APSA
-
సెయిలింగ్ విజేత కుషాల్, హర్షిత జోడి
హైదరాబాద్: అంతర్ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ సెయిలింగ్ సంఘానికి చెందిన కుషాల్, హర్షిత జోడి చాంపియన్గా నిలిచింది. హుస్సేన్ సాగర్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ చాంపియన్షిప్లో ఏడు రేసుల్లో ఓవరాల్గా 9 పాయింట్లు సాధించి ఈ జోడి అగ్రస్థానాన్ని సంపాదించింది. తెలంగాణ సెయిలింగ్ సంఘంకు చెందిన రెండు జట్లు... రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దిలీప్, ఐశ్వర్య (తెలంగాణ) జోడి 12 పాయింట్లు సాధించి రన్నరప్గా నిలవగా... జస్ప్రీత్ సింగ్, రాగిణి (తెలంగాణ) జోడి 18 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ అమ్మాయి అరుంధతికి బెస్ట్ యంగెస్ట్ సెయిలర్ అవార్డు లభించింది. -
సత్తా చాటిన కుషాల్, హర్షిత
హైదరాబాద్: అంతర్ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో మొదటి రోజు కుషాల్- హర్షిత (ఏపీఎస్ఏ)జోడి సత్తా చాటింది. హుస్సేన్సాగర్లో శుక్రవారం జరిగిన మూడు రేసుల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొలిరోజు తెలంగాణ జట్లు రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. రేస్-1 విజేతలు: 1. కుషాల్- హర్షిత (ఏపీఎస్ఏ), 2. గిరీష్-అరుంధతి (టీఎస్ఎస్ఏ), 3. జస్ప్రీత్ సింగ్-రాగిణి (టీఎస్ఎస్ఏ) రేస్-2 విజేతలు: 1. కుషాల్- హర్షిత (ఏపీఎస్ఏ), 2. దిలీప్-ఐశ్వర్య (టీఎస్ఎస్ఏ), 3. జస్ప్రీత్ సింగ్-రాగిణి (టీఎస్ఎస్ఏ) రేస్- 3 విజేతలు: 1. కుషాల్- హ ర్షిత (ఏపీఎస్ఏ), 2. గిరీష్-అరుంధతి (టీఎస్ఎస్ఏ), 3. నితీష్-రోహిత్ (ఎపీఎస్ఎఏ).