Central Ministers meeting
-
రైతులతో కొలిక్కిరాని కేంద్రం చర్చలు
-
రైతులతో కొలిక్కిరాని కేంద్రం చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. దీంతో శనివారం నాటి చర్చలు ఫలితానివ్వకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న మరోసారి చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. రైతులు మాత్రం డిసెంబర్ 8న భారత్ బంద్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, ఈ మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ నేతృత్వంలో రైతులతో చర్చలు మొదలయ్యాయి. దాదాపు నాలుగున్నర గంటలపాటు సుధీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతుల డిమాండ్లపై కేంద్రం ఓ మెట్టు దిగి సహేతుక డిమాండ్ల అమలుకు ఇబ్బంది లేదని తెలిపింది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేందుకు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సుముఖత తెలిపింది. ప్రైవేట్ మండీలలో రిజిస్ట్రర్డ్ సంస్థలకే కొనుగోలు అవకాశం, సవరణల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసే యోచన చేసింది. అయితే.. సవరణలు వద్దని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి. -
రైతుల ఆందోళన: మెట్టు దిగిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రుల చర్చలు జరుగుతున్నాయి. రెండున్నర గంటలుగా భేటీ కొనసాగుతోంది. రైతుల డిమాండ్లపై కేంద్రం ఓ మెట్టు దిగింది. సహేతుక డిమాండ్ల అమలుకు ఇబ్బంది లేదంది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేందుకు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సుముఖత తెలిపింది. ప్రైవేట్ మండీలలో రిజిస్ట్రర్డ్ సంస్థలకే కొనుగోలు అవకాశం, సవరణల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసే యోచన చేస్తోంది. సవరణలు వద్దని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి. ( ప్రభుత్వం దిగిరాకపోతే భారత్ బంద్ ) చర్చల నుంచి వాకౌట్ చేస్తామని అంటున్నాయి. కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. రైతు కమిషన్లో కేవలం రైతులకు మాత్రమే స్థానం కల్పించాలని.. నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని, రైతు కమిషన్ ముసాయిదాతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరాయి. -
కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లధనంపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్ధేశం చేస్తారు. రాష్ట్ర విభజన అంశం గురించి ఉన్నతాధికారులు కేంద్ర కేబినెట్కు వివరిస్తారు. తొలి సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.