
పెద్ది మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్ సీన్స్పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ విషయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా ప్రకటించారు. పెద్దిలో జాన్వీ రోల్కు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఈ కథను ఉప్పెన కంటే చాలా భిన్నంగా రాసుకున్నానని వెల్లడించారు. అయితే విమర్శలు రావడం వల్లే జాన్వీ కపూర్ సీన్స్ను తొలగిస్తున్నామని డైరెక్టర్ స్పష్టం చేశారు.కొత్త సీన్స్ యాడ్?అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించినప్పటికీ పెద్ది మేకర్స్ మరో ఆలోచనలో ఉన్నారట. మరిన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే సెన్సార్ అయిన వర్షన్ నుంచి జాన్వీ కపూర్ సీన్స్ మాత్రమే కాకుండా మరికొన్ని సీన్స్ తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా మరిన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. సెకండాఫ్లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ సెన్సార్ చేయించి థియేటర్స్లో పెద్ది కొత్త వర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. -
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026 -
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
-
చెర్రీ అంటే అంత అలుసా.! పెద్ది విషయంలో ఎందుకు అంత మౌనం.?
-
ఊహించలేని మలుపులున్నాయి: ఆకాష్
‘‘విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం రొమాంటిక్ అండ్ కామెడీ సబ్జెక్ట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాను. నటుడిగా కొంత ప్రయాణం చేసిన తర్వాత యాక్షన్ చిత్రాలు కూడా చేస్తాను. ఒకే జానర్కే నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు’’ అని ఆకాష్ గోపరాజు చెప్పారు.ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా, భైరవి ఆరాధ్య హీరోయిన్గా నటించిన రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సినిమా ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్ గోపరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘కోనసీమ నేపథ్యంతో సాగే విలేజ్ లవ్ స్టోరీ ఇది.పల్లెటూరి అందాలు, నవ్వులు, ఎమోషన్స్ , సస్పెన్స్ , ప్రేమ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందించాం. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే చాలా ఎనర్జిటిక్ పాత్ర చేశాను. ఈ సినిమా టైటిల్కు తగ్గట్లే కథలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. బాలకృష్ణగారు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది. మా అమ్మగారు ఈ సినిమా ఔట్పుట్ పట్ల సంతోషించారు’’ అని చెప్పారు. -
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం పోలీస్ కంప్లైంట్. ఈ మూవీ హరర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచేశాయి.తాజాగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. 'సూపర్స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కృష్ణపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. ఈ మూవీలో కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. -
'ఆయనను చూస్తే నా కళ్లలో నీళ్లు తిరిగాయి'.. రామ్ చరణ్ ఎమోషనల్
పెద్ది మూవీ సక్సెస్తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ మీట్లో పాల్గొన్న రామ్ చరణ్ తాము పడ్డ కష్టాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. నిజాయతీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందేనని అన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి చేశా. ఈ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సీన్స్కు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం చాలా ఆనందం కలిగించింది. ఇంత మంచి హిట్ అందించిన బుచ్చిబాబుకు, పెద్ది టీమ్కు థాంక్స్. నా లైబ్రరీలో నంబర్వన్గా పెద్ది నిలుస్తుంది. తొలిసారి ఈ కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్ చేసుకున్నా. నిజాయతీగా పని చేస్తే ఏదైనా హిట్ కావాల్సిందే. పెద్ది సినిమాలో జగపతి బాబుని చూసినప్పుడు.. ఒక ఆర్టిస్ట్గా నా కళ్లలో నీళ్లు తిరిగాయి' అని అన్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో పెద్ది మూవీని తెరకెక్కించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. జగపతిబాబు, శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత క్రేజ్ను తీసుకొచ్చింది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
'మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా'.. స్లమ్డాగ్ యాక్షన్ టీజర్
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టంపుల్ రోడ్. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్లో విజయ్ సేతుపతి ఎంట్రీ, యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సామాన్యుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. -
పెద్ది పేరుతో ఏకంగా స్కూల్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ పేరుతో ఏకంగా స్కూల్ ఉందని మీకు తెలుసా? దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో స్కూల్ను చూసిన ఓ చిన్నారి ది పెద్ది స్కూల్.. నాన్న అది చికిరి చికిరి వాళ్ల స్కూలా అంటూ క్యూట్గా.. అమాయకంగా అడిగింది. ఈ వీడియో యూఎస్లో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో పెద్ది టీమ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.#ChikiriChikiri Vala School Ah Anta 🔥😂#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/LDYLZLZTXQ— SAI CHARANISM ™ 🔥 (@saicharanism1) June 8, 2026 -
బ్లాక్ డ్రెస్లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
-
మళ్లీ విలన్గా?
చిరంజీవి సినిమాలో కన్నడ నటి రచితా రామ్ భాగమయ్యారని తెలిసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘చిరు 158’ (వర్కింగ్ టైటిల్) అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.మరో కీలక పాత్రకు కన్నడ నటి రచితా రామ్ను మేకర్స్ సంప్రదించారని, ఈ సినిమాలో ఆమె ఖరారయ్యారని టాక్. అయితే రచిత పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇక ‘చిరు 158’ చిత్రీకరణ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో రచిత నెగటివ్ షేడ్స్ ఉన్న కల్యాణి పాత్రలో నటించి, మెప్పించారు. వార్తల్లో ఉన్న ప్రకారం చిరంజీవి సినిమాలోది నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయితే ఆమె మళ్లీ విలన్గా చేసినట్లు అవుతుంది. -
ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ ఆధారంగా...
విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శ కత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మంచిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి.‘‘ఈ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను ప్లాన్ చేశాం. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమంతో ఈ సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయనున్నాం.ఈ ప్రచార యాత్రలో భాగంగా తొలి కార్యక్రమాన్ని ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఆ తర్వాత జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. జూన్ 26న వారణాసిలో ఈ సినిమాలోని ‘వీర నాగ’ పాటను రిలీజ్ చేస్తాం. జూన్ 28న హైదరా బాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
వరలక్ష్మి వ్రతానికి ఇరుముడి
అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘ఇరుముడి’ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం నిర్మాతలు తెలిపారు.‘‘భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. భక్తి, మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలను కూడా జోడించి శివ నిర్మాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు. -
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
ప్రస్తుతం థియేటర్లలో రామ్ చరణ్ పెద్ది మూవీ సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథ అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. తనయుడి టాలెంట్ను చూసి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారంటూ పొగిడారు.అయితే పెద్దికి మాత్రం టాలీవుడ్ హీరోల నుంచి సపోర్ట్ కరువైంది. కేవలం చిరంజీవి, కొందరు మెగా హీరోలు మాత్రమే రివ్యూలు ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ వీక్షించి మరి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే మిగిలిన స్టార్ హీరోల నుంచి మాత్రం పెద్దికి ఎలాంటి మద్దతు రావడం లేదు. రణ్వీర్ సింగ్ దురంధర్పై ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించిన తెలుగు హీరోలు.. పెద్ది విషయానికి వచ్చేసరికి గప్చుప్ అయిపోయారు. పెద్ది సినిమాపై ఇప్పటి వరకూ టాలీవుడ్ స్టార్స్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ అభిప్రాయాలను పంచుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే చర్చ హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఇప్పటి వరకు పెద్దిపై ఎలాంటి ట్వీట్ చేయలేదు. దురంధర్ సినిమాను సపోర్ట్ చేసిన మన హీరోలు.. టాలీవుడ్ మూవీని ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ మొదలైంది. ఇకనైనా మన హీరోలు.. మన సినిమాలకు మద్దతుగా నిలుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. -
రెబల్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. కల్కి-2 క్రేజీ అప్డేట్
కల్కి మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ క్రేజీ న్యూస్ షేర్ చేశారు. కల్కి-2 సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్పై క్లారిటీ ఇచ్చారు.కల్కి-2 ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో మొదలు కానుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని మరింత వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నాగ్ అన్నారు. ఏప్రిల్ 2027 నాటికి మెయిన్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.కాగా.. మొదటి భాగం కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె సైతం అభిమానులను మెప్పించింది. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ కోసం నిర్మాతలు మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. -
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్బాబు ఆలపించారు. ఈ సాంగ్ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
ఓటీటీకి టాలీవుడ్ ఎమోషనల్ డ్రామా..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు.ఈ సినిమా కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.When the perfect match is the one who heals your soul.Stream Ramani Kalyanam on Sun NXT from 12 June!#RamaniKalyanam #TeluguMovies #TFI #SunNXT [Feel Good Movies, Telugu Movies, New Telugu Movies, Deepshika, Surya Vashistta, Romance Movies, Emotional Drama, Poetic Movies,… pic.twitter.com/LL5Wa17mDS— SUN NXT (@sunnxt) June 7, 2026 -
క్యూట్నెస్తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
-
పెద్దిలో జాన్వీ సీన్లు కట్..! సారీ చెప్పిన బుచ్చిబాబు..
-
రామ్ చరణ్కు క్లీంకార సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.పెద్ది సూపర్ హిట్ వేళ ప్రతి ఒక్క అభిమాని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార.. డాడీకి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాన్న.. దిస్ ఈజ్ ఫర్ యూ.. క్లీంకార లవ్ యూ సో మచ్ అంటూ చరణ్ ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వారంతా చికిరి చికిరి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కోరిన వెంటనే అతని ఆకాంక్షను నెరవేర్చాడు. తన ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీస్ పంపమని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇది చూసిన ఎన్టీఆర్ మీ అడ్రస్ పెట్టు పంపిస్తా అంటూ రిప్లై ఇచ్చారు.అతనికి మాటిచ్చినట్లుగానే తన ఆటోగ్రాఫ్తో కూడిన కుకీస్ను పంపి అభిమాని కోరిక తీర్చాడు. వాటిని స్వయంగా ఎన్టీఆర్ తయారు చేసి మరి పంపించాడు. తమ రిక్వెస్ట్కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ అభిమాని ఆనందం పట్టలేకపోయారు. జూనియర్ పంపిన కుకీస్ను అతని పిల్లలు తింటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.ఇక జూనియర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుంది. Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK— saiteja (@saitejaathoti) June 6, 2026 -
నన్ను లాగిపెట్టి కొట్టారు.. నేనూ ఆయన చెంప చెళ్లుమనిపించా
సినిమాల్లో జరిగిదేంతా నిజం కాదని అనుకుంటూ ఉంటాం. అయితే అప్పుడప్పుడు షూటింగ్ సందర్భంగా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి సదరు హీరో లేదా హీరోయిన్ చెబితే తప్పితే తెలియదు. ఒకప్పటి హీరోయిన్ మధుబాల కూడా గతంలో తను ఓ హిందీ మూవీ సందర్భంగా ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టింది. తన చెంపపై నటుడు లాగిపెట్టిన విషయం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే)'యశ్వంత్ సినిమా షూటింగ్లో నానా పటేకర్(హీరో)కి నాకు గొడవ జరిగే సీన్ అది. ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా తేలిగ్గా పండిస్తారు. నేను అంత సహజంగా నటించలేను. మా ఇద్దరి మధ్య గొడవ జరిగేటప్పుడు నేను ఏడవాలి. కానీ కన్నీళ్లు రావట్లేదు. బాధగానూ అనిపించలేదు. అప్పుడు గ్లిజరిన్తో ప్రయత్నిద్దామనుకుంటే.. నానా పటేకర్ నా చెంపపై లాగిపెట్టి కొట్టారు. విపరీతమైన బాధతో పాటు ఆయనపై చాలా కోపం వచ్చింది. వెంటనే నేను కూడా ఆయన చెంప చెళ్లుమనిపించాను. అంతే మా డైరెక్టర్ కట్ చెప్పారు. ఒక్కదెబ్బతో అనుకున్నట్లుగా వచ్చిందని అనిల్ హ్యాపీగా ఫీలయ్యారు. నానా పటేకర్ ఎందుకు కొట్టారో అప్పుడు అర్థమైంది. ఆయన మంచి మనిషి. సహనటులతో గౌరవంగా ఉండేవారు. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు' అని మధుబాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.1997లో వచ్చిన ఈ సినిమాలో నానా పటేకర్, మధుబాలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈమె..'రోజా' సినిమాలో దక్షిణాదిలో ఫేమస్ అయింది. ప్రస్తుతం అడపాదడపా తల్లి పాత్రలు చేస్తోంది. గత కొన్నేళ్లలో అయితే తెలుగులో సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో, శాకుంతలం, కన్నప్ప తదితర మూవీస్లో నటించింది.(ఇదీ చదవండి: టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ)Actress Madhu claims that during the shooting of Yeshwant, Nana Patekar slapped her for real so that genuine tears would come on screenMadhu says she was shocked because it wasn't done during rehearsals, and she ended up slapping him back in the next takeAccording to her,… pic.twitter.com/TcQleeluuM— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) June 6, 2026 -
కథ చెప్పండి గురూ!
సినిమాలో కొత్తదనం లేక పోతే ప్రేక్షకులు థియేటర్స్కు రావడం లేదు. దీంతో హీరోలందరూ కొత్త కథల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క కథను ఓకే చేయడం కోసం పదుల సంఖ్యలో కథలు వింటున్నారు. ఇటు దర్శకులు, రచయితలు కూడా తమ కలానికి మరింత పదును పెట్టి విభిన్నమైన కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మరి... ఏ హీరోకి ఏ దర్శకుడు కథ చె΄్పారు? ఏ దర్శకుడు ఏ హీరోను మెప్పించారు? తెలుగులో రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏమిటి? అన్న విశేషాలపై ఓ లుక్ వేయండి.సంక్రాంతి తర్వాతే..! హీరో వెంకటేశ్ వరుస కథలు వింటున్నారు. యువ రచయిత నందు, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలను ఆల్రెడీ విన్నారు వెంకటేశ్. అయితే ఈ కథలతో సినిమాలు చేయాలని ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే స్పీడ్లో వెంకటేశ్ రీసెంట్గా మరో కథ విన్నారట. ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకుని, రెండో సినిమాయే చిరంజీవితో ‘విశ్వంభర’ తీసిన మల్లిడి వశిష్ట ఇటీవల వెంకటేశ్కు ఓ కథ వినిపించారట. ఈ సినిమా చేసేందుకు వెంకటేశ్ సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబరు 47’ సినిమాలో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలనే సంక్పల్పంతో ఉన్నారట ఈ సీనియర్ హీరో. అలాగే ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్’ (ఇందులో చిరంజీవి హీరో) వంటి హిట్ చిత్రాలను తనకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఓ సినిమా చేస్తారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. సో... వెంకీ ఇమ్మిడియట్ సినిమా ఇదే అవుతుంది. ఈ నెల 20 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్రామ్ మరో హీరోగా నటించనుండగా కీర్తీ సురేష్, కృతీశెట్టి హీరోయిన్స్గా నటిస్తారు. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే ఓ క్రేజీ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇలా తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉండటంతో, వెంకీ తన తదుపరి సినిమాను సంక్రాంతి పండగ తర్వాతనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఈలోపు వెంకీని ఇంప్రెస్ చేసి, ఆయనతో సినిమా చేసే చాన్స్ను ఏ దర్శకుడు దక్కించుకుంటారో చూడాలి.నెక్ట్స్ ఎవరు? రాజమౌళి డైరెక్షన్లోని ‘వారణాసి’ చిత్రంతో మహేశ్బాబు ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే సినిమాను రిలీజ్ చేయాలని, ఇది జరగాలంటే ఈ ఏడాది ఆగస్టులోపే షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇలా ‘వారణాసి’ సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయినా ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అవుతారు మహేశ్బాబు.కాగా, ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకూడదని మహేశ్బాబు అనుకుంటున్నారట. ఈ సినిమా రిలీజైన వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఇందుకు తగ్గట్లుగానే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లతో పాటు బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్స్ను మహేశ్బాబు విన్నారని సమాచారం. ‘వారణాసి’ సినిమా రిలీజైన తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంపై మహేశ్బాబు ఓ స్పష్టతకు వస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగాతోనే మహేశ్బాబు సినిమా ఉండొచ్చని భోగట్టా.ముందు ఎవరు? హీరో రవితేజ కాస్త స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే తన నెక్ట్స్ సినిమాలను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. ఇందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. ముందుగా హసిత్ గోలి కథ వినిపించారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్నారట రవితేజ.ఈ రెండు కథలకూ ఇంప్రెస్ అయినప్పటికీ ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను సెట్స్కు తీసుకువెళ్లాలని రవితేజ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమా ప్రారంభమైన మరికొన్ని రోజులకే హసిత్ గోలీ సినిమానూ సెట్స్పైకి తీసుకు వెళ్లాలని రవితేజ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని రవితేజ అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు. ఇక రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్లోని సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. కాస్త సమయం ఉంది.. ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నారు హీరో నాని. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజిత్తో ‘బ్లడీ రొమియో’ అనే ఓ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా చేయనున్నారు నాని. ఇక రెండు సినిమాలు ఇలా ఉండగానే... నిర్మాతగా తనకు ‘కోర్టు’ సినిమా రూపంలో ఓ బ్లాక్బస్టర్ను అందించిన రామ్ జగదీష్ చెప్పిన కథను నాని ఓకే చేశారని తెలిసింది.కానీ ఈ కథలో నానీయే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణ బాధ్యతల వరకే పరిమితం అవుతారా? అనేది చూడాలి. అలాగే ఇటీవల ‘బ్యాండ్ మేళం’ సినిమా తీసిన సతీష్ జవ్వాజి చెప్పిన కథను కూడా విన్నారు నాని. ఈ కథను ఆల్మోస్ట్ ఓకే చేశారు. అయితే ఈ కథలో తానే హీరోగా నటించాలని నాని భావిస్తున్నారని, కాక పోతే కథకు ఇంకాస్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని సతీష్కు నాని సూచించారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇప్పటికే రెండు సినిమాలను ఖరారు చేసుకున్న నాని,మరో రెండు సినిమాల కథలను కూడా ఓకే చేశారు.మ్యూజికల్ లవ్స్టోరీ! ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో నాగచైతన్య బిజీ బిజీ. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో తన కెరీర్లోని 25వ సినిమాను లవ్ జానర్లో చేయాలా? లేక యాక్షన్ జానర్లో చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారట నాగచైతన్య. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ చెప్పిన కథలను విన్నారట నాగచైతన్య.అయితే రొటీన్ లవ్స్టోరీకీ కాస్త భిన్నంగా ఓ డిఫరెంట్ ప్రేమకథను చెప్పిన క్లాక్స్కు ముందుగా చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రజెంట్ ఈ కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట క్లాక్. ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ తర్వాత, నాగచైతన్య 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ‘దూత చాప్టర్2’ షూటింగ్లోనూ త్వరలోనే పాల్గొనున్నారు నాగచైతన్య. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దూత చాప్టర్ 2’తో తొలిసారిగా నిర్మాతగా మారారు నాగచైతన్య. ఈ సిరీస్కు శరత్మరార్ మరో నిర్మాత.రెండు సంవత్సరాల తర్వాత తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను రాబట్ట లేక పోయాయి. వైష్ణవ్ గత చిత్రం ‘ఆది కేశవ’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయడానికి వైష్ణవ్ దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్లో వైష్ణవ్ ఎన్నో కథలు విన్నారని తెలిసింది. కానీ ఫైనల్గా సుధీర్బాబుతో ‘హంట్’ సినిమా తీసిన దర్శకుడు మహేశ్ సూరపనేని చెప్పిన కథ వైష్ణవ్ను ఇంప్రెస్ చేసిందట.ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కనీసం రెండు సెట్స్పై ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే పూర్తవుతుంది. ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ను ఈ ఏడాదే అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే... మరో రెండు సినిమాలను సమాంతరంగా సెట్స్పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ‘సలార్ 2’ ఒకటి అని తెలిసింది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు. కానీ వచ్చే ఏడాదికి ఈ ఇద్దరు దర్శకులు కాస్త ఫ్రీ అవుతారు. మరి... ప్రభాస్ తర్వాతి రెండు సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులే డైరెక్షన్ చేస్తారా? లేక మరో దర్శకుడి పేరు ఏదైనా సడన్గా తెరపైకి వచ్చి, కొత్త కాంబినేషన్ సెట్ అవు తుందా? అనేది చూడాలి. ఏదీ ఏమైనా తన తర్వాతి సినిమాలపై ప్రభాస్ ఓ క్లారిటీతో ఉన్నారని సమాచారం.అడవిలో పోరాటం ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రామ్చరణ్. ఇక మెల్లిగా చరణ్ ఫ్యాన్స్ చర్చంతా ఆయన తర్వాతి సినిమాపైనే జరుగుతోంది. ‘రంగస్థ్థలం’ వంటి బ్లాక్బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన సుకుమార్తో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్కు వెళ్తుందని సమాచారం. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో ఓ సందర్భంగా కలిశారట రామ్ చరణ్. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా కన్ఫార్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఇదొక పీరియాడికల్ జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించరని, కేవలం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవుతారనే వార్తలు బాలీవుడ్లో వినిపించాయి. అలాగే ఈ సినిమాకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్లో ‘కిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్తోనూ ఓ సినిమా విషయమై రామ్చరణ్ చర్చలు జరిపారని టాక్. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.– ముసిమి శివాంజనేయులు -
ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికంటే ముందు తీసిన 'రెబల్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. నిర్మాతలు, దర్శకుడు రాఘవ లారెన్స్ మధ్య అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. చెప్పిన బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు పెట్టించాడని, అలానే బెదిరిస్తున్నాడని నిర్మాతలే స్వయంగా లారెన్స్పై పోలీసు కేసు కూడా పెట్టడం అప్పట్లో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'రెబల్' గురించి మాట్లాడిన నిర్మాతలు భగవాన్, పుల్లారావు.. మరోసారి పాత విషయాలు గుర్తుచేసుకున్నారు.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)'లారెన్స్ మీద కోపంగానే ఉన్నాం. మేం ఒక బడ్జెట్ అనుకున్నాం. సగం సినిమా అయ్యేసరికి అది అయిపోయింది. ఇది పెద్ద లాస్ అని నిర్మాతలుగా మాకు అప్పుడే తెలిసిపోయింది. అయినా సరే మేం ఎక్కడా దాన్ని వదిలిపెట్టకుండా ముహూర్తం నాడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో అలానే పూర్తి చేసి రిలీజ్ చేశాం. లారెన్స్ పేరు ప్రభాస్కి మేమే ముందు చెప్పాం. మంచి కాంబినేషన్ అవుతుందని నమ్మాం. కానీ ప్రభాస్ వాళ్ల నాన్న మాత్రం.. లారెన్స్తో మీరు పడలేరు, వద్దయ్యా అనేవారు. వేరే ఎవరైనా డైరెక్టర్ని ఆలోచించండి అనేవారు. ఆయనతోనే చేస్తామని మేం అనేసరికి, సరే మీ ఇష్టం అని ప్రభాస్ తండ్రి వదిలేశారు''ప్రభాస్ దేవుడు లాంటి మనిషి. 'రెబల్' కోసం జరిగిందంతా చూశారు. దీంతో మీరు చాలా కష్టపడ్డారు. మీకు మరో సినిమా తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. కానీ ఆ ప్రామిస్ని ఇంకా ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పటికీ ప్రభాస్తో మాకు అనుబంధం కొనసాగుతోంది. ప్రతి పండగకు విషెస్ చెబుతుంటారు' అని నిర్మాతలు జె.భగవాన్, జె. పుల్లారావు చెప్పుకొచ్చారు.చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉన్న వీళ్లు.. జంబలకడిపంబ, మావిడాకులు,సముద్రం, మనసున్న మారాజు, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్, శంఖం, రెబల్, గౌతమ్ నంద, రిపబ్లిక్ లాంటి సినిమాలని నిర్మించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పెద్ది మూవీ టాక్ పై బూచి బాబు రియాక్షన్
-
సింగ్ గీతం చేయడం నా అదృష్టం: దేవిశ్రీ ప్రసాద్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేసి ఉండరు. ‘సింగ్ గీతం’ ప్రాజెక్ట్ చేస్తున్నామని మూడేళ్ల క్రితం ఆయన చెప్పినప్పుడు హ్యాపీ అనిపించింది. నాగ్ అశ్విన్గారు, స్వప్నగారు, వైజయంతి మూవీస్తో కలిసి ఈ సినిమా రూపొందడం మరింత ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.⇒ నేను సింగీతంగారికి వీరాభిమానిని. మా నాన్న సత్యమూర్తిగారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను ఆరాధనగా చూసేవాడిని. అలాంటిది సింగీతంగారితో కలిసి పని చేయడం ఒక ఆశీర్వాదంగా అనిపించింది. సింగీతంగారు ఎప్పుడూ ట్రెండ్కి తగ్గట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకు ముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ‘పుష్పక విమానం’ ఇప్పటికీ చాలా అడ్వాన్డ్స్ మూవీ. ‘సింగ్ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ⇒ ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటివరకు రాలేదు. అది ‘సింగ్ గీతం’లో కొత్తగా ఉంటుంది. నా కెరీర్లో సవాల్తో కూడుకున్న సినిమా ఇది. ఇది కేవలం కామెడీ సినిమా కాదు... అద్భుతమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. కమల్హాసన్గారు సినిమా చూసి, ‘ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది’ అనడం మాకు ఆనందాన్నిచ్చింది. ⇒ చిన్నప్పటి నుంచి ప్రతి అక్ష రాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకుండేది. అప్పుడు న్యూస్పేపర్ తీసుకుని అందులో ఉన్న వార్తలనే ట్యూన్స్గా మార్చుకునేవాడిని. అది ‘సింగ్ గీతం’కి ఉపయోగపడింది. ఈ సినిమా కోసం ప్రతిదీ ముందుగానే మ్యూజికల్గా చేసి ఇచ్చాం. తర్వాత షూట్ చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. 94 ఏళ్ల వయసులోనూ కొత్త ఆలోచనతో, ఉత్సాహంగా సినిమా చేసిన సింగీతంగారి నుంచి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారు. -
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు.అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్నెస్పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్కు ఫిదా అవుతున్నారు. "Like boss, like bodyguard." 😎🔥#MassaMassa pic.twitter.com/tiFrCqMwg3— ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁 (@Mouli_Ka) June 4, 2026 -
'ఉప్పెన హీరో.. హిట్ కోసం తంటాలు.. నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?'
ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీ హిట్ తర్వాత వైష్ణవ్కు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ పెద్దగా రాణించలేకపోయాయి.దీంతో సక్సెస్ కోసం మెగా హీరో తంటాలు పడుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను మెగా హీరో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కానీ ఇటీవలే ఓ కథకు వైష్ణవ్ ఓకే చెప్పారని లేటేస్ట్ టాలీవుడ్ టాక్. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ మహేశ్తో వైష్ణవ్ తేజ్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు వైష్ణవ్ ఓకే చెప్పారట. మహేశ్ చెప్పిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
అక్కినేని అఖిల్ 'లెనిన్'.. వయొలెంట్ సాంగ్ వచ్చేసింది
అక్కినేని నాగార్జున తనయుడు తనయుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కుదరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.No WAR is more VIOLENT than LOVE ❤️🔥#SoulOfLenin is out now▶️ https://t.co/caQUyeFpz1 MANODU VASTHUNNADU 🔥🔥#Lenin #LeninOnJune26th @MusicThaman Musical 🎶 🎤 @ImVagdevi ✍️ #KalyanChakravarthy@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/Cnm7pLzX5U— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2026 -
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
-
అభిమానుల ఓవరాక్షన్.. ఉపాసన ఆగ్రహం.!
టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున హడావుడి కనిపించింది. పెద్ది సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.రామ్ చరణ్ సతీమణి కూడా స్వయంగా థియేటర్కు వెళ్లి పెద్ది మూవీని వీక్షించింది. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన ఉపాసన అభిమానులతో కలిసి మూవీ చూసింది. అయితే అదే సమయంలో థియేటర్లో అభిమానుల అల్లరితో అసహనానికి గురైంది. అక్కడే గట్టిగా అరుస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్ లో గొడవ పెట్టుకున్న ఉపాసన ఒక్కసారిగా అంతా షాక్ | Upasana Viral Video | CVR News#peddimovierelease #upasana #ramcharan #theatre #ramcharanfans #virulshorts #trending #viral #shorts #cvrnews pic.twitter.com/scrQaV0bAW— Cvr News Telugu (@cvrtelugunews) June 4, 2026 -
అతిపెద్ద షాకింగ్ నిజం.. కాజల్ కొత్త సినిమా టీజర్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర చేస్తున్న సినిమా 'ద ఇండియన్ స్టోరీ'. మన దేశంలో పురుగు మందుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయే అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో కాజల్.. న్యాయవాదిగా కనిపించనుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)అయితే సినిమాలోని విజువల్స్ ఏం చూపించకుండా కాన్సెప్ట్ ఏం ఉండబోతుందనే స్లైడ్స్ మాత్రమే వేశారు. 'మనం ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం', '50 వేలకు పైగా మెట్రిక్ టన్నుల పురుగు మందులు వాడుతున్నాం', '20 కోట్ల మంది ప్రజలు వీటి బారిన పడ్డారు', 'ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్తో పోరాడుతోంది', 'ప్రతి నిమిషానికి ఒకరిద్దరు చనిపోతున్నారు', 'ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు', ఇదే 'ద ఇండియా స్టోరీ' అని చూపించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఆసుపత్రి బెడ్పై నుంచే పండు మాస్టర్ వీడియో) -
'మొహబ్బత్' సినిమా ప్రారంభం...క్లాప్ కొట్టిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (ఫొటోలు)
-
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి..!
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Japan Rc fans watched #Peddi at bramarambha ❤️🔥Their love for @AlwaysRamCharan is unconditional 🥹❤️ pic.twitter.com/DZSEqfsWcb— Mr.RK (@RavikumarJSP) June 4, 2026 -
'నా బాడీ గార్డ్ను బయటికెళ్లకుండా చేశారు'.. రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది హవా కనిపిస్తోంది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది.అయితే పెద్ది మూవీతో మరో వ్యక్తి అనూహ్యంగా ఫేమ్లోకి వచ్చేశాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ స్పెషల్ బాడీ గార్డ్ కెవిన్. పెద్ది ఈవెంట్స్లో అతను కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆరా తీయడం మొదలెట్టారు. అంతేకాకుండా పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయడం మరో విశేషం.ఇటీవల మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ అతని గురించి మాట్లాడారు. కెవిన్ చాలా త్వరగా పాపులర్ అయ్యాడని అన్నారు. అతన్ని మీరే ఫేమస్ చేశారని.. అందుకే నేను అతన్ని బయటికి వెళ్లనివ్వడం లేదని అన్నారు. కెవిన్ను స్వేచ్ఛగా బయటకు వెళ్లకుండా చేశారని సరదాగా మాట్లాడారు. కెవిన్ దాదాపు నాలుగేళ్లుగా మా కుటుంబంతోనే ఉంటున్నాడని తెలిపారు. వ్యక్తిగత దినచర్యలు అతనికి బాగా తెలుసని.. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తరచుగా వారితో పాటు వెళ్తుంటాడని రామ్ చరణ్ స్పష్టం చేశారు. కాగా.. కెవిన్ పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాకు చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్నారు. కెవిన్ తనకు వస్తున్న ఆదరణ చూసి సోషల్ మీడియాలో భారతీయ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. -
బాలు, సుశీల & జానకిని మించిన క్రేజ్ నాది ఒక్కసారి స్టేజి ఎక్కితే..!
-
పెద్దిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది మాటనే వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదలైన హడావుడి తొలి రోజే మరింత ఊపందుకుంది. పెద్ది మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పెద్దిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్తో పాటు ఉపాసన కూడా వీక్షించారు.తాజాగా పెద్ది మూవీని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీక్షించారు. హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో వీక్షించిన సందీప్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్ నుంచి బయటికి వస్తున్న సందీప్ను అక్కడే ఉన్న కొందరు అభిమానులు సినిమా ఎలా ఉంది? అని అడిగారు. దీనికి సందీప్ రెడ్డి బదులిస్తూ.. బాగుంది అని రిప్లై ఇచ్చారు. కాగా.. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన పెద్దికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి స్పిరిట్ టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Sensational director Sandeep Reddy Vanga snapped at AMB Cinemas, Hyderabad after watching the special screening of Ram Charan's #Peddi!#SandeepReddyVanga #RamCharan #PeddiMovie #AMBCinemas pic.twitter.com/r1dmMAovhq— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 4, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..!
రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ మహిళ అభిమాని ఏకంగా థియేటర్లోనే డ్యాన్స్ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.‘పెద్ది’ రిలీజ్.. థియేటర్లో డాన్సులతో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్.మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీమియర్లతోనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో పేపర్ల వర్షం, ఈలలు, డ్యాన్స్లతో అభిమానులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.అయితే అందరి దృష్టిని… pic.twitter.com/eMWVbzWkvN— Tupaki (@tupaki_official) June 4, 2026 -
సీన్ రివర్స్.. పూర్తిగా మారిపోయిన పెద్ది పబ్లిక్ టాక్!
-
Watch Live: పెద్ది సినిమా పబ్లిక్ టాక్
-
పెద్దితో ఇండస్ట్రీ అన్ని రికార్డులు బద్దలు!
-
పెద్ది చూస్తూ.. పేపర్స్ విసురుతూ..! థియేటర్లో ఉపాసన హంగామా
-
నా అల్లుడికి ఆస్కార్ పక్కా.. పెద్ది పై రామ్ చరణ్ అత్త రియాక్షన్
-
ఏంటి బుచ్చి ఇది..పెద్ది ప్రీమియర్స్ Public Talk
-
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
ప్రముఖ బాలనటి ఇక మేజర్.. బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)


