విశాఖ జిల్లా చోడవరంలోని పోలీస్ క్వార్టర్లను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదివారం పరిశీలించారు.
చోడవరం: విశాఖ జిల్లా చోడవరంలోని పోలీస్ క్వార్టర్లను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదివారం పరిశీలించారు. రూ.5 కోట్లతో నూతన పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే, పోలీసు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు రాజు తెలిపారు.