Garuda Panchami
-
ఇంట్లోకి వచ్చిన నాగుపాముకు పూజలు
సాక్షి, బెంగళూరు : నాగపంచమి రోజున ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగు పాముకు స్థానికులు పూజలు నిర్వహించారు. వివరాలు.. శ్రీనివాసపురం పట్టణంలో వీరేంద్రకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం నాగుపాము ఇంట్లోకి ప్రవేశించగా పాములు పట్టే నిపుణుడు అమీర్ చాంద్ను పిలిపించారు. దానిని పట్టుకునేందుకు యత్నిస్తుండగా బచ్చలిపైప్లోకి వెళ్లిపోయింది. దీంతో మరో వైపు నుంచి నీరుపోయడంతో పాము బయటకు రాగా స్నేక్రాజ్ ఒడిసి పట్టుకున్నాడు. అయితే నాగపంచమి రోజున ఇంటికి వచ్చిన నాగుపాముకు మహిళలు భక్తితో పూజలు చేశారు. అనంతరం పామును సురక్షితంగా అడవిలో వదలిపెట్టారు. నేడు గరుడ పంచమి తిరుమలలో సోమవారం గరుడ పంచమి ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితంలో ఆనందాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఇందులో భాగంగా రాత్రి 7నుంచి 9గంటల వరకు మలయప్ప స్వామి తనకు ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అలాగే ఈ నెల 15న గురువారం శ్రావణ పౌర్ణమినాడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9గంటలక వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావటంతో భక్తులు తిరుమల కొండకకు పోటెత్తారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శానికి 22 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటలు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చిన వారు స్వామివారిని దర్శించుకునేందుకు12 గంటలు సమయం పడుతోంది. నిన్న 71,552 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. నేడు గరుడ పంచమి సందర్భంగా ఈ రాత్రి 7 గంటలకు శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు.