The former MLA
-
రూ.350 కోట్ల భూమి.. అక్రమార్కుల పరం!
ఓటేరు చెరువు భూ కుంభకోణంలో అక్రమార్కులకు క్లీన్చిట్ 17.18 ఎకరాలు ఓటేరు చెరువు శిఖం కాదని తేల్చిన విచారణాధికారి రెవెన్యూ రికార్డులు తప్పులతడకేనని చెప్పకనే చెప్పిన వైనం కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు నివేదిక సమర్పించిన డీఆర్వో శేషయ్య నేడోరేపో తుది నిర్ణయం జారీ ఓటేరు చెరువు భూకుంభకోణం మరో మలుపు తిరిగింది. ఆ కుంభకోణంపై విచారణ చేస్తున్న డీఆర్వో శేషయ్య అక్రమార్కులకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలోని సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల భూమి ఓటేరు చెరువు శిఖం కాదని తేల్చారు. ఈ మేరకు అక్రమాలకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ సర్వే నెంబరు పరిధిలోని భూమి చెరువు శిఖం అని పేర్కొన్న రెవెన్యూ రికార్డులన్నీ తప్పుడువని చెప్పకనే చెప్పారు. ఈ నివేదికపై నేడో రేపో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. తిరుపతి : రెవెన్యూ చట్టంలో లొసుగులను అస్త్రంగా చేసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలో సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల ఓటేరు చెరువు శిఖం భూమిని కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఎప్పటికప్పుడు పార్టీలు మార్చే ఆ మాజీ ఎమ్మెల్యే కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన పంచన చేరి ఆ భూమికి పట్టాదారు పాసుస్తకాలు ఇచ్చేలా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనాతో ఉత్తర్వులు జారీచేయించుకున్నారు. ఎన్నికలకు ముందు సైకిలెక్కి చంద్రబాబుతో జతకట్టి కిరణ్ సర్కారు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయించుకున్నారు. రెవెన్యూ అధికారులకు నోట్ల కట్టలు వెదజల్లి.. సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి రూ.350 కోట్ల విలువైన 17.18 ఎకరాల చెరువు శిఖం భూమిని బినామీల ద్వారా ఆ మాజీ ఎమ్మెల్యే సొంతం చేసుకోవడంపై జూలై 16న ఁభూదోపిడీ*.. జూలై 17న ఁఆంతర్యమేమిటి రామచంద్రా..?* అంటూ వరుస కథనాల ద్వారా ఁసాక్షి* వెలికితీసింది. ఈ కుంభకోణంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్రెడ్డి కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన కలెక్టర్.. ఓటేరు చెరువు భూకుంభకోణంపై డీఆర్వో శేషయ్యను విచారణకు ఆదేశించారు. తిమ్మిని బమ్మిని చేసి.. రెవెన్యూశాఖకు ఏ-రిజిష్టరే ప్రామాణికం. బ్రిటీషు ప్రభుత్వం హయాంలో 1886లో తొలిసారి భూములను సర్వే చేసి ఏ-రిజిష్టర్ రూపొందించారు. 1886 ఏ-రిజిష్టర్ ప్రకారం తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలోని 377 సర్వే నెంబరులో 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం. బ్రిటీషు ప్రభుత్వం 1916లో మరోసారి భూములను సర్వే చేసింది. ఆ సర్వే చేసినప్పుడు ఆ భూమిని ప్రభుత్వ బంజరుగా తప్పుగా పేర్కొనడాన్ని పసిగట్టిన అప్పటి చంద్రగిరి సబ్ కలెక్టర్ రీ-సర్వే చేసి 1925లో చెరువు శిఖంగానే తేల్చి ఏ-రిజిష్టర్లో పొందుపరిచారు. ఇందుకు సంబధించిన రికార్డులు ఇప్పటికీ తిరుపతి రూరల్ తహశీల్దార్, తిరుపతి ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో పదిలంగా ఉన్నాయి. ఈ చెరువు భూ వివాదంపై పలు కోర్టుల్లో రెవెన్యూ అధికారులు అఫిడవిట్లు దాఖలు చేసేటప్పుడు ఆ భూమిని చెరువు శిఖంగానే పేర్కొన్నారు. ఇదే భూవివాదంపై ఫిబ్రవరి 12న అప్పటి కలెక్టర్ రాంగోపాల్ పంపిన నివేదికపై రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్పందిస్తూ.. ఁభూమి రికార్డులకు తక్కిన రికార్డులకన్నా ఏ-రిజిష్టరే ప్రామాణికం. ఏ-రిజిష్టర్లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయండి* అని ఆదేశిస్తూ మే 22న ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. మే 22 బీఆర్.మీనా జారీచేసిన ఉత్తర్వులను రెవెన్యూ అధికారులు వక్రీకరించారు. 1886, 1925 ఏ-రికార్డులను ప్రామాణికంగా తీసుకోని రెవెన్యూ అధికారులు.. 1916 రికార్డులనే ప్రామాణికంగా తీసుకుని సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదని తేల్చారు. ఆ భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకు కట్టబెట్టారు. ఇదేంటి శేషయ్యా..? ఓటేరు భూకుంభకోణంపై కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు డీఆర్వో శేషయ్య విచారణ చేశారు. విచారణలో 1886, 1925 ఏ-రికార్డులను శేషయ్య ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించలేదు. కేవలం 1916 రికార్డులనే పరిగణనలోకి తీసుకున్న శేషయ్య.. సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదని.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకే చెందుతుందని తేల్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను జారీచేయడంలో కూడా తప్పులేదని తేల్చారు. ఆ మేరకు కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు నివేదిక కూడా ఇచ్చేశారు. శేషయ్య ఆ మేరకు నివేదిక ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. సీఎంవో కార్యాలయం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెప్పించి.. శేషయ్యతో తప్పుడు నివేదికను కలెక్టర్కు ఇప్పించారనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. శేషయ్య నివేదికపై కలెక్టర్ ఆమోదముద్ర వేయడమే తరవాయి.. రూ.350 కోట్ల విలువైన భూమి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సొంతమవుతుందన్న మాట. కలెక్టర్కు నివేదిక ఇచ్చా : డీఆర్వో శేషయ్య తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలోని సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదు. ఆ భూమి డి.వెంకట్రామనాయుడు తదితరులకు చెందినదే. ఆ మేరకు వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు* అని డీఆర్వో శేషయ్య ఁసాక్షి*కి చెప్పారు. 1886, 1925 సర్వేల మేరకు ఏ-రికార్డుల్లో అది చెరువు శిఖం భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు కదా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. నివేదికను కలెక్టర్కు ఇచ్చానని.. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేని సెలవిచ్చారు. -
గోనె హన్మంతరావుకు కన్నీటి నివాళి
మంచిర్యాల అర్బన్ : టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, లక్సెట్టిపేట మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు (75)కు అశ్రు నివాళుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యు లు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, రాజ కీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు పలికారు. కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న హన్మంతరావు శనివారం తెల్లవారు జామున మరణించారు. వ్యాధి నివారణకు చికి త్స పొందుతుండగా శుక్రవారం పరిస్థితి విషమించడంతో చేసేదిలేక మంచిర్యాలకు తీసుకువచ్చారు. రెడ్డికాలనీలోని నివాసంలో శనివారం తెల్లవారు జామున 3:10 నిమిషాలకు హన్మంతరావు తుది శ్వాస విడిచారు. భూస్వామ్య కుటుంబానికి చెందిన ముత్యం రావు, ఆండాల్దేవిలకు నలుగురు సంతానం. హన్మంతరావు, శ్యాంసుందర్రావు, రమేందర్రావు, అశోక్రావు ఉన్నారు. అందులో హన్మంతరావు టీడీపీలో, శ్యాంసుందర్రావు బీజేపీలో రాజకీయంగా స్థిర పడగా మరో ఇద్దరు సోదరులు వ్యాపారం నిర్వహిస్తున్నారు. హన్మంత రావుకు విజయ్, వినయ్, వినిత ముగ్గురు సంతానం. వైద్యవృత్తి విడిచి రాజకీయాల్లోకి.. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన హన్మంతరావు ఉన్నత విద్యను అభ్యసించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వైద్య వృత్తిలో చేరారు. రెండేళ్లు విద్యను అభ్యసిస్తున్న సమయంలో మంచిర్యాల పురపాలక సంఘం ఎన్నికలు వచ్చాయి. రాజకీయాలపై అమితమైన మక్కువ కలిగిన హన్మంతరావు వైద్య వృత్తికి మంగళం పలికి 1962లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. కౌన్సిలర్గా రాజకీయ తెరంగెట్రం చే శారు. అప్పటి నుంచి అనేక పదవులు అలంకరించారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో కాసిపేట మండలంలోని ముత్యంపల్లి నుంచి సింగిల్విండో చైర్మన్గా గెలిచి జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పదవి చేపట్టారు. అదే సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మరో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో తొలిసారి అసెం బ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999,2004, 2010లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబు నీటిపారుదల శాఖ డెరైక్టర్ పదవి ప్రకటించినా సున్నితంగా తిరస్కరిం చారు. ఆ పార్టీ విధానంపై రాజీనామా చేశారు. కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే వరుసకు బావబామ్మర్ధులైన హన్మంతరావు, ఎమ్మెల్యే దివాకర్రావులు రాజకీయ ప్రత్యుర్థులు. ఎప్పుడు ఎన్నికల్లో నువ్వా..నేనా అన్న ట్లు తలపడ్డారు. అయితే హన్మంతరావు విగతజీవిగా ఉండడాన్ని చూసిన దివాకర్రావు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి కూడా ఫోన్లో హన్మంతరావు సతీమణి ఇందిర, విజయ్లను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు హన్మంతరావును కడసారి చూసేందుకు వివిధ జిల్లాల నుంచి రాజకీయ నాయకులు, సన్నిహితులు తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం పురవీధుల గుండా అంతిమయాత్ర సాగింది. గోదావరి నది తీరాన హన్మంతరావు తనయులు విజయ్, వినయ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రి తక్కల్లపల్లి పురుషోత్తంరావు, సమాచార మాజీ కమీషనర్ కలకుంట్ల సుధాకర్రావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు, టీడీపీ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్, మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, గడ్డం అరవింద్రెడ్డి, నాయకులు కేవీ కిషన్రావు, గోవింద్నాయక్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్రావు, మాజీ చైర్మన్ రాయయ్య పాల్గొన్నారు.