breaking news
Tollywood
-
'మ్యాడ్' హీరోతో నిహారిక కొత్త సినిమా షురూ
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా కొత్త సినిమా ఆరంభమైంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి హిట్ చిత్రం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ద్వితీయ సినిమా ఇది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్స్ వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ‘‘ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరకెక్కనున్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరగనుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ ఇతర పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి సంగీతం: అనుదీప్ దేవ్, కెమేరా: రాజు ఎడురోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)
-
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
'అలాంటి వారికే ఇండస్ట్రీలో గుర్తింపు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆరోపణలతో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన పూనమ్ మరో ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ స్టంట్లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే మరోసారి త్రివిక్రమ్ను ఉద్దేశించే పరోక్షంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్కు ముందు పూనమ్ చేసిన ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈనెల 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025 త్రివిక్రమ్పై మా అసోసియేషన్కు ఫిర్యాదుపూనమ్ కౌర్ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపింది. క్లియర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్షాట్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న భజరంగీ భాయిజాన్ ఫేమ్..!
సల్మాన్ ఖాన్ మూవీ బజరంగీ భాయిజాన్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి హర్షాలీ మల్హోత్రా. ఈ సినిమాలో మున్ని అనే పాత్రలో సినీ ప్రియులను మెప్పించింది. ముంబయికి చెందిన హర్షాలీ బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హిందీలో పలు సీరియల్స్లో తన నటనతో రాణించింది. 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ మూవీతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ సీక్వెల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హర్షాలీ.. జనని పాత్రలో కనిపించనుందని తెలిపారు. ఈ మేరకు హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.కాగా.. గతంలో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో సంయుక్త, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా ఈ ఏడాది కానుకగా సెప్టెంబరు 25న విడుదల కానుంది. A smile of an angel and a heart of gold ❤️Introducing Bajrangi Bhaijaan fame #HarshaaliMalhotra as 'JANANI' from #Akhanda2 ✨#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam 'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial… pic.twitter.com/t5M3pVh8c1— 14 Reels Plus (@14ReelsPlus) July 2, 2025 -
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్లో చిరంజీవి గెస్ట్ రోల్గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
జవాన్ కుటుంబానికి సాయం.. మర్యాదగా మాట్లాడండి: గౌతమ్ వార్నింగ్
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్గా, జుడా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డైరెక్టర్ అవుదామని వచ్చి..ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. ఎంతో కష్టపడి చాలా సాధారణ స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం. ఆయన ఓటీటీ ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.బిగ్బాస్ నుంచి హీరోగా..హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... "నేను బిగ్బాస్కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఎటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దాన్ని ఒక సక్సెస్ లా చూస్తున్నాను.మర్యాద ఇచ్చి మాట్లాడండిఅలాగే దివంగత జవాన్ మురళి నాయక్ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్" అంటూ ముగించారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్.. మురళీ నాయక్ పేరెంట్స్కు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.చదవండి: మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!? -
సైడ్ యాక్టర్గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్తో తీశారు. టాలీవుడ్లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. బాలీవుడ్లో ఛాన్స్మరి హీరోగా బాలీవుడ్లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.చిన్న రోల్.. నచ్చలేదుఉదాహరణకు స్టార్ హీరో అజిత్ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్స్టార్స్లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండిపోయారు.సెల్ఫిష్గా ఆలోచించలేనుకాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
తమ్ముడుతో టాలీవుడ్లో ఎంట్రీ.. అప్పుడే లైన్లో పెట్టేసిందిగా! (ఫోటోలు)
-
మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు అసహనం
రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా (Game Changer Movie) వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. కారణం.. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మొట్టమొదటిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో శిరీష్ ఏమన్నారంటే..? 'గేమ్ ఛేంజర్తో మా పని అయిపోయిందనుకున్నాం.. అంత నష్టం వచ్చినా హీరో, దర్శకుడు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. అలా అని వారిని తప్పుపట్టడం లేదు. రామ్చరణ్తో ఎలాంటి విభేదాలు లేవు. గేమ్ ఛేంజర్ నష్టాన్ని దాదాపు 70% సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేసేసింది' అని పేర్కొన్నారు.చంపుకుతింటున్నారుఈ కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో శిరీష్ను ఏకిపారేశారు. దీంతో శిరీష్.. మెగా ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దిల్ రాజు (Dil Raju) అసహనం వ్యక్తం చేశారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడో జనవరిలో రిలీజైన గేమ్ ఛేంజర్ గురించి పదేపదే అడిగి చంపుకు తింటున్నారు. సినిమా రిలీజై ఆరు నెలలు అయిపోయింది. ప్రతిదాంట్లో గేమ్ ఛేంజర్ టాపిక్ తప్ప మరొకటి లేనే లేదు. తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే..ఎందుకసలు? బాగా ఆడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అడగొచ్చు కదా! ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. అలాంటప్పుడు గేమ్ ఛేంజర్ను మాత్రమే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఏ సినిమాను ఇంతగా పట్టించుకోలేదు. నా సోదరుడు శిరీష్ తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ని కూడా వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా అవసరం లేదు కదా!22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా..మేము తమ్ముడు సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నాం. దాన్ని వదిలేసి ఆరు నెలల కిందట రిలీజైన సినిమా గురించే మాట్లాడుతున్నారు. రామ్చరణ్కు, మాకు మధ్య సత్సంబంధాలున్నాయి. చరణ్కు ఈ ఏడాది హిట్ ఇవ్వలేకపోయాం. మంచి స్క్రిప్టు సెలక్ట్ చేసుకుని చరణ్తో సూపర్ హిట్ మూవీ చేస్తామని ఇదివరకే ప్రకటించాను. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరితోనూ సినిమాలు తీసిన సంస్థ ఇది. చీల్చి చెండాడుతున్నారుఎక్కడా ఏ వివాదం లేకుండా పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఆరు నెలల కిందట ఫ్లాప్ అయిన ఒక్క సినిమాను పట్టుకుని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్. జరిగిన సంభాషణంతా వదిలేసి కావాల్సిన చిన్న క్లిప్ తీసుకుని సంచలన హెడ్డింగ్స్ పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమాను వదిలేయండి. జనవరి తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులున్నాయి. వాటిలో ఒక్క సినిమా గురించైనా మాట్లాడుతున్నారా? అని అసహనం వ్యక్తం చేశాడు.చదవండి: బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ -
‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ
కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు పూర్తయింది. చూసినవాళ్లకు చూసినన్ని అన్నట్లుగా ఈ ఆరు నెలల్లో స్ట్రయిట్ మూవీస్100కి పైగా రిలీజ్ అయ్యాయి. కానీ వందలో హిట్ అంటే పది శాతమే. కోట్లు బడ్జెట్ పెట్టి గ్రాండ్గా తీసినంత మాత్రాన వసూళ్లు కూడా గ్రాండ్గా ఉంటాయనుకుంటే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డట్టే. ‘బడ్జెట్ కాదు... సబ్జెక్ట్ ముఖ్యం’ అనే పంథాలో సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవసరం ఉంది. 2025లో హిట్ అయిన చిత్రాలతోపాటు భారీ అంచనాల మధ్య థియేటర్కి వచ్చి, నిరాశపరిచిన పెద్ద చిత్రాల గురించి ఓ రౌండప్.⇒ 2025 సినిమా బాక్సాఫీస్ బోలెడన్ని అంచనాలతో మొదలైంది. జనవరిలో దాదాపు పదిహేను చిత్రాలు విడుదల కాగా... రెండంటే రెండే హిట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంక్రాంతి పండగకి ముందుగా వచ్చిన చిత్రం రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై, అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఆ వెంటనే వచ్చిన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా ఎబౌ యావరేజ్ హిట్గా నిలిచింది.బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతికి మంచి హిట్ అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. కాగా ఈ సీజన్లో ‘గేమ్ చేంజర్’ రూపంలో నష్టాలు చవి చూసిన ‘దిల్’ రాజుకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త ఊరటనిచ్చింది. ⇒ ఫిబ్రవరిలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలైతే, ‘తండేల్’ సినిమా రూపంలో ఒకే ఒక్క హిట్ దక్కింది. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. శ్రీకాకుళం మత్స్యకారుల్లోని కొందరి జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో నాగచైతన్య తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారు. ⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు విడుదల కాగా, రెండు శాతం హిట్ దక్కింది. ఈ హిట్టయిన రెండు సినిమాలూ భారీ బడ్జెట్ కాదు... భారీ స్టార్స్ కూడా లేరు. నూతన తారలు రోషన్, శ్రీదేవి జంటగా, ప్రియదర్శి ప్రధానపాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కోర్ట్’. హీరో నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘కోర్ట్’ చిన్న సినిమాగా రిలీజై, సక్సెస్పరంగా పెద్ద సినిమా అనిపించుకుంది.కంటెంట్ ఉంటే స్టార్స్, భారీ బడ్జెట్ అవసరం లేదనడానికి ‘కోర్ట్’ ఓ తాజా ఉదాహరణ. అలాగే హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్గా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ అంచనాలు అందుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ⇒ ఈ ఏడాది వేసవికి టాలీవుడ్ బాక్సాఫీస్ చల్లబడింది. ఏప్రిల్లో రిలీజైన ఏ సినిమా ఆడియన్స్తో క్లాప్ కొట్టించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హిరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘జాక్’ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ప్రదీప్ మాచిరాజు హీరోగా మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి’ చిత్రం మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి నితిన్–భరత్ దర్శకులు. ఇదే నెలలో వచ్చిన సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘ఓదెల 2’, కల్యాణ్రామ్–విజయశాంతిల యాక్షన్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్తేజ్ దర్శకత్వంలో డి. మధు, సంపత్ నంది నిర్మించిన చిత్రం ‘ఓదెల 2. ఇక ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రాన్ని నిర్మించారు. ‘కోర్ట్’ వంటి సూపర్హిట్ తర్వాత ప్రియదర్శి హీరోగా ‘సారంగపాణి జాతకం’ సినిమా వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం హిట్ కాలేదు. ఇలా ఏప్రిల్ పూర్తిగా నిరాశ పరిచింది. ⇒ మే నెల తొలి రోజే ‘హిట్: ది థర్డ్ కేస్’తో ప్రేక్షకులను పలకరించారు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే హిట్ అయింది. ఇక శ్రీవిష్ణుకి ‘సింగిల్’ సినిమా రూపంలో మరో సూపర్హిట్ లభించింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్రలో మెప్పించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. నూతన తారలు నటించిన ఈ చిత్రంలో సమంత అతిథిపాత్ర చేశారు. ‘శుభం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. ఇక నవీన్చంద్ర ‘లెవన్’, రాజేంద్రప్రసాద్–అర్చన–రూపేష్–ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్లో చేసిన ‘షష్టిపూర్తి’, తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’ రీమేక్గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్–నారా రోహిత్– మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే ప్రయత్నంలో తడబడ్డాయి. ‘లెవన్’ సినిమాకు లోకేశ్ అజ్ల్సస్, ‘భైరవం’కు విజయ్ కనకమేడల, ‘షష్టిపూర్తి’కి పవన్ప్రభ దర్శకత్వం వహించారు. ⇒ నార్నే నితిన్ హీరోగా రూపొందిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ తొలి వారంలో వచ్చి ఫ్లాప్గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఇక జూన్ మూడో వారంలో ధనుష్–నాగార్జున–రష్మికా మందన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘కుబేర’ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్కు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాను పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మించారు. అయితే ‘కుబేర’ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళంలో ఆదరణ దక్కలేదు. ఈ చిత్రం విడుదలైన రోజే అనంతిక సనీల్కుమార్–హను రెడ్డి–రవితేజ దుగ్గిరాల లీడ్ రోల్స్లో నటించిన మీడియమ్ రేంజ్ సినిమా ‘8 వసంతాలు’ అలరించలేకపోయింది.ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ చివర్లో విష్ణు మంచు కలల ్రపాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలైంది. ప్రభాస్, మోహన్బాబు, మోహన్లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్కుమార్, ఆర్. శరత్కుమార్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ రూపంలో విష్ణు చెంత ఓ మంచి హిట్ చేరింది. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎమ్. మోహన్బాబు ‘కన్నప్ప’ను నిర్మించారు. ఇలా ఈ ఏడాది ప్రథమార్ధం తొమ్మిది హిట్స్తో సరిపెట్టుకుంది. ‘మంచిని ఆశిద్దాం’ అంటారు కాబట్టి ద్వితీయార్ధం హిట్స్తో కళకళలాడాలని కోరుకుందాం. -
మెగా ఫ్యాన్స్కు దిల్ రాజు సోదరుడు క్షమాపణలు
రామ్ చరణ్ అభిమానులకు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. తాను మాట్లాడిన మాటలతో మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసిందన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే కమాపణలు కోరుతున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తిగా సహకరించారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించమని శిరీష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని లేఖ ద్వారా కోరారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తన సోదరుడు చేసిన కామెంట్స్పై దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని.. ఫస్ట్ టైమ్ కావడం వల్లే ఎమోషనల్గా అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో శిరీష్ రెడ్డి క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు.అసలు శీరిష్ రెడ్డి ఏం చెప్పారంటే?గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు.' అని అన్నారు. -
మరింత క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. కన్నీటి పర్యంతమవుతోన్న భార్య!
ఈ రోజుల్లో ఎప్పుడు.. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. విధి రాతకు ఇక్కడ ఎవరు అతీతులం కాదేమో. ఎవరి జీవితంలో ఎప్పుడెలా తలకిందులవుతుందో ఊహించలేం. అలాంటి పరిస్థితి రాకూడదని మనం అనుకుంటాం. కానీ ప్రస్తుతం మనందరిని వెండితెరపై నవ్వించినా ఫిష్ వెంకట్ పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకతప్పదు. గతంలోనే కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.గత కొద్ది నెలలుగా బాగానే ఉన్నా ఫిష్ వెంకట్ మరోసారి ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కిడ్నీల ఫెయిల్యూర్తో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్న ఆయన.. మళ్లీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్ ఫ్యామిలీ.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్కు డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో డయాలసిస్తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ప్రస్తుతం ఫిష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాగా.. నాలుగేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేశారు. -
గేమ్ ఛేంజర్పై శిరీష్ కామెంట్స్.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు!
టాలీవుడ్లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వార్తల వేళ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత పది రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను.. శిరీష్కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ ఛేంజర్ సమయంలో శంకర్ ఇండియన్-2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. అయినా కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని.. ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్ ఎమోషనల్గా మాట్లాడారు.. కానీ అతని ఉద్దేశం అస్సలు అది కాదని.. రామ్ చరణ్తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.కాగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
నా రియల్ లైఫ్లో వాళ్లు లేరు.. అయినా ఫీల్ కాలేదు: లయ
తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.నితిన్ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్లో చాలా స్పెషల్ అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.కాగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది. -
హిరణ్యకశిపుడిని పరిచయం చేస్తూ 'మహావతార్' ప్రోమో విడుదల
హోంబలే ఫిల్మ్స్ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం 'మహావతార్: నరసింహ'.. రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కు మంచి ఆదరణ లభించింది. జులై 25న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హింట్ ఇచ్చారు. యానిమేషన్లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు. -
కన్నడ బిగ్బాస్ హోస్ట్ ఎవరో ప్రకటించిన టీమ్
బిగ్బాస్ షో వివిధ రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీ రియాల్టీ షో అని తెలిసిందే. త్వరలో కన్నడ బిగ్బాస్-12 సీజన్ ప్రారంభం కానుంది. దాదాపు అన్ని సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన హీరో సుదీప్ ఇకపై తాను ఆ కార్యక్రమానికి హోస్ట్గా చేయాలనుకోవడం లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే, ఈసారి ఎవరు హోస్ట్గా చేస్తారని కన్నడలో ఆసక్తి పెరిగింది. మళ్లీ కిచ్చా సుదీప్ హోస్ట్గా రావాలని ఆయన అభిమానులు #KicchaBackOnBBK, #BiggBossKannada12 హ్యాష్ట్యాగ్స్తో వైరల్ చేశారు. దీంతో సుదీప్ మనసు మార్చుకున్నారు. మళ్లీ హోస్ట్గా చేస్తానని ఆయన అధికారికంగా ప్రకటించారు.బిగ్బాస్ హోస్ట్ విషయంలో కిచ్చా సుదీప్ తన మనసు మార్చుకున్నారు. మళ్ళీ 'బిగ్ బాస్' షోను హోస్ట్ చేయడానికి అంగీకరించారు. ఈమేరకు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. కలర్స్ కన్నడ ఛానల్ 'బిగ్ బాస్' నిర్వాహకులు కిచ్చా సుదీస్తో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలిసింది. కిచ్చా సుదీప్ హోస్ట్గా ఒప్పుకోకుంటే తమకు వేరే ఆప్షన్లు లేవని నిర్వహాకులు అన్నారు. అందుకే ఆయన్ను ఒప్పించామని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, 12వ సీజన్ తర్వాత, 13వ సీజన్కు ఎవరు హోస్ట్గా ఉంటారనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ స్వయంగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాబోయే 4 సీజన్లకు తానే హోస్ట్గా ఉంటానని ఆయన అన్నారు. తాము అలాంటి ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు.కన్నడ బిగ్బాస్ ఎందుకు చేయనని చెప్పానంటే..మిగతా భాషల్లో బిగ్బాస్కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్బాస్కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే హోస్టింగ్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే నాకు బిగ్బాస్ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశానని ఆయన అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని చెప్పడంతోనే హోస్ట్గా చేసేందుకు ఒప్పుకున్నానని సుదీప్ అన్నారు. -
‘ప్రేమిస్తున్నా’ చిత్రం సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
ఎప్పటికీ 'తమ్ముడు' అనిపించుకోలేవు (ట్రైలర్)
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ మరో ట్రైలర్ను విడుదల చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. అయితే, తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరోటి వదిలి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు. మొదటి ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరో పవర్ఫుల్ వీడియోను షేర్ చేసి మూవీపై మరింత అంచనాలు పెంచేశారు.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. నితిన్-దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’పై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. -
'విశ్వంభర' విడుదలకు ఇదే ఛాన్స్.. లేదంటే వచ్చే ఏడాదే..!
చిరంజీవి 'విశ్వంభర' ( Vishwambhara) సినిమా 2023 అక్టోబర్ నెలలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే, ఇప్పటికీ విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దర్శకుడు వశిష్ఠ(Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదల కష్టమే అని తెలుస్తోంది. జులై-ఆగష్టు నెల దాటితే వచ్చే ఏడాది సమ్మర్లోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రావచ్చని ఇండస్ట్రీలో టాక్ ఉంది.విశ్వంభర టీజర్లో చూపించిన గ్రాఫిక్స్పై చిరు అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. వీఎఫ్ఎక్స్ పనుల విషయంలో భారీగా ట్రోల్స్ రావడంతో విశ్వంభరకు గ్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో సినిమా మరింత ఆలస్యం అయింది. ఈ ఏడాది దసరాకు విశ్వంభరను విడుదల చేయలేరు. ఆ సమయంలో అఖండ2, ఓజీ చిత్రాలు ఉన్నాయి. దీపావళీకి ఇప్పటికే చాలా సినిమాలు లాక్ అయిపోయాయి. నవంబర్, డిసెంబర్ నెలలో విడుదల చేద్దామంటే వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి- చిరు సినిమా జనవరి 10 స్లాట్ను బుక్ చేసుకుంది. తక్కువ గ్యాప్లో ఇలా రెండు సినిమాలు వస్తే మార్కెట్ మీద ప్రభావం చూపొచ్చు. అందుకే విశ్వంభరకు కష్టాలు ఎక్కువ అయ్యాయి. చూస్తుంటే 2026 సంక్రాంతికి మెగా 157 ముందు రిలీజై ఆ తర్వాత తాపీగా విశ్వంభర వస్తుందనే కామెంట్స్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. విశ్వంభర టీజర్లో వచ్చిన విమర్శల వల్ల దర్శకుడు వశిష్ట కూడా మరింత అలర్ట్ అయిపోయాడట. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చినప్పుడు దానిని కాపాడుకోవాలని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పగలు రాత్రి విశ్వంభర కోసం పనిచేస్తున్నారట. విడుదల ఆలస్యం అయినా సరే భారీ హిట్ కొట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. -
నితిన్ 'తమ్ముడు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ధనుష్ రూ. 20 కోట్లు డిమాండ్.. విషయం తెలిసి బాధేసింది: వెట్రిమారన్
నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాబినేషన్లో వడచైన్నె అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుష్ కావడం విశేషం. కాగా దానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో వడచైన్నె– 2 చిత్రం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది ఆ చిత్రం ఉంటుందని ధనుష్ బదులిచ్చారు. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ ఉత్తర చైన్నె నేపధ్యంలో నటుడు శింబు కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనతో కూడిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు. దీంతో నటుడు ధనుష్ నటించాల్సిన వడచైన్నె– 2లో శింబు నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అంతే కాకుండా వడచైన్నె– 2 చిత్ర కాపీ రైట్స్ కోసం నటుడు ధనుష్ రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో దర్శకుడు వెట్రిమారన్ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన పరిస్థితి. ఆయన వివరణ ఇస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి తానూ గమనిస్తున్నానని, అయితే శింబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం వడచైన్నె 2 కాదనీ, ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే మరో కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అయితే వడచైన్నె చిత్రంలోని పాత్రల ఛాయలుగానీ కొనసాగింపులు గానీ ఉంటే ఈ చిత్ర నిర్మాత (ధనుష్)తో తాము మాట్లాడుకుని అనుమతి పొందుతామని చెప్పారు. ఇకపోతే నటుడు ధనుష్ కాపీరైట్ రూ.20 కోట్లు అడిగారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై ధనుష్తో చర్చించానని, ఆయన సార్ మీకు ఏది కరెక్టో అది చేయండి, తాము తమ సైడ్ నుంచి నో అబ్జెక్స్ పత్రం ఇస్తాం అని చెప్పారన్నారు. అంతే కానీ డబ్బు ఏమీ వద్దు అని ఆయన చెప్పారన్నారు. అలాంటిది ప్రస్తుతం జరుగుతున్న వదంతులు బాధిస్తున్నాయని దర్శకుడు వెట్రిమారన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
గూఫీ విషయాలు చెప్పేస్తున్నా.. ‘రా’ కోరుకుంటా..రష్మిక మందన్న కామెంట్స్
ప్రస్తుతం రష్మిక మందన్న అంటే నేషనల్ క్రష్...మెగాస్టార్ చిరంజీవి సైతం తన అభిమానాన్ని దాచుకోలేనంటూ మాట్లాడేంత స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ సౌత్ బ్యూటీ ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్. వరుస విజయాల ఈ కధానాయిక పంచుకునే విశేషాల కోసం సోషల్ మీడియా నిరంతరం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే... రష్మిక మందన్న తొలిసారిగా స్నాప్ చాట్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది.ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాల తర్వాత అదే స్థాయిలో ఇండియన్ యువతను ఆకట్టుకుంటున్న స్నాప్చాట్ లో ఆమె ఖాతా తెరవడం అభిమానులకు మరిన్ని విశేషాలతో కనువిందు చేయడమే అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘‘నేను ఎల్లప్పుడూ కొంచెం ‘రా’ గా( పచ్చిగా) కొంచెం వాస్తవంగా ఉండగలిగే ప్రదేశాలనే కోరుకుంటాను. అదే క్రమంలో ఇప్పుడు, స్నాప్చాట్లో ప్రవేశించాను. దీని ద్వారా నా తెర వెనుక క్షణాలు, నా చిన్న చిన్న ఆనందాలు కూడా పంచుకుంటాను.అంతేకాదు గూఫీ విషయాలు (చిన్న చిన్న పొరపాట్లు, తడబాట్లు, నవ్వు తెప్పించే చిరు తప్పిదాలు..వగైరా) కూడా. మధ్యలో ఉన్న ప్రతిదాన్ని (నా సోషల్ మీడియా బృందం చేసే ముందు కూడా) పంచుకునే సమయం ఇది. మీరు దీన్ని చూస్తుంటే, చాలా ధన్యవాదాలు, అభిమానులు ఇప్పటివరకు ప్రతిదానిలో అక్షరాలా భాగమయ్యారు వారికి ఇంకా ఎక్కువ సమయం అందివ్వడానికి నేను వేచి ఉండలేను. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, నా ప్రేమికులారా ’’అని రష్మిక మందన్న ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో వేచి చూద్దాం..స్నాప్చాట్ వేదికగా ఈ నేషనల్ క్రష్ సృష్టించే జోష్ ఎలా ఉంటుందో... -
ముద్దుల కుమారుడితో టాలీవుడ్ జంట చిల్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ ఏడాదిలోనే తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి రహస్య(Rahasya Gorak ) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట తమ ముద్దుల కుమారుడితో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.కాగా.. కిరణ్ అబ్బవరం, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఇక కిరణ్ అబ్బవంరం సినిమాల విషయాలకొస్తే..‘క’తో గతేడాది భారీ హిట్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘దిల్ రూబా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నాడు. #TFNReels: Cutest fam vibes!😍 Actor @Kiran_Abbavaram and #RahasyaGorak’s adorable video with their lil munchkin is pure love!!💗#KiranRahasya #KiranAbbavaram #FamilyGoals #TeluguFilmNagar pic.twitter.com/VPg9xAOnXF— Telugu FilmNagar (@telugufilmnagar) June 30, 2025 -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆ తెలుగు సినిమానే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సందడి చేస్తుండగా.. ఈ వారంలో తమ్ముడు అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీంతో బిగ్బాస్ గౌతమ్ నటించిన సోలో బాయ్ కూడా బాక్సాఫీస్ వద్దకు రానుంది. అయితే ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు.మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా తెలుగులో వస్తోన్న ఉప్పు కప్పురంబు సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్, ప్రియాంక చోప్రా హెడ్ ఆఫ్ స్టేట్, అమితాబ్ బచ్చన్ నటించిన కాళిధర్ లపతా కాస్తా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు కమల్ హాసన్ నటించిన భారీ చిత్రం థగ్ లైఫ్ కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూలై మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మరి ఏ యే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..అటాక్ ఆన్ లండన్- హంటింగ్ ది 7/7 బాంబర్స్- జూలై 01ది ఓల్డ్ గార్డ్-2- జూలై 02థగ్ లైఫ్(తమిళ సినిమా)- జూలై 03(రూమర్ డేట్)ది శాండ్మాన్ సీజన్-2- జూలై 03ది సమ్మర్ హికరు డైడ్- జూలై 05అమెజాన్ ప్రైమ్ వీడియో..ది హెడ్స్ ఆఫ్ స్టేట్- జూలై 02ఉప్పు కప్పురంబు(తెలుగు సినిమా)- జూలై 04జియో హాట్స్టార్కంపానియన్- జూన్ 30గుడ్ వైఫ్(వెబ్ సిరీస్)- జూలై 04జీ5కాళిధర్ లపతా(హిందీ సినిమా)- జూలై 04సోనిలివ్ది హంట్- రాజీవ్ గాంధీ హత్య కేసు- జూలై 04 -
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అల్లు అర్జున్ స్థాయికి రాలేకపోయావ్: దిల్ రాజు
నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలో దిల్ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్ చిట్చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.సత్సంబంధాలు లేకపోయినా..నితిన్ మాట్లాడుతూ.. దిల్రాజు (Dil Raju)ను నేను అంకుల్ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.జయం సినిమాకు ముందే..దిల్ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్తో సినిమా చేద్దామని వినాయక్తో అన్నాను. అలా జయం రిలీజ్కు ముందే దిల్ మూవీ ఫిక్స్ చేశాం. కాకపోతే దిల్ టైటిల్ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్ ఇవ్వడం వల్లే 'దిల్' రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది.గేమ్ ఛేంజర్ నష్టాలునేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్వి. నేను జూనియర్ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్ పొజిషన్లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ను, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ (Nithiin)ను ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గురించి ఓపెన్ అవుతూ.. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
దిల్ రాజు బయోపిక్.. హీరోగా ఎవరు సెట్ అవుతారంటే?
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్- దిల్ రాజుతో ఇంటర్వ్యూ నిర్వహించారు.ఈ ఇంటర్వ్యూలో నితిన్- దిల్ రాజు మధ్య సరదా సంభాషణ జరిగింది. భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే అవకాశముందా? అని నితిన్ ప్రశ్నించారు. అందుకు తగిన కంటెంట్ ఉంటుందా? అని అడిగారు. దీనికి దిల్ రాజు సమాధానమిచ్చారు. కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది.. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. ఒకవేళ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరైతే సెట్ అవుతుందని నితిన్ అడిగారు. చాలామంది నితిన్ నీ తమ్ముడిలా ఉంటారని చెబుతారు. అది నువ్వు ఒక్కడినే అని నాకు అనిపిస్తోందని అన్నారు.#Nithiin: మీ బయోపిక్ తీసే అంత కంటెంట్ మీ లైఫ్ ఉందా ? Dil Raju: Yea Definite గా ఉంది. pic.twitter.com/ZbDxyfFogS— Rajesh Manne (@rajeshmanne1) June 30, 2025 -
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్లాల్గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
సోషల్ మీడియా క్రేజ్.. ఏకంగా మూవీ ప్రమోషన్లలో కుమారి ఆంటీ!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అలాంటి వారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ, కుర్చీ తాత, మోనాలిసా ఇలా ఎందరో ఉన్నారు. హైదరాబాద్లో రోడ్డు పక్కన్ భోజనాలు విక్రయించే కుమారి ఆంటీ ఓకే ఒక్క మాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.అదే ఫేమ్తో ఇప్పుడు ఏకంగా మూవీ ప్రమోషన్లలో భాగమయ్యారు కుమారి ఆంటీ. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా షో టైమ్ ప్రమోషన్లలో సందడి చేశారు. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్తో ఆమె ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ప్రమోషన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
కింగ్డమ్ గురించి తిడుతూనే ఉన్నారు.. మీకు మాటిస్తున్నా: నాగవంశీ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో మే 30కి వాయిదా వేశారు. అప్పటికీ కింగ్డమ్కు మెరుగులు దిద్దడం కంప్లీట్ కానందున జూలై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు నితిన్ తమ్ముడు చిత్రం విడుదలవుతోంది.మళ్లీ వాయిదాఅయితే కింగ్డమ్ (Kingdom Movie) వాయిదా పడటం ఖాయం అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. కింగ్డమ్ వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. నేను ఏం పోస్ట్ చేసినా కింగ్డమ్ సినిమా గురించి తిట్లు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు. మీకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీమ్ ఎంతగానో కృషి చేస్తోంది. మీకు మాటిస్తున్నా.. కింగ్డమ్ చూశాక మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. కింగ్డమ్దే విజయంనేను ఎంతో నమ్మితే కానీ ఇలా మాట్లాడనని మీకు తెలుసు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. నేను సినిమా చూసి చెప్తున్నా.. కింగ్డమ్దే గెలుపు. త్వరలోనే అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, సాంగ్ అనౌన్స్మెంట్తో కలుద్దాం అన్నాడు. దీంతో కింగ్డమ్ వాయిదా కన్ఫార్మ్ అయిపోయింది. Em post chesina, Kingdom sweet curses mathram vasthune untayi ani telusu 😅But trust me our team is working around the clock to bring you a Massive Big Screen Experience… One thing I can promise you - The ADRENALINE RUSH this film delivers is unreal 🔥🔥And you all know…— Naga Vamsi (@vamsi84) June 30, 2025 చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి (Ravuri Sravana Bhargavi)- హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడూ వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురితో ఒంటరిగా ట్రిప్స్కు వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాపంత్య జీవితానికి స్వస్తి పలికి, ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది.తప్పు చేస్తున్నామా?తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్లు.. వీటితోనే బతికేయడంలో అర్థంపర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైనది. మనం మనస్ఫూర్తిగా ఒకర్ని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా? అని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా, మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే.. మనం జీవితంలో గెలిచామా? ఓడామా? అనేది నిర్ణయిస్తుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.హేమచంద్రతో ప్రేమపెళ్లిటాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి.. పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా! అలాగే హీరోయిన్స్కు డబ్బింగ్ కూడా చెప్తుంది. ‘గబ్బర్సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్కి డబ్బింగ్ చెప్పింది. ఈగ హిందీ వర్షన్లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి- హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జిలుగా కూడా వ్యవహరించారు. లక్కీ లవ్ అనే షార్ట్ ఫిలింలో జంటగానూ నటించారు.చదవండి: రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న నటుడు -
'కన్నప్ప'కు ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్లో 80 శాతం సీట్లు ఫిల్ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్తో రన్ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్లను తమ టీమ్ తొలగించిందని ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే.. ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ' మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.' అంటూ విష్ణు కోరారు.కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. బుక్మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్ అవుతున్నాయి. -
ట్రెండ్ కి దూరంగా మహేష్ బాబు, రామ్ చరణ్
-
ఓటీటీలో 'కె.విశ్వనాథ్' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్
కళాతపస్వి 'కె.విశ్వనాథ్' దర్శకత్వం వహించిన చివరి సినిమా 'శుభప్రదం'.. 15 ఏళ్ల తర్వాత ఓటీటీలో విడుదలైంది. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాటలు పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సాగర సంగమం, శ్రుతిలయలు, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం... ఇలా ఒకదాన్ని మించి మరొకటి? సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కె. విశ్వనాథ్.. అయితే, చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన 'శుభప్రదం' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. కానీ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బలహీనంగా ఉన్నాయని ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉందని , హీరో పాత్ర అంతగా మెప్పించలేదని రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకుల హృదయాలను శుభప్రదం అస్సలు ఆకర్షించలేదని చాలామంది చెప్పారు. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి విశ్వనాథ్ చివరి సినిమా రావడంతో ఆయన అభిమానులు మాత్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.'శుభప్రదం' సినిమా 'జియోహాట్స్టార్' (jiohotstar)లో సడెన్గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈమేరకు సోషల్మీడియాలో ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. కె.విశ్వనాథ్ సుమారు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 5 సినిమాలు జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డ్స్ అందుకోవడం విశేషం. అంతటి గొప్ప దర్శకుడి చివరి సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ఓటీటీలో విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో కె. విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు. -
'కన్నప్ప' తర్వాత మంచు విష్ణు సినిమా ఇదే.. దర్శకుడు ఎవరంటే..?
'కన్నప్ప' సినిమా విజయం తర్వాత మంచు విష్ణు జోరు పెంచుతున్నారు. త్వరలో ఆయన నటించనున్న కొత్త సినిమాపై వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరో కూడా సమాచారం బయటికి వచ్చింది. కన్నప్ప మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మ్యాట్నీ, సాయింత్రం షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇదే జోష్తో ఆయన మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 'కన్నప్ప'కు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తర్వాతి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది.'కన్నప్ప' హిట్ తర్వాత మంచు విష్ణు- ప్రభుదేవా కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రానుందని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవా... మంచు విష్ణుతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
విజయ్ సేతుపతి- నిత్యా మీనన్ సినిమా టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కొత్త సినిమా ‘తలైవా తలైవి’ (Thalaivan Thalaivi) టీజర్ను విడుదల చేశారు. ఆపై మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen) ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 25న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. -
కుబేర 2.. ధనుష్ను రీప్లేస్ చేసే దమ్మున్న తెలుగు హీరో
ప్రస్తుతం సీక్వెల్స్ యుగం నడుస్తోంది. పలు సినిమాలు ముందుగానే 1,2,3 భాగాలు ఉంటాయని ప్రకటించి తీస్తుంటే మరికొన్ని మాత్రం సినిమా సక్సెస్ తర్వాత మాత్రమే ఎనౌన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు భారీ చర్చోపచర్చలకు కారణం కూడా అయిన సినిమాగా కుబేర ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి మరిన్ని రికార్డులకు చేరువవుతోంది. మరోవైపు అనేక రకాల చర్చలకు కూడా ఈ సినిమా విజయం దారి తీసింది. ముఖ్యంగా మన టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు హీరోగా ధనుష్ను ఎంచుకోవడం ఆ సినిమా ప్రారంభాన్ని కన్నా ఇప్పుడే అత్యంత చర్చనీయాంశంగా మారింది. అంత బలమైన సబ్జెక్టు ఉన్న, లోతైన నటనకు అవకాశం ఉన్న చిత్రంలో మన తెలుగు నటుల్లో ఎవరూ ఎందుకు హీరోగా చేయలేకపోయారు? లేదా శేఖర్ కమ్ముల చేయించలేదా? లేక అసలు ధనుష్ స్థాయిలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో నటించగల దమ్ము ఉన్న నటుడు టాలీవుడ్లోనే లేడా అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చోపచర్చలు వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే తొలుత టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను శేఖర్ కమ్ముల బిచ్చగాడి పాత్ర కోసం సంప్రదించారని అయితే తిరస్కారం ఎదురైందని ఒక ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరికొన్ని కూడా వచ్చినప్పటికీ అవి ఎంత వరకూ నిజమో తెలీదు.. సరే ఒకరిద్దరు ఒప్పుకోలేదు మరి ఇంకెవరూ శేఖర్ కమ్ములకు తట్టలేదా..?అంటూ ఈ చర్చల సందర్భంగా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు తమ వంతుగా కొన్ని పేర్లు కూడా తెరమీదకు తెస్తున్నారు. అందులో అత్యధికులు పేర్కొంటున్న పేరు అనూహ్యంగా ఓ చిన్న హీరోది కావడం విశేషం.అతడే అల్లరి నరేష్. ప్రముఖ దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో ఒకడైన అల్లరి నరేష్ ఒకప్పుడు సీనియర్ కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని భర్తీ చేస్తాడని చేసేశాడని కూడా భావించారు. అయితే కొంత కాలంగా ఆయన కెరీర్ అంత సంతృప్తికరంగా లేదు. అయితే జయాపజయాలకు అతీతంగా అల్లరి నరేష్ మాత్రం వైవిధ్యభరిత పాత్రల్లో తనను తాను నిరూపించుకుంటున్నాడు నేను, గమ్యం, నాంది, శంభో శివ శంభో, ఉగ్రం, బచ్చలమల్లి... వంటి చిత్రాల్లో అల్లరి నరేష్ నట విశ్వరూపాన్ని మనం చూశాం. ఈ చిత్రాల జయాపజయాలు అటుంచితే అల్లరి నరేష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపధ్యంలో ధనుష్ను అడ్డం పెట్టుకుని తెలుగు హీరోలు, నటులను తీసి పారేస్తున్నవారిని ఎదుర్కునే క్రమంలో అనేక మంది తెలుగు సినీ అభిమానులు అల్లరి నరేష్ను అస్త్రంగా మారాడు. అలాంటి వారిలో కొందరు మరో అడుగు ముందుకేసి కుబేర 2 సినిమా తీయాలని అందులో హీరోగా అల్లరి నరేష్ను ఎంచుకోవాలని సూచిస్తూ, ఆ సినిమా కధ సైతం అందుకు అనువుగానే ఉంటుందని ఊహాగానాలు చేసేస్తున్నారు. ఎంతో కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా స్టార్ హీరో కాలేకపోయినా, వైవిధ్య భరిత పాత్రలు ధరించడం ద్వారా స్టార్స్ని తలదన్నేలా సినీ ప్రేక్షకుల గుండెల్లో అల్లరి నరేష్ కొలువుదీరాడని కుబేర చిత్రం విజయానంతర పరిణామాలు తేల్చేశాయి. -
విడుదలై తర్వాత వెట్రిమారన్ చేస్తున్న సినిమా ఇదే
నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్ ఏమిటంటే నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచెన్నై చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయరో పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్ వాగైయారో అనే టైటిల్ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా(Andrea Jeremiah) ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే సోషల్ పొలిటికల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్ చాలా టైట్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
ముందుంది మస్త్ మజా
2025 నేటితో సగం పూర్తయింది. అయితే ఈ ప్రథమార్ధంలో వచ్చిన స్టార్ హీరోల చిత్రాల సంఖ్య తక్కువే. కానీ ద్వితీయార్ధం ధూమ్ ధామ్గా ఉండబోతోంది. పలువురు స్టార్స్ వెండితెరపైకి దూసుకు రావడానికి రెడీ అయ్యారు. సో... 2025 సెకండాఫ్ హీరోల అభిమానులకు పండగే. అలాగే హీరోయిన్ల ఫ్యాన్స్కి కూడా. ‘ముందుంది మస్త్ మజా’ అంటూ థియేటర్లకు రానున్న ఆ చిత్రాల గురించి...ఈ ఏడాదే విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, ‘విశ్వంభర’ అనే పుస్తకం, ‘విశ్వంభర’ ప్రపంచం సినిమాలో కీలకంగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్తో యూనిట్ బిజీగా ఉంది. ‘విశ్వంభర’ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.అఖండ తాండవం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న తాజా చిత్రం ‘అఖండ 2’. 2021లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోంది. సంయుక్త ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. సైమన్ ఈజ్ కమింగ్ ధనుష్తో కలిసి ‘కుబేర’ సినిమాతో థియేటర్స్లోకి వచ్చారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్ని నాగార్జున ‘కూలీ’లో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సైమన్ అనే పవర్ఫుల్ విలన్పాత్రలో నాగార్జున కనిపిస్తారు. నాగార్జున పూర్తి స్థాయి విలన్గా కనిపించనున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇటు వీరమల్లు... అటు ఓజీ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు, ఓజీ’... ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే విడుదల కాన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా జూలై 24న విడుదల కానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించారు. ఇక పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ గ్యాంగ్స్టర్ సినిమాను సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.పోలీసాఫీసర్ లక్ష్మణ్ భేరీరవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే పవర్ఫుల్పోలీసాఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. రాజా సాబ్ రెడీ విష్ణు మంచు టైటిల్ రోల్ చేసిన ‘కన్నప్ప’ సినిమాలో రుద్రగా కనిపించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ హారర్ కామెడీ యాక్షన్ సినిమాను మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లు. తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపిస్తారు.ఆంధ్రా కింగ్ తాలూకా... ఓ సినిమా హీరోకి, ఆ హీరో ఫ్యాన్కి మధ్యలో జరిగే సంఘటనలతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో అభిమానిగా రామ్, సినిమా స్టార్ సూర్యకుమార్గా ఉపేంద్ర కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పి. మహేశ్బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ఆరంభమైంది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. సెంటిమెంటల్ తమ్ముడు ఈ ఏడాది మార్చిలో నితిన్ నుంచి ‘రాబిన్హుడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలైలో ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి వస్తున్నారు నితిన్. అక్కా తమ్ముడు సెంటిమెంట్తో వస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలకపాత్రధారులు. లయ తమ్ముడిపాత్రలో నితిన్ కనిపిస్తారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. త్వరలో కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు కానీ జూలై చివర్లో లేదా ఆగస్టులో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుందని టాక్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమికులు క్రైమ్ చేయాల్సి వస్తే! ఈ ఏడాది మే 1న నాని హీరోగా చేసిన ‘హిట్ 3’ సినిమాలో అడవి శేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్: ఏ లవ్స్టోరీ’ డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఈ క్రైమ్ లవ్స్టోరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. బ్రేకప్ చేప్పుకున్న ప్రేమికులు కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథనం అని తెలిసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ–నిర్మాత.కిష్కింధపురిలో...బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘హైంధవ’, సాగర్కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాలు కూడా చేస్తున్నారు సాయిశ్రీనివాస్. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.సోషియో ఫ్యాంటసీ ‘స్వయంభూ’ నిఖిల్ హీరోగా నటిస్తున్నపాన్–ఇండియా మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లు. ఇందులో హీరో మాత్రమే కాదు... హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.లవ్స్టోరీ తెలుసు కదాఈ ఏడాది వేసవిలో ‘జాక్’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ థియేటర్స్కి వచ్చారు. ఇక ఈ దీపావళికి ‘తెలుసు కదా’ అనే లవ్స్టోరీతో రానున్నారు సిద్ధు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ముక్కోణపు ప్రేమకథగా ‘తెలుసు కదా’ ఉంటుందట. ఏటిగట్టు సంబరాలు సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 75 శాతం పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. మిరాయ్ అడ్వెంచర్ ‘హను–మాన్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్గా చేస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఇంకా నవీన్చంద్ర ‘షో టైమ్’, ఆది సాయికుమార్ ‘శంబాల’, సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’తోపాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఉమన్ పవర్ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలు వరుసగా విడుదలవుతుంటే... స్టార్ హీరోయిన్ల చిత్రాలూ దూసుకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమ పవర్ చూపించడానికి అనుష్క, లావణ్యా త్రిపాఠి, రష్మికా మందన్నా వంటి తారలు రెడీ అయ్యారు. ⇒ పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన ఓ బాధిత గిరిజన మహిళ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, లెజెండ్గా ఎలా ఎదిగింది? అనే కథాంశంతో అనుష్క ‘ఘాటీ’ రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు లీడ్ రోల్ చేశారు. ⇒ కుటుంబ బంధాలను నిలపడానికి సతీ లీలావతి ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్యా త్రిపాఠి టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ ఆమె భర్తపాత్ర చేశారు. భార్యాభర్తల అనుబంధాన్ని ఎమోషనల్గా, ఎంటర్టైనింగ్గా చూపిస్తూ, తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. . ⇒ స్టార్ హీరోల చిత్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకునేపాత్రలు చేస్తూ దూసుకెళుతున్న రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ లీడ్ రోల్ చేశారు. ఈ ప్రేమకథా చిత్రంలో క్లిష్టమైన రిలేషన్షిప్ని ఎదుర్కొనే కాలేజీ విద్యార్థినిగా రష్మిక నటించారు. ఇక ఇది కాకుండా ‘మైసా’ అనే మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక డైరీలో ఉంది. ⇒ అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. మూఢ నమ్మకాలు, మహిళా సాధికారిత వంటి అంశాలతో రూపొందిన ‘పరదా’ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.⇒ ఇంకా కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’ అంటూ టైటిల్ రోల్లో ఆగస్ట్ 27న థియేటర్స్కు రానున్నారు. జేకే చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అలాగే వరలక్ష్మిపోలీసాఫీసర్గా నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా మరికొందరు నాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమ పవర్ని నిరూపించుకోనున్నారు. కన్యారాశి టైమ్ వచ్చిందిహిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018)కి సీక్వెల్గా ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా రానుంది. ‘ఏలినాటి శనిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను సీక్వెల్లోనూ నటించనున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారు. డి. సురేష్బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.ఫీల్గుడ్ లవ్స్టోరీనరేశ్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో రబియా ఖతూన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఫీల్గుడ్ లవ్స్టోరీతో రూపొందించిన ఈ చిత్రంలో మ్యూజిక్కి మంచి స్కోప్ ఉంది. జస్టిన్ ప్రభాకరన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ చిత్రం మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయా..? భయపెడుతున్న టాప్ హీరోయిన్స్ అనుభవాలు
దక్షిణాదిలో పలువురు సినిమా షూటింగ్స్ కోసం ఎంచుకునే హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ లో దయ్యాలు ఉన్నాయా? తరచుగా సినీతారలు ఆ ఫిలిం సిటీ గురించి ప్రకటిస్తున్న భయాలు, అనుభవాలు దేనికి సంకేతం? విశేషం ఏమిటంటే, సదరు ఫిలిం సిటీలో తాము ఎదుర్కున్న భయానక అనుభవాలు వెల్లడిస్తున్న వారు కూడా ఏదో చిన్నా చితకా నటీమణులు కాకపోవడం, ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అత్యంత పేరున్న ప్రముఖ తారలు కావడమే విశేషం. హైదరాబాద్ శివార్లలో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీ హంటెడ్ స్థలం అనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షూటింగ్స్ సమయంలో కొన్నిసార్లు రాత్రంతా నిద్రపోలేని ప్రదేశాలలో గడిపాపనని, అలాంటి సమయంలో అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుంటుందని భావించానని కాజోల్ చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని పేర్కొన్నారు, ‘‘అది ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించవచ్చు’’ అన్నారామె. అయితే, అదృష్టవశాత్తూ తనకు ఏ దయ్యమో భూతమో లాంటివి తనకు కనపడలేదంటూ తీవ్రమైన భయాలను ఆమె వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఒక ప్రముఖ సీనియర్ నటి, అదే విధంగా అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరో భార్య ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన సంచలనం కలిగించాయి. ఇవి దేశవ్యాప్తంగా సినిమా రూపకర్తలను ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటోందని గ్రహించిన ఫిలింసిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలింసిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కాజోల్ కితాబిచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందని సినీ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కేవలం కాజోల్ మాత్రమే కాకుండా గతంలోనూ టాలీవుడ్ కి చిరపరిచితమైన రాశి ఖన్నా తాను అక్కడ బస చేసినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టుగా అడుగుల శబ్ధం వినిపించింది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మరో అగ్ర తార తాప్సీ పన్ను కూడా అక్కడేదో అసహజ వాతావరణ ఉంది అంటూ మాట్లాడారు. అదే విధంగా తమిళ దర్శకుడు సుందర్ సి వంటి సెలబ్రిటీలు సైతం తమకు అక్కడ షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకోవడం... గమనార్హం. ఫిలింసిటీ...హారర్కి అడ్రెస్సా?రామోజీ ఫిల్మ్ సిటీని వందల ఎకరాల్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం సైనికుల సమాధులు ఉండేవని కొందరు అలాగే ఆ స్థలం పూర్వపు యుద్ధభూమి అని మరికొందరు నమ్ముతున్నారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల నివాసితులకు శాంతి లేదని, అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని ఈ తరహా విషయాలను నమ్మేవారు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మూఢనమ్మాకాలను వ్యాప్తి చెందించడం మంచిది కాదనేది నిజమే అయినప్పటికీ, ఎన్నో రకాల అనుభవాలను చవి చూసిన ధైర్యవంతులైన సినీ తారలు వ్యక్తం చేసే అభిప్రాయాలను కొట్టిపారేయలేం. మూఢనమ్మకాల సంగతెలా ఉన్నా, ఆయా తారలకు ఎదురవుతున్న అనుభవాల వెనుక ఉన్నవి అతీంద్రీయ శక్తులా? లేక అనుమానాస్పద వ్యక్తులా? అనే నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు. -
నేను చేసిన ఐదు సినిమాలు ముందు నాగచైతన్యకే చెప్పా: వెంకీ అట్లూరి
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri). ప్రస్తుతం హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా అక్కినేని నాగచైతన్యకు వినిపించాడట! తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పాను.వర్కవుట్ కాలేఈరోజు వరకు నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది చైతన్య (Naga Chaitanya)కే చెప్పాను. కానీ, డేట్స్ కుదరక.. లేదా ఏదో ఒక కారణం వల్ల మా కాంబినేషన్లో సినిమా వర్కవుట్ కావడం లేదు. నెక్స్ట్ టైం అయినా కలిసి మూవీ చేద్దామని జోక్ చేసుకుంటూ ఉంటాం. అఖిల్కు మంచి హిట్టు ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది. తనతో భవిష్యత్తులో కచ్చితంగా ఓ మంచి మూవీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. సినిమావెంకీ అట్లూరి.. అఖిల్తో మిస్టర్ మజ్ను మూవీ చేశాడు. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు.చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం -
'21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ
ఒక్క పాటతో పడిపోయింది బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్తో కలిసి మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్ జరిగింది.మోడల్గా..తాజాగా ఈ ట్రోలింగ్పై శుభశ్రీ రాయగురు (SubhaShree Rayaguru) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాగా టైటిల్ గెలిచాను. ఐఏఎస్ కోచింగ్కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్బాస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్ వచ్చింది.సాంగ్ షూటింగ్లో పరిచయంఈ మధ్యే మేజస్టీ సాంగ్ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్ షూటింగ్లో అజయ్ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్ జరిగింది. చివరి రోజు షూటింగ్లో తను నాకు ప్రపోజ్ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు. డబ్బు కోసమే పెళ్లి?మా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్నర్ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను. ట్రోలింగ్ దెబ్బకు జ్వరంఈ ట్రోల్స్ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం -
షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. -
ఆ సినిమా తర్వాత పెళ్లి పీటలు ఎక్కనున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ?
-
దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. ఇంట్లో ఒప్పుకోలేదు: తేజస్విని
దేవుడు కోరుకున్నదానికంటే అన్నీ ఎక్కువే ఇచ్చాడంటోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భార్య తేజస్విని (వైఘా రెడ్డి). మంచి కుటుంబం, పిల్లాడు ఉన్నాడని, ఇంతకంటే ఇంకేం కావాలని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్విని (Tejaswini) మాట్లాడుతూ.. మా కుటుంబమంతా ఏడాదికి ఒకసారి మాత్రమే సినిమాకు వెళ్లేవాళ్లం. అది కూడా దసరా పండగప్పుడే థియేటర్కు వెళ్లి మూవీ చూసేవాళ్లం. అలాంటిది సినీ బ్యక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. మా ప్రయాణం సులభంగా సాగలేదు. గూగుల్లో వెతికా..నిజానికి నాకు దిల్ రాజు ఎవరో తెలియదు. దర్శకుడేమో అనుకున్నాను. ఈయన ఎవరని గూగుల్లో వెతికితే నిర్మాత అని తెలిసింది. ఆయనకు ఆల్రెడీ పెళ్లయి కూతురుందని తెలిశాక నేను వెనకడుగు వేశాను. నేను చిన్నప్పుడు అమ్మమ్మ-తాతయ్య, అత్తమామల దగ్గరే ఎక్కువ పెరిగాను. పెళ్లికి ఎవరిని ఒప్పించాలి? అని దిల్ రాజు అడిగినప్పుడు మా పెద్దమామయ్య పేరు చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్లాగా ఉంటాడు.పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదుతను చాలా స్ట్రిక్ట్. ఆయన్ను ఒప్పించాక మా పిన్నిని కన్విన్స్ చేయాలన్నాను. ఆశ్చర్యంగా మా పెద్దమామయ్య మమ్మల్ని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ, పిన్ని అసలు నమ్మలేకపోయింది. మా పెళ్లికి తను ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది. మాతృత్వం గురించి మాట్లాడుతూ.. నా కొడుకు అన్వయ్ మూడేళ్లబాబులా ప్రవర్తించడు. ఎప్పుడైనా నేను బాధలో ఉంటే నాకు ముద్దుపెట్టి, అమ్మా బానే ఉన్నావా? అని అడుగుతాడు. ఆ సినిమా తర్వాతే ప్రెగ్నెన్సీవాడి ముద్దు ముద్దు మాటలకు మాకు ఎంత ఒత్తిడి ఉన్నా ఇట్టే మాయం అయిపోతుంది. ఆ మధ్య బాలీవుడ్లో రాజ్కుమార్ రావు 'హిట్' మూవీ నిర్మాణ బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను. ఆ తర్వాత నేను గర్భం దాల్చడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. అన్వయ్ పుట్టాక నా జీవితమే మారిపోయింది. వాడు పుట్టి మూడేళ్లు కావడంతో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నావా? అని అడుగుతున్నారు. అన్వయ్తో నేను సంతోషంగా ఉన్నాను. ఇంకెవరూ నాకు వద్దు అని తేజస్విని పేర్కొంది.దిల్ రాజు పర్సనల్ లైఫ్దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. వీరికి కూతురు హన్షితా రెడ్డి సంతానం. 2017లో అనిత గుండెపోటుతో మరణించింది. అనంతరం హైదరాబాద్కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని 2020లో దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
చిరంజీవి బర్త్డే స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్ సినిమా రీరిలీజ్
చిరంజీవి- త్రిష కలిసి నటించిన ‘స్టాలిన్’ సినిమా రీరిలీజ్ కానుంది. 2006లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, ప్రదీప్ రావత్ వంటి స్టార్స్ నటించారు. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా (స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం కూడా స్టాలిన్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీని చిరు సోదరుడు నాగబాబు నిర్మించగా గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది. ప్రస్తుతం స్టాలిన్ ఏకంగా మూడు (ఆహా, అమెజాన్, జియోహాట్స్టార్) ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ అనుష్క కూడా ఒక స్పెషల్ సాంగ్లో సందడి చేసింది.ఆగష్టు 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ చిత్రాన్ని 4K వర్షన్లో విడుదల చేయబోతున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామి నాయుడు ఒక పోస్టర్ను తాజాగా లాంచ్ చేశారు. ఈ సినిమా చాలామంది యూత్ను ఆలోచించేలా చేసిందని చెప్పవచ్చు. సుమారు 19 ఏళ్ల తర్వాత స్టాలిన్ రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ త్రిష- చిరు కలిసి విశ్వంభరలో నటిస్తున్న విషయం తెలిసిందే. -
బిగ్బాస్ 9లోకి కామన్ ఆడియన్స్ .. ఇలా రిజస్టర్ చేసుకోండి
బిగ్బాస్ 9 (Bigg Boss Season 9) నుంచి ఇప్పటికే ఒక వీడియోతో ప్రకటన వచ్చేసింది. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్గా మరోసారి అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ పేల్చేశారు. అయితే, తాజాగా 'కాల్ ఫర్ ఎంట్రీస్' పేరుతో మరో వీడియోను బిగ్బాస్ టీమ్ వదిలింది. గతంలో మాదిరి ఈసారి కామన్ ఆడియన్స్ను కంటెస్టెంట్స్గా తీసుకుంటామని వీడియోలో పేర్కొన్నారు.బిగ్బాస్ షోను ఎంతో ప్రేమిస్తున్న ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్గా హౌస్లోకి ఎంట్రీ ఉంటుందని, అది కూడా కంటెస్టెంట్స్గా వచ్చే ఛాన్స్ ఉందని నాగార్జున తెలిపారు. ఈ సీజన్లో సెలబ్రిటీస్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా బిగ్బాస్- 9లోకి వెళ్లొచ్చు. అందుకు మీరు చేయాల్సింది www.bb9.jiostar.comలో రిజస్టర్ కావడమే. ఆపై బిగ్బాస్లో పార్టిసిపేట్ కావడానికి కారణం చెబుతూ వీడియోను అప్లోడ్ చేయడమే అంటూ వివరాలు ప్రకటించారు. -
నాగార్జున రియల్ హీరో అంటూ సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడారు. తాజాగా ఆయన హైదరాబాద్లోని కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన పి.జనార్థన్రెడ్డి(పీజేఆర్) ఫ్లైఓవర్ను ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ నాగార్జున గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి సీఎం రేవంత్రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. 'ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జునే స్వయంగా వచ్చి రెండు ఎకరాల స్థలం ప్రభుత్వానికి అప్పజెప్పారు. నగర అభివృద్ధిలో హీరోగా ముందు ఉంటానని ఆయన అన్నారు. మంచి సంకల్పంతోనే ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారంటూ.. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వాలంటీర్గా ఆయన ముందుకు వచ్చారు' అని సీఎం అన్నారు.గతేడాది ఆగష్టు నెలలో మాదాపూర్లో ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్హాలును హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. నగరంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేతలకు చర్యలు చేపట్టింది. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని ప్రభుత్వం ప్రకటించింది. ఆపై ఆ చెరువు చుట్టూ ఉన్న పలు కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. -
బీర్ తాగుతూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్
నాని నటించిన జెర్సీ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది 'శ్రద్ధా శ్రీనాథ్'( Shraddha Srinath).. కొద్దిరోజుల క్రితం డాకు మహారాజ్ సినిమాలో కూడా ఆమె మెప్పించింది. అయితే, తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్పై హోమ్లీగా కనిపించిన ఆమె బికినీ షోతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది. ఆమె బీర్ తాగుతూ ఉందంటూ గుర్తించిన కొందరు ఆ ఫోటోను హైలెట్ చేస్తున్నారు.శ్రద్ధా శ్రీనాథ్ రీసెంట్గా మాల్దీవ్స్ వెకేషన్లో ఎంజాయ్ చేసింది. అక్కడ బికినీలో దిగిన ఫొటోలను తన సోషల్మీడియాలో పంచుకుంది. సినిమాల్లో ఎంతో పద్దతిగా కనిపించే శ్రద్ధా శ్రీనాథ్ ఇలా పబ్లిక్గా బీర్ తాగుతూ బికినీలో ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు అందరు ఆశ్చర్యపోతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో నటించిన ఈ బ్యూటీ త్వరలో హిందీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అందుకే ఆమె ఇలాంటి గ్లామర్ ట్రీట్ ఇస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతున్న కన్నప్ప చిత్రాన్ని తాజాగా చూసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే, ఇదే విషయాన్ని విష్ణు సోషల్మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ పంపిన మెసేజ్ను కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు.కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవీ ఇలా మెసేజ్ చేశారు. 'మొదటి నుంచి నాకు దేవుడు, భక్తి వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే, నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీని నాలుగుసార్లు చూశాను. కానీ, ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటి కన్నప్ప సినిమా విషయానికొస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావ్ అని చెప్పడం కరెక్ట్. ఆలయంమంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండితెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పడు నీ నటన అద్భుతం.. ఒక్కోసారి ఊపిరి తీసుకోనివ్వలేదే కూడా.. సినిమా క్లైమాక్స్లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన రెండు కళ్లను సమర్పించే సీన్లో నీ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ, నీ నటనతో నన్ను మార్చేశావ్.. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్ ఎప్పికటికీ మాస్టర్క్లాస్గా నిలుస్తోంది. సినిమా చివరి సీన్లో నీవు పలికించిన భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుతాయి. అప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.' అని విష్ణుకు వాట్సాప్లో ఆర్జీవీ మెస్సేజ్ చేశారు. తన సినిమాపై ఆర్జీవీ చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. 'రామూ గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నా. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలామంది ఈ ప్రాజెక్ట్పై ద్వేషాన్నే చూపారు. కానీ, నమ్మకంతో ముందుకు వెళ్లాను.' అని ఆయన అన్నారు.This text message is like a dream come true for the actor in me. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/cB4CEjcmGo— Vishnu Manchu (@iVishnuManchu) June 28, 2025 -
'త్రిష' మంచి మనసు.. ప్రముఖ ఆలయానికి ఏనుగు విరాళం
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ త్రిష మంచి మనసుతో పాటు తనలోని భక్తిని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే రోబో ఏనుగును ఆమె బహూకరించారు. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (పీఎఫ్సీఐ) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష పనిచేస్తున్న విషయం తెలిసిందే. వారి భాగస్వామ్యంతోనే ఆమె ఈ ఏనుగును అందించారు. సంప్రదాయ మంగళవాద్యాల మధ్య 'గజ' అనే ఏనుగును అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వాహకులు అధికారికంగా తెలిపారు.ఆలయంలో నిర్వహించే వేడుకల్లో గజరాజులూ భాగస్వాములవుతుంటాయి. ప్రాణమున్న మూగజీవులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చాలామందిలో ఒక వాదన ఉంది. కొన్ని సందర్భాల్లో వాటికి అసౌకర్యం కలిగినప్పుడు గందరగోళమూ సృష్టిస్తుంటాయి కూడా.. అప్పుడు భక్తులు ప్రమాదంలో కూడా చిక్కుకుంటారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకే ఇలా రోబో ఎనుగులు వచ్చేశాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో ఇలాంటి ఎనుగులు కనిపిస్తున్నాయి. తాజాగా త్రిష అందించిన ఏనుగు 11 అడుగుల పొడవుతోపాటు 800 కేజీల బరువుతో ఉన్నట్లు సంస్థ నిర్వాహుకులు తెలిపారు. ఈ రోబో ఏనుగును తయారు చేసేందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చయిందట. ఈ రోబో ఏనుగు అయిదుగురిని మోయగలదనీ, స్విచ్ సాయంతో దాని తొండాన్ని పైకి, కిందకు కదిలించవచ్చనీ చెబుతున్నారు. దేవుడి ఊరేగింపు సమయంలో కూడా ఈ ఏనుగును ఉపయోగించుకోవచ్చు. కేరళ రాష్ట్రం త్రిశూర్లోని శ్రీకృష్ణ దేవాలయంలో మొదటిసారి రోబో ఏనుగులను పరిచయం చేశారు. హీరోయిన్ ప్రియమణి విరాళంగా రెండు ఏనుగులను అందించారు. నిజమైన ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మెకానికల్ ఏనుగులు వచ్చేశాయని ఆలయ పూజారులు చెబుతున్నారు. -
అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్.. కన్నప్ప మూవీకి అదిరిపోయే రివ్యూ ఇచ్చిన మనోజ్
-
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్ -
తెలుగు సినిమా చేయలేదు కానీ తెలుగు స్పీచ్ అదరగొట్టింది.. ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
కోట్లు కొల్లగొడుతున్న కన్నప్ప.. డే1 కలెక్షన్స్ ఎంతంటే..?
-
ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్
విమర్శలు అందుకోని సెలబ్రిటీలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సినిమా రూపంలో వారు విమర్శలపాలవుతూనే ఉంటారు. హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కూడా అలా తిట్లు తినే ఇక్కడివరకు వచ్చిందట! ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. సుహాస్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తనను బాధపెట్టిన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది. ఇప్పటికీ బాగా గుర్తుకీర్తి మాట్లాడుతూ.. ప్రియదర్శన్ సర్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం(గీతాంజలి)తో కథానాయికగా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టాడు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రిదయర్శన్ను కూడా అలాగే తిట్టేవాడు.అంతదాకా తెచ్చుకోనుకానీ ఉప్పుకప్పురంబు డైరెక్టర్ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టేవరకు పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్లో బాగా నటిస్తాను. ఇంకో విషయమేంటంటే.. ఈ డైరెక్టర్ మంచి నటుడు కూడా! చాలామంది డైరెక్టర్లు చెప్తారంతే.. కానీ ఈయన ఎలా యాక్ట్ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. గీతాంజలి చిత్రంతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి, రంగ్దే, దసరా, సర్కారువారిపాట వంటి పలు చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ వాడే కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చింది.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
మైథలాజి మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా రెబల్
-
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్
కొందరు పెళ్లి పేరు ఎత్తితేనే పారిపోతుంటారు. అందులో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ముచ్చటే లేదు. ఈ ఏడాదే ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. డార్లింగ్ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో? ఏంటో? లక్కీ గర్ల్ అని అభిమానులు సరదాగా అనుకుంటూ ఉంటారు. పెళ్లంటే ముఖం చాటేస్తున్న హీరోఅయితే ఎవరెన్ని అనుకున్నా.. వయసు మీద పడుతున్నా సరే.. ప్రభాస్ మాత్రం పెళ్లంటేనే నాలుగడుగులు వెనకడుగు వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా.. లెక్క చేయడం లేదు. రియల్ లైఫ్లోనే కాదు రీల్ లైఫ్లో కూడా ఇదే జరిగింది. కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్. ఓ సీన్లో తిన్నడు(విష్ణు).. రుద్ర(ప్రభాస్)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతాడు. అందుకు రుద్ర.. నా పెళ్లి గురించి నీకెందుకులే.. అని కౌంటరిచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్లో చప్పట్లు, విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్ అభిమానుల అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోతోంది.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్, మోహన్లాల్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఆషాఢ సారె (ఫొటోలు)
-
హీరో సిద్దార్థ్ ‘3BHK’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
కన్నప్ప రిలీజ్.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన కన్నప్ప ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కన్నప్ప టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ చూసిన మంచు మనోజ్ తన రివ్యూ కూడా ఇచ్చేశారు. అన్న ఇంత బాగా చేస్తాడని ఊహించలేదని అన్నారు. అలాగే ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపించారు.అయితే తాజాగా మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కన్నప్ప మూవీపై పోస్ట్ చేసింది. శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ సందర్భంగా కన్నప్ప టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పిది. మీరంతా కన్నప్ప సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలంటూ అభిమానులను కోరింది. మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత మొదటిసారి మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న పాజిటివ్గా పోస్టులు చేయడంతో విష్ణు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ దివి.. డిఫరెంట్ లుక్లో హీరోయిన్ సమంత!
నెదర్లాండ్స్ వేకేషన్లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..పింక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు..బీచ్లో బిగ్బాస్ బ్యూటీ విష్ణుప్రియ చిల్..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్.. వెరైటీ డ్రెస్లో హీరోయిన్ సమంత లుక్స్.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
కల్కి చిత్రానికి ఏడాది.. సీక్వెల్పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత
గతేడాది సరిగ్గా ఈ రోజు విడుదలై బాక్సాఫీస్ సునామీ సృష్టించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మైథలాజికల్ సినిమా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూడో సినిమాగా నిలిచింది.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.అయితే ఈ మూవీ తర్వాత సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో కల్కి-2 అప్డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఇంకెప్పుడు మొదలవుతుందా? అని అప్డేట్స్ కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ సినిమా రిలీజైన సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో నిర్మాత అశ్వనీదత్ కల్కి-2పై అప్డేట్ ఇచ్చారు.ఈ ఏడాది సెప్టెంబర్లో కల్కి-2 షూటింగ్ మొదలు కానుందని నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. వచ్చే ఏడాది మే లేదా జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను కల్కి-2 కనువిందు చేయనుందని అశ్వనీదత్ అన్నారు.Celebrating 1️⃣ year of #Kalki2898AD with the most awaited update on #Kalki2! 🔥#1YearForKalki2898AD#1YearForKalkiKARNAge@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/kkycW3Gt8U— Telugu FilmNagar (@telugufilmnagar) June 27, 2025 -
విజయ్ ఆంటోనీ 'మార్గన్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్తో మెప్పించాడా?
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్' జూన్ 27న విడుదలైంది. చిత్రపరిశ్రమలో విజయ్ ఆటోనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరో మాత్రమే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఎడిటర్గా ఇలా మల్టీ టాలెంట్ను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథనగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు. కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..మార్గన్ కథ మనం గతంలో చూసిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలానే ఉంటుంది. అంతా ఒకే ఫార్మాట్లోనే సాగుతుంది. హత్యల చేస్తున్న వ్యక్తి అందరిముందు శ్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు. కానీ, అతనే హత్య చేశాడని చివరివరకు రివీల్ కాదు. ఇదే పంతాలో మార్గన్ స్టోరీ ఉంది. రమ్య హత్య ఎపిసోడ్తో కథలో ఎంతమేకు సీరియస్నెస్ ఉందో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. యువతి హత్య కేసును చేధించేందుకు వచ్చిన ధృవ వెంటనే అరవింద్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇంత సులువుగా ఇన్వెస్టిగేషన్ మొదలు అయిందా అనే ఫీలింగ్ వస్తుంది.రెగ్యులర్ ఫార్మాట్లో సాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాదని సినిమా ప్రమోషన్స్లో మేకర్స్ చెప్పారు. కానీ, సినిమా చూస్తే మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఇందులో ఎక్కువ టైం తీసుకోకుండా నేరుగా పాయింట్లోకి వెళ్లాడు. సోది అనేది లేకుండా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆడియెన్స్ అనుమాన పడేలా అరవింద్ క్యారెక్టర్ను చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు అందరూ కూడా అరవింద్ మీదే ఫోకస్ పెడతారు. అప్పటిదాకా నగరంలో జరిగిన హత్యలతో అరవింద్కు సంబంధం ఉన్నట్లు సినిమా చూసే వారికి అనిపిస్తుంది. మళ్లీ కాదేమో అనిపిస్తుంది. ఇలా ఇంటర్వెల్కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకీ ఇటు ప్రేక్షకులకూ ఓ స్పష్టత వచ్చేస్తుంది. అక్కడి నుంచి సెకండాఫ్ మరింత ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.సెకండాఫ్లో హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేగం అందుకుంటుంది. కానీ, కథలో వేగం తగ్గుతుంది. కానీ ఇలాంటి జానర్లో వచ్చే చిత్రాలకు ఓ ఫార్మూలా ఉంటుంది. ఎవరి మీద అయితే అనుమానపడతామో.. వాళ్లు అసలు హంతకులు కాదు. ఎవరిని అయితే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటామో వాళ్లే చివరకు షాకింగ్గా సర్ ప్రైజ్ ఇస్తారు. అలా ఇందులోనూ ట్విస్ట్ ఇస్తారు. దాదాపు హంతకులు ఎవరన్నది ఆడియెన్స్ ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ అంతా అరవింద్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇక సెకండాఫ్లో ఆ పాత్ర చేసే విన్యాసాలు, ఇన్వెస్టిగేషన్లో చేసే సహాయం బాగుంటుంది. క్లైమాక్స్ సమయంలో దర్శకుడు కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్ ఎవరన్నది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినా.. అతను అలా చేయడానికి కారణం ఏమంత కొత్తగా అనిపించదు. అయితే, రెండు గంటల సేపు ఎంగేజింగ్గా తీయడంతో జాన్ పాల్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం.ఎవరెలా చేశారంటే..'మార్గన్' సినిమాకు విజయ్ ఆంటోనీ ప్రధాన బలం. ఈ చిత్రానికి తెరపై, తెర వెనుక హీరో అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇలా అన్నింటినీ హ్యాండిల్ చేశారు. పోలీస్ పాత్రకు తగ్గట్లు సీరియస్గా ఒకే లుక్లో ఆయన కనిపించారు. ఆర్ఆర్ అయితే ఇంటెన్స్గా అనిపిస్తుంది. అజయ్ దిశాన్ పాత్ర కథకు చాలా కొత్తగా ఉంటుంది. సినిమా ఆరంభంలో సైకో కిల్లర్లా అదరగొట్టిన ఆయన సెకండాఫ్ వచ్చేసరికి సూపర్ హీరోలా అలరించాడు. తన యాక్టింగ్తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. ఇతను విలనా..? సపోర్టింగ్ యాక్టరా..? హీరోనా..? అన్న రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తాడు. బ్రిగిడ పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. వెన్నెల, మేఘ పాత్రధారి నటన బాగుంటుంది. మిగిలిన ఇతర పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు. ఓటీటీలో రెగ్యులర్గా ఇలాంటి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చూసే వాళ్లకి మార్గన్ గొప్ప చిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ మార్గన్ మూవీ ఆడియెన్స్ని నిరాశ పర్చకపోవచ్చు. దర్శకుడు కథను ముగించిన తీరు అందరికీ సంతృప్తినివ్వదని చెప్పవచ్చు. -
'అప్పటిదాకా కన్నప్ప ఓటీటీకి రాదు..' మంచు విష్ణు క్లారిటీ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే కన్నప్పకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్.. రుద్ర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే రిలీజ్ ముందు రోజు మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు కన్నప్ప గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ మూవీని ఓటీటీకి ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించగా.. ఆయన సమాధానామిచ్చారు. నా సినిమా 10 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని స్పష్టం చేశారు. రిలీజ్ విషయంలో నాపై ఒత్తిడి లేదని చెప్పారు. అందుకే కన్నప్పను పది వారాల తర్వాతే ఓటీటీకి తీసుకొస్తామని వెల్లడించారు. -
తొలిసారి మాస్ సాంగ్ పాడిన 'సుహాస్'
టాలీవుడ్ హీరో సుహాస్ తొలిసారి గాయకుడిగా మారాడు. తను నటిస్తున్న కొత్త సినిమా 'ఓ భామ అయ్యే రామ' కోసం అదిరిపోయే మాస్ సాంగ్ను ఆయన పాడారు. ఈ చిత్రంలో సుహాస్కు జోడిగా మాళవిక మనోజ్ నటించింది. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్లో హరీశ్ నల్లా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ దశలో ఉంది. జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
జూలై 18న 'వీడే మన వారసుడు' చిత్రం విడుదల
రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. ఈ సినిమాలో రమేష్ ఉప్పు (RSU) హీరోగా నటించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్కు కథ , స్క్రీన్ప్లే, మాటలు, పాటలు ,నిర్మాతతో పాటు దర్శకత్వం కూడా ఆయనే వ్యవహరించాడు. ఇందులో రమేష్ ఉప్పు (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ నటించారు. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపోందిన ఈ చిత్రానికీ శ్రీమతి యు.రమాదేవి సమర్పకురాలుగా వ్యవహారిస్తున్నారు. సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ ఉప్పు (RSU) మాట్లాడుతూ.. 'సమాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు, ప్రీమియర్ షో చూసిన పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించడంతో మా నమ్మకం మరింత పెరిగింది. మా శ్రమకు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బలంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని థియేటర్కు వెళ్లి చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.' అని చెప్పారు. ఈ నెల 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
వారియర్గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన
2018లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా సత్త చాటుతున్నారు. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలతో పాటు రీసెంట్గా 'కుబేర'తో బాక్సాఫీస్ వద్ద మెప్పించారు. కిల్లర్ లుక్స్తో ఇటు యూత్ ఐకాన్గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్గా ఆమె మారిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికర ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో 'మైసా' అనే సినిమాతో వస్తున్నట్లు ఒక పోస్టర్తో ప్రకటించారు. అందులో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. పాన్ ఇండియా రేంజ్లో రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాను గతంలో ఎప్పుడూ పోషించని పాత్రతో 'మైసా' కోసం చేస్తున్నట్లు రష్మిక చెప్పారు. అభిమానుల కోసం ఎప్పుడు కూడా కొత్తగా, భిన్నంగా ఉన్న పాత్రలే చేయాలనేది తన ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ మైసా పోస్టర్ను రష్మిక షేర్ చేశారు. ఇప్పటి వరకు రష్మికను శ్రీవల్లి, గీతాంజలిగా చూసిన ప్రేక్షకులు త్వరలో ఒక వారియర్గా ఆమెను చూడనున్నారు. భారీ బడ్జెట్తో ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరిన్ని విషయాలు త్వరలో ప్రకటించనున్నారు. -
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. శుక్రవారం (జూన్ 27న) కన్నప్ప చిత్రాన్ని విష్ణు సోదరుడు, హీరో మంచు మనోజ్ ప్రసాద్ ఐమాక్స్లో వీక్షించాడు. ఈ సందర్భంగా అతడు సినిమా బాగుందని మెచ్చుకున్నాడు. మనోజ్ మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ చూశాను. చాలా చాలా బాగుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్కు వెళ్తుంది. క్లైమాక్స్లో (విష్ణు) ఇంత గొప్ప పర్ఫామెన్స్ ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. వెయ్యి రెట్లు బాగుందిఅందరూ చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదానికంటే వెయ్యి రెట్లు బాగుంది. చిత్రయూనిట్ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని, మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. సినిమా ప్రారంభంలో ఐదు నిమిషాలు మిస్సయ్యాను. దానికోసం కన్నప్ప సినిమాను మరోసారి చూస్తాను అని మనోజ్ చెప్పుకొచ్చాడు.ప్రత్యేకంగా చెప్పాలా?కానీ అన్న పేరును మాత్రం ప్రస్తావించలేదు. మరో వీడియోలో మాత్రం 'చివరి 20 నిమిషాలైతే అదిరిపోయింది. అన్న (విష్ణు) కూడా ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. నాన్న (మోహన్బాబు) యాక్టింగ్ గరించి ప్రత్యేకంగా చెప్పాలా? అదరగొట్టాడు. సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. కన్నప్పకన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మహాభారతం సీరియల్ ఫేం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. మోహన్బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో షూటింగ్ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ నిర్మితమైంది. ప్రభాస్, మోహన్లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఈ సినిమా చేశారు.చదవండి: సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్ నటి -
నిహారిక కొణిదెల కొత్త మూవీ.. హీరోయిన్ దొరికేసింది
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో నటించిన సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) సోలో హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మానసా శర్మ దర్శకత్వం వహించనున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత నిహారిక కొణిదెల నిర్మించనున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ‘ఆయ్, క’ చిత్రాల ఫేమ్ నయన్ సారిక (Nayan Sarika)ను ఎంపిక చేసినట్లుగా మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘‘జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (ఇందులో సంగీత్ శోభన్ లీడ్ యాక్టర్) వెబ్ సిరీస్కి రచయితగా, ‘బెంచ్లైఫ్’ సిరీస్కి దర్శకురాలిగా చేసిన మానసా శర్మ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. The beautiful @UrsNayan joins the joyride that is #ProductionNo2!Excited for all the fun ahead with this amazing team ❤️😎#PEP2@IamNiharikak #SangeethShobhan #ManasaSharma @anudeepdev #MaheshUppala @manyam73 @beyondmediapres @Ticket_Factory pic.twitter.com/G7LwesEqHG— Pink Elephant Pictures (@PinkElephant_P) June 26, 2025 చదవండి: స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే? -
కన్నప్ప మూవీ ట్విట్టర్ రివ్యూ..
-
సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్ నటి..
గాయం, చిత్రం, నువ్వునేను, గులాబీ, కిక్.. ఇలా ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేశారు రసూల్ ఎల్లోర్. ఒకరికి ఒకరు, సంగమం, భగీరథ చిత్రాలను డైరెక్ట్ కూడా చేశారు. సినిమాల్లో పని చేస్తున్న సమయంలోనే నటి జాహ్నవితో పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. జాహ్నవి.. యజ్ఞం, హ్యాపీ చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్గా నటించారు.అల్లు అర్జున్ హ్యాపీ మూవీలో జాహ్నవిసినిమా సెట్లో పరిచయం..ఆమె సినిమాలు మానేయడం గురించి సినిమాటోగ్రాఫర్ రసూల్ స్పందించాడు. ఒకరికి ఒకరు సినిమా సెట్లో మేమిద్దరం కలిశాం. అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత తను సినిమాలు మానేసింది. అందుకు ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు. మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాకే తను సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ తను తల్చుకుంటే మంచి దర్శకురాలు కాగలదు అని చెప్పారు. రసూల్ సినిమాటోగ్రాఫర్గా.. ఫ్యామిలీ సర్కస్, లిటిల్ సోల్జర్స్, వాంటెడ్, జల్సా, ఊసరవెల్లి, ఏజెంట్, దేవకీ నందన వాసుదేవ.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు.యజ్ఞం సినిమాలో నటి జాహ్నవిచదవండి: స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే? -
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
‘‘మా కథకి ‘తమ్ముడు’ సరైన టైటిల్. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్కి అక్క పాత్ర చేశాను. నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు’’ అని నటి లయ (Actress Laya) తెలిపారు. నితిన్ హీరోగా రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ పంచుకున్న విశేషాలు.2023లో ఇండియాకు..వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ చానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసిన ‘తమ్ముడు’ మూవీ టీమ్ నుంచి జూన్లో నాకు ఫోన్ వచ్చింది. నటిస్తారా? అని అడిగితే ఓకే అన్నాను. ‘తమ్ముడు’ కథ ఓ లైన్గా చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో స్వీట్స్ బాగా తిని, 7 కిలోలు బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని బలంగా అనిపించి, నటించాను.ఉద్యోగం మానేశా‘తమ్ముడు’ సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు... అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. నా క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి. అమెరికాలోనే కాదు హైదరాబాద్లోనూ..కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నాను. నేను అమెరికా నటిని కాదు... పక్కా హైదరాబాద్ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది. హైదరాబాద్లోనూ ఉంది. నాకోసం ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్ టికెట్స్, స్టార్ హోటల్స్లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోని నా ఇంట్లో ఉంటాను. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న ఓ సినిమా తుది దశకు వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను.చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
మురుగ పుస్తకంతో జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపై కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలోనే కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘వార్ 2’ సినిమా వర్క్స్లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ (కార్తికేయుడు) పుస్తకం కనిపించింది.అందుకోసమే ఈ ప్రిపరేషన్దీంతో త్రివిక్రమ్తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ సినిమాను కల్యాణ్రామ్, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ‘దేవర 2’ కమిట్ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
బిగ్ బాస్ 9 ప్రోమో రిలీజ్
-
సందడే సందడి
భాగ్యనగరంలో భలే జోరుగా షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోస్. సందడి సందడిగా ఈ షూటింగ్స్ జరుగుతున్నాయి. మరి... హైదరాబాద్లో ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసుకుందాం.షామిర్పేటలో... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన చిరంజీవి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక పాట మినహా ‘విశ్వంభర’ సినిమా పూర్తి చేశారు చిరంజీవి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని షామిర్పేటలో శరవేగంగా జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ ఉంటుందని, జూలై 1 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందనీ తెలిసింది. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. ‘మెగా 157’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అఖండ తాండవం హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వారి కాంబినేషన్లో రూపొందుతోన్న నాలుగో చిత్రమిది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్కి సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ఆయన కథానాయకుడిగా ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నారట హను రాఘవపూడి. ‘సీతారామం’ వంటి హిట్ మూవీ తర్వాత ఏడాదికిపైగా సమయం తీసుకుని ‘ఫౌజి’ కథను తీర్చిదిద్దారు దర్శకుడు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్ యువరాణి పాత్ర చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆటా పాటా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో భాగంగా ఎన్టీఆర్పై ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అయితే ఇది రెగ్యులర్ సాంగ్ కాదని, దేశభక్తి నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా 2026 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్పల్లిలో... హీరో మహేశ్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదని... నెగటివ్ క్యారెక్టర్ అని టాక్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలోని ఓ స్టూడి యోలో జరుగుతోంది. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారట. ప్రస్తుతం మహేశ్బాబు, ఇతర నటీనటులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేశ్ సరికొత్త లుక్లోకి మారిపోయారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్నగర్ టాక్. మొయినాబాద్లో... హీరో రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ‘ఆర్టీ 76’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్కి సమీపంలోని మొయినాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.రవితేజతో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్ మిస్ అవకుండా కథను సిద్ధం చేశారు కిశోర్ తిరుమల. ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ మహేశ్బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ర్యాపో 22’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ గబ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్గా డే అండ్ నైట్ షూటింగ్ చేసిన అనంతరం తర్వాతి షెడ్యూల్ని హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు యూనిట్. ముచ్చింతల్లో... ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ఫ్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. నానితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు నాని. ‘ది ఫ్యారడైజ్’ నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఇప్పటికే విడుదలైన ఓ గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ కానుంది. తుక్కుగూడలో... ‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్తో పాటు ప్రముఖ తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. గండిపేటలో... ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.ప్రత్యేకంగా వేసిన సెట్లో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మనసును హత్తుకునే స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.శంషాబాద్లో... ‘జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాల ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్లో జరుగుతోంది. నవీన్ పొలిశెట్టితో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రముఖ స్టూడియోలో...‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. మనోజ్ మంచు, జగపతి బాబు, శ్రియ శరణ్, జయరామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. టీమ్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని సమాచారం. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్గా నిలవనున్నాయి. ‘మిరాయ్’ 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.పై సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
న్యూజిలాండ్లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.న్యూజిలాండ్లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీరేమంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి మంచు విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీకు ఓ వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా..భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా నటించారు.న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నారా? Vishnu Manchu Reaction 🤣 pic.twitter.com/EfEJ1BugO6— Rajesh Manne (@rajeshmanne1) June 26, 2025 -
ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషికి టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్రాజు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలాగే మనం కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారిపై నిషేధం విధించేలా సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై.. ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై.. ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై.. గోపిచంద్ చెప్పినట్లు ఆ హై వేరు.. మనల్ని మనమే రక్షించుకుందాం.. డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు.. మన సోసైటీ మనమే క్లీన్ చేసుకుందాం. గతంలో కొన్ని స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. ఒక విజయవంతమైన సినిమా చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్, సమాజం బాగుచేసుకుందాం. ఈ విషయంలో పోలీస్శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్ను నిర్మూలిద్దాం' అని పిలుపునిచ్చారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ట్రై చేయిరా అనే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి అటువైపు వెళ్తే ఇక బయటపడటం కష్టం. ఎవరైనా మనకు అలాంటి వాళ్లు కనపడితే వారికి దూరగా ఉందాం. జిమ్లో మంచి వర్కవుట్ చేస్తే మంచిగా అనిపిస్తది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక హై వస్తది. డబ్బులు ఇంకొకరికి ఇచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేసి సక్సెస్ అందుకున్నప్పుడు ఒక హై వస్తది. ఛేజ్ ది సక్సెస్ ... డ్రగ్స్ వంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పేరేంట్స్ గర్వపడతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తది. అందుకే మన డ్రగ్స్కి దూరంగా ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని అన్నారు.Getting Successful in filmsPlaying a Game after our workSpending quality time with FamilyGives you high that you can't get from anywhere.- #RamCharan Message to Youthpic.twitter.com/rjDHweFOfQ— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 26, 2025 -
వెండితెరపైకి దశావతారాలు.. ఏ సినిమా ఎప్పుడంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ యూనివర్స్లో భాగంగా రానున్న తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో జూలై 25న రిలీజ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రోర్ ఆఫ్ నరసింహ...’ పాటను రిలీజ్ చేశారు. సామ్ సీఎస్, రాకేందు మౌళి సాహిత్యం అందించి, పాడారు. ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇది కేవలం సినిమా కాదు... ఆధ్యాత్మిక అనుభూతి’’ అన్నారు. ‘‘ఇప్పుడు మన కథలు వెండితెరపై అలరించబోతున్నాయి. ఇదో అద్భుతమైన సినిమా ప్రయాణం’’ అని శిల్పా ధవాన్ తెలిపారు. ఇదిలా ఉంటే... ఎంసీయూ దశావతారాలను తెరపైకి తీసుకొస్తుంది. 2025లో నరసింహ, 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. చదవండి: విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్ ఇవ్వడంతో..: -
పురివిప్పిన ‘నెమలి' అందం.. కన్నప్ప బ్యూటీ బ్యాక్గ్రౌండ్ ఇదే (ఫోటోలు)
-
లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా రాణించింది లయ (Actress Laya Gorty). శివరామరాజు, నీ ప్రేమకై, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా.. ఇలా బోలెడు సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. కొన్నేండ్ల క్రితమే సినిమాలకు గుడ్బై చెప్పి అమెరికాలో సెటిలైన లయ తమ్ముడు చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.తమ్ముడుతో రీఎంట్రీనితిన్ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు సినిమాలో లయ అక్కగా నటించింది. వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్ కీలక పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు లయ సినిమాలకు దూరంగా ఉందే కుటుంబం కోసం! అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంది. సరైన సమయం వచ్చేదాకా ఆగి ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయింది. తాజాగా లయ ఇంట గ్రాండ్ ఫంక్షన్ జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్గా శ్లోక..ఆమె కూతురు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను లయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే మై శ్లోక ప్రిన్సెస్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా లిటిల్ సన్షైన్కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు లయ కూతురికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. శ్లోక.. అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. అఖండ 2లోనూ శ్లోక భాగమైనట్లు ఆమధ్య ఓ రూమర్ తెగ వైరలయింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
400 కోట్ల క్లబ్ లో ధనుష్
-
నిహారిక విడాకులు.. తప్పు మాదే..
-
నా ఎలిమినేషన్లో జరిగిందిదే.. వీడియో రిలీజ్ చేసిన ప్రవస్తి
-
కన్నప్పలో సైడ్కి నిలబడే పాత్ర.. మోహన్బాబు అడిగితే..
‘‘కన్నప్ప’ చిత్రంలో మహదేవశాస్త్రి (మోహన్బాబు పాత్ర) కొడుకుగా యాక్ట్ చేయమని మోహన్బాబుగారు అన్నప్పుడు ఆలోచించాను. మరీ సైడ్కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణుని అడిగితే, ‘నీ ఇష్టం’ అన్నారు. మా ఆవిడ మధుమిత కూడా అలానే అన్నారు. ఫైనల్గా ఒప్పుకున్నాను. అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయ్యేవాణ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది’’ అని శివ బాలాజీ అన్నారు. విష్ణు మంచు హీరోగా ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, ఓ గొప్ప చిత్రం, పాన్ ఇండియన్ సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నేను చేసిన ‘రెక్కీ’ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘రెక్కీ 2’ త్వరలోనే రానుంది. ప్రస్తుతం ‘సిందూరం’ అనే చిత్రం చేశాను. అలాగే మోహన్బాబుగారి ప్రొడక్షన్లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
‘నేను రెడీ‘ అంటోన్న హవీష్ (ఫొటోలు)
-
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగాలో తనను బాడీ షేమింగ్ చేశారని, పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్ ప్రవస్తి. తన ఎలిమినేషన్ ఎపిసోడ్కి సునీత తప్ప ఎవరూ లేరంది. కానీ, రీసెంట్గా ఆ ఎలిమినేషన్కు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవగా.. అందులో ముగ్గురు జడ్జిలు (సునీత, చంద్రబోస్, కీరవాణి) చప్పట్లు కొడుతూ కనిపించారు.ఇంత అనైతికంగా..దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను. కానీ నిన్నటి ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక స్పందించాల్సి వస్తోంది. ఆ ఎపిసోడ్ చూసి చాలా షాకయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్లు చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకోలేదు. ఎడిట్ చేస్తారని తెలుసు. ఎలాగంటే అక్కడక్కడా ముక్కలు అతికిస్తారనుకున్నా.. కానీ, ఇంత అన్ప్రొఫెషనల్గా చేస్తారని మాత్రం ఊహించలేదు.మోసం చేయొచ్చనిమీరే చాలామంది రియలైజ్ అయి నాకు మెసేజ్లు చేస్తున్నారు. మిగిలిన ఎలిమినేషన్స్తో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు. మీరు చెప్పేది నిజమే.. చాలా ఎడిట్ చేశారు. జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం. అదే నాకు ఎంతో బాధనిపించింది. నా ఎలిమినేషన్ అప్పుడు సునీత మేడమ్ తప్ప మిగతా జడ్జిలు లేరని చెప్పాను. చంద్రబోస్ సర్ లేనే లేరు. కీరవాణి సార్.. నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు. అది ఎడిటింగ్లో లేపేశారు.ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో..కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారు. అది ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలీదు. ఎలిమినేషన్లో చప్పట్లు కొట్టే సీన్ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. చివరి రౌండ్లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు ఎలిమినేట్ చేశారు? అనేది చూపించలేదు. నేనైతే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ఎలిమినేట్ అవడమే బెటర్ఎందుకంటే, ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో ఉండటం అనవసరం అనిపించింది. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్ అవడమే బెటర్ అనుకున్నాను. అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను. వాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆరోజే నిర్ణయించుకున్నాను. అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చిరునవ్వు ఉంది. నేను మిస్టేక్స్ చేయలేదు. ద్వేషం లేదుసేవ్ అయినవాళ్లను చూస్తే తప్పులు చేసినా కూడా సేవ్ అయ్యాం అని గిల్ట్ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై నాకెలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను. విన్నర్ అయినా కూడా వారికి ఆ సంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు. వాళ్లకు నచ్చినవారే గెలుస్తారు అని చెప్పుకొచ్చింది. చదవండి: క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్! -
మిత్రా శర్మ ‘వర్జిన్ బాయ్స్’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ అశ్విని శ్రీ.. ట్రెడిషనల్ లుక్లో వితికా షేరు!
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ బ్యూటీ అశ్విని శ్రీ చిల్..వరుణ్ సందేశ్ వైఫ్ వితికా శేరు ట్రెడిషనల్ లుక్..బ్లాక్ డ్రెస్లో భూమిక చావ్లా పోజులు..మూవీ షూట్లో బిజీ బిజీగా రాశి ఖన్నా.. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ టాలీవుడ్ బీజీఎం కింగ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు ఓ రేంజ్లో తన టాలెంట్ బయటపెడతారు. అయితే తమన్లో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. క్రికెట్లోనూ మనోడు అదరగొట్టేస్తాడు. సీసీఎల్ లీగ్లో తెలుగు వారియర్స్ టీమ్లో కీలక ప్లేయర్ కూడా. అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ తమన్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. షార్ట్కి, స్లాట్కి తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అని అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇది చూసిన తమన్ తనదైన శైలిలోనే ఇచ్చిపడేశాడు. ఓకే రా.. వచ్చి నేర్చుకుంటా.. అడ్రస్ పంపు బే.. అంటూ అదే స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అంటూ చాలామంది పోస్టులు పెట్టారు. అనవసరంగా నువ్వే తెలియకుండా కామెంట్ చేశావంటూ అతనికి ఇచ్చి పడేస్తున్నారు. Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7— thaman S (@MusicThaman) June 25, 2025 Don’t bowl short bro 🤪🔥💥 !! pic.twitter.com/sIUMcd2iaY— thaman S (@MusicThaman) June 24, 2025 -
కన్నప్పకు చిక్కులు! మంచు విష్ణు ఆఫీస్లో జీఎస్టీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కన్నప్ప చిత్రయూనిట్కు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు జీఎస్టీ అధికారులు సోదాలకు దిగారు. మంచు విష్ణు (Vishnu Manchu)తో పాటు పలువురి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. కన్నప్ప బడ్జెట్ను విష్ణు ఎన్నడూ బయటపెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో రూ.100 కోట్లా? రూ.200 కోట్లా? అని అడిగినప్పుడు కూడా చెప్పేందుకు నిరాకరించాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీసుకు వస్తారని, ఎందుకీ గొడవ అని సమాధానం దాటవేశారు. చివరకు సినిమా రిలీజ్కు ముందే అధికారులు మంచు విష్ణు కార్యాలయంలో సోదాలకు దిగారు.చదవండి: వంద కోట్ల క్లబ్లో 'కుబేర' -
వంద కోట్ల క్లబ్లో 'కుబేర'
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేర (Kuberaa Movie). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తాజాగా కుంభస్థలాన్ని కొట్టేసింది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని కుబేర చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.కుబేర కథదీపక్ (నాగార్జున) నిజాయితీ గల సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. ఆయనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ.50 వేల కోట్లను బ్లాక్లో పంపించాలి. దానికోసం దీపక్.. నలుగురు భిక్షగాళ్లను తీసుకొచ్చి వాళ్ల పేరు మీద చెరో రూ.10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జత చేస్తాడు. ఆ తర్వాత నలుగురిలో ఒకరైన యాచకుడు దేవా (ధనుష్) తప్పించుకుని పారిపోతాడు. దేవా ఎందుకు తప్పించుకున్నాడు? దేవాను నీరజ్ గ్యాంగ్ పట్టుకుంటుందా? లక్ష కోట్లు చేతులు మారాయా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే! Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025 -
తను లేకపోతే ఫీలవుతుందని డైరెక్టర్ చెప్పారు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కన్నప్ప. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చేశాయి. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.అంతేకాకుండా ఈ మూవీలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటించారు. ఇటీవల అతని షూటింగ్కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విష్ణు కుమార్తెలిద్దరు అరియానా- వివియానా సైతం ప్రత్యేక భక్తి పాటలో మెరిశారు. దీంతో ఈ మూవీలో మంచు విష్ణు ఫ్యామిలీ అంతా కనిపించనుంది. అయితే మంచు విష్ణుకు మరో కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మంచు విష్ణు ముగ్గురు పిల్లలు నటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తన చిన్న కుమార్తె గురించి మాట్లాడారు. తాను కూడా ఈ సినిమాలో ఉందని తెలిపారు. చిన్నపాపను కూడా ఓ సీన్లో పెట్టేశామని అన్నారు. అవ్రామ్ నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తాడని వివరించారు. నా చిన్న కూతురిని ఓ సీన్లో పెట్టమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. లేకపోతే పెద్దయ్యాక తను ఫీలవుతుందని చెప్పారు. ఎక్కడైనా చిన్నపిల్లల సీన్లో ఛాన్స్ ఉంటే పెట్టేయండి అని చెప్పానని..తను డైలాగ్ కూడా చెప్పిందని మంచు విష్ణు తెలిపారు. దీంతో మొత్తంగా విష్ణు నలుగురు పిల్లలు కన్నప్పలో కనిపించనున్నారు. -
చిరు, వెంకటేష్ మల్టీస్టారర్ ఫిక్స్..!
-
నవీన్ చంద్ర ‘షో టైమ్’ మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన.. ఈ చిత్రంతో పాన్ వరల్డ్లోనూ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఎవరూ ఊహించని పనిచేసి జక్కన్న వార్తల్లో నిలిచాడు. ఓ జపనీస్ వీడియో గేమ్లో కనిపించి భారతీయ నటీనటులు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంతకీ ఏంటా గేమ్? అసలేం జరిగింది?'ఆర్ఆర్ఆర్' సినిమాని గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసిన రాజమౌళి.. ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జపాన్లోనూ రిలీజ్ చేయగా అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాని అప్పట్లో రాజమౌళి కలవడం చర్చనీయాంశమైంది. మహేశ్ సినిమా కోసం ఈయనతో కలిసి పనిచేయబోతున్నాడా అని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ కాదని ఇప్పుడు తేలిపోయింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా)కోజిమా సృష్టించిన 'డెత్ స్టాండింగ్ 2' వీడియో గేమ్లో రాజమౌళితో పాటు ఆయన కొడుకు కార్తికేయ కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లని పాన్ ఇండియా స్టార్స్ని చేసిన జక్కన్న.. ఇప్పుడు ఇంటర్నేషనల్ వీడియో గేమ్ కనిపించి తానే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. వీడియో గేమ్లో కనిపించిన భారతీయ తొలి సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.మహేశ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ జరిగింది. కొన్ని సీన్స్ కోసం త్వరలో కెన్యా వెళ్లి రానున్నారని తెలుస్తోంది. అలానే రూ.50 కోట్లు ఖర్చు పెట్టి.. హైదరాబాద్లోనే వారణాసి సెట్ వేశారని, ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే గానీ మహేశ్ సినిమా మొదలైన తర్వాత ఇప్పటివరకు రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు చెబుతాడో ఏంట?(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)#DeathStranding2 video game featuring SSR! 👍pic.twitter.com/HsdS4wZh0N— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025 -
జై శివనాయకీ...
‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమకారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని....’ అంటూ సాగుతుంది ‘తమ్ముడు’ సినిమాలోని ‘జై బగళాముఖీ’ పాట. నితిన్ హీరోగా నటించిన చిత్రం ఇది. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.ఈ సినిమాలోని ‘జై బగళాముఖీ...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘‘కొండ కోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారీ... గుండె గుండెలో అఖండ జ్యోతిగ వెలుగుచుండు ఓంకారి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీతదర్శకుడు అజనీష్ లోకనాథ్ నేతృత్వంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించిన ఈ పాటను వి. అబ్బి ఆలపించారు. ‘‘శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారి మహిమను కీర్తిస్తూ సిని మాలో జరుపుకునే గ్రామ జాతర సందర్భంగా ఈ పాట వస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
కన్నప్పలో ప్రభాస్ రోల్.. ఎంతసేపు కనిపిస్తారంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న కన్నప్ప రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి తెలుగు ఆడియన్స్కు కూడా బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పాత్రలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి కేవలం పది రోజులు మాత్రమే కాల్ షీట్స్ తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తారని చెప్పారు. ఈ ముగ్గురి షూట్ కోసం సెట్ మొత్తం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తి చేశామని వెల్లడించారు.సెన్సార్ పూర్తితాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్టైమ్ దాదాపు 182 నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్టైమ్ కాస్తా ఎక్కువగానే వచ్చింది. దాదాపు 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. ఈ మేరకు సీబీఎఫ్సీ నిబంధనల ప్రకారం చిత్రంలో మార్పులు చేశారు. -
కన్నప్ప సెన్సార్.. 12 కట్స్.. రన్ టైమ్ ఎంతంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న కన్నప్ప రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్టైమ్ దాదాపు 182 నిమిషాలు కాగా.. అంటే మూడు గంటల రెండు నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్టైమ్ కాస్తా ఎక్కువగానే ఉంది. 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. సీబీఎఫ్సీ నిబంధనల ప్రకారం చిత్రం మార్పులకు అంగీకరించింది. రాబందు ఓ చిన్నారిని పై నుంచి పడేయటం.. తిన్నడుకు సంబంధించిన కొన్ని సీన్స్, మూడు పాటల్లోని విజువల్స్ను తొలగించారు.మరోవైపు కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి మొదలవుతాయని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. తెలుగు అభిమానులకు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని విష్ణు వెల్లడించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా తర్వాత దాదాపు 50 ఏళ్లకు మరోసారి కన్నప్ప కథ రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. #Kannappa Advance bookings open in Telugu tomorrow, 25th June 🙏🔥! #HarHarMahadev— Vishnu Manchu (@iVishnuManchu) June 24, 2025 -
జూనియర్ ఎన్టీఆర్కు పెద్ద అభిమానిని: పొలిమేర హీరోయిన్
పొలిమేర సినిమాలతో ఆడియన్స్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఆమె షో టైమ్ అనే మూవీలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది.తాను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానినని కామాక్షి భాస్కర్ల అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్గా అరవింద సమేత సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లి.. నవీన్ చంద్ర అభిమానిగా బయటికొచ్చానని తెలిపింది. పొలిమేర-2 చూసిన తర్వాత నవీన్ చంద్ర వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.. ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్కు నా ధన్యవాదాలు.. మా సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆడియన్స్కు విజ్ఞప్తి చేసింది కామాక్షి భాస్కర్ల. -
డబ్బులు పంపిస్తామని యూపీఐ నంబర్ అడిగారు: నవీన్ చంద్ర
టాలీవుడ్ నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే బ్లైండ్ స్పాట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ చంద్ర.. షో టైమ్ అంటూ మరోసారి రెడీ అయిపోయారు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నవీన్.. అలాంటి కథతోనే మన ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూన్ 13న తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిపారు. ఆ రోజు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజని అన్నారు. ఎక్కడో బళ్లారి నుంచి మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపారు. నా కెరీర్లో సక్కెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా ఇండస్ట్రీలోనే ఉంటానని అన్నారు.చాలామంది మీ సినిమాలు థియేటర్లలో మిస్సయ్యాం.. మీ నిర్మాత యూపీఐ నెంబర్ పెట్టమని చాలామంది అడిగారని వెల్లడించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అంటూ నవీన్ చంద్ర మాట్లాడారు. షో టైమ్ మూవీని థియేటర్లకు వచ్చి చూడండి.. మిమ్మల్ని డిస్సపాయింట్ చేయదు అంటూ ఆడియన్స్కు రిక్వెస్ట్ చేశారు నవీన్ చంద్ర. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
'మల్లేశం' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ.. తర్వాత హిందీలో ఒకటి చేశారు. రీసెంట్గా '23' అనే తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?అంతా కొత్త నటీనటులతో తీసిన '23' సినిమా.. మే 16 థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రెగ్యులర్ మూవీ కాకపోవడంతో ఇది జనాల దృష్టిలో పడకుండానే బిగ్ స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం 23 చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. త్వరలో మన దగ్గర కూడా స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!)23 విషయానికొస్తే.. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ.చిలకలూరిపేట బస్సు దహనం సంఘటనతో పాటు 1991 చుండూరు మారణకాండ, 1997లో జూబ్లీహిల్స్ కారు బాంబు ఘటనని కూడా సినిమాలో చూపించారు. హంతకులకి శిక్ష పడటమే న్యాయమైతే, అందరు హంతకులూ ఉరికంబం ఎక్కుతున్నారా? అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రియలస్టిక్గా ఉండే చిత్రం చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
హైదరాబాద్ : కొత్తపేటలో సందడి చేసిన బ్యూటీ క్వీన్ మనసా వారణాసి (ఫోటోలు)
-
డ్రాగన్ దేశభక్తి
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలో జరిగింది. లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్పై ప్రస్తుతం ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ సాంగ్ స్క్రీన్ పై విజువల్గా అద్భుతంగా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే ఈ పాట రెగ్యులర్ సాంగ్ కాదని, దేశభక్తిని గుర్తుచేసేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. -
8 వసంతాలు సీన్స్పై తీవ్ర అభ్యంతరం.. స్పందించిన దర్శకుడు!
ఇటీవల విడుదలైన లేడీ ఓరియంటెడ్ చిత్రం 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ ప్రేమకథా చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లలో ఆదరణ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఈ మూవీలో రెండు సీన్స్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన కాశీలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా అని డైరెక్టర్ను ప్రశ్నించారు. అయితే ఈ సమావేశానికి దర్శకుడు హాజరు కాలేదు.ఈ ప్రశ్నకు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్రాహ్మణ వర్గం పట్ల తనకు అమితమైన గౌరవముందని తెలిపారు. సనాతన ధర్మానికి, వేదాధ్యాయనానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారని.. వారి నాలుకపైనే సరస్వతి కొలువై ఉంటుందని దర్శకుడు తన పోస్ట్లో రాసుకొచ్చారు. కేవలం ఒక వర్గంపైనే ముద్రవేస్తూ అత్యాచారం గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదన్నారు.ఫణీంద్ర తన ఇన్స్టాలో రాస్తూ.. 'నేరం చేసేవాళ్లు వారి విచక్షణా స్వభావంతోనే చేస్తారు.. కానీ వారి కులం, మతం ఆధారంగా చేయరు.. సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారని నేను చూపించే ప్రయత్నం చేశా. కేవలం ఒక వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు. కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నా. మీరు ఇదే విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి , మెడలో రుద్రాక్షలు ధరిస్తాడు. ఆయనలో మారింది ఏంటి? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను చదివి చివరకు ఏం చేశాడు? మనిషి తన ప్రవర్తన, ఆలోచనా ధోరణి బట్టే నేరం చేస్తాడు. అంతేకానీ, అతని మతం, కులం అందుకు కారణం కాదు. అది మానవ నైజం. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఈ సినిమాలో కలపకండి. వేదికపై పంతులు అనకుండా ఉండాల్సింది. మీరు దాన్ని సరిచేయటంలో తప్పులేదు. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది మా టీమ్ ఉద్దేశం కాదు. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. -
బీచ్లో కాజల్ అగర్వాల్ .. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్!
బీచ్లో ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్..పట్టాయాలో చిల్ అవుతోన్న రోహిణి..హీరోయిన్ నభా నటేశ్ గ్లామరస్ లుక్స్..జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్..మదర్తో మన్మధుడు హీరోయిన్ అన్షు చిల్.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
ఎమోషనల్ ఎంటర్టైనర్.. బండి సంజయ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్!
హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం హ్యాపీ జర్నీ. ఈ సినిమకాు చైతన్య కొండా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై గంగాధర్ పెద్ద కొండ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఎమోషనల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు చైతన్య కొండ, నిర్మాత గంగాధర్ పెద్ద కొండ, కెమెరామెన్ అరుణ్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.."ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన ఈ డైరెక్టర్ను అభినందిస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యతల మీద స్పృహ ఉన్న డైరెక్టర్. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ, తెలుగు భాషలలో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను ఎంతవరకైనా సహకరిస్తా. 'అని అన్నారు. కాగా.. ఈ సినిమాకు చైతన్య రాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, వి6 సత్య, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషించారు. -
బాక్సాఫీస్ వద్ద కుబేర.. వరల్డ్ వైడ్గా ఏకంగా 9వ స్థానం!
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తందా మూడు రోజుల్లోనే రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్ట్స్ మూవీని అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో కుబేర మూవీ రూ.48.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 57 గ్రాస్ కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.23 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఓవరాల్గా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ రూ.88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రధాన పాత్ర పోషించారు.మరోవైపు అదే రోజు విడుదలైన ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా రూ.88 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలపరంగా చూస్తే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 ఇయర్స్ లేటర్, ఎలియో వంటి చిత్రాలు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి. బాలేరినా మూవీ సితారే జమీన్ పర్కు కాస్తా దగ్గరగా ఉంది. -
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. ఈ మూవీకి విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ధనుశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాగార్జున ఎవరి కాళ్లకు దండ పెట్టడు.. ఒక్క ఆయనకు తప్పా.. అని అన్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయన మీ నాన్నగారి( సునీల్ నారంగ్ తండ్రి నారాయణ్దాస్ నారంగ్) కాళ్లకు తప్పా. నాకు ఆయన అంతే ఇష్టం. ఆయన గౌరవాన్ని నిలబెడుతూ మీరిద్దరు కూడా వెళ్లడం చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా థర్డ్ జనరేషన్ జాన్వీ కూడా అదే బాటలో వెళ్తోంది. మళ్లీ మాతో సినిమా చేయొచ్చు కదా అని సునీల్ నారంగ్ నాతో అన్నారు. మా నాన్నగారు మీ సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించాం. కానీ ఆ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత మీకు సినిమాలు రాకుండా పోయాయి కదా (నవ్వుతూ). ఇక మీ మూడో తరం నిర్మాత జాన్వీకి ఆల్ ది బెస్ట్. ఇక జాన్వీతో కూడా సినిమా చేస్తే మూడు జనరేషన్స్తో చేసినట్లవుతుందని' చిరంజీవి అన్నారు. -
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది -
బాలయ్య మూవీపై మంచు విష్ణు కన్ను
-
ఇండస్ట్రీ మొత్తం చిరంజీవిని ఎందుకు లవ్ చేస్తుందంటే..!
-
ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. #SitaareZameenPar …Shines so bright and how…..It’ll make you laugh, cry and clap!! Like all Aamir Khan’s classics, you’ll walk out with a big smile on your face… Love and Respect..♥️♥️♥️#AamirKhan @geneliad @r_s_prasanna @AKPPL_Official @ShankarEhsanLoy #AmitabhBhattacharya…— Mahesh Babu (@urstrulyMahesh) June 22, 2025 చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్స్టార్ మహేశ్బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ -
పర్సనల్ విషయాల్లో తలదూర్చాడు.. వార్నింగ్ ఇచ్చా: నటి
నటి అష్మిత (Ashmita karnani).. ఇటు బుల్లితెర, అటు వెండితెరపైనా రాణించింది. బాబీ, వర్షం, మధుమాసం, మురారి, ఓం నమో వెంకటేశాయ, కాటమరాయుడు, అతిథి.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై చంద్రముఖి, ముద్దు బిడ్డ, ఆకాశగంగ, శ్రావణ సమీరాలు, మనసు మమత, అగ్నిసాక్షి, మధుమాసం వంటి సీరియల్స్ చేసింది. చాలాకాలం కిందటే నటనకు గుడ్బై చెప్పేసి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ వస్తోంది. ఇటీవల యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.నన్నే చూస్తూ..నా అసిస్టెంట్ ఊరెళ్లినప్పుడు మరో వ్యక్తిని అతడి స్థానంలో పెట్టి వెళ్లాడు. అతడు సిన్సియర్గానే ఉండేవాడు. కానీ రానురానూ తనకు నాపై పొజెసివ్నెస్ మొదలైంది. ఎప్పుడూ నాకు ఎదురుగా నిలబడి నన్నే చూస్తూ ఉండేవాడు. ఓసారి అతడిని ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పాను. సెట్లో మేము ఏది తెచ్చుకున్నా అందరం పంచుకునేవాళ్లం. అలా ఆ ఫ్రూట్స్ను అందరితో షేర్ చేసుకున్నాను. అది చూసి ఫ్రస్టేట్ అయిపోయేవాడు. ఒకరోజు కోపంతో పిలిచి.. మేడమ్, నేను మీకోసం పండ్లు తీసుకొస్తే వాళ్లకిస్తున్నారేంటి? అని నిలదీశాడు. జోక్యం చేసుకోవద్దని వార్నింగ్నీ పని నువ్వు చూసుకో.. నేను వాళ్లకిస్తా, వాళ్లు నాకిస్తారు. మధ్యలో నీకేంటి సమస్య? అని తిట్టాను. మరో రోజు ఓ నటి మిస్డ్ కాల్ ఉంటే.. ఫోన్ చేయబోయాను. ఇంతలో అతడు.. ఆమెకు ఫోన్ చేయొద్దు, ఆమె నన్ను ఏంట్రా?.. అని పిలుస్తుందని అభ్యంతరం చెప్పాడు. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మళ్లీ వార్నింగ్ ఇచ్చాను. మరో రోజు నా ఫ్రెండ్తో చాలాసార్లు ఫోన్ మాట్లాడాను. అది గమనించిన అతడు నా ఫోన్లో నెంబర్ తీసుకుని ఫోన్బూత్లో నుంచి కాల్ చేశాడు. మీరెవరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అని ప్రశ్నించాడు. పనిలో నుంచి తీసేశాఆ తర్వాత షూటింగ్ లేకపోయినా నాకు ఫోన్లు చేసేవాడు. నాకు కాల్ చేయొద్దని కరాఖండి చెప్పాను. అతడి సైకోనెస్ చూసి రేపటినుంచి రావొద్దంటూ మరో అసిస్టెంట్ను పెట్టుకున్నాను. తీరా సెట్కు వెళ్లాక అక్కడి కాస్ట్యూమ్ డిజైనర్.. అతడిని అసిస్టెంట్గా తీసేయొద్దు అని బతిమాలుతున్నారు. అరె, మీ బాధేంటి? అని అడిగితే.. మేడమ్కు మీరైనా సర్ది చెప్పండి అంటూ రాత్రంతా ఆయన ఇంటిముందు ఏడ్చుకుంటూ ఉన్నాడట! వారం రోజులపాటు అదే పని చేశాడు. తర్వాత ఇక రాలేదట.. మేకప్ ఆర్టిస్ట్గా సెటిలయ్యాడని విన్నాను.అతడొస్తే నేను రానుఇండస్ట్రీలో ఓ నటుడు నన్ను ప్రేమించాడు. నేను కాల్ చేస్తే ఐ లవ్యూ అష్మిత అని రింగయ్యేది. చెత్తగా అనిపించేది. నాకతను అస్సలు నచ్చేవాడు కాదు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అతడే రూమర్లు సృష్టించాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఓ షోకి నాతో పాటు ఆ నటుడిని కూడా పిలిచారు. అతడొస్తే నేను రానని చెప్పేశాను. ఇప్పటికే పుకార్లు ఎక్కువయ్యాయి. కాబట్టి ఇప్పట్లో మీతో కలిసి ఏ ప్రాజెక్టులూ చేయనని చెప్పేశాను. అప్పటికే నేను కొరియోగ్రాఫర్ సుధీర్తో లవ్లో ఉన్నాను అని పేర్కొంది. తర్వాత సుధీర్నే పెళ్లి చేసుకుని సెటిలైంది అష్మిత.చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు -
'కుబేర' కలెక్షన్.. అన్ని కోట్లు వచ్చాయా?
-
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం.. కన్నప్పను ఆదరించాలే తప్ప అల్లరి చేయొద్దని కోరాడు.జోక్ చేసిన మోహన్బాబుఇకపోతే కన్నప్ప షూటింగ్ అంతా న్యూజిలాండ్లోనే జరిగింది. ఆ సమయంలో చిత్రయూనిట్ సరదాగా తీసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అందులో మోహన్బాబు.. ఓ మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే.. అన్నాడు. వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అన్నాడు.7 వేల ఎకరాలు కొన్నాందాంతో మోహన్బాబు.. మా దగ్గర బ్లాక్మనీయే లేదు. న్యూజిలాండ్లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్ చేశాడు. ఇంతలో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మార్చాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. Mohanbabu Mass 😂😂😂#JustforGags pic.twitter.com/Nbb2y053R6— V@ndeM@taR@m (@patriotatwork99) June 22, 2025 చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు -
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
కష్టాలు లేని జీవితం ఉండదు. మెగా డాటర్ నిహారిక లైఫ్లోనూ కష్టాలున్నాయి. ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. కానీ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి. నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు, దూరం, భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2023లో నిహారిక- చైతన్య విడాకులు తీసుకున్నారు.ఆ ఒక్కటే అవసరంతాజాగా ఈ విషయం గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నిహారిక, నేను ఎక్కువ మాట్లాడుకుంటాం. పిల్లల కెరీర్ విషయాల్లో నేను తలదూర్చను. నా పిల్లల హిట్స్, ఫ్లాప్ గురించి నాకవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. సంతోషంగా ఉంటే అది నాకు తృప్తి. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృథానే! వరుణ్.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు.. ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా? అన్నాను. లేదు, హ్యాపీగా ఉంటాం అని బదులిచ్చాడు. సరేనని పెళ్లి జరిపించాం. వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.తప్పు నాదేకానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్ తప్పయింది. ఆ పెళ్లి మేం చేసిన తప్పు. మేం సరిగా జడ్జిమెంట్ చేయలేకపోయాం. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు. తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్లాం. కానీ.. తనకు, అబ్బాయికి సింక్ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. వారిద్దరూ కలిసుండేందుకు నేనెలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇష్టం లేదన్నారు, సరేనని చెప్పాను. ఇప్పుడు తను నిర్మాతగా సినిమాలు చేస్తోంది. కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సినిమా -
రిషికేశ ఈజ్ బ్యాక్
ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆఫీసర్ రిషికేశ మళ్లీ థియేటర్స్లోకి వస్తున్నాడు. రవితేజ కెరీర్లోని వన్నాఫ్ ది హిట్ ఫిల్మ్ ‘మిరపకాయ్’. ఈ చిత్రంలో రిచా గంగో పాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించగా, ప్రకాశ్రాజ్ విలన్ పాత్రలో, మరో ఐబీ ఆఫీసర్గా బ్రహ్మాజీ నటించారు. రమేష్ పుష్పాల నిర్మించిన ఈ సినిమాను జూలై 11న రీ–రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఐబీ ఆఫీసర్ రిషికేశ పాత్రలో రవితేజ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. రిషికేశ ఓ అండర్కవర్ ఆపరేషన్తో మాఫియా డాన్ కిట్టు (ప్రకాశ్రాజ్) ఆటను ఎలా కట్టించాడన్నదే ఈ సినిమా కథనం.ఇక రవితేజ హీరోగా నటించిన మరో చిత్రం ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ ఇటీవల రీ–రిలీజైన విషయం గుర్తుండే ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ‘అనార్కలి’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. అలాగే రవితేజ నటించిన ఇంకో చిత్రం ‘మాస్ జాతర’ ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల కానుంది. -
నాన్నకు ప్రేమతో..
