breaking news
brutally tortured
-
భార్య డబ్బులు ఇవ్వలేదని... కొడుకుని చితకబాధిన తండ్రి!!
తూప్రాన్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఆవేశంతో మూడేళ్ల కొడుకును విచక్షణ రహితంగా చితకబాదాడొక తండ్రి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్లో బెడ బుడగ జంగాల కాలనీకి చెందిన గణేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. గణేశ్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ భార్య పుష్పతో నిత్యం గొడవ పడేవాడు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) ఈ క్రమంలోనే తనకు రూ.5 వేలు కావాలని, ఇందుకోసం ఆమె వెండి పట్టీ గొలుసులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గణేశ్ భార్యపై రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో ఎదురుగా ఉన్న మూడేళ్ల కొడుకు హర్షవర్ధన్ను కర్రతో పైశాచికంగా చితకబాదాడు. బాలుడి వీపు, ముఖం, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. భార్యను సైతం చంపుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారితో కలిసి బిడ్డను పట్టణ ప్రభుత్వాస్పత్రికి చికిత్సకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి ఇంటికి వెళ్తే తిరిగి ఎక్కడ కొడతాడోనని భయంతో పుష్ప మాసాయిపేటలోని పుట్టింటికి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్) -
పని ఇస్తామని చెప్పి ....చావగొట్టాడు!
కరీంనగర్(ఎల్కతుర్తి): బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకుని వచ్చిన వారిని ఓ మేస్త్రీ గదిలో నిర్బంధించి చావగొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలానికి చెందిన సిద్దు పెంచలయ్య, సిద్దు విజయ్, తుపాకుల వెంకటేష్, పోలి కుమార్ వారం రోజుల క్రితం కోరుట్లకు చెందిన గురువయ్య అనే మధ్యవర్తి పని కల్పిస్తానని ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన బండారు శ్రీను అనే మేస్త్రికి అప్పగించాడు. వీరికి అడ్వాన్స్గా రూ.వెయ్యి చొప్పున ఇచ్చి మూడు పూటలా భోజనం, ఉండేందుకు చోటు కల్పిస్తానని చెప్పాడు. వారు యజమాని చెప్పిన పని చేస్తున్నప్పటికీ కారం, పచ్చడితో భోజనాలు పెడుతున్నాడు. ఎంత పని చేసినా సరిగా చేయడం లేదని దూషిస్తున్నాడు. దీంతో సదరు కూలీలు అడ్వాన్స్గా తీసుకున్న డబ్బుల వరకు పని చేసి, గురువారం మధ్యాహ్నం స్వగ్రామాలకు బయల్దేరి వరంగల్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మేస్త్రీ శ్రీనివాస్ ఆటోలో వరంగల్ స్టేషన్కు వెళ్లి వారిని భయపెట్టి, మభ్యపెట్టి తిరిగి దామెరకు తీసుకొచ్చాడు. రాత్రి బాగా మద్యం తాగివచ్చి కూలీలను గదిలో నిర్బంధించి విచక్ష ణారహితంగా కర్రతో చితకబాదాడు. రాత్రి వారిని గదిలోనే బంధించి .. తాళం వేసుకుని శుక్రవారం కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాడు. ఉదయం గదిలో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో చుట్టుపక్కల వారు తాళం పగులగొట్టి వారిని బయటకు తీశారు. వారి శరీరాల నిండా కమిలిన గాయాలున్నాయి. గ్రామస్తుల సహకారంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.