266 కిలోల బంగారం మాయం | 266 kg gold missing from Sree Padmanabhaswamy temple: audit report | Sakshi
Sakshi News home page

266 కిలోల బంగారం మాయం

Feb 13 2015 10:06 PM | Updated on Sep 2 2017 9:16 PM

266 కిలోల బంగారం మాయం

266 కిలోల బంగారం మాయం

శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమయినట్టు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు.

తిరువనంతపురం: శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమయినట్టు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు.

ఆలయానికి చెందిన 893 కేజీల బంగారం వివిధ పనుల నిమిత్తం బయటకు ఇచ్చారని, ఇందులో 627 కిలోల బంగారం మాత్రమే తిరిగొచ్చిందని ఆయన తెలిపారు. మిగతా బంగారం ఏమైందన్నది నిగ్గుతేలాల్సివుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వినోద్ రాయ్ ఆడిట్ నిర్వహించారు. ఆలయ సంపద సహా ఆదాయ వ్యయాలపై మదింపు చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement