డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీసులు పలువురు తప్పిపోయిన చిన్నారులకు ఉపశమనం కలిగించారు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో తప్పిపోయినవారిలో 44 మందిని గుర్తించారు. ఆపరేషన్ స్మైల్ పేరిట తప్పి పోయిన చిన్నారులను శ్రమకూర్చి గుర్తించారు. వీరిలో ఇప్పటికే 31 మంది చిన్నారులను తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
ఉత్తరాఖండ్లో పలువురు చిన్నారులు తప్పిపోగా ఈ అంశం ఆందోళన కరంగామారింది. దీంతో రాష్ట్ర పోలీసులు పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఆపరేషన్ స్మైల్ పేరిట గాలింపు చర్యలు చేపట్టారు. 44 మందిని గుర్తించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వీరిలో ఎక్కువమంది చిన్నారులు హరిద్వార్లో దొరికారు.
అమ్మల చెంతకు 44 మంది చిన్నారులు
Published Wed, Jul 8 2015 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement