Cingireddy Srinivasa Reddy
-
ప్రతి కుటుంబం ఓటు వైఎస్సార్సీపీకే..
మంకమ్మతోట, న్యూస్లైన్ : దివంగతనేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవే శ పెట్టిన పథకాలతో లబ్ధిపొందిన ప్రతీ కుటుం బం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆ దివారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. గడపగడపకు వెళ్లి ఓటు అ డిగితే ఓటు వేస్తారని, ఆ దిశగా అభ్యర్థుల గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో 18నుంచి 20 శాతం వైఎస్సార్సీపీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. రానున్న మున్సిప ల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అన్ని వి ధాలా వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. అన్ని ఎ న్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధినేత జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలని సూచించా రు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి టీఆర్ఎస్ తామే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చామని, కాంగ్రెస్ మేమే ఇచ్చామని, తాము మద్దతు ఇస్తేనే వ చ్చిందని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన ని, మైనార్టీకి చెందిన వారిని డెప్యూటీ సీఎం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మా టమార్చి తానే సీఎం కావాలని ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినవారు లక్షల్లో ఉన్నారని, అందులో కేసీఆర్ ఒక ఉద్యమకారుడు మాత్రమేనన్నారు. నగర కన్వీనర్ డాక్టర్ కె.నగేశ్ మాట్లాడుతూ గె లుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అందరికీ సమన్యాయం జరుగుతుందనే నమ్మకంతో ముందుకు పోవాల న్నారు. కరీంనగర్ నుంచే వైఎస్సార్ సీపీకి ప్ర భంజనం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపెల్లి కుమా ర్ మాట్లాడుతూ వైఎస్ చలువతో ఎంపీ అయిన కొందరు వైఎస్సార్ సీపీ అసత్య ఆరోపణలు చే స్తున్నారన్నారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ వరాల శ్రీనివాస్, ఎస్టీసెల్ జిల్లా కన్వీనర్ ర ఘునాయక్, లీగల్సెల్ జిల్లా కన్వీనర్ విజయ్కుమార్, వి ద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ సందమల్ల నరేశ్, మహిళా విభాగం నగర కన్వీనర్ బోగెపద్మ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మోతె గంగారెడ్డి, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంట సుశీల, నాయకులు కట్ట శివ, ఎల్లారెడ్డి, మల్యాల ప్రతాప్, సొల్లు అజయ్వర్మ, వేణుమాధవ్రావు, పద్మారెడ్డి పాల్గొన్నారు. -
పత్తా లేని శుద్ధి
మున్సిపల్ కార్మికుల సమ్మెతో చెత్త కంపు పేరుకుపోతున్న చెత్త గుట్టలు ప్రత్యామ్నాయ చర్యలు అంతంతే.. సాక్షి,సిటీబ్యూరో: కనీస వేతనాలు పెంచాలని, మధ్యంత భృతి, ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్న తదితర డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నగరంలో తీవ్రరూపం దాల్చుతోంది. విధుల్లోకి రాకుండా పూర్తిగా సమ్మెబాట పట్టడంతో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. నగరంలో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుతో సహ కార్మికుల పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పారిశుధ్యం, దోమల నివారణ, వ్యర్థాల తరలింపు తదితర విభాగాల్లోని కార్మికులందరూ సమ్మెకు దిగారు. జీహెచ్ఎంసీలోని గుర్తింపుయూనియన్ జీహెచ్ఎంఈయూ, ప్రధానయూనియన్ బీఎం ఎస్ సహ పలు సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో పనులు ఎక్కడివక్కడే స్తంభించిపోతున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు: పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు ఒక్కో డివిజన్లో కనీసం ఒక్కో వాహనాన్నయినా వినియోగించి, వ్యర్థాల తరలింపు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పనులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. చెత్త తరలింపు వాహనాలను ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు అవసరమైనపక్షంలో పోలీసుల సహా యాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రుల ఇళ్ల వద్ద సేవలు నిలపండి: సింగిరెడ్డి ఏడాదికాలంగా జీహెచ్ఎంసీ కార్మికుల న్యాయమైన డిమాం డ్లను పట్టించుకోకపోవడం దారుణమని జీహెచ్ఎంసీలో టీడీపీ పక్షనేత సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాపోయారు. కార్మికుల సమస్యలను పట్టించుకోని మంత్రులు, ముఖ్యమంత్రి, ఇళ్లవద్ద అన్నిరకాల సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్యక్రమాలతోపాటు వారి ఇళ్లకు నీరు, కరెంట్ అన్నింటినీ బంద్చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడైనా వారు మేల్కొని కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తారేమోన న్నారు. పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంతోనే సీఎం,మంత్రులకు సరిపోతోందని..వారు కార్మికుల వేదనలేంవింటారని ప్రశ్నించారు. కార్మికుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉందని,అయితే ప్రజలను దృష్టిలో ఉంచుకొని విధులు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం హిమాయత్నగర్: జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సర్కారు ఘోర వైఫల్యం చెందిందని ఏఐటీయూసీ మండిపడింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం నారాయణగూడ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి పెద్దపెట్టున నినాదాలు చేశారు. గత నవంబర్లో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చి విస్మరించారని, అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఏఐటీయూసీ నాయకులు ఎండీ యూసుఫ్, నరసింహ, వెంకటేశం, యాదగిరి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ధర్నా, మానవహారం కవాడిగూడ: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ధర్నా అనంతరం ఇందిరాపార్కు సిగ్నల్ వద్ద మానవహారం నిర్వహించారు. బీఎంఎస్ అనుబంధ సంస్థ భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పనులు అడ్డుకుంటే కేసులు : కార్మికుల సమ్మెను ఎదుర్కొనేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి స్పెషల్ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పారిశుధ్య పనులను ఎవరైనా అడ్డుకుంటే వారిపై కేసులు నమోదు చేయించాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం పురపాలకమంత్రి మహీధర్రెడ్డి సమక్షంలో కార్మిక సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.