రూ. 4,232 కోట్ల కోసం కోర్టులో పిటిషన్ | Victims seek USD 688 mln from Pak-based Mumbai attacks accused | Sakshi
Sakshi News home page

రూ. 4,232 కోట్ల కోసం కోర్టులో పిటిషన్

Published Tue, Nov 11 2014 7:56 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

దాడి జరిగిన తాజ్ మహాల్ హోటల్ - హ ఫీజ్ సయీద్ - Sakshi

దాడి జరిగిన తాజ్ మహాల్ హోటల్ - హ ఫీజ్ సయీద్

 వాషింగ్టన్: ముంబైలో 2008లో ఉగ్రవాద దాడులకు పాల్పడిన పాకిస్తాన్లోని నిందితుల నుంచి తమకు రూ. 4,232 కోట్లు(68.8 కోట్ల డాలర్లు) పరిహారం ఇప్పించాలని నాటి దాడుల బాధితుల బంధువులు న్యూయ్కార్క్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  అమెరికా, ఇజ్రాయెల్లకు చెందిన తొమ్మిది మంది  పౌరుల  బంధువులు ఈ పిటిషన్ వేశారు.

జేయుడి(జమాత్-ఉద్-దవా) చీఫ్ హ ఫీజ్ సయీద్, లష్కరే తోయిబా కమాండర్ జకీరుల్ రెహ్మాన్ లక్వీ తదితరులపై విచారణ జరిపించాలని, వారి నుంచి ఈ మొత్తాన్ని ఇప్పించాలని వారు కోరారు.   గత ఏడాది నవంబర్‌లో ఇవే విజ్ఞప్తులతో వేసిన పిటిషన్‌కు నిందితులు స్పందించనందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
**
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement