charu majundar
-
నక్సల్బరి సృష్టికర్తకు వందేళ్లు
ప్రకృతి సంపదలైన భూమి, గాలి, నీరు, వెలుతురు అందరికి దక్కాలి.. భూమి మాత్రం కొందరి చేతుల్లో ఉంది.. ఆ భూమి దున్నేవాడికే ఇప్పించేందుకు ఎంఎల్పార్టీ కొనసాగించిన సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులను తలుస్తూ నేటి నుంచి వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ సన్నద్ధమవుతోంది. నక్సల్బరి సృష్టికర్త చార్మజుందర్ వర్ధంతిని అమరవీరుల వారోత్సవాలుగా తలుస్తూ ప్రతి ఏటా 1980 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరుపుతున్నారు. పెద్దపల్లి: నక్సల్బరికి 52ఏళ్లు.. దాని సృష్టికర్త భార త విప్లవ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన చారుమజుందార్కు వందేళ్లు నిండాయి.మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని భారత విప్లవ పరిస్థితులకు అన్వయించుకొని ‘ఖతం’ కార్యక్రమంతో వర్గశత్రు నిర్మూలన పోరాటాన్ని కొనసాగించిన భారత విప్లవపార్టీల పితామహుడు చార్మజుందార్ వర్ధంతి వేడుకలు ఆదివారం నుంచి జరగనున్నాయి. నక్సల్బరి 52 వసంతాల వేడుకల సందర్భంలో జరగనున్న అమరవీరుల వారోత్సవాలకు ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా విప్లవాభిమానులు, విప్లవ సంస్థలు నక్సల్బరి 52 వసంతాల వేడుకలు జరుపుతోంది విదితమే. ప్రకృతి సంపదలోని భూమి దున్నేవాడికే చెందాలంటూ వ్యవసాయిక విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవంతో సమసమాజ స్థాపన కోసం చార్ మజుందార్ కొనసాగించిన సాయుధ పోరు నడుపుతున్న మావోయిస్టు పార్టీ నేటి నుంచి వారం రోజులపా టువారోత్సవాన్ని జరుపుతోంది. 1965లో పశ్చిమ బెంగాల్ సిలుగురి కొండల్లో సంతాల్ తెగ విముక్తి కోసం చార్మజుందార్ నడిపిన సాయుధ పోరా టం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ప్రధానంగా శ్రీకాకుళం వైపు నక్సల్బరి పోరాటం నడిచి వచ్చింది. విప్లవోద్యమాలకు చిరునామాగా నిలిచిన చార్మజుందార్ ప్రభావంతో జిల్లాలో 1974 నుంచి ఎంఎల్పార్టీగా కార్యకలాపాలు కొనసాగించారు. 1972 జూలై 28న జైళ్లో అమరుడైన చార్మజుందార్ వర్ధంతిని 1980లో తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి పీపుల్స్వార్పార్టీ జరిపిం ది.అన్ని విప్లవపార్టీలు క్రమం తప్పకుండా ప్రతి ఏటా జూలై 28 నుంచి ఆగçస్టు 3 వరకు జరుపుతున్నాయి. ఈ సమయంలో చారు ఆశయసాధనలోని వర్గ శత్రు నిర్మూలన కార్యక్రమాన్ని ఉధృతం చేసిన పార్టీలలో పలు విప్లవపార్టీలు ఉనికిని కోల్పోగా, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ మాత్రమే తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గడిచిన పదేళ్లుగా కేవలం తూర్పు, పశ్చిమ అటవీ ప్రాంతాల్లోనే అడపాదడపా కార్యకలాపాలు నడుపుతున్న మావోయిస్టులు వర్ధంతి వేళ ఒకటి, రెండు సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మాజీ దళపతి కోటలో కదలిక లేని మావోలు.