The customers
-
గోల్డ్.. గోల్మాల్
ఐఐఎఫ్ఎల్ గోల్డు లోన్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది చేతివాటం... లక్షలాది రూపాయల స్వాహా: ఖాతాదారుల గగ్గోలు వనస్థలిపురం: వనస్థలిపురంలోని ఓ గోల్డు లోన్ సంస్థ సిబ్బంది చేతివాటంతో పలువురు ఖాతాదారులు మోసపోయారు. బాధితులు సద రు సంస్థ వద్ద ఆందోళనకు దిగడంతో సిబ్బంది మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వివరాలు... వనస్థలిపురం సుష్మ చౌరస్తా సమీపంలో విజయవాడ జాతీయ రహదారి పక్కన ఐఐఎఫ్ఎల్ గోల్డు లోన్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. అయితే ఈ సంస్థలో గోల్డు లోన్ తీసుకుని డబ్బు తిరిగి చెల్లించినా ఇంకా డబ్బు కట్టాలని సంస్థ సిబ్బంది చెప్తున్నారు. దీంతో పలువురు ఖాతాదారులు కొంత కాలంగా ఆ సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్గత విచారణలో ముగ్గురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు రుజువుకావడంతో యాజమాన్యం వారిని డిసెంబర్లో తొలగించింది. ఈ క్రమంలో బుధవారం సయ్యద్ అసద్ ఖాద్రీ అనే వ్యక్తి తాను రెండున్నర తులాల బంగారంపై రూ. 40 వేలు రుణం తీసుకోగా 52 వేలు రుణం తీసుకున్నారంటూ చెప్తున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సంస్థ ఏరియా మేనేజర్ రాంరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గతంలో పనిచేసిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ సిబ్బంది ఖాతాదారులకు ఇచ్చిన రుణాలకంటే ఎక్కువ రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపించి ఆ డబ్బు కొట్టేశారని, అలాగే అసలు చెల్లించిన కొందరు ఖాతాదారులకు నగలు తిరిగి ఇవ్వకుండా వాటిని వేరే చోట తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసపోయిన ఖాతాదారులు ఒక్కొక్కరుగా బయటికి వస్తుండటంతో సంస్థలో లక్షలాది రూపాయల అక్రమాలు జరినట్టు తెలుస్తోంది. -
వినియోగదారుల వ్యయానికి మోడీ జోష్
ముంబై: నరేంద్ర మోడీ మార్కెట్లకే కాదు, వినియోగదారులకు కూడా ఊపునిస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వం సుస్థిరమైన, సంస్కరణలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవచ్చని వినియోగదారులు భావిస్తున్నారని ప్రముఖ ఆర్థిక అంశాల రీసెర్చ్ సంస్థ జైఫిన్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. దీంతో రానున్న నెలల్లో వివిధ వస్తువులపై ఖర్చు చేయడానికి వినియోగదారులు సిద్ధంగా ఉన్నారంటున్న ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు -మెట్రో, టైర్ వన్, టైర్ టూ.. ఈ తరహా 18 నగరాల్లోని 4,000 మంది వినియోగదారులపై ప్రతినెలా ఈ సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే వివరాలు... ఏప్రిల్లో 40.6 పాయింట్లుగా ఉన్న కన్సూమర్ అవుట్లుక్ ఇండెక్స్ మేలో 42 పాయింట్లకు పెరిగింది. వడ్డీరేట్లు తగ్గుతాయని ఆర్బీఐ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో రానున్న మూడు. నాలుగు నెలల్లో వినియోగదారుల వ్యయం పెరుగుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. ఫలితంగా వాహన, రియల్టీ రంగాల్లో జోష్ పెరుగుతుంది. కొత్త కొలువులు రాకపోవడం, ఉన్న ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు లేకపోవడం, దిగిరానంటున్న ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులతో ఇప్పటిదాకా వినియోగదారులు అవస్థలు పడ్డారు. మోడీ రాకతో పరిస్థితులు మారతాయనే భరోసా వినియోగదారుల్లో పెరిగింది. ఏప్రిల్లో 26 గాఉన్న స్పెండింగ్ సెంటిమెంట్ ఇండెక్స్ మేలో 28.1కు పెరిగింది. గత ఏడాది డిసెంబర్ నుంచి చూస్తే ఇది మెరుగుపడడం ఇది మొదటిసారి.