all India ranking tennis tournament
-
సింగిల్స్ విజేత అదితి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ ఓపెన్ ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు సత్తా చాటారు. అండర్–16 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన అండర్–16 బాలికల ఫైనల్లో టాప్సీడ్ అదితి ఆరే (తెలంగాణ) 6–0, 6–3తో వేద వర్షిత (తెలంగాణ)పై గెలుపొందింది. డబుల్స్ తుదిపోరులో అభయ వేమూరి–అపూర్వ వేమూరి (తెలంగాణ) ద్వయం 6–0, 6–3తో తనుషిత రెడ్డి–నిర్మయి సురాపూర్ (తెలంగాణ) జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో కోట శశిధర్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో కోట శశిధర్ (తెలంగాణ)–అశ్విన్ భట్ (కర్ణాటక) జంట 1–6, 2–6తో హితేశ్–మానవ్ శ్రీకుమార్ (తమిళనాడు) జోడీ చేతిలో, సింగిల్స్ విభాగంలో శశిధర్ 6–7 (2/7), 6–1, 1–6తో హితేశ్ (తమిళనాడు) చేతిలో పరాజయం పాలయ్యాడు. అండర్–14 బాలుర తుదిపోరులో నితిన్ (ఏపీ) 6–1, 6–3తో నితీశ్ (తమిళనాడు)పై గెలిచాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో నీలా కుంకుమ్ (తెలంగాణ) 6–4, 3–6, 3–6తో ఇషిత (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. -
శరణ్య గెలుపు ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్
జింఖానా, న్యూస్లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శరణ్య నాగ్పాల్ మెయిన్ డ్రా మొదటి రౌండ్లో విజయం సాధించింది. సికింద్రాబాద్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సోమవారం జరిగిన మ్యాచ్లో శర ణ్య నాగ్పాల్ 6-3, 6-1తో ఢిల్లీకి చెందిన మేఘా శరావత్పై నెగ్గింది. నయనిక 7-6 (7-4), 7-5తో అమోల్ వారిక్ (కర్ణాటక)పై, ఎస్. పడమట 6-3, 7-5తో ఆర్యాలిపై గెలిచారు. మరో వైపు అనుష్కా భార్గవ 6-3, 2-6, 2-6తో దాంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో, శ్వేత 3-6, 0-6తో నికు అమిన్ (గుజరాత్) చేతిలో ఓడారు. పురుషుల విభాగంలో సాయి తేజస్ 6-3, 6-3తో తేజిస్విపై నెగ్గి రెండో రౌండ్కు అర్హత సాధించాడు. రోహిత్ సార్వతే 6-4, 7-6తో సాగర్ (మహారాష్ట్ర)పై, శరణ్ రెడ్డి 6-3, 7-5తో సాగర్ (కర్ణాటక) నెగ్గారు.