Tollywood
-
ఓటీటీకి తిమ్మరాజుపల్లి టీవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అందరు కొత్తవాళ్లతో ఈ మూవీని తెరకెక్కించారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కెమెరా అసిస్టెంట్ సాయితేజ్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా అఫీషియల్గా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే..ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్ని రెంట్కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. One missing TV.One blamed thief.One village waiting for the truth.#ThimmarajupalliTV premieres on May 15 only on #aha.24 Hours early acess for #ahaGold users. pic.twitter.com/DeFV7M4wnj— ahavideoin (@ahavideoIN) May 7, 2026 -
శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)
-
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నవ్వడమే కాదు నవ్వించడం కూడా మరిచిపోతున్నారు
'నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం'.. ఈ సామెత మీలో చాలామంది వినే ఉంటారు. కానీ మీలో ఎంతమంది మనస్పూర్తిగా ఓ సినిమా చూసి నవ్వుతున్నారు? అని అడిగితే చాలామంది దగ్గర సమాధానముండదు. ఎందుకంటే జీవితంలో ఎవరికి వాళ్లు బిజీ అయిపోతున్నారు. నవ్వడం అనే విషయాన్ని రోజురోజుకీ మర్చిపోతున్నారు. ఒకప్పుడు బాధల్ని కాసేపు పక్కనబెట్టి మనసారా నవ్వుకునేందుకు సినిమాకు వెళ్లేవాళ్లు. ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో కామెడీ అరుదుగా మారిపోయింది. దాదాపు కనుమరుగైపోయే స్థితికి వచ్చేసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?ఒకప్పుడు తెలుగులో ఏడాదికి కనీసం 20-30 సినిమాలైనా కామెడీవి వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి అంటే ఒకటో రెండో అని వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి. దీనికి చాలా కారణాలున్నాయి. హీరోల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. ఎందుకంటే స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, మహేశ్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు తమ తమ సినిమాల్లో కొంత మేర అయినా కామెడీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కత్తి పట్టి విలన్లని నరకడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. దర్శకులు కూడా అలానే తయారవడం ఆందోళన కలిగిస్తోంది.అహ నా పెళ్లంట, జంబలకడిపంబ, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు.. కామెడీ కోసం ఇప్పటితరం కూడా పాత సినిమాల్నే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడొచ్చే వాటిలో సరైన కామెడీ ఉండట్లేదు. ఉన్నా సరే క్రింజ్, సిల్లీ కామెడీ ఉంటున్నాయి. వాటికి జనాలు నవ్వకపోగా దాన్ని చూసి కామెడీ ఇలా ఉందేంటి అని మరోలా నవ్వుకుంటున్నారు.ఒకప్పుడు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవన్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఈవీవీ, సునీల్.. ఇలా చెప్పుకొంటూ పోతే పదుల సంఖ్యలో హాస్య నటులు ఉండేవారు. వీళ్ల కోసం రచయితలు.. ఆయా సినిమాల్లో సెపరేట్గా కామెడీ ట్రాక్స్ రాసేవాళ్లు. అవి ఎంతలా వర్కౌట్ అయ్యేవి అంటే ఇప్పటికీ 'సొంతం' మూవీ అంటే సునీల్ మాత్రమే గుర్తొంచేంతలా. ఇందులో సునీల్ హీరో కాదు గానీ అంతలా అందరికీ గుర్తుండిపోయాడు.దూకుడు లాంటి సినిమాల్లోనూ హీరోకి సరిసమానంగా బ్రహ్మానందం పాత్ర ఉండే విషయం మర్చిపోకూడదు. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు తమ సినిమాల్లో దాదాపు కమెడియన్లు అందరినీ పెట్టి అద్భుతంగా నవ్వించేవాళ్లు.కానీ ఇప్పటి దర్శకులకు సరైన కామెడీ రాయడం చేతకావట్లేదు! ఒకవేళ రాసినా సరే ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని భయపడి చస్తున్నారు. ఎందుకీ బాధ అని ప్రతిఒక్కరూ రక్తపాతం టైపు స్టోరీలే తీస్తున్నారు. ఒకప్పుడు కోన వెంకట్ లాంటి రచయితలు శ్రీనువైట్ల లాంటి దర్శకుల దగ్గర ఉండేవారు. కానీ ఇప్పుడొస్తున్న దర్శకులంతా క్రెడిట్ అంతా తమకే దక్కాలని చూస్తూ రైటర్స్ని పెద్దగా ప్రోత్సాహించకపోవడం కూడా కామెడీ తగ్గిపోవడానికి కారణమని చెప్పొచ్చు.ప్రేక్షకుల విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలో కామెడీని కామెడీగా మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఏమైనా తేడా అనిపిస్తే ట్రోల్ చేసిపడేస్తున్నారు. లేదంటే క్రింజ్ కామెడీ అని ముద్రవేస్తున్నారు. మరోవైపు మొబైల్లోని యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్లో కనిపించే ఫాస్ట్ కామెడీకి అలవాటు పడిపోయి సినిమాల్లో నిదానంగా బిల్డ్ అయ్యే కామెడీని ఓపికతో చూడలేకపోతున్నారు. ఇలా అన్నివైపుల నుంచి పలు సమస్యల వల్ల హాస్యం అనేది ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై తెలుగు దర్శకనిర్మాతలు కాస్త దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే కొన్నాళ్లకు పూర్తిగా కామెడీ ఇక కనిపించదేమో? -
'మా ఉన్నది ఒక్కటే.. అవేవీ నమ్మొద్దు..'
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరుతో జరుగుతున్న మోసాలపై మా స్పందించింది. తమ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు తెలిసింది. ఇలాంటి ఎవరు కూడా నమ్మవద్దని మా సూచించింది. ఏపీ మా, మా ఏపీ పేర్లతో ఈ దందాకు తెరతీశారని వెల్లడించింది. అలాంటి అసోసియేషన్స్ ఏవీ లేవని.. రెండు తెలుగు రాష్ట్రాలకుల ఉన్నది కేవలం మా మాత్రమేనన పేర్కొంది.తప్పుడు పేర్లతో కొందరు అనధికార వ్యక్తులు కళాకారులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మా స్పష్టం చేసింది. ఇలా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరింది. మా పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేయడానికి అధికారం లేదని తెలిపింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ విషయంలో కళాకారులు అప్రమత్తంగా ఉండాలని మా విజ్ఞప్తి చేసింది. కాగా.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కొనసాగుతున్నారు. -
'థియేటర్లు ఇవ్వలేదు.. చిన్న సినిమాలను చంపేస్తున్నారు'
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై నటుడు, నిర్మాత షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా రీ-రిలీజ్కు కూడా థియేటర్లు ఇవ్వలేదని తీవ్ర ఆరోపిణలు చేశారు. మంచి సినిమాలను కిల్ చేస్తున్నారని.. చిన్న సినిమాలను నలుగురు రాక్షసులు చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.నైజాం ఏరియాలో ఓ అందాల రాక్షసి సినిమాకు ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదని మెహదీ ఆరోపించారు. ఈ విషయంపై లీగల్గా పోరాటం ప్రారంభించామని.. ఇండస్ట్రీ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చామని షెరాజ్ మెహదీ వెల్లడించారు. చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో ఉందని.. బాలీవుడ్లో కూడా ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయని.. ఏడీసీసీ వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయని తెలిపారు.‘చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి’..ప్రొడ్యూసర్, నటుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ… 'ఇండస్ట్రీలో పెద్దల ధోరణి చిన్న సినిమాల పాలిట శాపంగా మారింది. చిన్న నిర్మాతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. త్వరలో నిరాహార దీక్షలు చేస్తాం. ఈ మాఫియాపై ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం” అని హెచ్చరించారు. చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని.. వాటినే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మీడియా సపోర్ట్ అవసరం..నటి మధు మాట్లాడుతూ… 'నేను ఢిల్లీ నుంచి వచ్చాను. టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్ చాలా అవసరం, చిన్న సినిమాలను బతికిస్తేనే మా లాంటి నటీనటులకు అవకాశాలు వస్తాయి” అని అన్నారు.డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు దెబ్బ..నటుడు, మూవీ మూవీ మేకర్ కాళీ చరణ్ మాట్లాడుతూ.. 'చిన్న సినిమాల విడుదలకు డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సెన్సార్ నిబంధనలు కూడా ఆర్థిక భారంగా మారాయి. అనేక మంది చిన్న నిర్మాతలు తనలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నటుడు, నిర్మాత ఉప్పు రమేష్ మాట్లాడుతూ… “వీడే మన వారసుడు అనే మా సినిమాను అవార్డులకు అప్లై చేశాం. 25 వేల రూపాయల ఫీజు కూడా చెల్లించాం. కానీ, కనీసం అవార్డు ఫంక్షన్కు కూడా ఆహ్వానం లేదు. ప్రభుత్వం, ఇండస్ట్రీ రెండూ చిన్న సినిమాలను తొక్కెస్తున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి, చిన్న సినిమాలకు థియేటర్లు, సరైన అవకాశాలు కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న సినిమాలను కాపాడాలని, పరిశ్రమలో సమాన అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, ఇండస్ట్రీ పెద్దలను కోరారు. -
ఎట్టకేలకు కొత్త సినిమా మొదలుపెట్టిన నితిన్
2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది నితిన్కి దక్కట్లేదు. గతేడాది వచ్చిన 'తమ్ముడు' మూవీ ఘోరమైన డిజాస్టర్ అయ్యేసరికి లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. ఎట్టకేలకు కొత్త చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేశాడు. బుధవారం ఉదయం హైదరాబాద్లో పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. నారి-సోము దర్శకులుగా పరిచయమవుతున్నారు. నితిన్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా చేస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ మొదలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్కి ఊహించని అవకాశం?) View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
ప్రతి నిమిషం ప్రేమించే పోటుగాడు లేడు.. ట్రైలర్ రిలీజ్
సహాయ పాత్రలు చేసి గుర్తింపు పొందిన నందు.. ఈ మధ్య కాలంలో లీడ్ రోల్స్ చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఈ ఏడాది ప్రారంభంలో 'సైక్ సిద్ధార్థ' అంటూ వచ్చాడు గానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి సైకో తరహా పాత్రతో వచ్చేస్తున్నాడు. 'అగ్లీ స్టోరీ' పేరుతో తీసిన ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)భార్యపై అతి ప్రేమ చూపించి, ఆమెని అతిగా ప్రేమించే సైకోలా నందు నటించాడు. ఇతడి భార్యగా అవికా గోర్ చేసింది. వీళ్లిద్దరి జీవితంలో 'ప్రేమ' అనేది ఎంతటి విధ్వంసానికి కారణమైంది అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. నందుకి ఈసారైనా సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్కి ఊహించని అవకాశం?) -
బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
మృణాల్ ఠాకుర్కి ఊహించని అవకాశం?
కొన్ని సినిమాలు అనుకున్న వెంటనే ప్రారంభం కావు. ఎందుకో ఎవరికీ అర్థం కాదు. తెలుగులో అలాంటి ఓ మూవీ ఉంది. నాని, నితిన్, శర్వానంద్ ఇలా పలువురు హీరోలు నటిస్తారని టాక్ వచ్చిన ఆ మూవీలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు లీడ్ రోల్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఊహించని విధంగా మృణాల్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ప్రాజెక్ట్ ఎక్కడివరకు వచ్చింది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)స్వతహాగా కమెడియన్ అయినప్పటికీ 'బలగం' మూవీతో దర్శకుడిగా మారిన వేణు బంపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత 'యల్లమ్మ' పేరుతో ఓ మూవీ చేయాలి. రెండు మూడేళ్ల నుంచి దీని గురించి వినిపిస్తూనే ఉంది. కానీ ఎంతకీ ముందుకు కదలట్లేదు. అసలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందా లేదా అని చెప్పలేని పరిస్థితి.తొలుత ఈ సినిమాలో హీరోగా నాని చేస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ అతడు నో చెప్పడంతో నితిన్ లైన్లోకి వచ్చాడు. గతేడాది తన 'తమ్ముడు' మూవీ రిలీజ్ టైంలో జరిగిన ప్రమోషన్లలో నితిన్ దీని గురించి చెప్పాడు. కానీ 'తమ్ముడు' ఘోరమైన డిజాస్టర్ కావడంతో నితిన్ని సైడ్ చేశారు. తర్వాత శర్వానంద్ పేరు వినిపించింది. కట్ చేస్తే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ప్రకటించారు. ఓ వీడియోని కూడా రిలీజ్ చేసి షాకిచ్చారు.హీరో సెట్ అయ్యాడు గానీ హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలుత సాయిపల్లవి అన్నారు. ఆమె సెట్ అవ్వలేదు. తర్వాత కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఈమె కూడా లేదని అన్నారు. తర్వాత ఒకరిద్దరూ ట్రెండింగ్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ పనవ్వలేదు. ఇప్పుడు మృణాల్ ఠాకుర్.. 'యల్లమ్మ'లో హీరోయిన్ అని అంటున్నారు. మరి ఈసారైనా రూమర్స్ నిజం చేస్తారా లేదా అనేది చూడాలి?మృణాల్ తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. సీతారామం, హాయ్ నాన్న తోపాటు గత నెలలో రిలీజైన 'డెకాయిట్'లోనూ మృణాల్ అదరగొట్టేసింది. ఒకవేళ ఈమె గనుక 'యల్లమ్మ'లో నటిస్తే ఎలా ఉంటుందో చూడాలి?(ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై అట్రాసిటీ కేసు) -
ఆర్బీ చౌదరి అంత్యక్రియలకు చెన్నైలో ఏర్పాట్లు
90కి పైగా సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి.. రాజస్థాన్లోని ఉదయ్పుర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం విశాల్ హీరోగా ఈయన నిర్మాతగా 99వ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే 100వ మూవీపై ప్రకటన చేయాలనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో విషాదం నెలకొంది.(ఇదీ చదవండి: ఆర్బీ చౌదరి.. రాజస్థాన్ టూ సౌత్ ఇండస్ట్రీ.. ప్రస్థానం ఇలా..!)ఇకపోతే నేడు(మే 06) ఆర్బీ చౌదరి భౌతికకాయాన్ని చెన్నైకి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకురానున్నారు. మైలాపుర్లో ఉన్న ఆయన నివాసంలో అభిమానులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం తుది నివాళి అర్పించేందుకు ఉంచనున్నారు. గురువారం చెన్నైలో ఈయనకు అంత్యక్రియలు చేయబోతున్నారు.(ఇదీ చదవండి: తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో జీవా(వీడియో)) -
ఆర్బీ చౌదరి.. రాజస్థాన్ టూ సౌత్ ఇండస్ట్రీ.. ప్రస్థానం ఇలా..!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. ఆయన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించారు. పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు సంతాపం ప్రకటించారు.ఆర్బీ చౌదరి ప్రస్థానం..రాజస్థానీ కుటుంబానికి ఆర్బీ చౌదరి పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. ఆయన మొదట ఉక్కు, ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మలయాళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టారు. సూపర్ పేరుతో బ్యానర్ ప్రారంభించి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.గుడ్ నైట్తో భాగస్వామ్యం..గుడ్ నైట్ అనే దోమల నివారణ మ్యాట్లను తయారు చేసే ఆర్ మోహన్ను తన భాగస్వామిగా చేర్చుకున్నారు. ఇద్దరు కలిసి సూపర్ బ్యానర్లోనే సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయే సమయంలో గుడ్ నైట్ అనే బ్రాండ్లోని గుడ్ అనే పదాన్ని తీసుకుని సూపర్ గుడ్ ఫిల్మ్స్గా పేరు మార్చేశారు. ఆ తర్వాత ఇదే పేరుతో చిత్రాలు నిర్మించారు ఆర్బీ చౌదరి. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో చివరిసారిగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.స్వతహాగా రాజస్థానీ అయిన ఆర్బీ చౌదరి తమిళ్ అయిన మహజబీన్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు సురేష్ వారి సొంత నిర్మాణ సంస్థ అయిన 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. మరో కుమారుడు జీవన్ ఒక స్టీల్ కంపెనీని నడుపుతున్నారు. మూడో కుమారుడు జితన్ రమేష్ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు జీవా హీరోగా చాలా సినిమాలు చేశారు. జీవా రంగం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. జీవాకు టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. జీవ తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్ అయ్యారు. -
ఆర్బీ చౌదరి మరణం పట్ల వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్బీ చౌదరి మరణంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్బీ చౌదరి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని వైఎస్ జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసే విధంగా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్బీ చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్. -
బోర్ కొట్టేస్తున్న తెలుగు సినిమాలు.. ఎందుకిలా!?
తెలుగు దర్శకుల్లో చాలామంది తాము తీసేదే అద్భుతమైన కళాఖండం అనుకుని భ్రమపడుతున్నారు. బాగోలేదని ఒప్పుకోవడానికి కూడా వాళ్లకు మనసు రావట్లేదు. రొటీన్ ఫక్తు కమర్షియల్ అంశాలతో బోర్ కొట్టిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సంగతి అటుంచి ఏ జానర్ ట్రెండ్ అవుతుంటే దాని వెంట పడుతున్నారు. అయినా గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంతకీ డైరెక్టర్స్ అప్డేట్ అవ్వట్లేదా? లేదంటే ప్రేక్షకులు అడ్వాన్స్ అయ్యారా? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)టాలీవుడ్ అనగానే చాలామందికి కమర్షియల్ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ తరహా చిత్రాలే దాదాపుగా వచ్చేవి. అప్పట్లో మొబైల్, టెక్నాలజీ లాంటివి పెద్దగా లేకపోవడంతో సినిమా ఒక్కటే వినోద సాధనంగా ఉండేది. దీంతో లాజిక్స్ పట్టించుకోకుండానే మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఎక్కువపోయాయి. మొబైల్, టీవీ, క్రికెట్ ఇలా కళ్లముందు చాలానే కనిపిస్తున్నాయి. వీటన్నింటిని దాటుకుని సినిమా చూడాలంటే అందులో కచ్చితంగా సమ్థింగ్ స్పెషల్ ఉండాలి. ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో అదే మిస్ అవుతోంది.ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో కొన్ని అంశాలైనా ప్రేక్షకులు తమని తాము రిలేట్ చేసుకునేలా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి వాటిని డైరెక్టర్స్ మిస్ చేస్తున్నారు. కథల్లో సహజత్వం పెద్దగా కనిపించట్లేదు. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. కొత్తగా కామెడీ, డ్రామా సృష్టించడం లాంటివి చేయకుండా వింటేజ్ పేరు చెప్పి పాత సినిమాల్లో పాటలు, కామెడీని, డ్రామాని వాడేయాలని చూస్తున్నారు. అవి ఎందుకో సరిగా కుదరట్లేదు.(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)ఈ ఏడాదే తీసుకుంటే సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్' సినిమా తప్పితే ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. బైకర్, డెకాయిట్ లాంటివి కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి గానీ వీటిలో కథ ఉన్నప్పటికీ అనవసరమైన కమర్షియల్ అంశాలు చేర్చి సూపర్హిట్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇకపోతే 'నారీ నారీ నడుమ మురారి', 'యుఫోరియా', 'శ్రీ చిదంబరం గారు', 'కపుల్ ఫ్రెండ్లీ' లాంటి కొన్ని మూవీస్ మంచి కంటెంట్తో వచ్చాయి గానీ వీటికి థియేటర్లలో సరైన సపోర్ట్ దొరకలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాదరణ పొందాయి.మొత్తంగా చూస్తే చాలామంది దర్శకులు.. తెలుగు ప్రేక్షకుల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏం తీసినా చూస్తారులే అనుకుంటున్నారు. మరికొందరైతే ప్రమోషన్లలో నవ్విస్తున్నారు గానీ సినిమాలో తీసికట్టు కంటెంట్తో విసుగు తెప్పిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మలయాళ, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే, అవి కూడా బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తాడు. రొటీన్ కంటెంట్తో ఇంకా బోర్ కొట్టిస్తే వాటికి కూడా వెళ్లాలా వద్దా అని సందేహపడతాడు! అప్పుడు టాలీవుడ్కే కష్టకాలం!(ఇదీ చదవండి: ‘జన నాయగన్’.. నాడు శాపం నేడు వరం) -
'ఆ బాధ జీవితాంతం గుర్తుంటుంది..' మోహన్ బాబు ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ నటుడు, హీరో మోహన్ బాబు ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవలే మోహన్ బాబు క్యారెక్టర్ సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత విలన్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా సంగతి పక్కనపెడితే మోహన్ బాబు డైరెక్టర్స్ డే 2026 ఈవెంట్కు హాజరయ్యారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరి నారాయణరావును తలచుకుని ఎమోషనలయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఆయన బర్త్ డేను మనం సెలబ్రేట్ చేసుకున్నప్పటీకీ.. చాలా బాధకరమైన రోజేనని అన్నారు. తండ్రి లాంటి వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ నాకు జీవితమంతా ఉంటుందని తెలిపారు. ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి మోహన్బాబుగా ఈ స్థాయికి తీసుకొచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ జనరేషన్ వాళ్లకు చాలామందికి డైరెక్టర్ అనే పదానికి అర్థం తెలియదు.. దర్శకుడు అనే పదానికి సరైన అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావుగారే అన్నారు. -
రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్
ఏ వ్యాపారం అయినా లాభాల సంపాదనే కీలకం. దానికోసమే ప్రతిఒక్కరూ ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలా అని చూస్తుంటారు. మలయాళ దర్శకనిర్మాతల ఆలోచన ఇప్పుడు అదే. 'పుష్ప' ఫేమ్ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ఇదే విషయాన్ని తెలుగు నిర్మాత 'మైత్రీ' రవిశంకర్తో పంచుకోగా.. ఆ విషయాన్ని ఈయన ఇప్పుడు బయటపెట్టారు.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మలయాళ సీనియర్ నటుడు)'కేరళ ఇండస్ట్రీలో రూ.20 కోట్లతో సినిమా తీసి 'బాహుబలి' స్థాయి కలెక్షన్స్ ఎలా సాధించాలా అని ఆలోచిస్తున్నామని ఫహద్ ఫాజిల్ నాతో అన్నారు. చాలా ముచ్చటగా అనిపించింది. అలాంటి వందల వేల కోట్ల కలెక్షన్స్ చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ల ఆలోచన' అని 'మైత్రీ' నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన దాసరి జయంతి వేడుకల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు.ఫహద్ చెప్పింది గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది మలయాళం వచ్చిన 'లోక' సినిమానే తీసుకుంటే రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. కానీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెలరోజుల క్రితం రిలీజైన 'వాలా 2' సెన్సేషనల్ సక్సెస్ అయింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మలయాళ మేకర్స్.. తక్కువ బడ్జెట్ పెట్టి 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే మలయాళ సినిమాలపై జనాల్లో అభిప్రాయం మారింది. థియేటర్లలో వీలుకానప్పటికీ ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎగబడి చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులైతే కొన్ని మలయాళ మూవీస్కి ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు!ఫహద్ ఫాజిల్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా టాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. వేల కోట్ల కలెక్షన్స్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఫిక్సయిపోయింది. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సినిమాలు రాబట్టుకోలేకపోతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొందరు యువ దర్శకులు సైతం రూ.100 కోట్లకు పైనే నిర్మాతలతో ఖర్చు పెట్టించేస్తున్నారు. ఈ విషయమే చాలామంది నిర్మాతలని భయపెట్టేస్తోంది! ఫహద్ ఆలోచిస్తున్నట్లు మన దర్శకనిర్మాతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది! ఒకవేళ ఆలోచించినా ఇది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న!(ఇదీ చదవండి: కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం)Shocking Statement by #FahadhFaasil 🚨Actor #FahadhFaasiil told me that in the #Keralafilmindustry, we think about how to make #Baahubali level revenue Film with a 20 crore budget.:- Mythri #RaviShankar pic.twitter.com/X8CbrVJ8vC— Milagro Movies (@MilagroMovies) May 4, 2026 -
విడుదలకు సిద్ధమైన 'కృష్ణావతారం పార్ట్ 1'
'కృష్ణావతారంపార్ట్ 1' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారం(మే 07) థియేటర్లలోకి రానుంది. అత్యంత మహత్తరమైన దివ్యగాథతో తీసిన ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా సత్యభామగా సంస్కృతి జయన నటించారు. రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసి కృష్ణన్ కనిపించబోతున్నారు.హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సజన్ రాజ్ కురుప్, శోభాసాంత్, పూనం ష్రాఫ్, పార్థ్ గజ్జర్ నిర్మాతలుగా వ్యవహరించారు. నిర్మాతరాజ్ కురుప్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఆశయంతో పాటు బాధ్యతని మోసుకుని వస్తోంది. మనం లోతైన సాంస్కృతిక జ్ఞాపకాలలో ఉన్న కథని చెబుతున్నప్పటికీ, దాన్ని ఎంతో ఆత్మీయమైన మానవీయకోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. కృష్ణుడి ప్రయాణాన్ని సత్యభామ కళ్ల ద్వారా అనుభవించి ప్రేక్షకులు బయటకు వస్తే ఈ మూవీకి మేము న్యాయం చేసినట్టే' అని చెప్పుకొచ్చారు. ఈ కథ సత్యభామ కళ్ల ద్వారా ఆవిష్కృతమవుతూ కృష్ణుడి ప్రయాణం, అతని సంబంధాలు, భావోద్వేగ ప్రపంచాన్ని ప్రేక్షకులకు కొత్తగా, ఆత్మీయంగా చూపిస్తుంది. -
సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)
-
'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?
చిన్న సినిమాలు అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిపోతుంటాయి. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా గతేడాది వచ్చిన వాటిలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. తెలంగాణలో జరిగిన ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రంతో సాయిలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలో మెప్పించాడు. ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన అఖిల్ రాజ్, తేజస్వి కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో తానే హీరోగా చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల వదిలేశానని 'మేమ్ ఫేమస్' సుమంత్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నేనే చేయాలి. సుమంత్.. ఇది నువ్వే చేస్తే బాగుంటుంది అని సాయిలు(దర్శకుడు) అన్న చెప్పాడు. నేను కథ విన్నా. స్క్రిప్ట్ మొత్తం విన్న తర్వాత.. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని అన్నతో చెప్పా. పదిమంది మాట్లాడుకునే సినిమా ఇది అని చెప్పాను. అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ చేశా. మళ్లీ తెలంగాణ కథ చేశానంటే.. అయ్యో నేను ఇటు వెళ్లిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా. మీది 100 శాతం వర్కౌట్ అవుతుందని ఎప్పుడు అంటుండేవాడిని. చెప్పాలంటే నాకు నెరేట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. ఫస్టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా తీశాడు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా ప్రెజెంట్ చేశాడు'యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్తో నటుడిగా మారిన సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడు, నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'గోదారి గట్టుపైన' మూవీ చేశాడు. ఇది ఈ శుక్రవారం(మే 08) ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరుకి తగ్గట్లే గోదావరి బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. దీని ప్రమోషన్లలో భాగంగానే సుమంత్ ప్రభాస్.. 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో అవకాశం వదులుకున్న సంగతి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి) -
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ యూనియన్ సభ్యుల కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపుర్మెట్ దగ్గర డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1940ల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్. ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం.(ఇదీ చదవండి: విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!) -
భావోద్వేగాలు మెప్పిస్తాయి: నిర్మాత అభినవ్
‘‘నేను పదేళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నప్పటికీ సినిమాఅంటే ప్యాషన్ . యూనివర్సల్ సబ్జెక్ట్తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేయాలనుకున్నాను. అలాంటి కథ ‘గోదారి గట్టుపైన..’తో కుదిరింది. ఈ సినిమా కోసం సుమంత్ గోదారి యాస నేర్చుకుని నటించాడు. జగపతిబాబు–నిధిగార్ల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అని నిర్మాత అభినవ్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన..’. సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ–‘‘దర్శకుడు సుభాష్కు సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఈ కథలో ఎమోషన్ , కామెడీ, డ్రామా అన్నీ కుదిరాయి. నిర్మాత సునీల్గారు నాకు మార్గదర్శి. నా తొలి సినిమాలోనే జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాలగార్ల వంటి నటీనటులు ఉన్నారంటే ఇందుకు కారణం ఆయనే. నాగవంశీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాను ఏపీలో సురేశ్ బాబుగారు, నైజాంలో నేను–సునీల్గారు, సీడెడ్లో తిరుపతి ప్రసాద్గారు రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రం కూడా సుభాష్ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని చెప్పారు. -
ఏం జరుగుతుంది?
రాజ్ తరుణ్, అమృతా చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకంపై రాజ్ విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘నిద్రలో నడిచే అలవాటు ఉన్న హీరో ఒక అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? అనే కాన్సెప్ట్తో ‘టార్టాయిస్’ రూపొందింది’’ అని యూనిట్ సభ్యులు తెలిపారు. -
గ్రాండ్గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.కాగా.. వీఆర్కే రావు భారత వైమానిక దళంలో కమాండర్గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. -
హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్పై ట్రోల్స్..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్గా బరిలోకి దిగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్ విజయంపై అభినందనలు చెబుతున్నారు.అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ట్రోల్స్ మొదలయ్యాయి. విజయ్ విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. విజయ్లా పవన్ కల్యాణ్ తొలిసారి విజయం సాధించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా సీఎం కాబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.అయితే తమిళనాడు, ఏపీ రాజకీయాలను ముడిపెట్టొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లను పేర్లను ప్రస్తావిస్తున్నారు. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
టాలీవుడ్ రీఎంట్రీలో త్రిషకు 'సినిమా' కష్టాలు
త్రిష.. తెలుగులో చాలా సినిమాలు చేసిన స్టార్ హీరోయినే. కానీ గత పదేళ్లలో టాలీవుడ్లో నటించలేదు. చేసిన ఒక్క మూవీ 'విశ్వంభర' కూడా ఎప్పుడో రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీమ్, ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)'వర్షం'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. తర్వాత చిరంజీవి, మహేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, రవితేజ తదితర స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2016లో చివరగా 'నాయకి' మూవీ చేసింది. ఆ టైంలో ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ '96' అనే తమిళ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. అనంతరం పొన్నియిన్ సెల్వన్ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి 'విశ్వంభర' కోసం ఈమెని హీరోయిన్గా తీసుకున్నారు.2023లో విశ్వంభర చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. తాజాగా జూలైలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వచ్చాయి గానీ త్రిష పుట్టినరోజు విషెస్ చెబుతూ వదిలిన పోస్టర్లో డేట్ ఏం లేదు. అంటే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదనమాట. చూస్తుంటే త్రిషకు టాలీవుడ్ రీఎంట్రీ విషయంలో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది.పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ కథతో తీసిన 'విశ్వంభర'లో త్రిష హీరోయిన్ అయినప్పటికీ ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా తదితర హీరోయిన్లు కూడా ఇతర పాత్రల్లో నటించారు. వశిష్ఠ దర్శకుడు కాగా కీరవాణి సంగీతమందించారు. యువీ క్రియేషన్స్ రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టేసింది గానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతోనే రిలీజ్ ఎప్పుడో దర్శకనిర్మాతలు కూడా చెప్పలేకపోతున్నారు.(ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?)Team #Vishwambhara wishes the gorgeous @trishtrashers a very Happy Birthday ❤️Her portrayal of ‘Avani’ will be elegant and enchanting ✨MEGA MASS BEYOND the UNIVERSE 🌟In Cinemas Soon 💫MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @AbhishekOfficl @UV_Creations… pic.twitter.com/HbP8PgeMm9— UV Creations (@UV_Creations) May 4, 2026 -
ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఈ సామెతని అన్వయించుకుంటే.. సొంత భాషల్లో హిట్స్ కొట్టిన అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కానీ తమిళ హీరో ధనుష్ పరిస్థితి మాత్రం కాస్త చిత్రంగా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో వచ్చిన ఇతడి సినిమాలు, వాటి ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)ధనుష్ పేరు చెప్పగానే ఆల్రౌండర్ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా విభిన్న బాధ్యతల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాడు. మధ్య పాటల రాసేస్తుంటాడు. కుదిరితే పాడేస్తుంటాడు కూడా. వీటి విషయంలో ఇతడిని వంక పెట్టడానికి ఏం లేదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇతడి మూవీస్ చూస్తే మాత్రం పరభాషలో చేసినవన్నీ హిట్ అవుతున్నాయి. సొంత భాషలో చేసినవి మాత్రం అక్కడివరకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తుంది.గత కొన్నేళ్లలో తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ధనుష్.. అణిచివేత గురయ్యే తరహా పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు. దీంతో తమిళ ప్రేక్షకులకే ధనుష్ మూవీస్పై మొనాటనీ వచ్చేసింది. వేరే దర్శకులు తీస్తున్నా ధనుషే సొంత డైరెక్షన్ చేస్తున్నా కాన్సెప్ట్ దాదాపు ఇదే ఉంటోంది. ఈ తరహా చిత్రాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెద్దగా ఆడట్లేదు. గత రెండేళ్లలో రిలీజైన రాయన్, ఇడ్లీ కొట్టు తరహా చిత్రాలతో పాటు గత వీకెండ్ రిలీజైన 'కర' మూవీలో ఇదే తరహా కాన్సెప్ట్స్ ఉండటం మైనస్ అవుతోంది. ఇవన్నీ తమిళంలో ఓ మాదిరిగా ఆడుతుంటే మిగతా చోట్ల మాత్రం దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.మిగతా భాషల్లో మాత్రం ధనుష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'సర్'లో టీచర్గా ధనుష్ అదరగొట్టేశాడు. శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'లో బిచ్చగాడిగా మెప్పించాడు. గతేడాది చివరలో వచ్చిన హిందీ చిత్రం 'రే ఇష్క్ మై'లోనూ శ్రుతిమించే ఎమోషన్స్ ఉండే ప్రేమికుడిగానూ ఆకట్టుకున్నాడు. చూస్తుంటే ఎప్పుడో ఇంట గెలిచేసినా ధనుష్.. రీసెంట్ టైంలో మాత్రం సొంత భాషా సినిమాలతో హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అదే టైంలో తెలుగు, హిందీలో మాత్రం హిట్స్ కొడుతూ అదరగొట్టేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
ఆరంభం... ముగింపు అక్కడే!
‘‘వారణాసి’ చిత్రకథ వారణాసి ఘాట్లలో ఆరంభమై, అక్కడే ముగుస్తుంది’’ అని పేర్కొన్నారు ఎస్ఎస్ కార్తికేయ. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ‘కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్’లో ఈ చిత్రం వీడియో గ్లింప్స్ని ప్రదర్శించారు. ఆ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ... ఈ సినిమా వారణాసి ఘాట్స్లో ఆరంభమై, అక్కడే ముగుస్తుందని పేర్కొన్నారు.ఇంకా దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణం ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు కార్తికేయ. ఒక కొత్త కోణంలో రాజమౌళి చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని విధంగా ఉంటుందని, విజువల్గా స్టన్నింగ్గా ఉంటుందని కూడా పంచుకున్నారు. తెరపై కనిపించే ఈ 20 నిమిషాల ఎపిసోడ్ చిత్రీకరణకు దాదాపు 60 రోజులు పట్టిందట. ప్రస్తుతం ఈ సినిమా షూట్ అంటార్కిటికాలో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల కానుంది. -
పవర్ఫుల్ ఫైట్లో...
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ హై ఓల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ని హైదరాబాద్లో పూర్తి చేశారట మేకర్స్.ఫైట్ మాస్టర్ కెవిన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశం తెరకెక్కించారట. వెంకటేశ్పై చిత్రీకరించిన ఈ పవర్ఫుల్ ఫైట్ మూవీ క్లైమాక్స్లో వస్తుందని సమాచారం. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’లో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
సరికొత్త యాక్షన్ షురూ
గోపీచంద్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగులోకి అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత మల్లెమాల శ్యామ్ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత ‘దిల్’ రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, యలమంచిలి రవిశంకర్ స్క్రిప్ట్ను అందజేశారు.‘‘70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్’ వంటి గొప్ప నిర్మాణ సంస్థ ‘గోపీచంద్ 34’ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఒక సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది. వి. వెంకట్కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ బలమైన స్క్రిప్ట్ను తయారు చేశారు. గోపీచంద్ పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ఇంటెన్స్ డ్రామా, మంచి ఎమోషన్స్ ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్దత్, సంగీతం: సామ్ సీఎస్. -
లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
తెలుగులో చాన్నాళ్ల నుంచి గీత రచయితగా గుర్తింపు తెచ్చుకుని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఈయన సోదరుడు రాజేంద్ర గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)రాజేంద్ర.. వ్యాపారం కోసం బెంగళూరు నుంచి అన్నమయ్య జిల్లా కలికిరి నగరానికి వచ్చారు. తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం రాత్రి బసచేశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేసుకున్న తర్వాత కలికిరి క్రాస్ రోడ్లో ఓ హోటల్లో టిఫిన్ చేశారు. తర్వాత వెంటనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?) -
గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)
-
'ఫస్ట్ డేనే అలా చేయడం తప్పు.. ఫ్రీ షోలు వేయాలి'
డైరెక్టర్గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో రవిబాబు ఒకరు. తన టాలెంట్తో దర్శకుడిగా మాత్రమే కాదు.. హీరోగా కూడా మెప్పించారు. అలా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం రేజర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఇండస్ట్రీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా హీరోల అభిమానుల గురించి కూడా రవిబాబు ప్రస్తావించారు. వారి వల్లే హీరోలకు క్రేజ్ ఉందన్న మనందరికీ తెలుసు కదా అన్నారు. అలాంటప్పుడు ఫస్ట్ రోజే వాళ్ల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగడమేంటని ప్రశ్నించారు. మొదటి రోజు ఫ్యాన్స్కు ఉచితంగా సినిమా వేయొచ్చు కదా అని సూచించారు. నువ్వు రెండో రోజు నుంచి రూ.1000 తీసుకున్నా ఫర్వాలేదని రవిబాబు అన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఓటీటీకి అడివి శేష్ డెకాయిట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ. -
రామ్ చరణ్ - సుకుమార్ మూవీ క్రేజీ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కు పండగే..
-
'టాలీవుడ్లో కుల పిచ్చి ఎక్కువ'.. మహేశ్ విట్టా షాకింగ్ కామెంట్స్
యూట్యూబర్ కెరీర్ స్టార్ట్ చేసిన టాలీవుడ్లో నటుడిగా స్థిరపడిన కొద్దిమందిలో మహేశ్ విట్టా ఒకరు. చాయ్ బిస్కెట్ వెబ్ సిరీస్ల ద్వారా వినోదాన్ని పంచిన మహేశ్.. ఆ తర్వాత బిగ్బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్ సినిమాల్లో కమెడియన్గా తన నటనతో ప్రత్యేక ముద్రవేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూ హాజరైన మహేశ్ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ప్రస్తావించారు. తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.సినీ ఇండస్ట్రీలో కుల పిచ్చి ఎక్కువని సంచలన కామెంట్స్ చేశారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత నాకు రావాల్సిన రోల్స్ను చివరి నిమిషంలో వేరేవాళ్లకు ఇచ్చేవారని అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేయడం కూడా ఆపేసే వారని తెలిపారు. ఇక్కడ టాలెంట్ కంటే.. కులం ముఖ్యమని నాకు అర్థమైందన్నారు. అలా నాకు ఎన్నో అవకాశాలు రాకుండా పోయాయని మహేశ్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు.గత ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ..' నేను చాలా పాత్రలకు ఆడిషన్లు ఇచ్చేవాడిని. నన్ను సెలెక్ట్ కూడా చేసేవారు. షూటింగ్ తేదీలు కూడా ఫిక్స్ చేసేవారు. కానీ చివరి నిమిషంలో నాకు ఫోన్ చేయడం ఆపేయడం.. నా స్థానంలో మరో నటుడిని తీసుకోవడం జరిగేది. మొదట్లో ఇదంతా నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ విషయంపై ఆరా తీశా. నా స్థానంలో వచ్చిన వ్యక్తి నిర్మాత, దర్శకుడి సామాజిక వర్గానికి చెందినవాడేనని తెలిసి షాక్ అయ్యా. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం క్యాస్ట్ కారణంగా నాకు అవకాశాలు దక్కకపోవడం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసింది' అని అన్నారు.కాగా.. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. బిగ్బాస్ షోలోనూ రెండుసార్లు కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. సినిమాలు చేస్తూనే శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. -
అరుదైన దృశ్యం.. ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య..!
నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి విరూపాక్ష’ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల క్రితమే వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కన పెడితే టాలీవుడ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గతంలో విడిపోయిన నాగచైతన్య, సమంత ఓకే వేడుకలో మెరిశారు. చైతూ తన భార్య శోభిత ధూళిపాళ్లతో పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఇదే రిసెప్షన్కు సమంత సైతం తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. వీరిద్దరు ప్రముఖ నిర్మాత, ఏషియన్ సునీల్ కూతురు సిమ్రాన్ పెళ్లి రిసెప్షన్ హాజరు కావడం విశేషం.వీరిద్దరు విడిపోయి పెళ్లిళ్లు చేసుకున్నాక ఓ వేడుకలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఒక్కసారిగా అందరి కళ్లు వీరిద్దరిపైనే పడ్డాయి. ఇదే రిసెప్షన్లో నాగార్జున, అమల సైతం కనిపించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Naga Chaitanya and Sobhita Dhulipala at Simran (Sunil Narang's daughter) - Krish wedding reception. pic.twitter.com/zgVOmb4ABa— idlebrain.com (@idlebraindotcom) May 3, 2026 #TFNExclusive: All smiles as #Samantha along with her husband #RajNidimoru graced #SunilNarang’s daughter’s reception ❤️✨#SimranKrish #TeluguFilmNagar pic.twitter.com/twIKpdrAAz— Telugu FilmNagar (@telugufilmnagar) May 2, 2026 -
హీరోయిన్ యాక్షన్
‘హీరోయిన్లు అంటే హీరోల సరసన ఆడి పాడేందుకే పరిమితం’ అనే మాట ఇటు చిత్ర పరిశ్రమలో, అటు ప్రేక్షకుల్లో వినిపించేది. అయితే.. ఇదంతా గతం. ప్రస్తుతం మాత్రం ఏ విషయంలోనూ తాము తక్కువ కాదు అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పలువురు హీరోయిన్లు. పోలీస్, లాయర్, గృహిణి... ఇలా పాత్ర ఏదైనా బిగ్ స్క్రీన్పై తమదైన నటన చూపించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలకు కూడా సై అంటున్నారు. రిస్కీ సన్నివేశాలకు కూడా నో చెప్పడం లేదు. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్త, కీర్తీ సురేష్, కామాక్షి భాస్కర్ల... వంటి పలువురు హీరో యిన్లు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం. వినోదం... సందేశం తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీకళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయ్యారు కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్... వంటి పలువురు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి, తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ సినిమాలోనూ నటించడం లేదు. అయితే ఇతర భాషల్లో బిజీగా ఉన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అనేది క్యాప్షన్. డీకే చేతన్ దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే నిర్మించిన ఈ హిందీ సినిమా జూలై 24న రిలీజ్ కానుంది.జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపొందిన ఈ గ్రిప్పింగ్ సోషియో–నేషనల్ డ్రామా మూవీలో కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో నటించారు. ‘‘కెమికల్స్ దుర్వినియోగం, సాగులో పురుగు మందులు మితిమీరిన వినియోగం, దీని వెనుక ఉన్న భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంది. నేటి ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే మా ‘ది ఇండియా స్టోరీ’ కూడా ఉంటుంది.బలమైన సందేశం, ఆలోచింపజేసే స్క్రీన్ప్లే, స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్ తో వస్తున్న మా మూవీ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సినిమాలో కాజల్ ధైర్యవంతురాలైన న్యాయవాది పాత్రలో కనిపిస్తారు. కంపెనీల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బయటపెట్టే పాత్రను ఆమె పోషించారు. వినోదంతో పాటు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనే ఆలోచనతో రూపొందిన ఈ చిత్రం బలమైన కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఫ్యామిలీ డ్రామా ఓ వైపు హీరోయిన్గా, నిర్మాతగా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత. ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత ఆమె నటించిన మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రానికి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ‘ఓ బేబి’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన రెండవ సినిమా ఇది. ఇందులో గౌతమి, శ్రీలక్ష్మి, దిగ్నాథ్, ఆనంద్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాంక్ దువ్వూరుతో కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు నిర్మించారు.ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సమంత లుక్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రత్యేకించి ఈ మూవీలో సమంత యాక్షన్ సన్నివేశాలు హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ‘‘ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ , గ్రిప్పింగ్ స్టోరీ ఉండనున్నాయి. రా, హై ఇం పాక్ట్ యాక్షన్తో భారతీయ శైలిని మిక్స్ చేసిన సమంత పాత్ర ప్రేక్షకులకు సరికొత్తగా ఉంటుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘తస్సాదియ్యా...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా, చిన్మయి శ్రీ పాద, పుణ్య సెల్వ తమదైన శైలిలో ఆలపించారు. సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ ఈ పాటను విజువల్ ట్రీట్గా మార్చేశాయి. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ‘తస్సాదియ్యా...’ ఉంటుంది. ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేసిన ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందించడంతో ఈ మూవీకి మరింతగా హైప్ వచ్చింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా ‘మా ఇంటి బంగారం’ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఫాంటసీ ఎంటర్టైనర్ రష్మికా మందన్నా భలే జోరు మీద ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఆమె మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనూ నటిస్తున్నారు. రష్మిక కమిట్ అయిన తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్బో’. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో రష్మికకి జోడీగా మలయాళ నటుడు దేవ్మోహన్ నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్. ప్రభు తెలుగు– తమిళ భాషల్లో నిర్మించారు. ‘‘విభిన్నమైన రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో రష్మిక పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇప్పటి వరకూ చూడని సరికొత్త పాత్రలో ఆమె ప్రేక్షకులను అలరిస్తారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, కె.ఎం.భాస్కరన్ఛాయాగ్రహణం ఈ మూవీకి హైలెట్గా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ‘రెయిన్బో’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రష్మిక నటించిన సెకండ్ లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా 2025 నవంబరు 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. రష్మిక చేసిన తొలి సినిమా ‘రెయిన్బో’ విడుదల కాకమునుపే సెకండ్ ఫిల్మ్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ విడుదలవడం విశేషం. మైసా యాక్షన్ రష్మికా మందన్న నటిస్తున్న మరో పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో గోండు గిరిజన అమ్మాయి మైసాగా కనిపించనున్నారామె. ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకున్నారు రష్మిక. రా, రియల్గా అనిపించే యాక్షన్ పెర్ఫార్మెన్స్ కోసం బ్యాంకాక్కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్లో శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వా¯Œ్డ్స స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఆమె శిక్షణ పొందిన ఫొటోలు చూస్తే సాధారణంగా కనిపించే సాఫ్ట్ నేచర్ ఇమేజ్కు పూర్తి భిన్నంగా, ఈ చిత్రంలో ఒక దృఢ సంకల్పంతో కూడిన యోధురాలిలా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘ పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల యాక్షన్ ΄్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ కేరళలో ప్రారంభించాం.కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్గా నిలుస్తాయి. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మూవీకి శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ సంగీతం హైలైట్గా నిలుస్తాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేయబోతోంది. ఈ మూవీలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశారు రష్మిక’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కోర్టు రూమ్ డ్రామా... ‘మహానటి’ చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక అభిమానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్. ‘నేను శైలజ, నేను లోకల్, సర్కారు వారి పాట, దసరా’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె పెళ్లి కోసం కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు కెరీర్లో మళ్లీ స్పీడు పెంచారు కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగులో ‘రౌడీ జనార్ధన’తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వెంకటేశ్కి జోడీగా నటిస్తున్నారు. అలాగే మలయాళం, హిందీ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.మిస్కిన్, బాల శరవణన్, చారుకేశ్, శిల్పా మంజునాథ్ ఇతర పాత్రలు పోషించారు. డ్రమ్స్టిక్స్ ప్రోడక్షన్స్ , జీ స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. కోర్టు రూమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ నుంచి విడుదలైన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ‘ప్రశాంతమైన ముఖం.. అజేయమైన శక్తి.. ఇప్పుడు అంతా ఆమె వంతు’ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కోర్టు వాతావరణంలో లాయర్ల మధ్య నిలబడి ఉన్న కీర్తి... సాధారణ చుడీదార్ ధరించి, నుదుట, పాపిట్లో కుంకుమ బొట్టుతో కనిపిస్తోంది. ఆమె కళ్లలో అమాయకత్వం కనిపిస్తున్నప్పటికీ, ఏదో గట్టి పోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉంటుందట. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.మహాదేవిగా... ‘శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్ రాజు. నిర్మాత నుంచి డైరెక్టర్గా మలుపు తీసుకున్న ఆయన ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రోడక్ష¯Œన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల నటించిన మహాదేవి పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల ఆమె లుక్ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ మూవీలో ‘డర్టీ హరి’ మూవీ ఫేమ్ శ్రవణ్ రెడ్డి సింహ అనే పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా ప్రముఖ నటీనటులు మంజుల–విజయ్ కుమార్ మనవరాలు, నటి వనిత కుమార్తె జోవిక తెలుగులో పరిచయం అవుతున్నారు. హరిణి పాత్రలో ఆమె నటించినట్లు పేర్కొంటూ ఇటీవల ఆమె లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘అగధ’లోని దైవిక, ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్.. దాదాపు 45 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్తో మా మూవీ ఆడియన్స్కి గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పైన పేర్కొన్న హీరోయిన్లే కాదు.. మరికొంత మంది కథానాయికలు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్లో.. ‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్... రెండు కులాలు, రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల’ అంటూ ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి చేసిన అల్లరి ప్రేక్షకులకు బాగా నచ్చింది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడిపడి లేచె మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్’ వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు సాయి పల్లవి. ‘తండేల్’ మూవీ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రం ఏదీ ఒప్పుకోలేదు. కానీ, హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్సి గ్నల్ ఇచ్చారని, అది కూడా లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ అని టాక్. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ తెరపైకి రానున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు ఈ మూవీ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటించనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ప్రీ–్ర΄÷డక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ టాక్.ఇదిలా ఉంటే... సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ నుండి తప్పుకున్నారని, ఆ అవకాశం రుక్ష్మిణీ వసంత్కు దక్కిందనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. మరి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర చేసే అవకాశం సాయి పల్లవికి దక్కుతుందా? లేదా రుక్ష్మిణీ వసంత్ని వరిస్తుందా? అన్నది వేచి చూడాలి. పవర్ఫుల్ పోలీస్ తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ... ఇలా దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంయుక్త. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీకి తొలిసారి తెలుగులో ఆమె సంతకం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్’ సినిమా ముందుగా విడుదలైంది. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూ పాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహించారు. మురళీ శర్మ, రావు రమేశ్, నాజర్, మనీష్ వాధ్వా, రామ్కి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం, సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, మజాకా’ వంటి సినిమాలు తీసిన రాజేశ్ దండా హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్స్పై ఈ సినిమా నిర్మించారు. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల నేపథ్యంలో, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ కథని మరింత గ్రిప్పింగ్గా తీర్చిదిద్దారు యోగేష్.స్క్రిప్ట్లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. సంయుక్త కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్లో చిత్రీకరించాం. మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్లో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఐదు పవర్ఫుల్ షెడ్యూల్స్లో, పదికి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరించాం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలుంటాయి.ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించాం. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించాం. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందించిన ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.– డేరంగుల జగన్ మోహన్ -
యాక్షన్కి డేట్ ఫిక్స్
నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్కుమార్ జంటగా నటించిన పోలీస్ కంప్లెయింట్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 22న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.సంజీవ్ మేగోటి మాట్లాడుతూ–‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాం. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే ఈ కథకి హారర్, థ్రిల్లర్ అంశాలను జోడించాం’’ అని తెలి పారు. -
అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్
'కాంతార' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషభ్ శెట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనతో జరిగిన భేటీ.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఒకటని రాసుకొచ్చాడు. ఈ మేరకు తామిద్దరి మధ్య సినిమాల గురించి చర్చ జరిగినట్లు చెబుతూ రెండు ఫొటోలని రిషభ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)'కాంతార, కాంతర ఛాప్టర్ 1 సినిమాల గురించి అమితా షా మాట్లాడుతూ వాటిని ప్రశంసించడం గొప్ప అనుభూతి. నా తర్వాత చిత్రాల విశేషాలని కూడా ఆయనతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మన చరిత్ర, సంస్కృతి, కళలు, సినిమా మేకింగ్ గురించి ఆయన మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.రిషభ్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'జై హనుమాన్' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. అలానే శివాజీ జీవితం ఆధారంగా తీస్తున్న మరో పాన్ ఇండియా మూవీ, సితార సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం కూడా చేయాల్సి ఉంది. 'కాంతార' ఫ్రాంచైజీలో మూడో భాగం అయితే ఇప్పట్లో రాకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి) View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి
కార్తీకదీపం సీరియల్ పేరు చెప్పగానే అందరికీ దీపనే గుర్తొస్తుంది. వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోనే ఈమె తల్లి సుమిత్రగా చేస్తున్న నటి సీత గురించి చాలామందికి తెలుసు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. అయితే ఈమె అప్పుడప్పుడు బుర్కా ధరించడం, నమాజ్ చేస్తుండటంపై వస్తున్న ప్రశ్నలకు రీసెంట్గా క్లారిటీ ఇచ్చింది. తను రెండో పెళ్లి చేసుకోవడం గురించి కూడా వివరణ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)'చాలారోజులుగా నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా ఫాలోవర్స్కి నాపై చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు. సీతాలక్ష్మీ అనే పేరు ఉంది కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా? ఎందుకు పెట్టుకోవడం లేదని అడుగుతుంటారు. మీరు బుర్కా ఎందుకు ధరిస్తున్నారని కూడా అడుగుతున్నారు. కావాలనే వేసుకుంది, నటిస్తుందని అంటుంటారు. ఇలా చాలామందికి అర్థం కావట్లేదు. వాటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరు సీతాలక్ష్మీ. అది అమ్మనాన్న పెట్టిన పేరు. నా ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటైల్స్ అన్నింటిలో అలానే ఉంది. అయితే నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకముంది. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. దాన్నుంచి బయటకు రావడానికి నాలుగేళ్ల పట్టింది. 2013 తర్వాత నాలుగేళ్లు యాక్టింగే చేయలేదు. ఎందుకంటే అప్పుడు నాకు విడాకులయ్యాయి. ఇది ఎందరికీ తెలుసో తెలీదు. కానీ నిజం చెప్పడానికి బాధపడను. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదు''నాకు విడాకులు అయిన తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతడితో చెప్పుకొన్న తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. తోడు కావాలని ఓకే చెప్పేశాను. అలా అతడిని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఆయన వైపు వాళ్లు నన్ను అంగీకరించారు. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. ఆయాస్ అని పిలుస్తారు. నా గురించి అంతా తెలిసిన వ్యక్తి. నన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా మేం ఒక్కటయ్యాం. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ల మతంలోకి మారాల్సి వచ్చింది. మా ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదు. అత్తగారింట్లో సపోర్ట్ కావాలంటే కొన్ని చేయకతప్పదు. అందుకే వాళ్ల వైపు వెళ్లిపోయా. అలా మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి కాస్త యాస్మిన్ అయింది. వాళ్లు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. సీత అని పిలవరు''పేరు మార్చుకుంటే ఇండస్ట్రీలో కుదరదు కాబట్టి సీత అని అలానే ఉంచేసుకున్నా. నా భర్త వైపు వాళ్లు మాత్రం యాస్మిన్ అనే పిలుస్తారు. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయను. అందుకే బుర్కా ధరిస్తాను. అయితే వాళ్లు ఇలానే ఉండాలి, అలాగే ఉండాలి అని నన్ను బలవంతం చేయరు. షూటింగ్కి వచ్చినప్పుడు మాత్రం నచ్చినట్టు ఉంటాను. అందుకే ఒకసారి బొట్టు పెట్టుకుంటాను. ఇంకోసారి పెట్టుకోను. అంతే తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇవేం ఉండవు. నాకు మతపరమైన ఫీలింగే లేదు. నా జీవితంలో చాలా ఆశపడ్డాను. కానీ ఒక్కటీ జరగలేదు. విడాకులు అవుతాయని కలలో కూడా ఊహించలేదు. రెండో పెళ్లి కూడా ఊహించలేదు' 'దేవుడు ముందే అంతా నిర్ణయించి ఉంటాడు. రాసినదాన్ని తప్పించుకోలేం. వద్దంటే ఆగిపోదు.. కావాలంటే రాదు. మా అత్తగారి ఇంటి వాళ్ల కోసం అలా మారాను. నేనే తప్పు చేయడం లేదు. నేను అల్లాని మొక్కుతా. నమాజ్ చేస్తా. నిజాయితీగా ఉంటా. నేను ఎవరికీ చెడు చేయలేదు. నేను కష్టపడుతున్నా. నేను తింటున్నా. నా బాధలైనా ఆనందం అయినా దేవుడితోనే, అది ఏ దేవుడైనా అయ్యి ఉండొచ్చు' అని సీత వివరణ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ) -
వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' రిలీజ్ ఎప్పుడంటే?
విలనిజం, క్యారెక్టర్ రోల్.. ఏదైనా సరే తనదైన నటనతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్కుమార్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. నవీన్ చంద్రతో కలిసి నటించిన 'పోలీస్ కంప్లైంట్'.. మే 22న థియేటర్లలోకి రానుంది. సంజీవ్ మేగోటీ దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కృష్ణసాయి నటించారు. ఇతడి బర్త్ డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్ 10 సార్లు లైంగికంగా వేధించాడు: మోనాలిసా) -
పెద్దిలో చరణ్ మూడో లుక్.. మెగా అభిమానులకు సర్ ప్రైజ్
-
మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)
-
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్మీట్కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మనుషులనే వదలరు.. కుక్కలను వదిలేస్తారా?.. రేణు దేశాయ్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మూగ జీవాలకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడైనా వాటిని హింసించినా.. హానీ తలపెట్టినా తన దృష్టికి వస్తే రియాక్ట్ అవుతూ ఉంటోంది. తాజాగా కొద్ది రోజులుగా కుక్కల రక్తం తీసి అమ్ముకుంటున్నారని ఓ వార్త తెగ వైరలవుతోంది. హైదరాబాద్లోనే ఈ దందా నడుస్తోందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ అయింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..'గత మూడు రోజులుగా మనం వింటున్నాం. అసలు ఈ రక్తం ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? ఇద్దరిదీ తప్పే. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేవారు కుక్కలను వదిలేస్తారా? కానీ కొంచమైనా భయం, భక్తితో ఉండండి. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ మన పిల్లకు తగులుతుందని మైండ్లో పెట్టుకోండి. కుక్కల రక్తంతో డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. వీధి కుక్కలతో ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కుక్కలు, పిల్లులతో ఇలా చేస్తే అది పెద్ద కర్మ. అందరికీ డబ్బు కావాలి. కానీ ఇలా సంపాదించడమనేది ఎంతవరకు సమంజసం' అంటూ మాట్లాడింది.నిన్న కూడా ఫస్ట్ టైమ్ నన్ను మోసం చేశారని రేణు తెలిపింది. మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే పగిలిన పోయినవి వచ్చాయని వెల్లడించింది. ముసలి వాళ్లను టార్గెట్ చేసి.. ఓటీపీలు తీసుకుని మోసాలు చేస్తున్నారు. రాక్షసులైతేనే ఇలాంటి పనులు చేస్తారని.. మనుషులైతే ఇలా చేయరని రేణు మండిపడింది. చెడు మార్గాలు, మోసాలు, గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నాలను ఆపాలని రేణు దేశాయ్ కోరింది. నిజాయితీగా, కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడని హితవు పలికింది. ఎందుకంటే కర్మ అనేది నిజం.. అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది. ఆ దేవుడు అంతా గమనిస్తూ ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందరు సురక్షితంగా ఉండాలని రేణు దేశాయ్ కోరింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఓటీటీలోకి డెకాయిట్.. స్టీమింగ్ ఎప్పుడంటే..!
-
చెప్పు శ్రీని.. కొత్త కోడలి వీడియో వైరల్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రియురాలు కావ్యని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి తిరుమల వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న నూతన వధూవరులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకునే సరికి చిన్నపాటి ఆటపట్టించడం లాంటివి జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ తమ పేర్లు చెప్పే ఇంట్లోకి అడుగుపెడతారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి కూడా అలానే చేశారు. ముందుగా కొత్త కోడలు కావ్య మాట్లాడుతూ.. నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అని చెప్పింది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ .. మా ఇంటికి మా ఆవిడని తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి' అని నవ్వేశాడు. కావ్య కూడా తన భర్తను 'చెప్పు శ్రీని' అడగడంతో పాటు కుటుంబ సభ్యులు పట్టుబట్టేసరికి.. నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను అని అనేశారు.ఇకపోతే నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు గానీ చెప్పుకోదగ్గ హిట్స్ ఏం లేవు. గతేడాది 'కిష్కింధపురి'తో వస్తే ఇది యావరేజ్గా నిలిచింది. ప్రస్తుతం హైందవ, టైనస్ నాయుడు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)After wedding at Tirumala, the newlyweds #BellamkondaSreenivas and his wife Kavya have gracefully arrived at their home in Hyderabad, marking the beginning of a beautiful new chapter in their lives.❤️🔥✨@BSaiSreenivas pic.twitter.com/PvUQUqRgA0— H A N U (@HanuNews) April 30, 2026 -
సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)
-
అషురెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి.. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి.. హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఈమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈమె.. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం తదుపరి విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే హైకోర్టు.. మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోట్ని అషు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)'గత కొన్నిరోజుల నుంచి నాపై మీడియా, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్స్ నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నాపై వచ్చిన ఆరోపణల కేసు.. కోర్టు పరిధిలో ఉంది. నా పరువుకు భంగం కలిగించే కంటెంట్ ప్రసారం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇది గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, నెటిజన్లని కోరుతున్నా. కోర్టు ఆదేశాల మేరకు నాపై ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని, కొత్తవి పబ్లిష్ చేయకుండా సహకరించాలని కోరుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి' అని అషురెడ్డి చెప్పుకొచ్చింది.ఇకపోతే ఈ కేసు విషయం బయటకొచ్చిన తర్వాత తామేం తప్పు చేయలేదని అషురెడ్డి, ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అషురెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర తిరిగి ఇచ్చేస్తా, మిగిలిన డబ్బులు జీవితంలో స్థిరపడినప్పుడు ఇచ్చేస్తా అని ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లు ఉంది. మరోవైపు ధర్మేంద్రకు సంబంధించిన ఆరు నిమిషాల ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు మాట్లాడుతూ అప్పు చేసి మరీ అషురెడ్డికి డబ్బులిచ్చానని.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్లే కేసు పెట్టాల్సి వచ్చిందని మాట్లాడినట్లు ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
తండ్రి కాబోతున్న నారా రోహిత్.. ఆ ఇద్దరు కూడా
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాల హడావుడితోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే తిరుమలలో పెళ్లి చేసుకున్నాడు. అంతకు రెండు నెలల ముందు హీరోయిన్ రష్మిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇదలా ఉండగానే టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు శుభవార్తలు చెప్పేశారు.(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్ తదితర సినిమాల్లో నటించిన హీరోయిన్ రెబా మోనికా జాన్, తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. థాయ్లాండ్లోని బీచ్లో భర్తతో దిగిన ఫొటోలని షేర్ చేసింది. త్వరలో తాము ముగ్గురు కాబోతున్నామని చెప్పింది. దీంతో ఈమెకు విషెస్ తెలియజేస్తున్నారు.గతేడాది అక్టోబరులో పెళ్లి చేసుకున్న హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఇతడి భార్య, నటి శిరీష ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. రీసెంట్గా సీమంతం వేడుక జరగ్గా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారికంగా ఈ విషయాన్ని అయితే ఈ జంట బయటపెట్టలేదు. 'ప్రతినిధి 2' మూవీ చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డ రోహిత్-శిరీష.. పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు.'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా నటించిన కన్నడ ధనంజయ భార్య ధన్యత కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని తాజాగానే ఈ జంట ప్రకటించారు. తమ ప్రపంచం పెరగనుందని చెబుతూ ఫొటోలని పంచుకున్నారు. కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తెలుగులో 'పుష్ప' కాకుండా ఒకటి రెండు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Dr. Dhanyatha Gauraklar (@dr.dhanyatha_gauraklar) View this post on Instagram A post shared by Harsha clicks 📸 (@kissik_celeb_) -
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు
-
అమ్మోరే దిగినాది...
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన సినిమా ‘అనకాపల్లి’. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించి, ఓ కీలక పాత్రలో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకంపై కాండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.‘‘కుంకాల పోగుంది... పసుపంటి నేలుంది... కాగడాల చమురు కాలుతూ నవ్వింది.... ఘల్లన్న ఈ గజ్జలు ఎవరంటూ చూశాము... చింతానిప్పుల వెనక నల్ల రాతిరిలాగా... నల్ల రాతిరిలాగా... అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’అంటూ సాగే ఈ జాతర పాటకు గణేష్ సలాది సాహిత్యం అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు దేవ్ జండ్ స్వరకల్పనలో మంగ్లీ పాడారు. ‘‘యూత్ ఎలిమెంట్స్, లవ్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్లో ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ బైకర్ (తెలుగు మూవీ) - మే 01 రాకాస (తెలుగు సినిమా) - మే 01 గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01స్వాప్డ్(యానిమేషన్ మూవీ)- మే 01మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01పార్ట్టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03క్లీకా (హాలీవుడ్)- మే 03ఆహాసోదర(తెలుగు మూవీ)- మే 01అమెజాన్ ప్రైమ్ సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01 యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01జీ5ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01హెచ్బీవో మ్యాక్స్..ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01సన్ నెక్ట్స్మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01హులు..హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01 -
సమంత మా ఇంటి బంగారం.. పెద్దితో పోటీ పడనుందా?
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ టైమ్లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. -
'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' ఫుల్ కామెడీగా జెట్లీ ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్లో వచ్చే సీన్స్ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. -
పెళ్లి వేడుకలో సీనియర్ నటి శారద.. ఇప్పుడెలా ఉందో చూశారా?
సీనియర్ హీరోయిన్ శారద ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆమెను చూసిన మెగాస్టార్ దంపతులు దగ్గరికి వెళ్లి పలకరించారు. ప్రస్తుతం ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో శారద అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్ డైలాగ్స్తోనూ సినిమాల్లో మెప్పించారు. కాగా.. కన్యా శుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు. అయితే శారద మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటి అయినప్పిటికీ.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ రేంజ్కు ఎదిగారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు.. తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. తెలుగులో అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, స్టాలిన్, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు.సీనియర్ హీరోయిన్ శారద గారు...#Chiranjeevi Garu @KChiruTweets #Saradha #Actress pic.twitter.com/wzXLhpHaXs— Suresh Kondeti (@santoshamsuresh) April 29, 2026 -
ప్రముఖ నటి కూతురు.. ఫస్ట్ సినిమా పోస్టర్ విడుదల
ప్రముఖ నటి వనితా విజయ్కుమార్ కూతురు జోవిక టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా అగధ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. స్టార్ కిడ్గా గుర్తింపు ఉన్న జోవిక తమిళ్ బిగ్ బాస్ సీజన్- 7లో కనిపించిన విషయం తెలిసిందే.. తమిళ్లో గతేడాది మిసెస్ & మిస్టర్ మూవీతో అలరించిన జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రానున్న చిత్రం అగధ.. మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్ని కొద్దిరోజుల క్రితమే రివీల్ చేశారు.‘‘డర్టీ హరి’ చిత్రంతో గుర్తింపు తెచ్చకున్న శ్రవణ్ రెడ్డికి ఎం.ఎస్. రాజు. మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్... విస్తృతమైన సెట్ వర్క్... దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. View this post on Instagram A post shared by Sri Adi Varaha Productions (@sriadivarahaproductions) -
అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా: త్రిష
ఇటీవల సెంటర్ ఆఫ్ ది మీడియాగా మారిన నటి త్రిష.. చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్టాపిక్గా మారారు. దీంతో ఆమె సోషల్మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతుంది. రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష.. కోలీవుడ్లోని అతి కొద్దిమంది మోస్టెస్ట్ బ్యాచిలర్ నటీమణుల్లో ఒకరు. ఈ విషయం కూడా ఈమెను వార్తల్లో నిలబెట్టడానికి ఒక కారణం కావచ్చు. నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఫ్రెండ్ కావడంతో ఈమె రాజకీయాల్లోనూ ఎక్కువగా నానుతున్నారు. దీంతో త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని, సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే నటనకు స్వస్తి చెప్పడం లేదని చెప్పే విధంగా ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈమె మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసే ఫొటోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. త్రిష రాత్రి వేళ మేలుకుని ఉంటారనే ప్రచారం ఉంది. ఇటీవల త్రిష తన ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి రికవరీ అవడానికి 4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తాననే భావన కలుగుతోంది అని పేర్కొన్నారు. దీంతో త్రిష మాటల్లో అర్థం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. త్రిషకు సరిగా నిద్ర పట్టడం లేదా, ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా..? వంటి ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. -
స్టార్ హీరోపై జెడి చక్రవర్తి సంచలన ఆరోపణలు.. ఇండస్ట్రీని కుదిపేసే వార్త
టాలీవుడ్ నటుడు జెడి చక్రవర్తి సుమారు 35ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్నారు. తన ప్రయాణం శివ సినిమాతో మొదలైన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ స్టేటస్ను ఆయన అందుకున్నారు. హీరోగా ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమలోనే అతిపెద్ద స్టార్ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పేరు రివీల్ చేయకుండానే బిగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే కామెంట్స్ను షేర్ చేశారు.మనం అభిమానించే వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలియకుండానే గౌరవం పెంచుకుంటే అది పొరపాటే అంటూ తనకు ఎదురైన ఒక సంఘటనను జె. డి. చక్రవర్తి ఇలా పంచుకున్నారు.'ఒక నటుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ, అతని పేరు మాత్రం చెప్పను. ఆ హీరో అంటే నాకు మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాకు కూడా ఆయన అంటే గౌరవం. అలాగే నిజ జీవితంలో ఉంటారని అనుకున్నాను. కానీ, సినిమా సెట్స్కు ఆయన ఆలస్యంగా వస్తారు సార్ అని నాతో కొందరు చెప్పారు. ఎందుకంటే..? రాత్రి తాగింది దిగలేదన్నారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజమా..! ఆయన తాగుతారా..? అని ప్రశ్నించాను. ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది. హోటల్లో కూడా బస చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం తన గర్ల్ఫ్రెండ్తో ఉంటున్నారని చెప్పడంతో ఆయనకు పెళ్లైంది కదా అన్నాను. లేదు గర్ల్ఫ్రెండ్తోనే ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు వరకు ఆయనకున్న ఇమేజ్ను బట్టి నేను కూడా మహానుబావుడు అనుకున్నాను.' అని రియాలిటీ మరోలా ఉంటుంది అనేలా జెడి చక్రవర్తి పేర్కొన్నారు. అయితే, ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం ఆయన రివీల్ చెయలేదు. Huge controversy!!!! pic.twitter.com/NZCOl6wIzn— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 29, 2026 -
తిరుమలలో వైభవంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో బుధవారం రాత్రి వారి వివాహం జరిగింది. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్య రెడ్డి తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది ‘కిష్కింధపురి’ చిత్రంతో హిట్ కొట్టాడు. . ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ అనే ఆసక్తికరమైన రెండు ప్రాజెక్ట్లలో పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Beautiful Tirupathi 2.0 (@beautifultirupathi_2.0) -
అల్లు అర్జున్ రాకా.. నార్త్లోనూ కేక..!
పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదిలోనే కాదు..నార్త్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. పుష్ప-2 రిలీజ్ టైమ్లో బీహార్లో గ్రాండ్గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 నార్త్లో కేవలం హిందీలోనే రూ. 812 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో బన్నీకి ఉత్తారాదిలోనూ భారీస్థాయిలో మార్కెట్ ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెరకెక్కుతోన్న రాకా మూవీపై నార్త్ ఆడియన్స్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం బిహార్లో తీవ్రమైన పోటీ ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటికే 'రాకా' చిత్ర నిర్మాతలను సంప్రదించారని తెలిపింది.ఈ మూవీ రైట్స్ కోసం భారీ ధర చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారట. ఇదంతా చూస్తుంటే బిహార్లో బన్నీకి ఎంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ మూవీ బీహార్తో పాటు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు రాకా సినిమాకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
బేబీ కాంబో రిపీట్.. ఎపిక్ టీజర్ చూశారా?
బేబీ మూవీ జోడీ మరోసారి బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతోన్న మూవీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకు 90s ఏ మిడిల్క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ డేస్, కెరీర్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండనున్నట్లు టీజర్లో అర్థమవుతోంది. ఈ చిత్రంలో శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నారు. -
నటి సురేఖవాణి బర్త్ డే.. కూతురు సుప్రీత స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
మెగాస్టార్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఇదే..!
ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి జతకట్టారు. వీరిద్దిరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి నెగెటివ్ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా సమాచారం. అయితే మేకర్స్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల సంగతి పక్కనపెడితే.. నెట్టింట ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ భాషా చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ చిరంజీవిని కలిసి కథను వివరించారట. చిరంజీవికి.. నిర్మాత అల్లు అరవింద్ కు 'బాషా' కథ విపరీతంగా నచ్చిందట. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారట.కానీ అప్పట్లోనే బాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దాదాపు రూ.40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు ఇవ్వాలని నిర్మాతలను కోరారని సమాచారం. దీంతో 15 లక్షల తేడా రావడంతో ఈ డీల్ కుదరలేదట. అలా మెగాస్టార్ ఈ బ్లాక్బస్టర్ మూవీని మిస్సైనట్లు తెలుస్తోంది. కాగా.. భాషా తమిళంలో విడుదలై ఊహించని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్లో తెలుగులోనూ విడుదల చేశారు. -
'పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు'.. నిత్యామీనన్ బాటలో కట్టప్ప కూతురు
ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్టాపిక్గా మారాయి.వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది. కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. -
'తిరుమలలో పెళ్లి జరగడం నా అదృష్టం..' బెల్లంకొండ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో తెలుగు దర్శకుడు కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం. దర్శకుడు రఘురామ్ చనిపోయారు. మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సహచరులు, పలువురు ఈయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.రచయిత, జర్నలిస్టు అయిన రఘురామ్.. ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేశారు. జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లాంటివి చేసినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదట్లో సానా యాదిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేశారు. 2004లో వచ్చిన 'వరం' మూవీతో దర్శకుడిగా మారారు. ఇది పెద్దగా మెప్పించలేకపోయింది.గత కొన్నాళ్లుగా రైటర్, ఘోస్ట్ రైటర్గా పలు సినిమాలు చేస్తున్న ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన స్వస్థలం జగిత్యాల కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని మధురా నగర్లో ఉంటున్నారు. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
20 ఏళ్లు అయినా తగ్గని క్రేజ్.. ఎంత బడ్జెట్.. ఎంత కలెక్ట్ చేసింది ?
-
స్టార్ హీరో కుమారుడితో పూజా హెగ్డే డేటింగ్!
ప్రముఖ నటి పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే కథనాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా (దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు)తో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు కొంత కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ ఫిల్మ్ఫేర్ సంస్థ సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే వార్త నిజమేనంటూ తమ వద్ద సరైన ఆధారం కూడా ఉందని ఆ సంస్థ పేర్కొంది.పూజా హెగ్డే, రోహన్ మెహ్రా తరుచుగా పలుమార్లు కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతకాలం అది కేవలం రూమర్గానే ఉండేది. కానీ, ఫిల్మ్ఫేర్ లాంటి సంస్థ ఈ వార్తను ప్రచురించడంతో దాదాపు నిజమే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. అయితే , ఈ అంశం గురించి వారిద్దరూ ఇంకా స్పందించలేదు. రోహన్ మెహ్రా (Rohan Mehra) 2018లో 'బజార్' (Baazaar) చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 420 IPC, అద్భుత్ వంటి చిత్రాలతో పాటు, కాళ (Kaala) వంటి వెబ్ సిరీస్లలో నటించి గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Filmfare (@filmfare) -
అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర
నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓ ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఈమెపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అషు తొలుత స్పందించింది. ఈమె తండ్రి వెంకటకృష్టారెడ్డి అయితే ఇవన్నీ ఆరోపణలు అని కొట్టిపారేశారు. అబ్బాయికి ఆల్రెడీ పెళ్లయి, విడాకులు తీసుకున్నాడని.. ధర్మేంద్ర కుటుంబంపై కాల్ మనీ కేసు కూడా ఉందని సంచలన నిజాలు బయటపెట్టారు.(ఇదీ చదవండి: కొత్త అఖిల్ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ)వీళ్లిద్దరిలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? అని అంతా అనుకుంటున్న టైంలో అషురెడ్డి పేరిట ఓ ఆడియో బయటకొచ్చింది. తీసుకున్న డబ్బులో కోటిన్నర రూపాయలని మే నెలలో తిరిగిచ్చేస్తానని.. మిగతా డబ్బు మాత్రం తాను జీవితంలో స్థిరపడినప్పుడు, తన దగ్గరున్నప్పుడు ఇస్తానని సదరు ఆడియోలో అషురెడ్డి చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వేణుస్వామి, ప్రవీణ అక్క సమక్షంలో కూర్చుని మాట్లాడుకుందామని, ఇది కాదంటే తిరిగే కేసు పెడతానని అషు అన్నట్లు అందులో వినిపించింది.ఈ కేసులో భాగంగానే అషురెడ్డి తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు అషురెడ్డి బాధితుడు ధర్మేంద్రకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ధర్మేంద్ర మాట్లాడుతూ.. 2 నెలల క్రితమే ఆమెపై ఫిర్యాదు చేశాం. అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే ఈ నెల 20న పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.గత ఏడాది కాలంగా డబ్బులు తిరిగివ్వడం గురించి చర్చలు నడుసున్నాయి. మీడియేటర్స్ ఈ మేటర్ సెటిల్ చేద్దామనుకున్నారు గానీ ఈ అమ్మాయి(అషు) అస్సలు వినట్లేదు. దీంతో వాళ్లు డ్రాప్ అయిపోయారు. మేం డబ్బులు అడగలేదు. గోల్డ్ కావాలని అడిగాం. నా ఇల్లు నాకు ఇచ్చేయమని అడిగాను. చాలా మీటింగ్స్, చాలా డిస్కషన్స్ తర్వాతే కేసు పెట్టాల్సి వచ్చింది. నాకు వేరే ఆప్షన్ వదల్లేదు. మొదట నుంచి ఆమెపై కేసు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నాపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తోంది. పరిస్థితి ఇక్కడితో ఆగదని భావించి మా నాన్న కేసు పెట్టాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: హీరో విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత రెండేళ్లలో బంగారం, ఫ్లాట్ నాతో కొనిపించింది. దీనికోసం నేను అప్పు చేయడంతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసరికి నేను ఇచ్చిన డబ్బులు, ఆస్తులు తిరిగి ఇవ్వాలని అడిగితే మొదట ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించింది. నేను ఇచ్చిన ప్రతి రూపాయికీ ఆధారాలు ఉన్నాయి. ఆ అన్ని డాక్యుమెంట్స్ పోలీసులకు అందజేశాం. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తరువాతే కేసు నమోదు చేశారు. చట్టపరంగా ఆమెపై పోరాటం కొనసాగిస్తాను.నాకు పెళ్లయి విడాకులు తీసుకున్న సంగతి అషురెడ్డికి ముందే తెలుసు. అయినా సరే ఆమె తండ్రి వింత వింత స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. డబ్బులిచ్చిన మాట వాస్తవమే అని అంటున్నారు. నేనేదో విడాకుల విషయం దాచి పెళ్లి ప్రపోజల్ తెచ్చినట్లు నా గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర వాట్సాప్ రికార్డులు అన్నీ ఉన్నాయని ధర్మేంద్ర తన వెర్షన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది) -
80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసిన రష్మికా మందన్న
హీరోయిన్ రష్మికా మందన్న మైసా సినిమా కోసం భారీ సాహసమే చేస్తుంది. ఈ చిత్రంలో గోండు గిరిజన యువతిగా నటిస్తున్న ఆమె భారీ స్టంట్స్కు సంబంధించిన మెళకువలు నేర్చుకుంది. దీంతో ఈ మూవీ ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలబడిపోతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. రష్మిక కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద సాహసమే చేసిందని దర్శకుడు రవీంద్ర పుల్లె మాటాల్లో తెలుస్తోంది.. మైసాలో ఒక సీన్ కోసం రష్మిక మందన చేసిన సాహసం గురించి ఆయన రివీల్ చేశారు.రష్మికా మందన్న నటిస్తున్న మైసా తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభమైన విషయం తెలసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన సీన్ కోసం ఆమె చాలా రిష్క్ చేసిందని దర్శకుడు చెప్పారు. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా రష్మిక జంప్ చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి హీరోలు 10 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాలంటే డూప్ కావాలని కోరడం చూస్తూనే ఉన్నాం. అలాంటిది రష్మిక ఇంతపెద్ద రిష్క్ చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కేరళలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా సారథ్యంలో సుమారు 20రోజుల పాటు అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. మైసాలో తన పాత్ర కోసం రష్మిక మందన్న చాలా కఠినంగా శిక్షణ తీసుకున్నారు. బ్యాంకాక్లో కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ దాదాపు ఎనిమిది గంటలకు పైగానే ఫైటింగ్ మరియు స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఆమె అంకితభావం చూస్తే, తెరపై పూర్తిగా కొత్త మరియు ఉగ్రమైన ఇమేజ్ను ప్రదర్శించాలనే ఆమె లక్ష్యం స్పష్టమవుతుంది. -
వారణాసి తర్వాత మహేష్ బాబు సర్పైజ్.. బుచ్చిబాబుతో క్రేజీ కాంబో?
