సిరిపురపు రాము కుటుంబంతో...
దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము చెన్నై ఘటనలో మృతి చెందారు. ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆ సంభాషణ ఇలా సాగింది.
జగన్: తల్లీ నీ పేరేంటి?
బాధితురాలు: నా పేరు లక్ష్మి అండి.
జగన్:ఎంతమంది పిల్లలమ్మా నీకు?
బాధితురాలు: ఇద్దరు పిల్లలు.
జగన్: అక్కడ ఎంత కూలి ఇచ్చేవారు?
బాధితురాలు: నాకు తెలీదండి. అంతా ఆయనే చూసుకొనేవారు.
జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేసిందా?
బాధితురాలు: నాకు తెలీదండి.
జగన్: తమిళనాడు బిల్డర్ మీతో ఏమైనా మాట్లాడారా?
బాధితురాలు:మాతో ఎవరూ మాట్లాడలేదండి.
జగన్: కోర్టులో కేసు వేయండి వాళ్లే రాజీకి వస్తారు. మీకు డబ్బులు ఇస్తారుగా.
బాధితురాలు:నాకు ఏటీ తెలీదు సారూ.
జగన్: అక్కడ మన తెలుగు ఎంపీలు ఉన్నారు. వారి ద్వారా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను.
బాధితురాలు: అంతా మీ దయండి.
జగన్: పిల్లలను బాగా చదివించు తల్లి. (అంటూ పిల్లలు వేదశ్రీ, ఐశ్వర్యలను పలకరించారు).
బాధితురాలు: అలాగేనండి. బాగా చదివించుకుంటానండి.