breaking news
buchepalli siva prasad reddy
-
బాలినేనిపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డ్డి ఫైర్
-
టీడీపీ బంటుల్లా పేట్రేగిపోతున్న పోలీసులు
సాక్షి, ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దర్శిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. దీంతో, దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి అరెస్ట్కు నిరసగా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శిలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్ట్లు చేస్తున్నారు. దర్శి ఎస్ఐ మురళీని తక్షణమే తొలగించాలి. దర్శి స్టేషన్ని టీడీపీ పీఎస్గా ఎస్ఐ మురళీ మార్చుకున్నారు. బొట్లపాలెంలో నా వాహనంపై దాడి చేసిన వారిని వదిలేసి.. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త అంజిరెడ్డి మీద 307 కేసు పెట్టి అరెస్ట్ చేశారు. స్టేషన్లో అంజిరెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.దర్శి ఎస్ఐని తొలగించాలని డీజీపీని కలుస్తాను. నాకు ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు. నా హక్కులు కాపాడుకోవడం కోసం స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేస్తాను. శాంతియుతంగా నిరసన చేయాలనుకుంటే పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.అయితే, కొద్దిరోజులుగా దర్శి నియోజకవర్గంలో పచ్చ బ్యాచ్ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ వాహనంపై టీడీపీ కార్యకర్త దాడి చేశాడు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్త అంజిరెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వారిపై కాకుండా అడ్డుకోబోయిన అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు.దీంతో, పోలీసు వైఖరికి నిరసనగా బూచేపల్లి ధర్నాకు పిలుపునిచ్చారు. అనంతరం, దర్శి వీధుల్లో వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ధర్నాకు అనుమతి లేదంటూ శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తర్వాత వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది?: బొత్స -
నా విజయానికి కారణం జగనన్నే..
-
వదంతులు నమ్మొద్దు
ఒంగోలు: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతులను వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తోసిపుచ్చారు. వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతున్నానన్న వదంతులను నమ్మొద్దని ఆయన కోరారు. జగనన్న నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. -
విశ్వసనీయతకు పట్టం కట్టండి
తాళ్లూరు, న్యూస్లైన్:విశ్వసనీయతకు, వెన్నుపోటుకు జరగనున్న ఎన్నికల్లో ప్రజలు సరైన నాయకునికి పట్టం కావాలని వైఎస్ఆర్ సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కోరారు. మండలంలోని తూర్పుగంగవరం, మాధవరం, తాళ్లూరు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతం ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్ని మహా కూటములు ఏర్పడినా వైఎస్ రాజశేఖరరెడ్డిని ఏమీ చేయలేకపోయాయని, ప్రస్తుతం చంద్రబాబు ఎంత మందితో పొత్తు పెట్టుకున్నా జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేరని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడిన జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. ఓట్లు, సీట్ల కోసం రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు నాటకాలు ఆడి రాష్ట్ర విభజనకు కారకులయ్యారని ఆరోపించారు. అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థి మారం వెంకటరెడ్డి, తూర్పుగంగవరం, మాధవరం, తాళ్లూరు ఎంపీటీసీ అభ్యర్థులు నగుళ్ల ఏడుకొండలు, మహాబున్ని బేగం, గర్నెపూడ పాపులమ్మ, అవిశన తిరుపతమ్మ, ఇడమకంటి రమాదేవిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తూర్పుగంగవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ గ్రామాల కన్వీనర్లు తిరుపతిరెడ్డి, వీరనారాయణ, నాగిరెడ్డి, మాధవరం, తాళ్లూరు సర్పంచ్లు సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మైనార్టీ నాయులు ఆదాం షరీఫ్, నాయకులు గుజ్జుల యోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 435 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీలో చేరిక తాళ్లూరు మాజీ ఎంపీపీలు పోశం మధుసూధనరెడ్డి, కోటరామిరెడ్డిల సమక్షంలో బెల్లంకొండవారిపాలెం, నాగంబొట్లవారిపాలెం, తూర్పుగంగవరం గ్రామాలకు చెందిన 435 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బూచేపల్లి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి బూచేపల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యతగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు.పార్టీలో చేరిన వారిలో తూర్పుగంగవరం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగరాజు, మాజీ సర్పంచ్ పేరుపాక కోటేశ్వరావు, కొండారెడ్డి, నాయకులు యాడిక యలమందారెడ్డి, దేవదానం, జక్రయ్య, దయానందం, బాలనాగరాజు, తిరుపతిరెడ్డి ఉన్నారు. లింగాలపాడులో 40 కుటుంబాలు చేరిక .. లింగాలపాడులో తెలుగుదేశం పార్టీకి చెందిన 40 కుటుంబాలు బూచేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పులి వెంకటరావు, గోగుల అంకయ్య, గోగుల ఓబులేసు, అండ్ర వెంకటరావు, గోగుల రాజశేఖర్, కీర్తిపాటి రామారావు, పులి చినవెంకటేశ్వర్లు, గోగుల కృష్ణ, జనమాల వెంకటేశ్వర్లు, జనమాల వీర వెంకటరావు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు కటకం శెట్టి శ్రీనివాసరావు, జక్కం రామక్రిష్ణలు పాల్గొన్నారు.