తుపాకీతో కాల్చుకుని విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని హకీంపేట్లో గురువారం సాయంత్రం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
తన తండ్రి తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆ విద్యార్థిని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.