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాష్ట్ర కార్యదర్శులు, వివిధ జిల్లాలకు కార్యదర్శులను అందించి ఏకంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులే కాకుండా కార్యదర్శిగా పని చేసిన మావోయిస్టు మాజీ దళపతి గణపతి సొంత జిల్లాలో ఆపార్టీకి లోటు కనిపిస్తోంది. అమరవీరుల, పీఎల్జీఏ వారోత్సవాల సందర్భాల్లో అప్పట్లో అట్టుడికిన జిల్లా కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంటోం ది. భారీ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో జిల్లాలోని మావో యిస్టు దళాలు చత్తీస్ఘడ్, బస్తర్లాంటి ప్రాంతా లకు తరలిపోవడంతో మైదాన ప్రాంతాలు పూర్తి గా దళాల ఉనికి లేకుండా పోయాయి. ఇక జిల్లాకు తూర్పు, పశ్చిమ అటవీ ప్రాంతాల్లోనే దళాల సం చారం కొనసాగుతోంది. చార్మజుందార్ వారసులుగా దేశంలో కొండపల్లి సీతారామయ్య అరెస్టు తర్వాత కేజీ సత్యమూర్తి పీపుల్స్వార్ పార్టీకి నాయకత్వం వహించారు. ఆయన పార్టీని వీడిపోవడం కొండపల్లి సీతారామయ్యను పార్టీ నుంచి బయటికి పంపిన తర్వాత విప్లవపార్టీ పగ్గాలు జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి అందుకున్నారు. 1988 నుంచి వరసగా పీపుల్స్వార్ పార్టీ ప్రస్తుత మావోయిస్టు పార్టీకి గణపతి దళపతిగా ఉంటూ దేశంలోని 12 రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు. అయితే కరీంనగర్ జిల్లా కల్లోల పరిస్థితి నుంచి బయటపడి నక్సలైట్ కార్యకలాపాలకు దూరమైంది. అయినా దేశంలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ల జాబితాలో ఉన్న పది మందిలో ఈ జిల్లాకు చెందిన ఐదుగురు ఉండడం విశేషం. -
ఆ నెత్తుటి తిరుగుబాటుకు 50 ఏళ్లు
సరిగ్గా ఈ రోజుకు 50 ఏళ్లు. పచ్చటి తేయాకు తోటలు, అడువులు రక్తంతో ఎరుపెక్కిన రోజు. భూస్వాముల వద్ద తరతరాలుగా వెట్టి చాకిరి చేస్తున్న రైతులు తొలిసారి తిరగబడిన రోజు. కత్తులు, కటార్లు, విల్లంబులే కాకుండా పలుగు, పార, బరిసె, కొడవళ్లు.. దొరికిన వ్యవసాయ పనిముట్లను పట్టుకొని భూ స్వాములను తరిమికొట్టిన రోజు. నక్సల్బరి ఉద్యమం ఊపిరి పోసుకున్న రోజు. అదే 1967, మే 24వ తేదీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా, సిలిగురి సబ్ డివిజన్లోని నక్సల్బరి గ్రామం. ఓ పక్క చిన్న రైల్వే స్టేషన్, దట్టమైన అడవి, తేయాకు తోటల మధ్య వెలసిన గ్రామం. సిలిగురి నుంచి హతిగీస (ఏనుగు), బాగ్దోగ్రా (పులి) గ్రామాల మీదుగా వెళుతుంటే పచ్చని పంటపొలాల మధ్య కనిపించేది నక్సల్బరి గ్రామం. ఈ గ్రామాల్లో ఆదివాసులే ఎక్కువ ఉండేవారు కనుక ఊళ్ల పేర్లన్నీ ఎక్కువగా జంతువులు, ప్రకృతి పేర్ల మీదనే ఉన్నాయి. ఆ పచ్చని పొలాలు కొంతమంది భూస్వాముల చేతుల్లోనే ఉండేవి. ఆదివాసీలైన రైతులు తరతరాలుగా వెట్టిచాకిరి చేసేవారు. తీవ్రవాద కమ్యూనిస్టులు రైతులను, తేయాకు తోటల్లో పనిచేసేవారిని రెచ్చగొట్టారు. అప్పటికే తేయాకు తోటల్లో పనిచేసే కూలీల యూనియన్లు కమ్యూనిస్టు నాయకుల చేతుల్లో ఉండేవి. ఇక్కడ తీవ్రవాద కమ్యూనిస్టులంటే చైనా, క్యూబా విప్లవాలు విజయం సాధించిన స్ఫూర్తితో భారత్లో కూడా సాయుధ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని భావించిన వారు. వీరిలో సీపీఐ, సీపీఎం వారూ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు చెందని తీవ్రవాద కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ తీవ్రవాదులు ‘సిలిగురి గ్రూప్’గా ఏర్పడి నక్సల్బరితోపాటు ఊరూరా రైతు కమిటీలను ఏర్పాటు చేయించారు. 1967, మార్చి 3వ తేదీన ఓ రైతు కమిటీ ఆధ్వర్యాన ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకొని కొందరు రైతులు సాగు చేయడం ప్రారంభించారు. ఆరోజు నుంచి మార్చి 18 వరకు రైతులు, భూస్వాముల పొలాలను స్వాధీనం చేసుకోవడాన్ని ఓ ఉద్యమంగా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, భూస్వాముల మధ్య ఘర్షణలు జరిగేవి. రైతుల తరఫున తేయాకు కార్మికులు కూడా రంగంలోకి దిగారు. ఓ రోజున పొలాన్ని కౌలుకు తీసుకున్న బికూ అనే రైతును భూస్వామి చితకబాదారు. దాంతో కోపోద్రిక్తులైన రైతులు మే 24వ తేదీన భూస్వాములపై తిరగబడ్డారు. భూస్వాములకు అండగా వచ్చిన పోలీసులపై కూడా కత్తులు, కొడవళ్లు, విల్లంబులు, పలుగు, పార పట్టుకొని దాడి చేశారు. ఈ దాడిలో జారుగావ్ పోలీసు ఇన్స్పెక్టర్ మరణించారు. మర్నాడే.. అంటే మే 25వ తేదీన అదనపు భద్రతా బలగాలు వచ్చి నక్సల్బరి గ్రామంలో విధ్వంసం సృష్టించాయి. రైతుల ఇళ్లను కూల్చేశాయి. ఈ సందర్భంగా తిరగబడిన రైతులపైకి కాల్పులు జరపడంతో ధనలక్ష్మీ దేవీ, నయనేశ్వరి ముల్లిక్ సహా తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ రైతుల ఆందోళన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, బిహార్లోని ఎక్వారీ, ముషాహరి, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి, పంజాబ్లోని కొన్ని గ్రామాల్లో కూడా రైతులు తిరుగుబాటు చేశారు. పొరుగునే ఉన్న నేపాల్లోని కమ్యూనిస్టులు కూడా రైతుల తిరుగుబాటుకు నైతిక మద్దతు ఇచ్చారు. జూలై 19వ తేదీన పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో అన్ని ప్రాంతాలతోపాటు నక్సల్బరీ ప్రాంతంలో ఆందోళన పూర్తిగా చల్లారిపోయింది. చారు మజుందార్ లాంటి కమ్యూనిస్టు నాయకులు అండర్ గ్రౌండ్కు వెళ్లగా, కొంత మంది అరెస్టయ్యారు. కొంత మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. రైతుల తిరుగుబాటుకు మద్దతిచ్చినందుకు చారు మజుందార్, సొరేన్ బోస్, మహదేవ్ ముఖర్జీ, దిలీప్ బాగ్చీ లాంటి నాయకులను సీపీఎం తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మజుందార్ ‘హిస్టరీస్ ఆఫ్ 8 డాక్యుమెంట్స్’ రాశారు. ఈ పుస్తకం ప్రాతిపదికనే 1969లో సీపీఐ (ఎంఎల్) ఏర్పడింది. నక్సల్బరీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు కనుకనే మావోయిస్టులకు నక్సలైట్లు అని పేరు వచ్చింది.