Future Fund
-
ఇక పీఎఫ్ విత్డ్రాయల్ 75 శాతమే!
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ భవిష్య నిధి నుంచి గడువుకు ముందే విత్డ్రా చేసుకునే నగదును 75 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా మొత్తం(25%) ఆ సభ్యులు 58 ఏళ్ల వయసు వచ్చేంతవరకు ఈపీఎఫ్ఓ వద్దే ఉంటుంది. ఈ ప్రతిపాదనను కార్మిక శాఖ అనుమతి కోసం పంపించారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నందువల్ల 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలన్ వెల్లడించారు. గృహనిర్మాణం, పెళ్లి, పిల్లల చదువు తదితర కారణాలకు కూడా ఈ 75% పరిమితి వర్తిస్తుందన్నారు. పీఎఫ్ ఉద్దేశం వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించడమని, దానికి కాకుండా మరే కారణానికి ఆ మొత్తాన్ని ఉపయోగించడం సరికాదని తాము భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. 58 ఏళ్ల లోపు వయసున్న ఈపీఎఫ్ఓ సభ్యులు గత రెండు నెలలుగా తమకే ఉద్యోగం లేదన్న కారణం చూపుతూ మొత్తం పీఎఫ్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. -
పీఎఫ్ సొమ్మును మింగేస్తారా...
క్రిమినల్ కేసులు పెడతాం! ఆర్టీసీకి పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు పక్షం రోజుల్లో మొత్తం జమచేస్తామని అధికారుల విజ్ఞప్తి హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు చెందాల్సిన రూ. 160 కోట్ల భవిష్య నిధి మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు వాడుకున్న తీరుపై ఆర్టీసీకి షాక్ తగిలింది. ఈ వ్యవహారాన్ని భవిష్యనిధి విభాగం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు వినియోగించిన మొత్తాన్ని వెంటనే ‘నిధి’కి జమ చేయకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పీఎఫ్లోని ఎన్ఫోర్స్మెంట్ స్క్వ్యాడ్ ఆర్టీసీకి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి కార్మికులతో పాటు సంస్థ జమ చేసే భవిష్య నిధి మొత్తాన్ని గుట్టుగా సొంతానికి వాడుకున్న తీరును ఇటీవల ‘పీఎఫ్నూ మింగేశారు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి పీఎఫ్ విభాగం స్పందించి ఈ మేరకు ఆర్టీసీకి నోటీసులు జారీ చేసింది. పీఎఫ్ నిధులను మళ్లించ డమంటే కేంద్ర చట్టాలను అతిక్రమించినట్లేనంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయటానికి సిద్ధం కావటంతో ఆర్టీసీ అధికారులు గతుక్కుమన్నారు. ఆ నిధులు మళ్లించటానికి దారితీసిన పరిస్థితులను తెలుపుతూ పీఎఫ్ కార్యాలయానికి వివరణ ఇచ్చారు. తమకు పక్షం రోజుల గ డువు ఇస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమచేస్తామని విజ్ఞప్తి చేశారు.