దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీ | Robbery in temple at mallapur, Hyderabad | Sakshi
Sakshi News home page

దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీ

Published Sun, Dec 14 2014 9:48 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in temple at mallapur, Hyderabad

హైదరాబాద్: నగర శివారు ప్రాంతం నాచారం మల్లాపూర్లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. శనివారం అర్థరాత్రి  దేవాలయంలోని దొంగలు ప్రవేశించి...  మూడు పంచలోహ విగ్రహాలతోపాటు వెండి కిరీటం, అమ్మవారి నగలు అపహరించారు. దేవాలయంలో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు దేవాలయానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement