
జీఆర్టీ చైర్మన్ రాజేంద్రన్కు పురస్కారం
హైదరాబాద్: జీఆర్టీ జ్యుయల్లర్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ జి.రాజేంద్రన్కు జెమ్స్ అండ్స్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. 50 ఏళ్లుగా జ్యుయలరీ రంగానికి చేసిన సేవలకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ అవార్డును రాజేంద్రన్ కుమారుడు, జీఆర్టీ ఎండీ జి.ఆర్. రాధాకృష్ణన్ జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా నుంచి ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు.