పుష్కర సైడ్లైట్స్
పుష్కరాల ముగింపు ఒక్క రోజే మిగిలి ఉంది. శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని మంగపేట, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కరఘాట్లు కిక్కిరిపిసోయూరుు. 11వ రోజు పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు క్లుప్తంగా..
►గోదారి ప్రవాహం పెరిగింది. గతంలో ఏర్పాటు చేసి న కంచెలు కొట్టుకపోయాయి. శుక్రవారం మంగపే ట ఘాట్ వద్ద పోలీసులు, అధికారులు కాపాల ఉన్నారు.
►గోదావరి ఉప్పొంగడంతో భక్తుల కోసం వేసిన టెంట్లు నీటిలో నానిపోయూరుు. దీంతో భక్తులు నిలుచోడానికి, పిండ ప్రదానాలు చేయడానికి నీడ కరువైంది.
►కళాకారుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూలిపోరుుంది. అదే టెంట్ కింద శుక్రవారం ప్రదర్శనలు కొనసాగారుు.
►గోదావరి నదీ తీరంలో దొరికే గులక రాళ్లను భక్తులు తమ ఇంటికి తీసుకెళ్తూ కనిపించారు.
►మంగపేట ఘాట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల ద్వారా ఐటీడీఏ పీవో అమయ్కుమార్, ములుగు ఆర్డీవో మహేంద్రజీలు భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
►మంగపేట పుష్కర ఘాట్పై ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు
►పుష్కరసమాచారాన్నిఉన్నతాధికారులకుచేరవేశారు.
►మంగపేట ఘాట్వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో చాలామంది షవర్ల కింద స్నానాలు ఆచరించారు.
►రెండు రోజులుగా కురిసిన వర్షాలతో గుంతల్లో భారీగా నీరు చేరింది. భక్తులు వాహనాల పార్కింగ్కు ఇబ్బంది పడ్డారు.
►పుష్కర స్నానాలు ఆచరించినవారు గోదావరి నీటిని బాటిళ్లు, టిన్నుల్లో ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. పుష్కర నీటిని ఇళ్లలో నిల్వ ఉంచితే శుభసూచకమని చెప్పారు.
►మంపేటలో భక్తులు తిరుగు ప్రయూణంలో ఇబ్బంది పడ్డారు. వృద్ధులు సుమారు 2 కిలోమీటర్ల పొడువు నడవలేక అవస్థలుపడ్డారు.
►రామన్నగూడెం గోదావరి నదిలో మహిళలు వేసిన రవిక ముక్కలను కొందరు సేకరించడం కని పించింది.
►మంగపేటలో సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చిత్రపటానికి ధరావత్ మోహన్గాంధీనాయక్ క్షీరాభిషేకం చేశారు.
►మాజీ డిప్యూటీ సీఎం తాటి కొండ రాజయ్య మంగపేట పుష్కరఘాట్ వద్ద పుష్కరస్నానం చేశారు. గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించారు.
-ఏటూరునాగారం/ములుగు/మంగపేట/
ఎస్ఎస్తాడ్వారుు