-
రూ. 20 కోట్ల లగ్జరీ ఇల్లు.. నాది కాదు: యాంకర్ స్రవంతి
యూట్యూబ్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు.. తన చురుకైన మాటలు, అందంతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్, యాంకర్, నటి, ఇలా పలు రంగాల్లో దూసుకుపోతూ సోషల్ మీడియాలో తరుచుగా ట్రెండింగ్లో నిలుస్తోంది. యాంకర్ సుమ, అనసూయ, శ్రీముఖిల మాదిరిగానే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కదిరికి చెందిన స్రవంతి మధ్యతరగతి అమ్మాయే.. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె భారీగా సంపాధిస్తుందని, రూ. 20 కోట్లతో హైదరాబాద్లో ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనేసిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.గోదారి గట్టుపైన సినిమా కార్యక్రమంలో యాంకర్ స్రవంతిని నటుడు సుదర్శన్ ఒక ప్రశ్న అడిగారు. 'మీకు రూ. 20 కోట్ల విల్లా ఉందని వార్తలు వస్తున్నాయి నిజమేనా..?' అన్నారు. అందుకు ఆమె కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. తనకు లగ్జరీ విల్లా ఉందనే విషయం కేవలం రూమర్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కొందరు ఇలాంటి ప్రచారాలు చేయడం సహజమేనని ఆమె చెప్పింది. భవిష్యత్లో మంచి ఇల్లు కొనాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుందని ఆమె తెలిపింది. పుష్ప -1 రిలీజ్ సమయంలో రాయలసీమ స్లాంగ్తో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి పాపులర్ అయింది. అలా ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. సున్నా నుంచి మొదలు పెట్టిన స్రవంతి ప్రయాణం ఎన్నో కష్టాలను దాటుకుని మంచి స్థానానికి చేరుకుందని తన గురించి తెలిసిన వారు బహిరంగంగానే చెబుతుంటారు.యాంకర్ స్రవంతి ఆర్థిక స్థితిపై ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి ప్రముఖ యాంకర్లు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్లందరూ కూడా సినీ నటులతో సమానంగా సంపాదిస్తున్నారనే అభిప్రాయానికి నెటిజన్లు రావడమే ఇలాంటి రూమర్స్కు కారణమని చెప్పవచ్చు. ఆపై యాంకర్లు తరచుగా ప్రయాణాలు చేస్తూ, ఆన్లైన్లో ఆడంబరమైన జీవితాన్ని ప్రదర్శించడం వల్లే ఇలాంటి అభిప్రాయానికి కారణం అవుతుంది. అసలు వాస్తవం మరోలా ఉంటుందని పలు సందర్భాల్లొ వారు చెప్పిన విషయం తెలిసిందే. తమ కాస్ట్యూమ్స్, మేకప్ ఖర్చులకే సగం రెమ్యునరేషన్ పోతుందని చాలామంది చెబుతుంటారు. View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) -
నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నేడు (ఏప్రిల్ 29) వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కావ్య రెడ్డి అనే యువతితోకలిసి తిరుమలలో ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. బుధవారం రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీనివాస్- కావ్యల పెళ్లి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది. సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్యను ప్రేమించి శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. కొంతకాలంగా వారు ప్రేమలో ఉన్నామని రెండు కుటుంబాలకు తెలిపి ఒక్కటి కానున్నారు. కావ్య తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ కుటుంబం సాయి శ్రీనివాస్ పెళ్లి ఘనంగా నిర్వహించనుంది. తమ కుటుంబ దైవం సమక్షంలో పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. అందుకోసం ఇప్పటికే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
నెలకు నా ఖర్చు ఎన్ని లక్షలు అంటే..: నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే నటిగా దశాబ్దానికి చేరువు అవుతున్నా..ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారని చెప్పక తప్పదు . అదే సమయంలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే సంపాందిస్తున్నా, ఐరన్లెగ్ అనే ముద్ర నుంచి ఇంకా బయట పడలేదు. ఇక ప్రేమ వ్యవహారంలోనూ బాగానే వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అప్పుడామె ఆయనకు జంటగా ఈశ్వర్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సక్సెస్ కాకపోయినా, ప్రేయాయణం వార్తలతో బాగానే పాపులర్ అయ్యారు.తెలుగుతో పాటు కోలీవుడ్లో ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. జయంరవికి జంటగా భూమి చిత్రంలో నటించారు. కానీ, ఆ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడంతో నిధి అగర్వాల్ కెరీర్కు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. ఆ మధ్య తెలుగులో పవన్ కల్యాణ్కు జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది కూడా పూర్తిగా నీరుగార్చింది. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. అదీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నెల ఖర్చు గురించి ఒక భేటీలో నిధిఅగర్వాల్ పేర్కొన్నారు. అందులో ‘ నా నెల ఖర్చు ఎంతో తెలుసా ? అంటూ చెప్పడం ప్రారంభించారు. నా నెలవారి ఖర్చు రూ. 5 లక్షలు అని పేర్కొన్నారు. నా ట్రావెలింగ్, బస,డయిట్,జిమ్, ట్రైనర్, పార్లర్ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్, హెయిర్స్టైలింగ్, ఫోటోస్ వంటి ఖర్చులను కొన్ని సార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించినా, కొన్ని సార్లు నేను భరించాల్సి ఉంటుంది’ అని నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు. -
సెటిల్ చేసుకుందాం రా! సోషల్ మీడియాలో వైరల్ అయిన అషురెడ్డి ఆడియో
-
స్పీడ్ పెంచారు
పాన్ ఇండియా ట్రెండ్లో పడి కొందరు తెలుగు హీరోలు పర్ఫెక్షన్ కోసం ఒకే సినిమాతో సెట్స్లో రెండు మూడేళ్లు గడుపుతు న్నారు. కథ స్థాయి, నిర్మాణ విలువల ప్రాధాన్యం వల్ల ఈ సమయం కొన్నిసార్లు పెరుగుతుంది. అయితే ఇకపై సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకూడదని, ప్రేక్షకులకు మరింత చేరువలో ఉండాలని ఏడాదికో సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు కొందరు హీరోలు. స్పీడ్ పెంచి, వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. మరి... ఈ హీరోలు, వీరు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం.స్ట్రాంగ్ లైనప్ స్టార్ హీరో ప్రభాస్ లైనప్ ఎప్పుడూ మూడు సినిమాలకు తక్కువ కాకుండా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. వచ్చే నెల నుంచి ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణను కూడా షురూ చేయనున్నారు. ఇలా ఏకకాలంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్స్టోరీ సినిమా ‘ఫౌజి’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో కనిపిస్తారని తెలిసింది ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ‘ఫౌజి’ సినిమా విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైపోయింది. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. దీంతో వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు సందీప్ రెడ్డి వంగా.ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా హీరోయిన్ త్రిప్తి దిమ్రి డాక్టర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్, కాంచన, ప్రకాశ్ రాజ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టి సిరీస్ ఫిలింస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో కల్కి సెట్స్లో..! దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి సినిమా ‘కల్కి 2898ఏడీ’. ఈ యూనివర్స్ నుంచి వచ్చే ఏడాది ‘కర్ణ 3102బీసీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అమితాబ్ బచ్చన్, కమల్హాసన్పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే నెలలో ఈ చిత్ర హీరో ప్రభాస్ సైతం ఈ సినిమా సెట్స్లో జాయిన్ కానున్నట్లుగా తెలిసింది. సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.‘కర్ణ 3102బీసీ’ సినిమా వచ్చే ఏడాది చివర్లో థియేటర్స్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇంకా ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు ప్రభాస్ ఆల్రెడీ కమిటైన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి ‘సలార్ 2’ అని, మరో చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఒకే ఏడాదిలో మూడు సినిమాలు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ ట్రాక్లోకి వచ్చారు శర్వానంద్. ఈ యంగ్ హీరో నుంచి ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం శర్వానంద్ ‘భోగి’, శ్రీను వైట్ల డైరెక్షన్లోని ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలోని ‘భోగి’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 28న రిలీజ్ కానుంది. 1960 కాలమానంలో తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతంలో జరిగే ఈ రివెంజ్ యాక్షన్ సినిమాలో అనుపమా పరమేశ్వర్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ‘జార్జ్ క్రిష్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా శర్వానంద్ ఆల్రెడీ ప్రకటించారు. ఒకవేళ ఈ సినిమా అనుకున్నట్లుగా వచ్చే సంక్రాంతికే రిలీజ్ అయితే 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతికి లోపు నాలుగు సినిమాల్లో శర్వానంద్ కనిపించినట్లు అవుతుంది.ఇటు గోదావరి... అటు రాయలసీమ ‘రణబాలి, రౌడీ జనార్థన’... ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్తో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ రెండూ పీరియాడికల్ సినిమాలే కావడం విశేషం. అలాగే ‘రణబాలి’ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 11న, ‘రౌడీ జనార్థన’ సినిమాను ఈ డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లు విజయ్ దేవరకొండ ఆల్రెడీ ప్రకటించారు. ఈ దిశగా షూటింగ్స్ జరుగుతున్నాయి. 1854 –1878 మధ్య బ్రిటిష్ పరి పాలనా కాలంలో, రాయలసీమలో జరిగిన ఆర్థిక దోపిడీ, రణబాలి తిరుగుబాటు వంటి అంశాల ఆధారంగా ‘రణబాలి’ సినిమా కథనం ఉంటుంది. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఆయన భార్య రష్మికా మందన్నా హీరోయిన్గా చేస్తున్నారు. జయమ్మపాత్రలో నటిస్తున్నారు రష్మిక.‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్–రష్మిక కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ‘రౌడీ జనార్థన’ విషయానికి వస్తే... రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా చేస్తున్నారు. 1980 టైమ్లైన్లో తూర్పుగోదావరి నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం గోదావరి యాసలో మాట్లాడేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ రెండు చిత్రాలను కాస్త పక్కన పెడితే... విజయ్ దేవరకొండ హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి... ‘రణబాలి’, ‘రౌడీ జనార్థన’లతో కలిసి ఈ సినిమానూ విజయ్ సెట్స్కు తీసుకువెళ్తారా? లేక ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలి.ముచ్చటగా మూడు వరుసగా సినిమాలు చేయడానికి పక్కా ప్లాన్తో రెడీ అవుతున్నారు నితిన్. ఈ ప్లాన్లో భాగంగా నితిన్ ఆల్రెడీ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోని సినిమాను షురూ చేస్తున్నారు నితిన్. సోము–నర్రి ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం వచ్చే నెల మొదటివారంలో జరుగుతుందని, చిత్రీకరణ కూడా వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తారని సమాచారం. ఇక వీఐ ఆనంద్ డైరెక్షన్లో నితిన్ ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో తొలిసారి నితిన్ ద్వి పాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్లో ఓ సినిమా చేయనున్నారు నితిన్. ‘ఆయ్’ సినిమా ఫేమ్ దర్శకుడు అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో... వీలైనంత తొందరగానే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలా నితిన్ ఏకకాలంలో కనీసం రెండు సినిమాలు చేస్తారని ఊహించవచ్చు. పాలిటిక్స్... ఫ్యాంటసీ! వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ హీరోగా నటించిన ‘సిగ్మా’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. ప్రజెంట్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘పవర్ పేట’, ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్లోని సోషియో ఫ్యాంటసీ సినిమాలకు సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ మూవీని నిర్మిస్తారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు సమాంతరంగా జరగనున్నాయి. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. అలాగే సందీప్ కిషన్ హీరోగా ‘వైబ్, మాయవన్’ వంటి సినిమాల ప్రకటనలు వచ్చాయి కానీ, ఆ తర్వాత ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.రానా రెడీ! ఇటీవలి కాలంలో నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు రానా. దుల్కర్ సల్మాన్తో ‘కాంత’ వంటి సినిమాను నిర్మించడమే కాకుండా, తన స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా పలు తెలుగు సినిమాల రిలీజ్లకు అసోసియేట్ అయ్యారు. కాగా, రానా మళ్లీ యాక్టింగ్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తేజ సజ్జా ‘మిరాయ్’ క్లైమాక్స్లో కనిపించారు రానా. సో... ‘మిరాయ్ 2’ చిత్రంలో రానా ఉంటారని ఊహించవచ్చు. ఇక అక్షయ్ కుమార్, రానా లీడ్ రోల్స్లో చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రానుందనే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.కరణ్ జోహర్ నిర్మించనున్న ఈ హిస్టారికల్ సినిమా ఉజ్జయిని నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ‘జై హనుమాన్’ సినిమా చిత్రీకరణలోనూ రానాపాల్గొంటున్నారని తెలిసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ఓ ప్రధానపాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఇలా ఏక కాలంలో రెండు సినిమాలు చేస్తున్నారు రానా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇలా ఒకేసారి రెండు మూడు సినిమాలను సెట్స్పైకి తీసుకువెళ్లిన హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఈ తరహాలో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.ఏడాదికో సినిమా!మహేశ్బాబు హీరోగా నటించి, థియేటర్స్లో రిలీజైన గత చిత్రం ‘గుంటూరు కారం’. 2024లో ఈ సినిమా విడుదలైంది. మహేశ్బాబు నెక్ట్స్ సినిమా ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల మధ్య దూరం మూడు సంవత్సరాలు. అయితే ఇకపై ఇలాంటి గ్యాప్ ఉండకూడదని, ఏడాదికో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మహేశ్బాబు తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్లో ఓ సినిమా చేయనున్నారట మహేశ్బాబు.అలాగే సందీప్ రెడ్డి వంగాతో మహేశ్బాబు ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా వరుస సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే... అల్లు అర్జున్ గత చిత్రం ‘పుష్ప: ది రూల్’, రాబోయే చిత్రం ‘రాకా’ (అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా) ల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ కనిపిస్తోంది. ఈ గ్యాప్ను తగ్గించాలని అల్లు అర్జున్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారట. ఈ దిశగా అల్లు అర్జున్ తన లైనప్ను రెడీ చేసుకుంటున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.‘రాకా’ తర్వాత తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లుగా అల్లు అర్జున్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోల తరహాలోనే మరికొంత మంది హీరోలు సైతం సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా తమ లైనప్స్ను, కాల్షీట్స్ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాల విషయంలో వారి ఫ్యాన్స్ను హ్యాపీ ఫీలయ్యేలా చేసే విషయం ఒకటి ఉంది. వారి సినిమాలు రీ రిలీజ్లు అవుతుంటాయి. అయినప్పటికీ కొత్త సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు రావాలని స్టార్ హీరోలు ప్లాన్స్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
పుట్టినరోజు కానుకగా...
హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు ఓ కానుక ఇవ్వనున్నారు. మే 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమా రీ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ప్రకాశ్రాజ్, విద్యుత్ జమాల్, సాయాజీ షిండే, మురళీ శర్మ తదితరులు ఇతరపాత్రలు పోషించారు.బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్గా నిలిచింది. కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం సుమారు పదిహేనేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై కల్యాణ్రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న రిలీజ్ కానుంది. -
పండుగాడు వస్తున్నాడు
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ సినిమాలో మహేశ్బాబు చెప్పిన డైలాగ్ ఎంతపాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే పండుగాడు (మహేశ్పాత్ర నిక్ నేమ్) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాడు. మహేశ్బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోకిరి’. ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, అజయ్ ఇతరపాత్రలు పోషించారు. ఇందిర సమర్పణలో వైష్ణో అకాడమీ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మించిన ఈ సినిమా 2006 ఏప్రిల్ 28న విడుదలై, మహేశ్బాబు కెరీర్లోనే బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి ఈ చిత్రంలో మహేశ్ మేనరిజమ్, డైలాగ్స్ ఇప్పటికీపాపులరే. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా విడుదలై మంగళవారంతో 20 ఏళ్లు పూర్తయ్యాయి.ఇదిలా ఉంటే... మహేశ్బాబు బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా ‘పోకిరి’ సినిమాని పీవీ ఎంటర్టైన్మెంట్ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. డాల్బీ, 4 కె వెర్షన్లో రీ రిలీజ్ కానుంది. కాగా మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
#కింగ్ 100.. 'శివ' లుక్తో నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వందో సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన ఫార్ములా కథతో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఒక షేడ్లో 25 ఏళ్ల యువకుడిలా కనిపించనున్నారని సమాచారం. దాని కోసం చిరంజీవి ఆచార్యలో, రజనీకాంత్ కూలీలో వాడిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. అంటే దాదాపు శివ సినిమాలో నాగార్జున ఎలా కనిపించారో, అదే వింటేజ్ లుక్ను ఈ పాత్రలో మళ్లీ చూపించనున్నారు.ఆచార్య వచ్చిన సమయంలో ఈ టెక్నాలజీ ఖరీదైనది. కానీ ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గింది, దాంతో వాడకం చాలా సులభమైంది. ఇక దీంతో నాగార్జున వందో సినిమా మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున-టబు జంట 28 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది. గతంలో వీరిద్దరూ నటించిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చివరిగా వీరు ఆవిడా మా ఆవిడే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టబు షూటింగ్లో పాల్గొంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. దసరా తర్వాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే టైటిల్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఏదీ ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశం లేదు. సినిమా పూర్తయిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని నాగ్ నిర్ణయించారు. ఇలా నాగార్జున తన వందో చిత్రంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. -
చిరంజీవి-బాబీ.. క్లారిటీ వచ్చింది
సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. తర్వాత మూవీని సమయానికి మొదలుపెట్టకపోయేసరికి ఎక్కడ లేని రూమర్స్ అన్నీ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ తీయాల్సిన నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్.. జన నాయగణ్, టాక్సిక్ చిత్రాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటమే దీనికి కారణం. అయితే చిరు-బాబీ సినిమా నుంచి కేవీఎన్ తప్పుకొందని, మరో నిర్మాత కావాల్సి ఉందని రకరకాల పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ దాదాపు చెక్ పడిపోయింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)రీసెంట్గానే నిర్మాణ సంస్థ మారిపోయిందనే రూమర్స్ని కేవీఎన్ ప్రొడక్షన్ ఖండించగా.. ఇప్పుడు దర్శకుడు బాబీ, చిరంజీవికి ఈరోజు(ఏప్రిల్ 28) లుక్ టెస్ట్ జరిగిందనే సంగతి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరోవైపు ఇప్పటికే సెట్ వర్క్ జరుగుతోందని, ప్రాజెక్ట్ లాంచ్ కాగానే ఇంటర్వెల్ ఎపిసోడ్తో షూటింగ్ మొదలవుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు.ఇకపోతే 'కాకాజీ' అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ పేరుపై మెగా అభిమానుల్లో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. టైటిల్ ఏమంత పవర్ఫుల్గా లేదని అనుకుంటున్నారు. మరి ఇదే పేరు ఫిక్స్ చేస్తారా లేదంటే ఏమైనా చేర్పులు మార్పులు ఉండబోతున్నాయా అనేది చూడాలి? ఇందులో ప్రముఖ నటీనటులు కూడా చాలామందే కనిపించబోతున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: నాకు టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా.. లేదంటే కేసు పెడతా: అషురెడ్డి)Look test ☑️Locked the look of #Mega158 with Megastar @KChiruTweets garu today 🤗Can’t wait to begin this journey❤️🔥#ChiruBobby2 @KvnProductions @LohithNK01 pic.twitter.com/eWSLEqCqVN— Bobby (@dirbobby) April 28, 2026 -
పోకిరి విధ్వంసానికి 20 ఏళ్లు.. మాస్ డైలాగ్ రీ క్రియేట్..!
పూరి జగన్నాద్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ పోకిరి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో ఇలియానా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 28న 2006లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పోకిరి మూవీ డైలాగ్స్ ఓసారి గుర్తు చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాలైనా పోకిరి డైలాగ్స్ను తెలుగు ఆడియన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.తాజాగా స్వీడన్కు చెందిన నటుడు కర్ల్ స్వాన్బెర్గ్ పోకిరి మూవీ డైలాగ్ను రీ క్రియేట్ చేశాడు. ఆశిష్ విద్యార్థితో మహేశ్బాబు చెప్పే డైలాగ్ను రీ క్రియేట్ చేశాడు. మీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది..అనవసరంగా పుట్టావ్? అనే డైలాగ్ ఇప్పుడు విన్న గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో పూరి జగన్నాధ్ మాస్ డైలాగ్స్కు అభిమానులు ఫిదా అయిపోయారు. మరోసారి పోకిరి డైలాగ్ను విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..
ఇన్ స్టాలో సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు నెలొచ్చేసరికి ఏకంగా లక్షలు సంపాదిస్తున్నారని, అయితే దీనికోసం హద్దులు దాటేస్తున్నారని వార్తలొచ్చాయి. విష్ణుప్రియపై విజయవాడలో కేసు కూడా పెట్టగా.. అనన్య మాత్రం తన రోజూవారీ జీవితంలో జరిగే వాటిని పోస్ట్ చేయడానికే ఈ సబ్స్క్రిప్షన్ పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే వీళ్లని మించే సబ్స్క్రిప్షన్ స్టోరీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వృత్తిక పటేల్ అనే ఇన్ స్టా అకౌంటే ఈ చర్చకు కారణం. ఇంతకీ ఈమె ఎవరు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)వృత్తిక పటేల్ అనే అమ్మాయి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కేవలం లక్ష పద్నాలుగ వేలమంది ఫాలోవర్స్ మాత్రమే ఈమెకు ఉన్నారు. కానీ ఈమెని 300 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.390 అంటే దాదాపు రూ.లక్ష రూపాయల వరకు నెలకు ఈమె సంపాదిస్తోంది. ఇంతా చెప్పుకొన్నాం కదా అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఎందుకంటే మీరూ చూసేదంతా నిజం కాదు అన్నట్లు.. వృత్తిక పటేల్ అనేది అమ్మాయి కాదు. ఇది ఏఐ మాయాజాలంతో సృష్టించిన ఖాతా.అవును మీరు విన్నది నిజమే. వృత్తిక పటేల్ అనే వ్యక్తిని ఏఐలో సృష్టించిన ఓ వ్యక్తి లేదా వ్యక్తులు.. నిజంగా అమ్మాయిలా ఉండేలా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్, దేవుడు లాంటి రెగ్యులర్ టాపిక్స్కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. అలానే సబ్స్క్రిప్షన్ పెడితే 300 మంది వరకు చేరారు. ఈమె నిజమైన అమ్మాయి కాదు ఏఐ అని గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ ఈమె ఫాలోవర్స్ తగ్గడం లాంటివి జరగలేదు.విష్ణుప్రియ, అనన్య నాగళ్ల లాంటి వాళ్లు అమ్మాయిలు కాబట్టి వీళ్లపై కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ వృత్తిక పటేల్ ఖాతా నడుపుతున్న వ్యక్తులు ఎవరో గానీ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ స్టాలో నెలకు సులభంగా లక్షకు పైనే సంపాదించేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలా జాగ్రత్త!(ఇదీ చదవండి: తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..) View this post on Instagram A post shared by Vrutika Patel (@vrutikaapatel) -
తెలుగు హీరోల్లో 90 శాతం మంది డూపులతోనే..
తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే వీళ్లలో నిజమైన ఫైట్స్ చేసేది ఎంతమంది అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే చాలామంది డూప్స్ ఉపయోగిస్తుంటారు. కాకపోతే ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలానే సీన్స్లోనూ సదరు డూప్ ఉన్నాడని తెలియకుండా చూసుకుంటారు. అయితే టాలీవుడ్లో 90 శాతం మంది హీరోలు, డూపులనే ఉపయోగిస్తున్నారని చెప్పి నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!)'నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీని కోసం టాలీవుడ్లో ఎవరుంటారా అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు. ఎందుకంటే నాలా ఫిజికల్గా బలంగా ఉండి, నాలా నటించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరూ దొరకలేదు. అందుకే నేనే చేశాను. అలానే మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కిక్స్ నిజంగా ఫెర్ఫార్మ్ చేశాను' అన రవిబాబు చెప్పుకొచ్చాడు.సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు.. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే 'అల్లరి' లాంటి కామెడీ మూవీస్తో దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లలో చూసుకుంటే మూవీస్ అయితే తీస్తున్నాడు గానీ వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఇప్పుడు కూడా 'రేజర్' అనే రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేశారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఇందులో అంత రక్తపాతమే కనిపించింది. మే 08న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రవిబాబుకి ఇదెంత వరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా) -
హైకోర్టుకు అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.. పెళ్లి పేరుతో తన కుమారుడిని రూ. 9.35 కోట్ల వరకు మోసం చేసిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టును అషురెడ్డి ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
గుడ్న్యూస్ తర్వాత తొలిసారి కనిపించిన దీపికా పదుకొణె (వీడియో)
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించారు. అయితే, రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా వారు కెమెరా ముందుకు రావడంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించినప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాల కోసం ఆమె పనిచేస్తూనే ఉన్నారు.అల్లు అర్జున్- అట్లీ మూవీ రాకాలో దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సీన్స్ షూటింగ్ జరుగుతుంది. ఆపై షారుఖ్ ఖాన్ కింగ్ మూవీలోనే భాగమైన దీపికా.. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు రెడీ అయిపోయిందట. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం షారుక్తో పాటు దీపిక కూడా సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.దీపికా పదుకొణె- రణవీర్ సింగ్ దంపతులకు 2024లో దువా పదుకొణె సింగ్ అనే కుమార్తె జన్మించగా.. ఇప్పుడు రోండో బిడ్డ వారి జీవితంలోకి రానుంది. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా సినిమా షూటింగులలో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. Late-night airport spotting alert! #RanveerSingh and #DeepikaPadukone keep it stylish, comfy, and oh-so-iconic 💼✨#MissMalini pic.twitter.com/uaWuuB1hz1— MissMalini (@MissMalini) April 28, 2026 -
మహిమాన్వితమైన గుడికి విజయ్.. వీడియో వైరల్
తిరుచెందూర్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి ఆలయం)ను నటుడు, టీవీకే అధినేత విజయ్ దర్శించుకున్నారు. కొద్దిరోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ 4న విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుచెందూర్ మురుగన్ను విజయ్ దర్శించుకున్నారు. స్వామి ఆయుధం "వేల్" (శక్త్యాయుధము) చేత అందుకున్న విజయ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే స్వామి ఆశీస్సుల కోసం విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది.తమిళనాడులో ఉన్న మురుగన్ ఆరు నివాసాలలో ఇది రెండవది. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణేశ్వర స్వామికి చెందిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉన్నాయి. కానీ, తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో కొలువై ఉంటుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. తిరుచెందూర్ మురుగన్కు అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవని నమ్ముతారు. తమిళనాడు నలుమూలల నుంచి తిరుచెందూర్కు చేరుకోవచ్చు. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం ఉంది. #TVKVijay at Tiruchendur Murugan Temple for Vishwaroopa Darshan ❤️🔥💥pic.twitter.com/204nfbypKs— Troll Cinema ( TC ) (@Troll_Cinema) April 28, 2026 -
పవర్ఫుల్ గుడి.. దర్శనం తర్వాత నా లైఫ్ మారిపోయింది: శృతి హాసన్
దైవం అన్నది మానవ జీవితంలో అతి ప్రధానమైనది. నాస్తికులు దీన్ని అంగీకరించకపోవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక తరుణంలో మనిషి నిజమైన భక్తిని పొంది పరవశిస్తాడు. అలాంటి నిజమైన భక్తి పారవశ్యాన్ని పొంది తరించానంటున్నారు నటి శృతి హాసన్. నాస్తికుడైన కమలహాసన్ వారుసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్(Shruti Haasan) మాత్రం ఆస్తికురాలే. దైవభక్తి కలిగిన నటి. వ్యక్తిగతంగా సంచలన నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమిళ్, తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఆమె రాణిస్తున్నారు. ఆ మధ్య ప్రేమలో పడ్డా, ఆ వ్యవహారం అచ్చిరాలేదనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం తాను సింగిల్ అని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిన గట్స్ కలిగిన నటి శృతీహాసన్. ఇటీవల ఈమె నిజమైన భక్తి భావనను పొందిన విషయంపై ఒక భేటీలో పేర్కొన్నారు. ‘ఇటీవల నేను వారాహీ మాత ఆలయానికి వెళ్లాను. మనమే కాదు. దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. ఒక మిత్రుడు నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. రా దేవాలయానికి వెళ్లి వద్దాం అని పిలిచారు. అది చాలా చిన్న ఆలయమే. అయితే గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందాను. ఎలాంటి ఆడంబరం లేదు. వీఐపీల క్యూ లేదు. శక్తివంతమైన దేవత ’ అని నటి శృతి హాసన్ పేర్కొ న్నారు. అయితే, అమ్మవారి దర్శనం తర్వాత తన జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చాయని, తనలో కొత్త శక్తి వచ్చిందని ఆమె చెప్పడం విశేషం.శృతి హాసన్ జీవితంలో మార్పులుశృతి హాసన్ చెన్నైలో సందర్శించిన ప్రసిద్ధ వారాహి దేవి ఆలయం మయిలాపూర్ (Mylapore)లో ఉంది. ఈ ఆలయం చెన్నైలోని ప్రసిద్ధ కపాలీశ్వర ఆలయానికి సమీపంలో ఉంది, ఇది వారాహి ఆరాధనకు అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ దర్శనం కొద్దిరోజుల తర్వాత శృతి హాసన్ అస్సాంలోని వారాహి మాత (కామాఖ్య దేవాలయం) కూడా దర్శించారు. ఇది అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండలపై ఉంది. వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఇది ఒక ప్రముఖ శక్తి పీఠం ఆపై తంత్ర సాధనకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం.ఇకపోతే ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది. సలార్–2 చిత్రంలో నటించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
#కింగ్ 100లో ఎంట్రీ
నాగార్జున హీరోగా నటిస్తున్న ‘#కింగ్ 100’ సినిమాలో భాగమయ్యారు నటి టబు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. కాగా, ఈ సినిమాలో నటి టబు భాగం అయినట్లుగా మేకర్స్ సోమవారం ప్రకటించారు. ‘‘సెట్స్లో మీ రాక మాకెంతో గౌరవంగా ఉంది.ఈ సినిమాలో మీరు భాగం కావడంతో మా మైల్స్టోన్ సినిమా మరింత స్పెషల్గా మారిపోయింది’’ అంటూ ‘#కింగ్ 100’ సినిమా యూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తాను జాయిన్ అయినట్లు ఇన్స్టా వేదికగా టబు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా టబు కనిపిస్తారా? లేదా కీలక పాత్ర చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.నాగార్జున కెరీర్లోని ఈ వందో సినిమాలో సుస్మితా భట్, విజయేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని, తండ్రీకూతుళ్ల ఎమోషన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నిన్నే పెళ్లాడతా’(1996), ‘ఆవిడా మా ఆవిడే’ (1998) చిత్రాల్లో నాగార్జున, టబు జోడీగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
గాయపడ్డ సింహం సంతృప్తి ఇస్తుంది: ఫరియా అబ్దుల్లా
‘‘గాయపడ్డ సింహం’ చిత్ర కథ వినగానే కొత్తగా అనిపించింది. కశ్యప్ శ్రీనివాస్గారు నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగై్జటింగ్గా అనిపించింది. ఇందులో ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉంటుంది. నేను చేసిన షాలిని పాత్రలో వినోదం ఎక్కువగా ఉంటుంది. మా మూవీ చూసిన ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే సంతృప్తి కలుగుతుంది’’ అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పారు.తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పంచుకున్న విశేషాలు.... ⇒ నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, నా పాత్ర నచ్చాలి. ‘గాయపడ్డ సింహం’లో వ్లాగర్ షాలిని పాత్ర చేశాను. కశ్యప్ క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్గా వచ్చాయి. మా మూవీ ఫైనల్ ఔట్పుట్ చూశాను.. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తరుణ్ భాస్కర్గారు సరదాగా ఉంటారు. ఆయన సెట్స్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేది. ఈ మూవీలో శ్రీవిష్ణుగారి క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ప్రేమికుడి చేయి వదిలేసిన అమ్మాయిగా మానసా చౌదరి చేస్తే.. ఆ చేతిని పట్టుకునే అమ్మాయి పాత్ర నాది (నవ్వుతూ).⇒ ‘గాయపడ్డ సింహం’ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్గా తెరకెక్కించారు కశ్యప్ శ్రీనివాస్గారు. స్వీకర్ అగస్తి చాలా అందమైన సంగీతం ఇచ్చారు. ‘బ్రైడ్...’, ‘జింగాల...’ నాకు ఇష్టమైన పాటలు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు ఉన్నారు.. అందరూ చాలా క్రియేటివ్గా ఆలోచించే వారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తిగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. దుల్కర్ సల్మాన్గారి సినిమాలో అతిథి పాత్ర వస్తే చేయాలనుకోవడం లేదు. పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్ర చేయాలని ఉంది. వచ్చే ఏడాది నేను ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తాను.. కొన్ని కథలు రాస్తున్నాను. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ సినిమాలు పూర్తి చేశాను. సత్యదేవ్గారితో ఓ మూవీ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. -
బొగ్గు స్కామ్పై సినిమా.. పవర్ఫుల్ పోలీస్గా యంగ్ బ్యూటీ
హీరోయిన్ సంయుక్త ప్రధాన పాత్రలో కోల్ సిండికేట్ నేపథ్యం, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపుదిద్దుకున్న యాక్షన్ సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్సీ యోగేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ, రవీంద్ర విజయ్ ఇతర పాత్రల్లో నటించారు. మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.‘‘తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంతో సాగే కథే ‘ది బ్లాక్ గోల్డ్’. సంయుక్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆదిలాబాద్ లొకేషన్స్తో పాటుగా, హైదరాబాద్లో వేసిన సెట్స్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ మూవీ కోసం పదికిపైగా భారీ సెట్స్ వేశాం. 60కిపైగా వర్కింగ్ డేస్లో చిత్రీకరణను పూర్తి చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ నిర్మాత: సింధు మాగంటి, సంగీతం: సామ్ సీఎస్. -
'నా భర్తకు పదిమందితో ఎఫైర్స్'.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్పుల్గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఆనాటి హీరోయిన్, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.భర్త మోసంపై ఒంటరి పోరాటం..వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది. ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
'నిజమైన కరెన్సీ అదే'.. పూరి జగన్నాధ్ సందేశం విన్నారా?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే పూరి జగనాధ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైఫ్ పాఠాలు చెబుతుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూరి రిలీజ్ చేసిన వీడియో మన టైమ్, మనీ గురించి మాట్లాడారు. ప్రతి రోజు మనం ఖర్చు చేస్తున్న సమయం గురించి వివరించారు. లైఫ్లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కాదని సందేశమిచ్చారు. గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తీసుకురాలేమని అన్నారు. రియల్ కరెన్సీ పేరుతో పూరి ఏమన్నారో మీరు కూడా చదివేయండి.'అందరికీ దేవుడు ఇచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయన్నది కాదు.. ఆ 24 గంటలు ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మనం ప్రతి రోజు డబ్బు కోసం రాత్రి, పగలు కష్టపడతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డబ్బు కంటే విలువైన సమయాన్ని మాత్రం పట్టించుకోం. టైం గురించి వివరంగా చెప్పాలంటే.. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నువ్వు ఏం చేసినా.. చేయకపోయినా ఖర్చు అయిపోతుంది. మళ్లీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా 24 గంటలు నిండే ఉంటాయి' అని అన్నారు.'నువ్వు టైమ్ను వేస్ట్ చేసినా కరిగిపోతుంది.. తెలివిగా ఇన్వెస్ట్ చేసినా అయిపోతుంది. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నేళ్లు కష్టపడినా పర్లేదు.. ఏదో రోజు బోలెడంత డబ్బు సంపాదించి మిగిలిన జీవితమంతా హ్యాపీగా బతుకుదామనుకుంటాం. బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయడానికి టైముండదు. అందుకే అదే రియల్ కరెన్సీ. డబ్బు మాయలో పడి కుటుంబంతో గడిపే అరుదైన క్షణాలు కోల్పోతాం. మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం''ఒక రోజులో మన నాలుగు గంటలు ట్రాఫిక్.. మరో నాలుగు గంటలు చిరాకులో గడిచిపోతాయి. మిగతావి నిద్రకు కేటాయిస్తాం. ఈరోజు కాకపోతే రేపు గుడ్న్యూస్ వింటామని ఎదురు చూస్తూ నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో కరిగిపోయిన కాలమే సమాధానం చెబుతుంది. ఈ భూమ్మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ప్రాణం వదిలేస్తాం. అందుకే వీలైనన్ని మధుర క్షణాలు మన అకౌంట్లో పడితేనే పుట్టినందుకు.. ఇక్కడ గడిపినందుకు ఏదో ఓ మీనింగ్ అంటూ ఉంటుంది. లేకపోతే ఈ జర్నీ మొత్తం నాశనమైపోద్ది' అంటూ సమయం విలువను కరెన్సీతో పోలుస్తూ సందేశమిచ్చారు మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. -
కాజల్ అగర్వాల్కి ఇది చివరి అవకాశం!
టాలీవుడ్లో స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో అద్భుతమైన యాక్టింగ్ చేసి హిట్ కొట్టింది. తర్వాత చేసిన వాటిలో మూడేళ్ల క్రితం 'భగవంత్ కేసరి' మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమెది పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజైన 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్గా లీడ్ రోల్ చేసిన 'ద ఇండియన్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే షూటింగ్ పూర్తవగా ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ప్రకటించారు.జూలై 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇందులో కాజల్తోపాటు మరాఠీ స్టార్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్ర చేశాడు. పంటకు ఉపయోగించే రసాయనాల దుర్వినియోగం, సాగులో పురుగు మందుల మితిమీరిన వినియోగం, దీని వెనకున్న భారీ కుంభకోణాల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మూవీస్ చేయాలనుకుంటే మాత్రం ఇది హిట్ కావడం కాజల్కి చాలా కీలకం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకొన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మాత్రం మెల్లగా ఈమెని పట్టించుకోవడం దర్శకులు తగ్గించేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?') -
‘వదలా’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రెడ్ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)
-
జగపతి బాబు, లయ కొత్త సినిమా.. టీజర్ విడుదల
జగపతి బాబు, లయ, హృతిక నటించిన కొత్త సినిమా ‘వదలా’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆసక్తిగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ చిత్రంలో చూపించారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రావట్లేదు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' రిలీజ్ కానున్నాయి. ఇక డబ్బింగులు విషయానికొస్తే ధనుష్ 'కర', మోహన్ లాల్-ముమ్ముట్టి 'పేట్రియాట్', సాయిపల్లవి 'ఒక రోజు'తో పాటు హిందీ చిత్రం 'రాజా శివాజీ'.. బిగ్ స్క్రీన్స్పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ఈసారి చాలానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బైకర్, రాకాస లాంటి తెలుగు మూవీస్తో పాటు ద కేరళ స్టోరీ 2, లీడర్, ఆడు 3 లాంటి డబ్బింగ్ మూవీస్ ఆసక్తి రేపుతున్నాయి. గ్లోరీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా బాగానే ఉందనిపించేలా ఉంది. వీటితో పాటు వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ప్రైజులు కూడా ఉండే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 27 నుంచి మే 03 వరకు)నెట్ఫ్లిక్స్షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30బైకర్ (తెలుగు మూవీ) - మే 01రాకాస (తెలుగు సినిమా) - మే 01గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01హాట్స్టార్బ్యాచ్మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30అమెజాన్ ప్రైమ్ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01 (రూమర్ డేట్)జీ5లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01ఆపిల్ టీవీ ప్లస్విడోస్ బే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29ఎమ్ఎక్స్ ప్లేయర్క్యాంపస్ బీట్స్ రిటర్న్స్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 29(ఇదీ చదవండి: 'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు) -
ఓటీటీలో నంబర్ వన్ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా
జీవీ ప్రకాశ్కుమార్, శ్రీ గౌరిప్రియ జోడీగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్.. విజయవంతంగా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మస్ట్ వాచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకులు మారియా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ మూవీని జైవర్దన్ నిర్మించారు. ఈ మూవీతో సుమారు 11ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్ వెండితెరపై కనిపించాడు. అయితే, ఓటీటీలో హ్యాపీ రాజ్ దూసుకుపోతున్నాడు.ట్రెండింగ్లో హ్యాపీ రాజ్తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్న 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులలో వేగంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ సినిమాగా చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంపై చిత్ర యూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది.ప్రతి కుమారుడు తన తండ్రితో చూడాల్సిన సినిమా అంటూ చాలామంది నెటిజన్లు హ్యాపీ రాజ్ మూవీ గురించి పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో కన్నీళ్లు తెప్పిస్తుందని తెలుపుతున్నారు. ఓటీటీలో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
హనీ ఈజ్ ది బెస్ట్.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్ (ఫోటోలు)
-
ఇదేం ట్విస్టురా బాబు.. అశు రెడ్డి కేసులో షాకింగ్ నిజాలు
-
పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకుంది. గతంలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకున్న ఈమె ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్లోని ఓ రిసార్ట్లో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా.. ఆ ఫొటోలని ఇప్పుడు పంచుకుంది. తన భర్త అర్ష్ ఔలక్ని పరిచయం చేసింది. ఈమె భర్తకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)పంజాబ్కి చెందిన మెహ్రీన్.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయి, స్పార్క్ లైఫ్ మూవీస్ చేసింది. తమిళ, హిందీ, పంజాబీ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.ఇకపోతే హరియాణాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్తో 2021 మార్చిలో మెహ్రీన్కి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో దీన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య పరి అనే ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా అర్ష్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే మెహ్రీన్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. చూస్తుంటే నటనకు రిటైర్మెంట్ ఇచ్చేలానే ఉంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. భారీ రికార్డ్కు మేకర్స్ ప్లాన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయనుంది.అయితే పెద్ది మూవీ జూన్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్చరణ్ స్పెషల్ సాంగ్లో స్టెప్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి గత రాత్రి నుంచి పలు వార్తలు వస్తున్నాయి. లండన్కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అషురెడ్డి.. తన అనుమతి లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు.(ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)'2021లో ఓ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనని తాను పరిచయం చేసుకుని మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశానని అన్నారు. మా అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగాను. దీంతో మా అమ్మాయి, వాళ్ల అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అని నాతో చెప్పారు. ఓసారి కాకినాడ వచ్చి వెళ్లండి అని కూడా అన్నారు. నేను కాకినాడ వెళ్లలేదు గానీ తెలిసిన వాళ్లతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుదాం అని నాన్చుతూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వినడం''నేను వైజాగ్లో ఉంటాను. మా అమ్మాయి, తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. మొదట నుంచి నాకు, అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. అషురెడ్డికి ఏం తెలీదు, అమయకురాలు. తల్లి పోత్రాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏం తెలీదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు(సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పింది. నేను కూడా ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను' అని అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?) -
రేర్ పిక్ షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఫోటోలో ఎక్కడుందో తెలుసా?
మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్తో ఉన్న ఆనాటి రేర్ పిక్ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) -
'మా లైఫ్లో నువ్వు ఉండటం అదృష్టం'.. బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి పేరు అందరికీ సుపరిచితమే. ఈ ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేసింది. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్గా మారింది.ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ప్రత్యేకంగా తన భర్తకు విషెస్ తెలిపింది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ గంగా అంటూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది… ఎందుకంటే మాతో పాటు మా చిన్న తల్లి కూడా ఉన్నారంటూ రాసుకొచ్చింది. మా జీవితంలో నువ్వు ఉండటం మా అదృష్టం.. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది బిగ్బాస్ శివజ్యోతి. ఇది చూసిన పలువురు సినీతారలు ఈ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
ఓటీటీలో 'ది కేరళ స్టోరీ 2'.. స్ట్రీమింగ్ తేదీ మార్పు
‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఓటీటీ స్ట్రీమింగ్ తేది మారింది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ది కేరళ స్టోరీకి కొనసాగింపుగా ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే ఓటీటీ రిలీజ్ గురించి ప్రకటించారు. అయితే, తాజాగా మరో తేదిని ప్రకటిస్తూ ఎక్స్ పేజీలో షేర్ చేశారు. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మరి ఓటీటీలో ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.ది కేరళ స్టోరీ 2 మొదట మే 8 ZEE5లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, స్ట్రీమింగ్ తేదీని మే 1, 2026కి ముందుకు జరిపారు. అయితే, ఈ ముందస్తు విడుదలకు గల సరైన కారణాన్ని చిత్ర నిర్మాతలు గానీ, ప్లాట్ఫామ్ గానీ వెల్లడించకపోవడంతో, ఈ మార్పు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. థియేటర్స్లో విడుదల సమయంలో అనేక చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొని, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Love looked like a new beginning, until it started closing in. Divya, Neha, and Surekha step into relationships built on trust, only to face a reality that reshapes their lives. Watch #TheKeralaStory2, streaming from 1st May on ZEE5.#TheKeralaStory2OnZee5… pic.twitter.com/t4Ev3wbgiR— ZEE5Official (@ZEE5India) April 25, 2026 -
రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి తనపై నమోదైన కేసు గురించి సోషల్మీడియా ద్వారా స్పందించింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక పోస్ట్ చేసింది. ఆపై ఆమె పలు ఫోటోలను షేర్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె కొల్హాపూర్ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న దృశ్యాలను పంచుకుంది. అయితే, అందులో అమ్మవారికి సమర్పించిందేకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం)సినీ నటి అషురెడ్డిపై హైదరాబాద్లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేట్కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర.. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
హైదరాబాద్ లో సినీ నటి అషురెడ్డిపై కేసు నమోదు
-
విలువలు ముఖ్యం.. కోట్ల డబ్బును కాదన్న జి.వి. ప్రకాష్
సినిమా, స్పోర్ట్స్ రంగాలకు చెందిన అగ్ర నటులు, గొప్ప క్రీడాకారులు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే, వృత్తిపరంగా తీసుకునేంత రేంజ్లో వాణిజ్య ప్రకటనలకు కూడా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇందులో కొందరు మాత్రం ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా దొరికిన ప్రతి బ్రాండ్లకు ప్రచారం చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. మరికొందరు సమాజ హితం కోరి ప్రజలకు హాని చేసే వస్తువులకు ప్రమోషన్ చేయరు. ఇప్పుడు ఇదే కోవలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.బ్రాండ్ ఎండార్స్మెంట్ల విషయంలో సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ కుమార్ ఒక బలమైన ప్రకటన చేశారు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను మద్యం, జూదాన్ని ప్రచారం చేయనని పేర్కొన్నారు. ఈ అంశంలో కొందరు తనను సంప్రదించారని భారీ మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. పలుమార్లు చాలామంది పదేపదే తనను సంప్రదించినప్పటికీ నిరంతరం నిరాకరిస్తున్నానని ఆయన వెల్లడించారు.తాజాగా ప్రముఖ కంపెనీకి చెందిన ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ను ప్రచారం చేయడానికి తనకు కోట్లు కూడా ఆఫర్ చేశారని, కానీ అది తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేకపోవడంతో దానిని తిరస్కరించానని ప్రకాష్ కుమార్ తెలిపారు. కీర్తితో పాటు తమకు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలని అందుకే వాటికి దూరంగా ఉంటున్నాని అన్నారు. వినోద పరిశ్రమలో ఆర్థిక లాభం కంటే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన వైఖరికి అభిమానులు ప్రశంసలు కురిపించారు.సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే హీరోగా కూడా జి. వి. ప్రకాష్ రాణిస్తున్నారు. యుగానికి ఒక్కడు, మదరాసు పట్టణం, ఆకాశం నీ హద్దురా, అమరన్, లక్కీ భాస్కర్, పరాశక్తి, ఇడ్లీ కొట్టు వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. -
2026 మిస్
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తుంటారు. కుదిరితే ఏడాది రెండు లేదంటే కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో చాలామంది ఒక్కో సినిమా కోసం ఏడాది, రెండేళ్లు కూడా పని చేస్తున్నారు. భారీ బడ్జెట్, విదేశాల్లో షూటింగ్స్, నటీనటుల డేట్స్ క్లాష్,పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్, రిలీజ్ డేట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏవైనా కొందరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి ఏడాది ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లు తక్కువగానే ఉంటున్నారు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్కి వెళ్లింది. దీంతో నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, అనుకున్న ఔట్పుట్ వచ్చేవరకు రాజీ పడటం లేదు. లేట్ అయినా పర్లేదు కానీ ఫైనల్గా ఆడియన్స్కి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చి, వారిని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ కారణంగా షూటింగ్,పోస్ట్ ప్రోడక్షన్కే చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలు ప్రతి ఏడాది తమ సినిమాలను విడుదల చేయలేక΄ోతున్నారు. ఇందులో భాగంగా హీరోలు నాగార్జున, బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... ఇలా పలువురు హీరోలు 2026ని మిస్ అవుతున్నారు. వారి సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.రెండోసారి... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. గతంలో వరుస సినిమాలతో అటు అక్కినేని అభిమానులను ఇటు ప్రేక్షకులను అలరించిన ఆయన సోలో హీరోగా వరుసగా రెండేళ్లు మిస్ అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘నా సామిరంగ’ 2024లో విడుదలైంది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. ఆ తర్వాత నాగార్జున సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ‘కుబేర, కూలీ’ వంటి తమిళ సినిమాల ద్వారా తెలుగు–తమిళ ప్రేక్షకులను పలకరించారాయన. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు నాగార్జున. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలోనూ ధనుష్తో కలిసి నటించారు. ఈ సినిమా 2025 జూన్ 20న విడుదలైంది. ఇదిలా ఉంటే... తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా కోసం కాస్త సమయం తీసుకుని కథని ఓకే చేశారు నాగార్జున. ఆయన నటిస్తున్న 100వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ అందుకున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో 100వ సినిమా అనేది కీలకమైనది కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నాగార్జున.ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలీలో శరవేగంగా జరుగుతోంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ కార్తీక్. ఈ మూవీలో మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్లో కనిపించబోతున్నారు నాగార్జున. ఈ చిత్రంలో ఆయన 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ దశల్లో, విభిన్న గెటప్స్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికత సాయంతో నాగార్జునను 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు. సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రకథ తండ్రీ–కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందట. ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ వంటి టైటిల్స్ని పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని తొలుత యూనిట్ అనుకుందట. అయితే నాగార్జునకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సందర్భంగా 2027లో విడుదల చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఈ రకంగా చూస్తే సోలో హీరోగా నాగార్జున వరుసగా 2025, 2026... రెండేళ్లను మిస్ అవుతున్నట్లే లెక్క. ఏడాది గ్యాప్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2: తాండవం’ గత ఏడాది విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ మూవీస్ తర్వాత బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా 2025 డిసెంబరు 12న విడుదలైంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నటించనున్న చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.‘వీర సింహారెడ్డి’ (2023) తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఎన్బీకే 111’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా నయనతార నటిస్తున్నారు. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి సినిమాల తర్వాత బాలకృష్ణ– నయనతార జోడీగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. పవర్ఫుల్ ఎమోషన్ ్స, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ముంబై నేపథ్యంలో ఉంటుందట. ఈ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని టాక్.దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయాలని చిత్రయూనిట్ తొలుత భావించింది. అయితే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో షూటింగ్ ఆలస్యమైనా సరే ఔట్పుట్ విషయంలో రాజీ పడకూడదన్నది మేకర్స్ ఆలోచన అట. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ, పోస్ట్ ప్రోడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావనే ఆలోచనతో డిసెంబరులో విడుదల చేద్దామన్నది మరో ఆలోచన అట. అయితే బాలకృష్ణకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ 2027 సంక్రాంతికి ‘ఎన్బీకే 111’ని విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ లెక్కన చూస్తే 2026ని బాలకృష్ణ మిస్ అయినట్లే అని భావించవచ్చు. రెండున్నరేళ్లకు పైగా గ్యాప్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’ 2024 లో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెం బరు 27న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా నటించారు ఎన్టీఆర్. అంతేకాదు... ఈ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.‘దేవర: పార్ట్ 1’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రపోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు.ఈ రెండు పాత్రల కోసం ఆయన మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తేదీకి ‘డ్రాగన్’ తప్పకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ అనుకున్నారు.మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. అనుకున్నట్లే అప్డేట్ వచ్చింది.. అయితే సినిమాని 2026 జూన్ 25 నుంచి 2027 జూన్ 11కి విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో తమ అభిమాన హీరో సినిమా కోసం మరో ఏడాది పాటు ఫ్యాన్స్ నిరీక్షించక తప్పదు. ఈ విధంగా చూస్తే ‘దేవర: పార్ట్ 1’ విడుదలైన 2024 సెప్టెంబరు 27 నుంచి 2027 జూన్ 11 మధ్య గ్యాప్ రెండున్నరేళ్లకు పైగానే ఉంది. సెకండ్ టైమ్ ‘ఏంట్రోయ్... గ్యాప్ ఇచ్చావ్’ అంటూ నటుడు మురళీ శర్మ అనగానే... ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో చూశాం. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూస్తే ఆయన కావాలని గ్యాప్ ఇవ్వకున్నా వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించనున్న 22వ సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.‘పుష్ప: ది రూల్’ మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తమిళ డైరెక్టర్ అట్లీతో నటించేందుకు అల్లు అర్జున్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ 22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ సాంకేతికతతో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘రాకా’ అనే టైటిల్ని ఖరారు చేసి, ఫస్ట్ లుక్తో అల్లు అర్జున్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.ఈ సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. ఈపోస్టర్ చూస్తే.. అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ సరికొత్త అవతారంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండు, వింత శరీరాకృతి, చూపుల్లో వాడీ వేడి... ఇలా సరికొత్త లుక్లో ఉండటంతో ‘రాకా’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రాకా’ ఒకటి. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు అట్లీ.హాలీవుడ్ సినిమాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఇచ్చారాయన. ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రకంగా చూస్తే వరుసగా 2025, 2026 ఏడాదిలను అల్లు అర్జున్ మిస్ అయ్యారు. సంవత్సరం గ్యాప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాల నటుడిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో సోలో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఆ మూవీ మంచి హిట్గా నిలిచింది. ‘జాంబి రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా–ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘హనుమాన్’. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా హిట్గా నిలిచింది.ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు తేజ సజ్జా. ‘హనుమాన్’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ ప్రధాన పాత్రపోషించారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2025 సెప్టెంబరు 12న విడుదలై, హిట్గా నిలిచింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత తేజ సజ్జా నటించనున్న చిత్రాలపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.అయితే తన హిట్ సినిమాలైన ‘జాంబి రెడ్డి’కి సీక్వెల్గా ‘జాంబీ రెడ్డి 2’, ‘హనుమాన్’ మూవీకి సీక్వెల్గా ‘జై హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రం సీక్వెల్ ‘మిరాయ్: జైత్ర’ లో నటించనున్నట్లు తేజా సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటిల్లో ముందుగా ‘జై హనుమాన్ ’ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషబ్ శెటì ్ట హనుమంతుడి పాత్ర చేయనున్నారు. ఈ మూవీలో తేజ సజ్జా తన పాత్రని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లి, 2027లో విడుదల కానుంది. ఈ లెక్కన చూస్తే తేజ సజ్జా 2026ని మిస్ అవుతున్నారు.మూడేళ్లు గ్యాప్... హీరో మహేశ్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చో ప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత ‘వారణాసి’ కోసం మేకోవర్ అయ్యేందుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు మహేశ్బాబు. ఈ మూవీ కోసం ΄÷డవాటి హెయిర్ స్టైల్తో పాటు లైట్గా గెడ్డం కూడా పెంచారాయన. ఫిజికల్ మేకోవర్ కోసం బాగా కృషి చేశారు.ఇందుకోసం దాదాపు ఆరు నెలల పాటు ట్రైన్ అయ్యారట. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకుపైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాతపోస్ట్ ప్రోడక్షన్కి కూడా దాదాపు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు సమయం పడుతుంది. ఈ సినిమాలో మైథాలజీ బ్యాక్డ్రాప్కి అధిక ప్రాధాన్యం ఉంది. రామాయణం ఎపిసోడ్ని తనదైన శైలిలో తెరపై చూపించబోతున్నారు రాజమౌళి.‘గతంలో తాను తీసిన సినిమాలన్నీ రామాయణం నుంచి స్ఫూర్తి పొందినవే అని, మొదటిసారి ఆ రామాయణం ఎపిసోడ్ని ‘వారణాసి’లో చూపిస్తున్నాను’ అంటూ రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉండబోతుందట. ‘వారణాసి’ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో భాగంగా త్రేతాయుగంలో రాముడి పాత్రలో కనిపించనున్నారు మహేశ్. అదే విధంగా రుద్ర అనే సాహస వీరుడిగా మరో పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో తీసిన సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయని టాక్. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.అందులో భాగంగానే హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వారణాసి’ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. మహేశ్బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్పై వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. ఈ సినిమా విడుదలయినప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్బాబు చె΄్పారంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని బట్టి చూస్తే 2025, 2026 ఏడాదిలను మహేశ్బాబు కూడా మిస్ అయినట్లే. ‘గుంటూరు కారం’ విడుదల తేదీ నుంచి ‘వారణాసి’ రిలీజ్ డేట్ వరకు చూస్తే మూడేళ్లకు పైగా ఆయన సినిమా కోసం ప్రేక్షకులు నిరీక్షించినట్లే లెక్క. పైన పేర్కొన్న హీరోలే కాదు.. మరికొంత మంది కూడా 2026ని మిస్ అయ్యే అవకాశాలున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
కేరళలో యాక్షన్
హీరోయిన్ రష్మికా మందన్న యాక్షన్ బాట పట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మైసా’. ఈ మూవీలో రష్మిక గోండు గిరిజన అమ్మాయిగా కనిపించనున్నారు.పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల పాటు జరగనున్న యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ను కేరళలో ప్రారంభించాం. కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్గా నిలిచేలా ఉంటుంది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్!
నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్ను ఆ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్గా టాలీవుడ్లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో ఆమెకు పెద్ద గ్యాపే వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. -
చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?
చిన్న చిన్న హీరోల సినిమాలకు ఇబ్బందులు వచ్చాయంటే ఏదో అనుకోవచ్చు. స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి మూవీకి, అది కూడా ఇంకా మొదలవకముందే వస్తున్నాయంటే ఏమనుకోవాలి? ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' మూవీతో హిట్ కొట్టిన చిరు.. లెక్క ప్రకారం డైరెక్టర్ బాబీతో ఈ పాటికే కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టేయాలి. కానీ ఎక్కడో సమస్యలు ఈ చిత్రానికి చుట్టుకుంటున్నాయి. దీంతో నిర్మాత విషయంలో లేనిపోని టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)తమిళ స్టార్ హీరో విజయ్తో 'జన నాయగణ్' తీసిన నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఈ సినిమాతో బోలెడన్ని లాభాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.మరోవైపు కన్నడ స్టార్ హీరో యష్తో ఈయనే 'టాక్సిక్' నిర్మించారు. ఇది కూడా మార్చిలోనే విడుదలవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల జూన్ 4కి వాయిదా పడింది. మరోవైపు ఈయనే నిర్మించిన 'కేడీ' అనే పాన్ ఇండియా సినిమాలోని పాట, కొన్నిరోజుల ముందు వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ట్రైలర్ కూడా ఇలాంటి సమస్యే ఎదురవగా యూట్యూబ్ నుంచి తీసేశారు. ఇలా లెక్కకు మించిన సమస్యల కారణంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.ఇన్ని ఇబ్బందులు ఉండటంతో చిరు-బాబీ చేయాల్సిన కొత్త ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. చిరు సినిమా నుంచి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతగా తప్పుకొందని కొందరు అంటున్నారు. లేదు లేదు ఈయనతో పాటు మరో నిర్మాత కావాల్సి ఉందని రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే చిరు తెలిసిన ఓ నిర్మాత.. ఈ మూవీ విషయంలో భాగస్వామిగా మారబోతున్నాడని మరో టాక్ వినిపిస్తుంది. ఏదో ఒకటి త్వరగా దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో స్టార్ హీరో సర్జరీ.. రిస్క్ చేశాడా?) -
తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?
మనిషి జీవితం రోజురోజుకీ మారుతోంది. మరోవైపు సినిమాలు తీసే, చూసే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోతో కమర్షియల్ మూవీ తీస్తే చాలు.. కథ కొంచెం అటుఇటుగా ఉన్నాగానీ 50, 100 రోజుల పాటు ఆడేవి. మరి ఈ తరహా చిత్రాలపై జనాలకు మోజు తగ్గిందో లేదంటే నిర్మాతల అత్యుత్సాహం కొంపముంచుతోందో తెలియట్లేదు గానీ తెలుగు సినిమాల జీవితకాలం తగ్గిపోయింది. కేవలం మూడంటే మూడు రోజులకు వచ్చేసింది. మరి ఈ పరిస్థితికి ఎవరు కారణం? ప్రస్తుతం ఏం జరుగుతోంది?ఒకప్పుడు 50,100 రోజుల పాటు సినిమాలు ఆడేవి. తర్వాత అవి వారాలకు వచ్చాయి. ఇప్పుడు మొదటి వీకెండ్ అయ్యేసరికి సినిమా పరిస్థితి అటో ఇటో తేలిపోతోంది. శుక్రవారం రిలీజైన చిత్రానికి ఆదివారం వచ్చేసరికల్లా హిట్ లేదా ఫ్లాప్ అనే ముద్రపడిపోతుంది. హిట్ అయితే సోమవారం నుంచి కాస్తోకూస్తో జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫ్లాప్ అని టాక్ వస్తే మాత్రం థియేటర్ వైపే చూడట్లేదు.ఒకప్పుడు సినిమా టాక్ యావరేజ్గా ఉన్నా సరే వారం, పదిరోజుల తర్వాత పికప్ అయ్యేది. మౌత్ టాక్ ఇందులో కీలక పాత్ర పోషించేంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కనీస ఊపిరి పీల్చుకునేంత టైమ్ కూడా సినిమాలకు దొరకట్లేదు. దీనికి కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు జనాలు స్వయంగా థియేటర్కి వెళ్లి సినిమా చూసి.. నచ్చితే నలుగురికి చెప్పేవారు. కానీ ఇప్పుడు మొదటి షో పూర్తయ్యేసరికే ట్విటర్ రివ్యూలు, పబ్లిక్ టాక్ అని మూవీ రిజల్ట్ చాలా వేగంగా బయటకొచ్చేస్తుంది. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతున్నారు.సినిమాల లైఫ్ తగ్గడానికి మరో కారణం 'అంచనాలు'. కొందరు హీరోలు, దర్శకులు.. తమ సినిమాలో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అంచనాలు పెంచేస్తున్నారు. తీరా చూస్తే ఓస్ ఇంత దానికా అంత హడావుడి అని జనాలకు అనిపిస్తోంది. దీంతో ఆయా మూవీస్ నచ్చట్లేదు. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు.. ప్రతి మూవీలోనూ 'వావ్ ఫ్యాక్టర్' ఉందా లేదా అని వెతుకుతున్నారు. కథ పక్కనబెడితే సర్ప్రైజ్ లేదా ఎంటర్టైన్మెంట్స్ ఎలిమెంట్స్ లాంటివి ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అలాంటివి లేకపోతే ఆ సినిమాని పట్టించుకోవట్లేదు. దీని వల్ల నెమ్మదిగా సాగే కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోతున్నాయి.ఈ నెలలోనే చూసుకుంటే డెకాయిట్, బైకర్, రాకాస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ యావరేజ్గా ఉన్నాయని ఆడియెన్స్ ఫిక్సయిపోవడంతో మూడు రోజులకు మించి ఊపు కొనసాగించలేకపోయాయి. చిత్రబృందాలు ఎంతలా ప్రమోషన్స్ చేసినా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు ఈ తరహా చిత్రాలకు లాంగ్ రన్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదంటేనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడివే దర్శకనిర్మాతలకు అతిపెద్ద సవాళ్లుగా మారిపోయాయి. ఇండస్ట్రీ ధోరణి కూడా మొదటి వీకెండ్ అయ్యేసరికి ఎలాగోలా డబ్బులొచ్చేస్తే చాలులే అన్నట్లే తయారైంది. మరోవైపు ఆడియెన్స్ టేస్ట్ కూడా మారిపోతోంది. ఒకప్పుడు సినిమాలు చూసి బాగుంది బాగోలేదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడంతా ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిసైడ్ అయిపోతున్నారు. టాక్ బాగోలేకపోతే సినిమాని నిర్ధాక్ష్యిణ్యంగా వదిలేస్తున్నారు. మరోవైపు ఓటీటీలో ప్రతి వీకెండ్ వస్తున్న పరభాషా సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాల జీవితకాలం తగ్గడానికి ఓ రకంగా కారణమవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం టాలీవుడ్కి రాబోయేది గడ్డుకాలమే! -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ) రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) -
లావణ్య త్రిపాఠి మూవీ.. రిలీజ్ డేట్ ప్రకటన
మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. మార్చి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ మూవీని ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో వి.కె.నరేశ్, వి.టి.వి.గణేశ్, సప్తగిరి వంటి వారు నటిస్తున్నారు. సంగీతం మిక్కీ జె.మేయర్ అందిస్తున్నారు.‘సతీ లీలావతి’ చిత్రం మే 8న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇదే పాయింట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథలో భార్యగా లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి నటించగా.. భర్తగా దేవ్ మోహన్ నటించారు. లావణ్య పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై సోషల్మీడియాలో బజ్ క్రియేట్ అయింది. -
రేసుగుర్రం Vs డార్లింగ్.. రీ రిలీజ్ రికార్డులన్నీ ఔట్
-
హీరో సంచలన నిర్ణయం.. రీషూట్ చేస్తున్న మేకర్స్ ?