ఓ తండ్రిది బాధ్యత... మరో నాన్నది పగ. ఇంకో ఫాదర్ది ప్రేమ... ఇలా ఫాదర్ సెంటిమెంట్, ఎమోషన్లతో సిల్వర్ స్క్రీన్పై సినిమాలొస్తే ఆ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. పైగా ఈ తరహా సినిమాల్లో తండ్రి–కొడుకు ఈ రెండు పాత్రలనూ తమ అభిమాన హీరో చేస్తే అభిమానులు ఖుష్ అవుతారు. ఇలా తండ్రీ కొడుకుల ద్విపాత్రాభినయంతో కొందరు హీరోలు, తండ్రిగానో, కొడుకుగానో మరికొందరు హీరోలు ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ ఫాదర్ ఎమోషన్తో సినిమాలు చేసున్నారు. ఆ హీరోలపై ఓ లుక్ వేద్దాం...గతం నిశ్శబ్దంగా ఉండదు జార్జి కుట్టి గుర్తున్నాడుగా..! అదేనండీ... తన కుమార్తెల రక్షణ కోసం, తన కుటుంబం కోసం పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి. మలయాళ బ్లాక్బస్టర్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మోహన్లాల్ పాత్ర పేరు జార్జి కుట్టి. ఈ సినిమాలో ఓ తండ్రిగా మోహన్లాల్ నటన అద్భుతమని ప్రేక్షకులు కితాబులు ఇచ్చారు. అందుకే ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటివరకు ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలు రాగా ఈ రెండు చిత్రాలూ సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు ‘దృశ్యం’ సినిమాలో మూడో భాగంగా ‘దృశ్యం 3’ రానుంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ‘దృశ్యం 3’ సినిమాకూ దర్శకత్వం వహించనున్నారు.‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు... దృశ్యం 3 సినిమా ఉంది’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ఖరారు చేశారు మోహన్లాల్. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానుందని శనివారం మోహన్లాల్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు. మరి... ఈ సారి ఓ తండ్రిగా మోహన్లాల్ తన కుటుంబాన్ని, కుమార్తెలను ఏ విధంగా సంరక్షించుకుంటారో చూడాలి. అయితే ఈసారి తండ్రీ–కుమార్తెల మధ్య ఉన్న ఎమోషనల్ మోతాదును పెంచాలని జీతూ జోసెఫ్ అనుకుంటున్నారట. ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించనున్నారు. మోహన్లాల్ త్వరితగతిన సినిమాలు పూర్తి చేస్తుంటారు కాబట్టి, ‘దృశ్యం 3’ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజైనా ఆశ్చర్యపోవడానికి లేదు.మూడు తరాల కథ శర్వానంద్ హీరోగా ‘లూజర్’ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ రానుంది. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడు తరాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఫాదర్ అండ్ సన్ల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందట. మూడు తరాల నేపథ్యం కాబట్టి ఈ చిత్రం డిఫరెంట్ టైమ్లైన్స్లో ఉంటుందనుకోవచ్చు. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్గా కనిపిస్తారని, ‘రేస్ రాజా’ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం.హిట్ ఫార్ములాఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్ను బాగా అలరించి, హిట్ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ మెయిన్ పాయింట్ ఫాదర్ ఎమోషనే. సముద్రఖని –ధన్రాజ్ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్ కిషన్–రావు రమేశ్ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, మోహన్లాల్ ‘తుడరుమ్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్ ఎమోషన్నే మెయిన్ పాయింట్గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్ను బాగా అలరించి, హిట్ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ మెయిన్ పాయింట్ ఫాదర్ ఎమోషనే. సముద్రఖని –ధన్రాజ్ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్ కిషన్–రావు రమేశ్ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, మోహన్లాల్ ‘తుడరుమ్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్ ఎమోషన్నే మెయిన్ పాయింట్గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ధారా.. ఫాదర్ ఆఫ్ దేవా తండ్రీకొడకుల కథలంటే ప్రభాస్కు బాగా ఇష్టం ఉన్నట్లుగా తెలుస్తోంది. తండ్రి ఎమోషన్తో ప్రభాస్ హీరోగా ఆల్రెడీ చేసిన ‘మిర్చి, బాహుబలి’ వంటి సినిమాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా ప్రభాస్ కమిటైన చిత్రాల్లో ‘సలార్’ కూడా ఒకటి. ఈ సినిమాలో కూడా ఫాదర్ ఎమోషన్ గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘సలార్’ ఫ్రాంచైజీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ తండ్రి పేరు ధారాగా వినిపించింది. కాగా ‘సలార్: సీజ్ఫైర్’ ఎండింగ్లో ‘సలార్: శౌర్యాంగపర్వం’ సినిమా ఉన్నట్లుగా మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో దేవా, ధారాల మధ్య మరింత ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సన్నివేశాలు ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతేకాదు... దేవా తండ్రి ధారా పాత్రలోనూ ప్రభాసే కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.పైగా ‘సలార్’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ప్రభాస్కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. వాటిలోని ఒక పోస్టర్లో ప్రభాస్ కాస్త ఏజ్డ్గా కనిపిస్తారు. ఈ పాత్రే ధారా అనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్కు వెళ్లలేదు. ఇక ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాకు మారతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం సైతం ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల నేపథ్యంలో సాగుతుందని, తాత– మనవళ్ల ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ కూడా కాస్త ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో తండ్రీకొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి మధ్య ‘బాహుబలి’ సినిమాలో కాంబినేషన్ సీన్స్ లేనప్పటికీ మాహిష్మతి రాజ్యంలో తండ్రి అమరేంద్ర బాహుబలికి జరిగిన అన్యాయానికి తల్లి దేవసేన ్రపోత్సాహం, ప్రతీకారంతో.. మహేంద్ర బాహుబలి రివెంజ్ తీర్చుకోవడం ఆడియన్స్ను మెప్పించింది. ఇక ఇక్కడ ‘బాహుబలి’ ప్రస్తావన తీసుకు రావడానికి ఓ కారణం ఉంది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ‘బాహుబలి’ ఈ ఏడాది అక్టోబరులో రీ రిలీజ్ కానుంది. అయితే ‘బాహుబలి’ రెండు భాగాలను (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్) కలిపి ఒకే సినిమాగా ఎడిట్ చేసి, రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.వర... సన్నాఫ్ దేవర దేవర చనిపోయినప్పుడు అతని కొడుకు వర చేతిలో కత్తి ఎందుకు ఉంది? తండ్రి దేవరను, అతని కొడుకు వరనే చం పాడా? అసలు ఏం జరిగింది? అనేది ‘దేవర 2’ సినిమాలో చూడాలి. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి పేరు దేవర. కొడుకు పేరు వర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. 2024 సెప్టెంబరు 24న ‘దేవర పార్ట్ 1’ విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. ‘దేవర 2’ చిత్రం కూడా ఉంటుందని, ‘మ్యాడ్ 2’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఎన్టీఆర్ పేర్కొన్నారు.ఈ ‘దేవర 2’ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. అసలు దేవర, అతని కొడుకు వరల మధ్య ఏం జరిగింది? దేవర నిజంగానే చనిపోయాడా? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘దేవర 2’లో చూడొచ్చని ‘వార్ 2’ ప్రమోషన్స్లో భాగంగా ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు పోలీస్... అటు ఖైదీ తండ్రంటే ఎవరికి ప్రేమ ఉండదు. కానీ విజయ్ప్రకాశ్కు ఇష్టం లేదు. ఈ విజయ్ప్రకాశ్ ఎవరంటే... ‘సర్దార్’ సినిమాలో పోలీసాఫీసర్. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు కార్తీ. తండ్రి సర్దార్పై దేశ ద్రోహి అనే అభియోగం ఉంటుంది. కానీ తన తండ్రి దేశద్రోహి కాదని, అసలు సిసలైన దేశభక్తుడని ప్రకాశ్ తెలుసుకుంటాడు. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అవుతాడు. కానీ.. ‘సర్దార్’ సినిమాలో తండ్రీకొడుకులు మధ్య ఉన్న సన్నివేశాల నిడివి తక్కవే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రానుంది. ఈ చిత్రంలోనూ కార్తీ తండ్రీ కొడుకుగా ద్వి పాత్రాభినయం చేశారు.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించారు. ఇటీవలే బ్యాంకాక్లో జరిగిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణతో ‘సర్దార్ 2’ పూర్తయింది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని కోలీవుడ్ సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా ఉంటాయట. ‘సర్దార్ 2’ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.మరోవైపు కార్తీ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ఖైదీ 2’. ఈ సినిమాలో కూతురి కోసం తపన పడే దిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపిస్తారు కార్తీ. ‘ఖైదీ’లో తన కుమార్తెను కలవడంతో సినిమా ముగుస్తుంది. మరి... దిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? తన కుమార్తెకు దూరమై ఓ తండ్రిగా ఎంత ఆవేదన చెందాడు? అసలు దిల్లీ భార్యకు ఏం జరిగింది? అన్న విషయాలు ‘ఖైదీ 2’లో ఉండొచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఖైదీ 2’లో ఖైదీ దిల్లీ భార్య పాత్రలో అనుష్కా శెట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సెప్టెంబరులో చిత్రీకరణ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్నుప్లాన్ చేశారు. ‘ఖైదీ’ సినిమాను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థనే ‘ఖైదీ 2’నూ నిర్మించనుందట.తొలిసారి ద్వి పాత్రాభినయం ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్లోని ఈ 14వ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారు. బ్రిటిష్ పరి పాలన కాలం నేపథ్యంలో 1854–1878ల టైమ్ పీరియడ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రీకొడుకుగా ద్వి పాత్రాభినయం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.స్క్రీన్పై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ద్వి పాత్రాభినయం చేయలేదు. సో... తొలిసారి విజయ్ ఈ తరహా ప్రయత్నం చేస్తుండటంతో, ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్లో అంచనాలు ఉన్నాయి. ఇంకా ‘గీత గోవిందం, డియర్ కామ్రెడ్’ వంటి సినిమాల తర్వాత హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేయనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగే ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుంది. సెట్ వర్క్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక విజయ్ సెట్స్కి వచ్చి, రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనడమే ఆలస్యం. 2026 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.మధ్యతరగతి తండ్రి కథ పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘చౌకీదార్’. ఈ చిత్రంలో సాయికుమార్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీ అంబర్, సాయికుమార్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాన్న అంటేనే దైవం’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను బట్టి ఈ సినిమాలో తండ్రీకొడుకుల ఎమోషన్, ఓ మధ్య తరగతి తండ్రి తన కుటుంబం కోసం పోరాడే తీరు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో కల్లహల్లి చంద్రశేఖర్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఫాదర్ ఎమోషన్తో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
రష్మిక సాంగ్ ఎందుకు తీసేశారు?.. శేఖర్ కమ్ముల క్లారిటీ!
ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ కుబేర. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో నాగ్ ఫ్యాన్స్తో పాటు ధనుశ్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. కుబేర సక్సెస్ కావడంతో ఇది శేఖర్ కమ్ముల మార్క్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక సైతం తన పాత్రకు వస్తున్న ఆదరణను చూసి సంతోషంగా ఉందని తెలిపింది.అయితే తాజాగా కుబేర సక్సెస్ కావడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో నాగార్జునతో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్ అనే రష్మిక సాంగ్ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురైంది. దీనిపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు.పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్ ఉండాలకున్నామని శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే ఈ సాంగ్ను కావాలని మేము తీయలేదన్నారు. కానీ కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నట్లు వెల్లడించారు. వేరే మంచి సీన్ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదన్నారు. ఈ చిత్రంలో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ తీసేసినా ఈ సినిమా ఉండదు.. అలా కథ రాసుకున్నానని శేఖర్ కమ్ముల వివరించారు. -
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
ఈ సంవత్సరం తనకెంతో స్పెషల్ అంటోంది నటి ఆర్జే కాజల్ (RJ Kajal). బిగ్బాస్ సీజన్ 5తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన భర్త విజయ్ శీలం శెట్టికి బర్త్డే విషెస్ చెప్తూ తమ జర్నీని రాసుకొచ్చింది. నా విజయ్కు హ్యాపీ బర్త్డే.. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను. 2025.. ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేక చోటు దక్కింది. ఎందుకంటే మన జీవితంలోనే కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నాం.ఎన్నో గొడవలుఇంకా ఆ ఇంట్లోకి మనం షిఫ్ట్ కాలేదనుకో.. కానీ, మనిద్దరం కలిసి ఆ ఇంటిని కొన్నందుకు ఆల్రెడీ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు మనం చీకట్లో గుసగుసలాడుకునేవాళ్లం. ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తోంది. అలా అని మనమెప్పుడూ ఇంతే సంతోషంగా ఉండేవాళ్లం కాదు. ఎన్నోసార్లు పోట్లాడుకునేవాళ్లం. ఇంటీరియర్స్ గురించి, దిండుల గురించి, సమయపాలన గురించి.. కొన్నిసార్లయితే మరీ అనవసరమైన విషయాల గురించి కూడా గొడవపడేవాళ్లం. పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లంఆ రోజులో ఎన్ని గొడవలు పడ్డా కూడా రాత్రయ్యేసరికి దాన్ని పరిష్కరించుకునేవాళ్లం. ప్రశాంతంగా నీ కౌగిలిలో నిద్రపోతుంటే మన ప్రేమ కంటే ఏ గొడవా పెద్దది కాదనిపించేది. మరికొన్నిసార్లు పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం. ఒకరి కాలు మరొకరు పట్టుకుని లాగేవాళ్లం. కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం. మన బంధాన్ని మరింత ధృడంగా నిర్మించుకున్నాం. నువ్వు లేని జీవితం? అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను.మరణం తర్వాత కూడా..కానీ సరదాగా ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనమేం అనుకునేవాళ్లం? మనిద్దరి శవాలను పక్కపక్కనే సమాధి చేసి మరణం తర్వాత కూడా కలిసే ఉండాలనుకునేవాళ్లం. అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం. మన లవ్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చేమో కానీ, అందమైన ప్రేమను ఆస్వాదిస్తున్నాం. ఈ రోజు, నీ పుట్టినరోజున ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం.. నువ్వు నాకోసమే పుట్టావు. నాకు భర్తగా దొరికినందుకు థాంక్యూ.. అని కాజల్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు భర్తతో కలిసి దిగిన ఫోటోలను జత చేసింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి -
అమ్మ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్!
గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే తాజాగా ఇవాళ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం నిర్మలమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అవార్డుల అల్లు అర్జున్..పుష్ప-2 సినిమాకు గానూ 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలిచారు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కాగా.. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు -
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
ఏ సినిమా అయినా సరే హీరోయిజం పండాలంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' విషయంలోనూ ఇదే జరిగినట్లు అనిపిస్తుంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna Akkineni) లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ షర్బ్ ఆకట్టుకున్నాడు. ఇదే ఇతడికి తొలి సినిమా అయినా సరే.. విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు. ఇతడి వయసు జస్ట్ 37 ఏళ్లే. తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు. తర్వాత 2014లో హిందీలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తొలి మూవీ షురురత్ కి ఇంటర్వెల్ ఫ్లాప్. దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు. 2016లో వచ్చిన 'నీర్జా' ఇతడి కెరీర్ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. అలా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)బాలీవుడ్లో పద్మావత్, సంజు సినిమాల్లో ఇతడు విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. 'కుబేర'లో అవకాశం దక్కించుకున్నాడు. స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ.. డబ్బింగ్కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు. సినిమాలో ఇతడి నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.అలా తెలుగులో 'కుబేర' సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్.. త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటనీ వచ్చేసింది. ఇలాంటి టైంలో జిమ్కి అవకాశాలు వస్తే టాలీవుడ్లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?) -
'కుబేర' జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)
-
‘కుబేర’ మేకింగ్ వీడియో చూశారా
-
సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో కొత్త సినిమాలు ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే త్వరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలైతే మరీ రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ ఇలానే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'రాజాసాబ్' దర్శకుడు మారుతి దీన్ని సమర్పించడం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ప్రస్తుతం అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)'ఉయ్యాలా జంపాలా', 'బాహుబలి' తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఘటికాచలం'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకుని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించగా.. నిఖిల్తో పాటు ప్రభాకర్, ఆర్వికా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ రెండు ఓటీటీల్లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు 20 రోజులకే అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు చూస్తారేమో? ఘటికాచలం విషయానికొస్తే.. తండ్రి కోరిక మేరకు మెడిసన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయడానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
హైదరాబాద్లో వారణాసి!
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ను క్రియేట్ చేశారని తెలిసిందే.ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని భోగట్టా. ఈ సెట్స్కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్. అంతేకాదు... ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ ఫారిన్కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్లో యాక్షన్ సీక్వెన్స్లను ΄్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. -
కేరవాన్లో ఫుల్లుగా ఏడ్చేదాన్ని.. తర్వాత నవ్వుతూ..: అనన్య
ప్రేమలో మోసపోయానంటోంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో నా మనసుకు, మెదడుకు, చేతలకు సంబంధమే లేకుండా పోయింది. అతడికి ఫోన్ చేయడం ఇష్టం లేకపోయినా నాకు తెలీకుండానే ఫోన్ చేసేవాడిని. ఎందుకు చేశానో అర్థమయ్యేది కాదు. రెండు, మూడేళ్లపాటు చాలా బాధపడ్డాను. కేరవాన్లో ఏడ్చేసి..కానీ, చేసే పనిపై దాని ప్రభావాన్ని పడనివ్వలేదు. రాత్రంతా ఏడ్చి ఉదయాన్ని జిమ్కు వెళ్లిపోయేదాన్ని. కేరవాన్లో ఏడ్చేసి.. ఏం జరగనట్లు కళ్లు తుడుచుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని. ఈ బాధలో నుంచి బయటకు వస్తానా? లేదా? అనుకున్నాను. తర్వాత ఇదంతా ఒక మాయ అని తెలుసుకుని బయటపడ్డాను అని తెలిపింది.తెలుగమ్మాయికి అవకాశాలు తక్కువ?తెలుగమ్మాయిలకు వస్తున్న అవకాశాల గురించి అనన్య మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్. హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది, అప్పుడే హీరోయిన్లను సినిమాలో పెట్టుకుంటారు. వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగింది. మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. కానీ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి బ్లాక్బస్టర్ హిట్ కొడితే వచ్చినన్ని అవకాశాలు.. తెలుగమ్మాయి బ్లాక్బస్టర్ హిట్ కొడితే రావట్లేదు. ఇదే నిజం. హిట్స్ ఉన్నా ఎందుకు మంచి అవకాశాలు రావడం లేదని కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నాకోసం నేను మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు నేనే మార్కెటింగ్సినిమాల్లో యాక్ట్ చేసి వదిలేయకుండా వాటి ప్రమోషన్స్పై ఎక్కువగా ఫోకస్ చేశాను. దానివల్ల నాకంటూ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్టులు వస్తున్నాయి. బాలీవుడ్లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన అనన్య.. వకీల్ సాబ్, తంత్ర, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించింది. పొట్టేల్ సినిమాకుగానూ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
యాంకర్, బుల్లితెర నటి సమీరా షెరిఫ్ (Sameera Sherief) గుడ్న్యూస్ చెప్పింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సమీరా- సయ్యద్ అన్వర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నాం అని రాసుకొచ్చారు. అలాగే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు.. సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సమీరా ప్రెగ్నెన్సీ జర్నీ..సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాదే నటి తొలిసారి గర్భం దాల్చింది. అప్పుడు ఆమె తమిళంలో మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తోంది. షూటింగ్ అవగానే హాస్పిటల్కు వెళ్దామనుకుంది. అంతలోనే తీవ్ర రక్తస్రావమై కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. తర్వాత 2021లో మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అలా ఆమెకు అర్హాన్ జన్మించాడు. 2023లో మరోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఇంటిల్లిపాది ఎంతో సంతోషించారు. కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు. 2024 చివర్లో మరోసారి ప్రెగ్నెంట్ అని తేలగా.. ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది.సమీరా ఎందుకింత పాపులర్?ఆడపిల్ల సీరియల్తో సమీరా ఒక్కసారిగా పాపులర్ అయింది. అభిషేకం, భార్యామణి, ముద్దుబిడ్డ.. ఇలా ఎన్నో ధారావాహికలు చేసింది. అదిరింది షోకి కొన్నిరోజులపాటు యాంకర్గానూ వ్యవహరించింది. View this post on Instagram A post shared by Syed Anwar (@syedd_annwar) చదవండి: జెన్ Z అంటే ఇదేనా? ఆశిష్ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం -
ఐదు నెలల తర్వాత ఓటీటీకి తెలుగు సినిమా.. ఎక్కడ చూడాలంటే?
దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు శ్రీరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రం ఒక పథకం ప్రకారం. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 27 నుంచి సన్ నెక్స్ట్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం 25 డాగ్స్తో ఫైట్ సీన్ తెరకెక్కించారు. కాగా.. హీరో సాయిరాం శంకర్ 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. -
మీకు సడన్గా రూ.500 కోట్లు ఇస్తే ఏం చేస్తారు?.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?
