Advertisement
be allert
-
బీ అలర్ట్: వదంతులు నమ్మకండి!
సాక్షి, ముంబై: గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘17వ వార్షికోత్సవం సందర్భంగా డీమార్ట్ రూ.2500 ఫ్రీ షాపింగ్ వోచర్ ఇస్తుంది’’ అనే వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. యూజర్లు వివిధ గ్రూపులలో దీన్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే అచ్చం డీమార్ట్ వైబ్ సైట్ లానే కనిపించే neuenwfarben.com అనే బోగస్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇది జర్మనీకి చెందిన ఓ వోచర్ స్కామ్ కు చెందిన వైబ్ సైట్అని, తద్వారా ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ మెసేజ్ ను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు. ఒకవేళ ఇప్పటికే ఈ మెసేజ్ ఓపెన్ చేసినవారు వెంటనే తమ ఈమెయిల్ ఐడీ, బ్యాంకు, ఇతర ముఖమైన వాటి పాస్ వర్డ్ లు మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నకిలీ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే వైరస్ ఎటాక్తో ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఈ విషయంపై డీమార్ట్ కూడా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, మెసేజ్లు అవాస్తవమని, తాము అటువంటి ఆఫర్లు ఏమీ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కాగా ఇలాంటి మోసపూరిత మెసేజ్ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేసేటపుడు మరింతజాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకటి రెండు సార్లు పరిశీలించుకొని, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షేర్ చేయాలి. ఇది ఎవరికి వారు విధించుకోవాల్సిన నియంత్రణ. లేదంటే మనంతో మోసపోవడంతో పాటూ.. మరింత మందిని ప్రలోభపెట్టినవారమవుతాం... తస్మాత్ జాగ్రత్త! -
అపరిచిత ఫోన్ కాల్స్తో జాగ్రత్త
మాకవరపాలెం : అపరిచిత ఫోన్ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ పి.రమేష్ కోరారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకుల నుంచో, లేదా వేర్వేరు కంపెనీల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ చాలా మందికి కాల్స్ వస్తున్నాయన్నారు. మండలంలోని బూరుగుపాలెం గ్రామానికి చెందిన రుత్తల శ్రీరామ్మూర్తికి ఫోన్ చేసి అతడి ఏటీఎం కార్డు నంబరు, పాస్వర్డ్లను సైతం తెలుసుకుని రూ.35 వేల నగదు డ్రా చేశారన్నారు. అలాగే అన్రాక్లో పని చేస్తున్న కేశవరెడ్డి ఎల్లారెడ్డికి కూడా ఈ నెల 19న బ్యాంకు నుంచి ఫోన్ చేశామని ఏటీఎంపై ఉన్న 16 అంకెల నంబర్ను తెలుసుకుని, ఎస్ఎంఎస్లో వచ్చిన పాస్వర్డ్ కూడా ఆయన ద్వారానే సేకరించి రూ.42,594 డ్రా చేశారని వివరించారు. వెంటనే ఎల్లారెడ్డి అప్రమత్తమై ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రై ం సిబ్బంది సాయంతో స్నాప్డీల్ ముంబయి పేరున ఒక వస్తువు కొనుగోలుకు ఈ నగదు డ్రా చేసినట్టు గుర్తించారని చెప్పారు. దీంతో వస్తువును డెలివరీ చేయకుండా ఆపాలని సమాచారం ఇవ్వడంతో వివరాలు తెలుసుకున్న స్నాప్డీల్ సంస్థ నిలుపుదల చేసిందన్నారు. అనంతరం ఎల్లారెడ్డి అకౌంట్లో రూ.28 నగదు జమ అయిందన్నారు. మిగిలినది కూడా త్వరలో జమకానుందని చెప్పారు. సెల్ వినియోగదారులంతా అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీరామ్మూర్తి కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.