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’కు విడుదల ముందే కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే ఒక్కసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 26న రిలీజ్ చేస్తామని కొత్త తేదీని ప్రకటించారు. అయితే, ఇప్పడు తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే జూన్లో లెనిన్ రావడం కష్టమేనని తెలుస్తోంది.'లెనిన్' మూవీ గురించి ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ ప్రకారం రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఏడాదికి పైగా నిర్మాణ దశలోనే ఉంది. అయితే, అఖిల్ కోరికమేరకు కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ మూవీ జూన్ 26న విడుదల కావడం కష్టమేనని గుసగుసలు మొదలయ్యాయి.లెనిన్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాపై భారీగానే బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల అంచనాలను లెనిన్ అందుకుంటాడో లేదో కొద్దిరోజుల్లోనే తేలనుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
విజయ్ ఆంటోనికి జోడీగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్..
వైవిధ్య కథా పాత్రలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా శశి దర్శకత్వంలో నటించిన నూరుసామి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విజయ్ అంటోని తన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ఎం.మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు ఇరవుక్కు అయిదు కంగళ్, కన్నై నంబాతే (కళ్లను నమ్మొద్దు), బ్లాక్ మెయిల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. తాజాగా సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి అప్పాకుట్టి అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో విజయ్ ఆంటోనికి జంటగా ప్రీతి అస్రాని నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలుగులో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? చిత్రంతో ప్రీతి అస్రాని చైల్డ్ ఆర్టిస్గా వెండితెరకు పరిచయం అయింది. 'మళ్లీ రావా', గుండెల్లో గోదారి, దొంగలున్నారు జాగ్రత్త, సీటీమార్, తదితర సినిమాల్లో నటించిన ప్రీతి ఆస్రానీ హీరోయిన్గా ఇప్పటికే తమిళంలో 'కిస్' మూవీతో వచ్చింది. -
అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
వారణాసి గ్లోబల్ ఈవెంట్.. టైమింగ్స్ ఇవే..!
మహేశ్బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టైటిల్ ప్రకటనతోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు. అందుకే వారణాసి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఏడాది ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్ను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్పీరియెన్స్లో ప్రదర్శించనున్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం రేపు ఉదయం 5.15 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాపై ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మక థండర్ స్టేజ్లో ప్రత్యేక ప్యానెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ‘వారణాసి టు ది వరల్డ్’ అనే సెగ్మెంట్ను హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్లో వారణాసి మేకింగ్ వీడియోలు ప్రదర్శించునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నుంచి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల కాని బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్ ఫ్యాన్స్కు పరిచయం చేయనున్నారు. దీంతో పాన్ వరల్డ్ రేంజ్లో వారణాసి ప్రమోషన్స్ షురూ కానుంది. -
రీ రిలీజ్లోనూ డార్లింగ్ సత్తా.. పవన్ కల్యాణ్ మూవీ రికార్డ్ బ్రేక్
టాలీవుడ్ కొన్ని నెలలుగా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీని కూడా బిగ్ స్క్రీన్పై విడుదల చేశారు. విడుదలైన 16 సంవత్సరాల తర్వాత థియేటర్లలో మళ్లీ సందడి చేసింది. 2010లో ఏప్రిల్ 23న రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు.ఈ రొమాంటిక్ మూవీ రీ రిలీజ్లోనూ సత్తా చాటింది. మొదటి రోజు ఏకంగా రూ.7.59 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రీ-రిలీజ్ మూవీస్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేశ్ బాబు ఖలేజా చిత్రాల వసూళ్లను అధిగమించింది.ఈ సినిమా కంటే ముందు 'బాహుబలి: ది ఎపిక్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ.19.65 కోట్లు వసూలు చేసింది. కాగా.. డార్లింగ్ మూవీని 4కె వర్షన్లో రిలీజ్ చేశారు. బాహుబలి: ది ఎపిక్ ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీ-రిలీజ్గా నిలిచింది. కాగా.. డార్లింగ్ మూవీకి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో నిర్మించారు. -
'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు
'ఠాగూర్' పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తారు. ఇందులో ఆయన చెప్పిన డైలాగ్స్, అద్భుతమైన యాక్టింగ్ మరోసారి మదిలో మెదులుతాయి. చెప్పాలంటే చిరు కెరీర్లోనే మైలురాయి లాంటి సినిమా ఇది. అయితే ఇదో రీమేక్ అని చాలామందికి తెలీదు. అలానే రాజశేఖర్ చేయాల్సిన ఈ మూవీ.. చిరంజీవి చేతుల్లోకి వచ్చిందనే సంగతి కూడా ఇప్పటి జనరేషన్లో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడీ విషయంపై స్వయంగా రాజశేఖర్ స్పందించారు. అప్పట్లో ఏం జరిగిందో బయటపెట్టారు.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)''ఠాగూర్' నేను కొనుక్కున్న సినిమా. అడ్వాన్స్ అంతా ఇచ్చేశా. నిర్మాత నా ఫ్రెండే కదా అని అగ్రిమెంట్ చేసుకోలేదు. ఠాగూర్ మధు ఉన్నారు కదా! చిరంజీవి కోసం ఆయన వెళ్లి, ప్రొడ్యూసర్ని కలిసి ఎక్కువ డబ్బులిస్తానని చెప్పి పట్టుకెళ్లిపోయారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఇవ్వలేదు. ఇది జరిగింది' అని రాజశేఖర్ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు.శంకర్ దర్శకత్వంలో అర్జున్ చేసిన 'జెంటిల్మన్' సినిమా కూడా తానే చేయాలని.. కానీ 'అల్లరి ప్రియుడు' షూటింగ్ టైంలోనే ఆ అవకాశం రావడంతో తప్పక వదులుకున్నానని రాజశేఖర్ చెప్పారు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీలో తెర వెనక చాలా జరుగుతుంటాయి. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లాంటివి లేకపోవడం నిజాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఈయనే చెప్పడంతో జరిగింది ఇది అని అందరికీ క్లారిటీ వచ్చింది.తమిళంలో విజయకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో 'రమణ' సినిమా వచ్చింది. ఇది బ్లాక్బస్టర్ కాగా తెలుగులో దీన్నే 'ఠాగూర్'గా రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. సూపర్హిట్గా నిలిచింది. ఒకవేళ ఇది రాజశేఖర్ చేసుంటే ఎలా ఉండేదో మరి?(ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త) -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. ఆ డేట్నే ఫిక్స్ చేశారా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్కు షిఫ్ట్ చేశారు.అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతర వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక బాబీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవితో జతకట్టారు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. బాబీతో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించనున్న చిత్రం వచ్చే నెలలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ కాకాజీ అని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బాబీ pic.twitter.com/aXxXVBlxUM— Telugu360 (@Telugu360) April 24, 2026 -
ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Behind every “perfect” romance can lie a calculated trap. Witness the moment Divya, Neha, and Surekha’s dreams spiraled into a nightmare.Watch #TheKeralaStory2, streaming from 8th May on ZEE5.#TheKeralaStory2OnZee5#TheKeralaStory2GoesBeyond #ShowYourDaughters… pic.twitter.com/TMdec083gG— ZEE5Official (@ZEE5India) April 24, 2026 -
రెడ్ డ్రస్లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)
-
15 ఏళ్ల తర్వాత సమీరా రెడ్డి రీఎంట్రీ..
బాలీవుడ్ నటి సమీరా రెడ్డి సుమారు 15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న సమీరా.. అంతకు ముందే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కృష్ణం వందే జగద్గురుం (2012) మూవీలో ప్రత్యేక గీతంలో మాత్రమే ఆమె కనిపించారు. అయితే, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆఖ్రీ సవాల్’లో కీలక పాత్రలో ఆమె నటిస్తుంది. ఈ చిత్రం మే 8న విడుదల కానుంది.ఆఖ్రీ సవాల్ మూవీలో సమీరా రెడ్డి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. తన రీఎంట్రీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నటించబోయే పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని సమీరా వెల్లడించింది. రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే, నటనకు ఆస్కారం కల్పించే అర్థవంతమైన పాత్రలపైనే తన దృష్టి ఉంటుందని ఆమె నొక్కి చెప్పింది.ఆఖ్రీ సవాల్ చిత్రాన్ని జాతీయ అవార్డు దర్శకుడు అభిజీత్ మోహన్ వారంగ్ తెరకెక్కిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ప్రయాణాన్ని కథగా రాసుకుని ఈ మూవీని తీసినట్లు సమాచారం. ఇందులో సంజయ్ దత్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి పీహెచ్డీ విద్యార్థి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఖ్రీ సవాల్ చిత్రం ద్వారా ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోపణలు గురించి చూపించనున్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఘటనలు.. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలను ఈ మూవీలో చూపనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ నందా, సంజయ్ దత్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. -
పెద్దిలో శృతి స్పెషల్ సాంగ్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా
-
చిరంజీవి, బాలకృష్ణ.. రేసులో తెలుగు హీరోయిన్
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్లో రానున్న చిత్రంలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతికి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్మీడియాలో కథనాలు వస్తున్నాయి. చివరిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మెప్పించిన ఈ తెలుగు బ్యూటీకి తన కెరీర్లో ఎక్కువగా గ్లామరస్ పాత్రలే దక్కాయి. అయితే, చిరు సినిమాలో తనకు ఒక సీరియస్ పాత్రను దర్శకుడు బాబీ క్రియేట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.తాజా వార్తల ప్రకారం చిరంజీవి- బాబీ సినిమాలో డింపుల్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. తొలిసారి నెగటివ్ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారని తెలియడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరంగా, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని తదుపరి చిత్రం కోసం నిర్మాతలు ఆమె పేరును పరిశీలిస్తున్నారనే రూమర్ వచ్చింది. అందులో కూడా ప్రతినాయక పాత్రే కావడం విశేషం. ఇలా రెండు పెద్ద ప్రాజెక్ట్లలో ఆమె పేరు రావడంతో డింపుల్ వైరల్ అవుతుంది. డింపుల్లో మంచి టాలెంట్ ఉంది. కానీ, ఆమె కెరీర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మంచి ఛాన్స్ ఇంకా రాలేదని నెటిజన్లు చెబుతుంటారు. చిరు- బాబీ చిత్రాన్ని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా.. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ను వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. -
ఖురాన్ నేర్చుకున్న ధురంధర్ దర్శకుడి సతీమణి
బాలీవుడ్ నటి యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన చిత్రం హక్.. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు సుపర్న్ ఎస్ వర్మ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్లో భాగంగా వాస్తవికతను తెలుసుకునేందుకు తమ టీమ్ ఎంతగానో శ్రమించిందని ఆయన వెల్లడించారు.హక్ సినిమా ఇస్లాం మత విధానం, వారి ఆచారాలు వంటి అంశాలతో నిండి ఉంటుంది. దీంతో ఇస్లామిక్ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి తమకు సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందని దర్శకుడుసుపర్న్ ఎస్ వర్మ తెలిపారు. షా బానో పాత్రలో యామీ గౌతమ్ జీవించారిన ఆయన అన్నారు. యామీ గౌతమ్ తన పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మత గ్రంథాలను అధ్యయనం చేయడంతో సహా విస్తృతమైన సన్నాహాలు చేశారని సుపర్న్ వర్మ వెల్లడించారు. ఈ పాత్ర కోసం పవిత్ర ఖురాన్ను కూడా యామీ నేర్చుకున్నారని ఆయన తెలిపారు. ఈ మూవీతో యామీ గౌతమ్కు మంచి గుర్తింపు దక్కింది. ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్కు ఆమె సతీమణి అనే విషయం తెలిసిందే.45 ఏళ్ల క్రితం జరిగిన షా బానో కేసును తిరిగి ఈ మూవీతో మరోసారి గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన షా బానో(62)కు, తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చాడు. జస్ట్ త్రిబుల్ తలాక్ అనే పదంతో తమ 40 ఏళ్ల బంధం తెగిపోయింది. అయితే, పిల్లల పోషణ బాధ్యతను పట్టించుకోకుండా భార్యను వదిలేయడంతో ఆమె 125 సీఆర్పీసీ కింద కోర్టులో పిటిషన్ వేసింది. సుమారు పదేళ్ల తర్వాత సుప్రీంలో షా బానో కేసు గెలిచింది. దీంతో భారతీయ ముస్లిం మహిళల హక్కులను కాపాడిన కేసుగా షా బానో తీర్పుకు ప్రాధాన్యత దక్కింది. -
గ్లామర్ క్వీన్ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ప్రభాస్ అభిమానిపై థియేటర్ సిబ్బంది దాడి
ప్రభాస్ హిట్ సినిమా డార్లింగ్ రీ-రిలీజ్ అయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ థియేటర్లో షో రన్ అవుతుండగా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ‘డార్లింగ్’ సినిమా విడుదలై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 4K వెర్షన్లో రీ రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా సంఖ్యలో మరోసారి సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, సినిమా చూస్తున్న ప్రభాస్ అభిమానిపై సుదర్శన్ థియేటర్ యాజమాన్యం దాడి చేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది.డార్లింగ్ సినిమాలోని పాటలు ఒక షోలో వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలపడంతో తమపై దాడి చేశారని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే, థియేటర్ నిర్వహాకుల వర్షన్ మరోలా ఉంది. సదరు వ్యక్తి మద్యం మత్తులో థియేటర్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో తాము రియాక్ట్ అయ్యామని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో నెటిజన్ల నుంచి వ్యతిరేఖత వస్తుంది. థియేటర్స్లలో తరుచుగా ఇలాంటి గొడవలు జరగడం సహజం. ఇలాంటి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన యాజమాన్యం ఒకరిని కర్రతో కొట్టడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ వేసవిలో సినిమా సందడి పెద్దగా కనిపించలేదు. కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్స్ బోసిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ హిట్ సినిమా ప్రమోషన్లతో హడావిడి చేసిన చిన్న సినిమాలు రెండురోజుల్లోనే చేతులు ఎత్తేయడంతో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మారిపోయింది. ఇలాంటి టైంలో డార్లింగ్ రూపంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్కు మరో ఆక్సీజెన్ దొరికింది. డార్లింగ్ సినిమాకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. దర్శకుడు ఏ.కరుణాకరన్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీకి భారీ సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు.ప్రభాస్ ఫ్యాన్పై #Sudarshan35MM థియేటర్ మేనేజ్మెంట్ దాడిSongs ఒక షోలో వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలిపారు. Songs వేయాలని అడిగిన అభిమానిపై దాడి జరిగినట్టు సమాచారం.#Darling4K #Prabhas pic.twitter.com/l9zwd6sy4u— Milagro Movies (@MilagroMovies) April 23, 2026Ikada women bag lagindhi so daniki godava chesthe management motham ochi godava karraltho kottaru but baitaki anti fans misbehaving of women and spread chestunaru please share and repost this video atanu na Friend eh he's not that kind of man of misbehaving with women.#Darling4K pic.twitter.com/HIkXL8ZjVq— Jack Sparrow (@Jack_Sparrow131) April 23, 2026 -
ప్రముఖ ఎగ్జిబిషన్లో టాలీవుడ్ యాంకర్ లాస్య సందడి (ఫోటోలు)
-
చాలా ఇష్టమంటోన్న బిగ్బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర: సింగర్ మంగ్లీ మరో పోస్ట్
సింగర్ మంగ్లీ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగిందని తెలిపింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని వెల్లడించింది. బాధితుల తరఫున అండగా ఉంటానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ ఆర్థిక మోసాలతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నానని మంగ్లీ తెలిపింది.కానీ కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అదే పనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం ఏంటనేది నిలకడపై తెలుస్తుందని.. న్యాయ వ్యవస్థ, చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
ఏడాది తర్వాత సినీ నటి రన్యారావు విడుదల
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు విడుదల అయ్యారు. విదేశాల నుంచి భారత్కు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు నమోదు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆమెను ఇక విచారించబోదని తెలిపారు. గత ఏడాది మార్చిలో రన్యారావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ గడువు ముగియడాన్ని కూడా డీఆర్ఐ అధికారులు సవాలు చేయబోదని, గడువు పొడిగింపు కోరడం లేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో బెంగళూరులోని ఆర్థికనేరాల నియంత్రణ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తీర్పు అనంతరం పరప్పన అగ్రహార కారాగారం నుంచి రన్యారావు విడుదలయ్యారు. -
సంజనా గల్రానీ కూతురు బర్త్డేలో పాపులర్ ఎమ్మెల్యే (ఫోటోలు)
-
‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అవాస్తవాలు ఆవేదనను కలిగించాయి: సాయి పల్లవి
సౌత్ ఇండియా స్టార్ నటి సాయి పల్లవి తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఈ బ్యూటీ వైద్య విద్యను పూర్తి చేసి భారతీయ కథానాయకిగా విజయం సాధించారు. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ఈమె సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికిగా రాణిస్తున్నారు. తాజాగా హిందీ ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. హిందీలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన ఏక్ దిన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రాల్లో సీతగా నటిస్తున్నారు. సాయిపల్లవిని చాలా మంది నటీమణుల మాదిరిగానే ఒక విషయం గాయపరిచింది. ఈమె గత రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు మలయాళి కదా తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారు అనే ప్రశ్నకు తాను మలయాళీ కాదు తమిళమ్మాయి అని బదులిచ్చారు. ఆ విషయాన్ని వక్రీకరించి రెండేళ్ల తరువాత ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారం తనను చాలా బాధించిందన్నారు. తాను తమిళ అమ్మాయిని, తన పూర్వీకులు తమిళం అని మాత్రమే చెప్పానని, ఇతర భాషలనో, ఇతరులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు అని ఆమె పేర్కొన్నారు. -
డిఫరెంట్ మూవీతో వస్తోన్న కమిటీ కుర్రోళ్లు బ్యూటీ.. మరో హిట్ కొట్టేనా?
కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా హీరోయిన్ టీనా శ్రావ్య. ఇప్పుడు మరోసారి గేదెల రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా ఆమెను ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేదెల రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో టీనా ఫర్మామెన్స్ చూస్తే ప్రామిసింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న క్యారెక్టర్స్లో టీనా అదరగొడుతోంది. టాలీవుడ్లో చిన్న బడ్జెట్ చిత్రాలకు ఈమె పర్ఫెక్ట్ ఆప్షన్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆమె డైలాగ్ డెలివరీతో పాటు అందం, అమాయకపు నటనా శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈనెల 24న విడుదల కానున్న గేదెల రాజు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
బ్లూ డ్రెస్లో హీరోయిన్ శ్రియా శరణ్..పాలరాతిలా మెరిసిపోతున్న హీరోయిన్ లక్ష్మీ ప్రణీత..శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..హ్యాపీ ఎర్త్ డే అంటోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi)