శేఖర్ కమ్ముల అంటే ఒక మార్క్. ఆయన సినిమా తీశాడంటే కథ మాములుగా ఉండదు. నాగచైతన్యతో లవ్ స్టోరీ మూవీ తీశాక అంటే.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కుబేర అనే సినిమాను తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్ రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాకు రిలీజ్ ముందురోజే నాగచైతన్యతో కలిసి నాగార్జున, శేఖర్ కమ్ముల చిట్ చాట్ నిర్వహించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చైతూ వాళ్లిద్దరికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ చిట్ చాట్ చాలా ఫన్నీగా, సరదాగా సాగింది. ఇందులో శేఖర్ కమ్ములకు ఓ ఆసక్తికర ప్రశ్న వేశాడు నాగచైతన్య.సడన్గా మీకు రూ.500 కోట్లు ఇచ్చి.. ఏం చేసినా పర్లేదు అంటే మీరు ఏం చేస్తారు? అని అడిగాడు. దీనికి శేఖర్ కమ్ముల ఆ ఐదొందల కోట్లు తీసుకుని ఏదైనా మంచి సినిమా చేస్తా అన్నారు. పక్కనే నాగార్జునను మీరేం చేస్తారని అడగ్గా.. నాకేందుకురా వద్దే వద్దు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #NagaChaitanya: Sudden gaa meeku ₹500 crores isthe, meeru em chestharu?#Nagarjuna: వద్దు… I don’t want. 😄#KuberaaInCinemasTomorrow pic.twitter.com/WOCNViedfH— Whynot Cinemas (@whynotcinemass_) June 19, 2025 -
అమ్మా.. అంటూ తిరుపతిలో భిక్షమెత్తా: హీరో ధనుష్
ఇతడు హీరో ఏంట్రా? అన్నవారితోనే.. హీరో అంటే ఇతడిలా ఉండాలి అనిపించుకున్నాడు ధనుష్ (Dhanush). నిజానికి ఈయన హోటల్ మేనేజ్మెంట్ చదివి మంచి చెఫ్ అవ్వాలనుకున్నాడు. కానీ ఫ్యామిలీది సినిమా బ్యాక్గ్రౌండ్. తండ్రి కస్తూరి రాజా.. దర్శకనిర్మాత, అన్న సెల్వరాఘవన్ కూడా డైరెక్టర్గా ప్రయత్నించాలనుకుంటున్నాడు. తమ్ముడు కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందన్నాడు. నటుడిగా ట్రై చేయమన్నాడు.స్టార్డమ్అలా తండ్రి డైరెక్షన్లో తొలి చిత్రం (తుళ్లువదో ఇలమై), అన్న డైరెక్షన్లో రెండో మూవీ (కాదల్ కొండైన్) చేశాడు. ఈ సినిమాల విజయంతో తనలోనూ కాన్ఫిడెంట్ పెరిగింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. తక్కువ కాలంలోనే టాప్ స్టార్గా ఎదిగాడు. సినిమా కోసం ఎలాంటి ట్రాన్స్ఫార్మేషన్కైనా సిద్ధమవుతాడు. కోలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలు పెట్టిందే ఈ హీరో (పొల్లాధవన్ మూవీలో ధనుష్ ఆరు ఫలకల దేహంతో కనిపిస్తాడు)! అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో ధనుష్ యాచకుడిగా కనిపిస్తాడు.తిరుపతిలో భిక్షాటనసినిమా షూటింగ్లో భాగంగా తిరుమలలోనూ ధనుష్ భిక్షాటన చేశాడు. ఇటీవల కుబేర ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ములకు ఉన్న మంచి పేరు చూసి ఈ సినిమా అంగీకరించాను. కానీ, చివరకు నన్ను తిరుపతి నడిరోడ్డుపై అమ్మా, అయ్యా అంటూ భిక్షాటన చేసేలా చేశాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా తిరుపతిలోని అలిపిరి వద్ద జనవరి నెలాఖరులో ధనుష్ భిక్షాటన చేసిన సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ధనుష్ కష్టం ఊరికే పోలేదు. జూన్ 20న రిలీజైన కుబేర గ్రాండ్ సక్సెస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి నడి రోడ్ లో బిచ్చగాడి లా కూర్చోపెట్టాడు - #Dhanush#KuberaaInTheatersFromTomorrow pic.twitter.com/3ApQWtri5L— Shreyas Sriniwaas (@shreyasmedia) June 19, 2025 చదవండి: అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి -
ఇన్ స్టా ఫాలోవర్స్ లేరని హీరోయిన్గా తీసేశారు: శివాత్మిక
హీరోయిన్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అంటే యాక్టింగ్ టాలెంట్ లేదంటే ప్రేక్షకుల్ని రప్పించగలిగే గ్లామర్ ఉండాలి కదా అని చాలామంది అంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందని అంటోంది ఒకప్పటి హీరో రాజశేఖర్ కూతురు. హీరోయిన్గా ఐదు సినిమాలు చేసిన ఈమె.. తన ఛాన్సుల కష్టాల గురించి చెబుతోంది. ఇన్ స్టాలో ఫాలోవర్స్ లేరని తనని సినిమా నుంచి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటోంది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.హీరో రాజశేఖర్-జీవిత దంపతులకు శివానీ, శివాత్మిక అని ఇద్దరు కూతుళ్లు. వీళ్లలో శివాత్మిక చిన్నమ్మాయి. 2019లో 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది మోస్తరుగా ఆడింది. కానీ తమిళంలో ఓ రెండు చిత్రాలు చేసింది. 2022లో మళ్లీ 'పంచతంత్రం', 2023లో 'రంగమార్తండ' మూవీస్లో నటించింది. తర్వాత కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక.. తనకు ఇన్ స్టాలో సరైన ఫాలోవర్స్ లేకపోవడంతో కొన్ని సినిమాల నుంచి హీరోయిన్గా తీసేశారని, మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశమిచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఏ మేనేజర్ లేదా ఏజెంట్ని కలిసినా సరే ఇన్ స్టాలో ఫాలోవర్స్ని పెంచుకోమంటున్నారని తన ఆవేదనని చెప్పుకొచ్చింది. అయితే తాను ఓ యాక్టర్ అని కంటెంట్ క్రియేట్ చేయడం తన పనికాదని చెప్పింది.శివాత్మిక చెప్పడం అని కాదు గానీ రీసెంట్ టైంలో సోషల్ మీడియా నుంచి వచ్చి హీరోయిన్లు అయినవాళ్లు ఉన్నారు. వాళ్లలో వైష్ణవి చైత్యన ఒకరు. తొలుత ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈమె.. 'బేబి' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ తర్వాత వచ్చిన 'లవ్ మీ', 'జాక్' చిత్రాలతో ఘోరమైన ఫ్లాప్స్ అందుకుంది. రీసెంట్గా నిహారిక ఎన్ఎమ్ కూడా ఇలానే హీరోయిన్ అయింది. తొలుత తమిళంలో సినిమాలు చేసింది. ఇప్పుడు 'మిత్రమండలి' మూవీలో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. ఉపాసన పోస్ట్ వైరల్) -
ధనుష్, రజనీకాంత్లతో భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జననాయకన్ చిత్రం కథ గురించి పలు రకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా ఇది సమకాలీన రాజకీయాలను తెరపై ఆవిష్కరించే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కథను దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేసిందనే ప్రచారం జరిగింది. మొత్తం మీద నటుడు విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అంటే 2026 జనవరి 8వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో దర్శకుడు హెచ్ వినోద్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తదుపరి ధనుష్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు హెచ్ వినోద్ నటుడు రజనీకాంత్ను కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కథ చెప్పడానికే హెచ్ వినోద్ నటుడు రజనీకాంత్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఈయన హెచ్.వినోద్ దర్శకత్వంలో నటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. రజనీతో ఛాన్స్ లేదంటే ధనుష్తో ప్లాన్ చేస్తారా అనే టాక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి'
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజాగా చిత్రం కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఓ ట్వీట్ వేసింది. చాలా కారణాల వల్ల కుబేర నాకు స్పెషల్ చిత్రంగా నిలవబోతుంది. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడం, అద్భుతంగా నటించడం ధనుష్ సర్ వల్లే సాధ్యమవుతుంది.ఎప్పటికీ గుర్తుండిపోతుందిశేఖర్ (Sekhar Kammula) గారి డైరెక్షన్లో నాగార్జున సర్ కిల్లర్ లాంటి పాత్రలో కనిపించడం మాకు కన్నుల పండగ్గా ఉంటుంది. ప్రియమైన రష్మిక.. శేఖర్ గారు తన సినిమాల్లో హీరోయిన్లకు శక్తివంతమైన పాత్రలు ఇస్తారు. కుబేరలో నీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నీ విజయాల పరంపరలో ఈ మూవీ కూడా చేరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ గారు.. మీరు మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం! రక్తం ధారపోశారుచైతన్య, సూరి, అజయ్, స్వరూప్.. మీరంతా రక్తం ధారపోసి కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలం, గుర్తింపు తప్పకుండా వస్తుంది. నిర్మాత సునీల్ గొప్ప కథల్ని ఎంచుకుని అందిస్తున్నందుకు దివంగత నారాయణ్దాస్ గారు పై నుంచి ఎంతో గర్విస్తుంటారు. శేఖర్గారిలాంటి స్వచ్ఛమైన హృదయం కలవారే ఇలాంటి సినిమాలు తీయగలరు. మీరు ఒక తరాన్నంతటినీ ప్రభావితం చేస్తున్నారు. అందులో నేనూ ఉన్నాను. నా గురువుగారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కుబేరఇలాంటి మంచి కథల్ని మరెన్నో అందించాలని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయిపల్లవి ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చేసింది. కుబేర సినిమా విషయానికి వస్తే.. నాగార్జున సీబీఐ ఆఫీసర్గా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. నికేత్ బొమ్మరెడ్డి కెమెరామేన్గా పని చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న రిలీజైంది. #Kuberaa is going to be special for many reasons! @dhanushkraja sir’s masterclass in acting & art of picking challenging characters that only he can pull off so effortlessly. @iamnagarjuna sir, It’s going to be a treat to watch you in a killer character under Sekhar garu’s…— Sai Pallavi (@Sai_Pallavi92) June 20, 2025 చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ -
ఫిట్ అండ్ హెల్దీ : ‘యోగా సే హోగా’ అంటున్న సెలబ్రిటీలు (ఫొటోలు)
-
సూర్య- ఆర్జే బాలాజీ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
హీరో సూర్య 45వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. గతేడాదిలో పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. నటుడు ఆర్జే బాలాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.సూర్య- ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్కు 'కరుప్పు' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్ను ప్రారంభించిన ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ కొలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరో సూర్యతోనే ఛాన్స్ దక్కించుకుని హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. -
'సితారే జమీన్ పర్' ట్విటర్ రివ్యూ.. ఆమిర్ ఖాన్ మార్క్
బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ (Aamir Khan), జెనీలియా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par). జూన్ 20న హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్లో మొదటి ఆట పూర్తి అయింది. దీంతో సినిమా గురించి సోషల్మీడియా వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆర్.ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని విడుదల చేసింది. ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్గా దీనిని రూపొందించారు. ఈ సినిమాపై సోషల్మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నాయనేది తెలుసుకుందాం.మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వాళ్లకు ఓ కోచ్ బాస్కెట్ బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి.. వాళ్లను మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే ఇతివృత్తంగా ఈ 'సితారే జమీన్ పర్' సినిమా కథ ఉంటుంది. ఆమిర్ఖాన్ ఇందులో కోచ్గా మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆమిర్ ఖాన్ నటించిన అత్యుత్తమమైన చిత్రాలలో ఈ మూవీ తప్పకుండా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దర్శకత్వంతో పాటు సూపర్ స్క్రీన్ ప్లే అంటూ అభినందిస్తున్నారు. ప్రతి సీన్లో అదిరిపోయే సందేశాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆపై వెంటనే ఏడిపిస్తుంది కూడా అంటూ ఒకరు పేర్కొన్నారు. ఈ సినిమాను అంకెలతో కొలమానంగా చూపుతూ.. స్టార్ రేటింగ్లు ఇచ్చి ఇందులో నటించిన ఆ పిల్ల టాలెంట్ను తక్కువ చేయలేమన్నారు.మొదటి భాగంలో పూర్తిగా వినోదాత్మక స్క్రీన్ప్లేతో కథ సాగుతుంది. ఇందులో ఆమిర్, జెనీలియా కెమిస్ట్రీ రిఫ్రెషింగ్గా ఉందని అంటున్నారు. ఇందులో నటించిన బాల నటులందరూ అద్భుతమైన యాక్టింగ్తో ప్రేక్షకులను కట్టిపడేస్తారని షేర్ చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత కథలో ఎమోషనల్ జర్నీ మొదలౌతుంది అంటున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ అదిరిపోతుందట. దాని గురించి ఎంతచెప్పినా కూడా తక్కువే అని పోస్టులు పెడుతున్నారు. ఫైనల్గా ఈ మూవీ చూసిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోవడమే కాకుండా గూస్బంప్స్ తెప్పించే అనుభూతి కూడా పొందుతారు. కథతో తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతారని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, కథ ప్రారంభంలో కాస్త ఇబ్బంది ఉంటుందని కొందరు తెలుపుతున్నారు. చాలా స్లోగా దర్శకుడు కథలోకి వెళ్లడం వల్లే ఈ ఇబ్బందని అంటున్నారు.ఒక యూజర్ ఈ చిత్రానికి 10కి 6.5 రేటింగ్ ఇచ్చి, 'ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' చూసిన తర్వాత, ఇది అతని పాత సినిమాల జ్ఞాపకాలను గుర్తు చేస్తంది. అతని లుక్ మీకు 'రంగ్ దే బసంతి. 3 ఇడియట్స్ చిత్రాలను చూసిన ఫీల్ కలుగుతుంది. అదే సమయంలో, కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఉంది.' అని చెప్పారు. అయితే, సితారే జమీన్ పర్లో నటించిన వారు అద్భుతంగా చేశారని ఎక్కువ మంది నెటిజన్లు అభినందిస్తున్నారు. కుటుంబంతో తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటూ సలహా ఇస్తున్నారు.#SitaareZameenParReview ~ MASTERPIECE!Ratings: ⭐️⭐️⭐️⭐️ ½#SitaareZameenPar is a typical #AamirKhan film, with all the ingredients to go down as one of his finest films ever! SUPER DIRECTION, SUPER SCREENPLAY, and a SUPER MESSAGE that should echo everywhere — "SABKA APNA APNA… pic.twitter.com/LDoph7qADu— CineHub (@Its_CineHub) June 19, 2025"#SitaareZameenPar touches you, makes you question the way you think. It makes you laugh out loud, makes your eyes well up & gives you hope. It's incredibly reassuring that a superstar like #AamirKhan would put his time, money & face to make something that's this bold & risky". pic.twitter.com/QQuTwoQlrv— Kate Wordy (@KateWordy) June 19, 2025#SitaareZameenParReviewThis film is more than just about “stars” 🌟1 2 34 5 stars can't measure it.You can’t judge the heart and effort of those special kids and #AamirKhan 🙏It’s emotional, powerful & truly special.#SitaareZameenPar is a must-watch! Must watch. That's it. pic.twitter.com/IsRX9iYEXX— Vivek Mishra (@actor_vivekm89) June 19, 2025#SitaareZameenParReview - 🌟 Rating: 6.5/10 🌟 #ReviewAfter watching Aamir Khan’s Sitaare Zameen Par, it brings back memories of his older films. His look reminds you of Rang De Basanti and 3 Idiots, and at the same time, there’s a small effort to try something new. One… pic.twitter.com/zWQaw0KZ4a— Bipin Singh (@bipinsinghreal) June 19, 2025#SitaareZameenPar is an emotional rollercoaster which makes you laugh and cry at the same time #AamirKhan delivers top-notch performance after a long time, The entire cast has done a splendid job and even with cliches, this one is a beautiful watch. (4/5)#SitaareZameenParReview pic.twitter.com/X6OdMQdckg— Afroj Hussain (@TheAfroj) June 20, 2025#SitaareZameenPar Review - TOUCHING Ratings: ⭐️⭐️⭐️☆☆The film beautifully highlights that "normal" is subjective.. what seems Subnormal to us might just be someone else's Normal. #AamirKhan captures this emotional truth with sensitivity, making it instantly relatable to… pic.twitter.com/WDzLUtJMaH— Ravi Gupta (@FilmiHindustani) June 19, 2025Aamir Khan is back with a bang, but Genelia is EXCEPTIONALLY well in Sitaare Zameen Par 🔥🔥A very well made film #SitaareZameenPar ✨️✨️Detailed review in morning 👍#Genelia #AamirKhan #SZP #GeneliaDeshmukh #GeneliaDSouza @geneliad @AKPPL_Official @cine_tales pic.twitter.com/YZlVD10q1k— Praneet Samaiya (@praneetsamaiya) June 19, 2025Aamir Khan is back with a bang, but Genelia is EXCEPTIONALLY well in Sitaare Zameen Par 🔥🔥A very well made film #SitaareZameenPar ✨️✨️Detailed review in morning 👍#Genelia #AamirKhan #SZP #GeneliaDeshmukh #GeneliaDSouza @geneliad @AKPPL_Official @cine_tales pic.twitter.com/YZlVD10q1k— Praneet Samaiya (@praneetsamaiya) June 19, 2025 -
'విరాటపాలెం' ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
హిట్3 మేకర్స్పై కేసు వేసిన అభిమాని
'హిట్3: ది థర్డ్ కేస్' హీరో నాని కెరీర్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిపోయన సినిమా.. అయితే, ఈ సినిమా స్టోరీని కాపీ కొట్టారంటూ నాని అభిమాని మద్రాస్ కోర్టులో కేసు వేసింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ మూవీలో హింస ఎక్కువగానే ఉందని టాక్ వచ్చినప్పటికీ భారీ విజయాన్ని అందుకుంది.హిట్1, హిట్2 చిత్రాలకు సీక్వెల్గా హిట్ 3 మూవీని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. అయితే, స్టోరీని కాపీ కొట్టారంటూ మహిళా రచయిత విమల్ సోనీ (Sonia Vimal) మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె నానికి వీరాభిమాని అని కూడా చెప్పారు. గతంలో తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V కథల నుంచి కాపీ కొట్టి హిట్ 3 సినిమా తీశారని ఆమె తెలిపారు. దీంతో హిట్ 3 సినిమా మేకర్స్ పై మద్రాస్ హైకోర్టులో కాపీ రైట్ కేసు వేశారు. ఈ క్రమంలో తను రచించిన ఒరిజినల్ కాపీని కోర్టుకు సమర్పించారు. గతంలో కూడా దర్శకుడు శైలేష్ కొలనుపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. వెంకటేశ్తో తాను దర్శకత్వం వహించిన 'సైంథవ్' సినిమా కథ కూడా కాపీ కొట్టారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. -
అందరిచూపు సౌత్వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్బాస్ 18 ఫేమ్, హీరోయిన్ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అన్నీ ప్రత్యేకమేదంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్ప్లే, విజన్ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.ఎగ్జయిట్ అయ్యా.. కానీ!తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్ మార్ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
అఖిల్ వెడ్డింగ్.. శోభితను అలా చూస్తుండిపోయిన నాగచైతన్య!
ఏడాది వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట రెండు పెళ్లిళ్లు జరిగాయి. గతేడాది నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడారు. ఆ తర్వాత ఇటీవలే అఖిల్ అక్కినేని సైతం ఓ ఇంటివాడయ్యారు. గతేడాది తన ప్రియురాలు జైనాబ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ 6న తన మెడలో మూడు ముళ్లు వేశారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో నాగచైతన్య- శోభిత పాల్గొని సందడి చేశారు. తమ్ముడి వెడ్డింగ్లో చైతూ- శోభిత స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు.తాజాగా వీరిద్దరి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పెళ్లి వేడుకలో శోభిత ధూలిపాళ్ల దోశ తింటూ ఉండగా.. పక్కనే నాగచైతన్య తన సతీమణి వైపే అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ వెడ్డింగ్లో తన భార్యతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు చైతూ. ఈ వీడియోను ప్రముఖ కేటరింగ్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో అఖిల్- జైనాబ్ జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. -
'పెళ్లి రోజే వధువు మరణిస్తే'.. ఆసక్తిగా టాలీవుడ్ థ్రిల్లర్ ట్రైలర్!
ఓటీటీలు వచ్చాక హారర్ అండ్ థ్రిల్లర్ కంటెంట్కు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ జోనర్లో ఎక్కువగా చిత్రాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ అలరించేందుకు వస్తోంది. యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్గా నటిస్తున్న ఈ థ్రిల్లర్కి 'విరాటపాలెం'. ఇటీవలే ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు.ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్కు పొల్లూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే ఓ గ్రామంలో పెళ్లైన వధువు అదే రోజు రాత్రి మరణిస్తుంది. ఇదంతా ఆ ఊరికి ఉన్న శాపం వల్లే గ్రామస్తులు భావిస్తారు. కానీ ఆ ఊరికి వచ్చిన లేడీ కానిస్టేబుల్ దీని వెనుక ఉన్న గుట్టును బయట పెట్టేందుకు యత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లతో ఈ కథను ఆసక్తికరంగా తెరెకెక్కించారు. ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా
జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా! అందులో రామ్పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్ ఖాన్తో రీమేక్ చేశారు. కానీ హీరోయిన్గా జెనీలియా (Genelia D'Souza)కు బదులుగా అసిన్ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో..సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.రుణపడి ఉన్నాతర్వాత యాంకర్.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు. ఎంజాయ్ చేశాతమిళంలో హరిణి (సంతోష్ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Anchor: South films never used to give solid roles.Genelia : No, I always got - if you see my South films, I've had the best roles ever. It was my learning ground. I am eternally indebted to the work that I got there.#GeneliaDeshmukh pic.twitter.com/OBOhFQAAqZ— Whynot Cinemas (@whynotcinemass_) June 18, 2025చదవండి: బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే -
బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే గూగుల్పే..
బిగ్బాస్ షోకు రెండుసార్లు వెళ్లొచ్చాడు గౌతమ్ కృష్ణ (Gautham Krishna). మొదటిసారి ఫినాలే వరకు చేరకుండానే ఎలిమినేట్ అయ్యాడు. రెండోసారి మాత్రం వైల్డ్ కార్డ్లా వెళ్లి వైల్డ్ ఫైర్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అతడు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ తన బిగ్బాస్ సంపాదనను బయటపెట్టాడు. బిగ్బాస్ షోలో నేను పది వారాలున్నాను. అందుకుగానూ నేను రూ.30 లక్షలు సంపాదించాను. నా సంపాదనలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడు వచ్చిందంటే.. 25 ఏళ్ల మురళీనాయక్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు.స్టేజీపై ఆర్థిక సాయంమరి నేనేం చేశాను? అని ఆలోచించుకున్నాను. అందుకే సమవర్తి అనే ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా సంపాదనలో సగం ఈ ట్రస్టుకే ఇస్తాను. అలా బిగ్బాస్ ద్వారా సంపాదించినదాంట్లో సగం అంటే రూ.15 లక్షలు ఈ సంస్థ ఖాతాలో వేస్తున్నాను. మొదటగా మురళీ నాయక్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను చచ్చేలోపు లక్ష మందికి సాయం చేయాలన్నదే నా కోరిక. నేను నా మాట నిలబెట్టుకోకపోతే నన్ను ఏకిపారేయండి అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే మురళీ నాయక్ కుటుంబానికి స్టేజీపై లక్ష రూపాయలు గూగుల్ పే చేశాడు. సోలోబాయ్ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.హోటల్లో దెయ్యాలు?ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి. దెయ్యంతో పోరాడలేనుభయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.కీరవాణిదీ అదే అభిప్రాయంఅలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్