GHMC Election campaign
-
నెలాఖర్లో సీఎం సభ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ నెలాఖరున నగరం నడిబొడ్డున భారీ బహిరంగసభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ సభలో ప్రసంగిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరంలో పలు రోడ్ షోలు, కాలనీ సమావేశాల్లో పాల్గొంటారు. నలుగురు బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చే ఏడాది ఆరంభంలో ఖాళీ అయ్యే 7 ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన నలుగురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం జరిగిన భేటీలో కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్తో పాటు నాయీబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పి స్తామని ప్రకటించినట్లు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావుకు కూడా మలి విడత జాబితాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తొలి జాబితాలు వచ్చేశాయ్..! హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్ఎస్ తొలి జాబితాలో భాగంగా 105 డివిజన్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు.. కాప్రా– ఎస్.స్వర్ణరాజ్(ఎస్సీ); నాగోల్– చెరుకు సంగీత ప్రశాంత్గౌడ్(బీసీ); మన్సూరాబాద్– కొప్పుల విఠల్రెడ్డి(ఓసీ); హయత్నగర్– ఎస్.తిరుమల్రెడ్డి(ఓసీ); బీఎన్రెడ్డి నగర్– ఎం.లక్ష్మీప్రసన్నగౌడ్(బీసీ); వనస్థలిపురం– జిట్టా రాజశేఖర్రెడ్డి(ఓసీ); హస్తినాపురం– రమావత్ పద్మానాయక్ (ఎస్టీ); చంపాపేట్– సామ రమణారెడ్డి(ఓసీ); లింగోజిగూడ– శ్రీనివాసరావు(బీసీ); సరూర్నగర్– అనితా దయాకర్రెడ్డి(ఓసీ), ఆర్కేపురం– ఎం.విజయభారతి అరవింద్ శర్మ(ఓసీ); కొత్తపేట– జీవీసాగర్రెడ్డి(ఓసీ); చైతన్యపురి– జె.విఠల్రెడ్డి(ఓసీ); గడ్డిఅన్నారం– బి.ప్రవీణ్కుమార్(బీసీ) సైదాబాద్– సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి(ఓసీ); ముసారాంబాగ్– తీగల సునరితారెడ్డి(ఓసీ); ఓల్డ్మలక్పేట్– పి.శైలిని(బీసీ); అక్బర్బాగ్– ఎం.శ్రీధర్రెడ్డి(ఓసీ); అజంపుర– భారతి బాబురావు(ఎస్సీ); చావని– ఎండీ షవౌత్ అలీ(మైనార్టీ); డబీర్పుర– ఎండీ షబ్బీర్(మైనార్టీ); రెయిన్బజార్– అబ్దుల్ జావేద్(మైనార్టీ); పత్తర్గట్టి– అక్తర్మెహినోద్దీన్(మైనార్టీ); మొగల్ఫుర– ఎస్వీ సరిత(బీసీ); తలాబ్ చెంచలం– మెహరున్నీసా(మైనార్టీ), గౌలిపుర– బొడ్డు సరిత(బీసీ); లలిత్బాగ్– జి.రాఘవేంద్రరాజు(బీసీ); కుర్మగూడ– ఎం. నవిత యాదవ్(బీసీ); ఐఎస్ సదన్– స్వప్న సుందర్రెడ్డి(ఓసీ); సంతోష్నగర్– శ్రీనివాసరావు(బీసీ); రియాసత్నగర్– సంతోష్కుమార్(బీసీ); కంచన్బాగ్– ఆకుల వసంత(బీసీ) బార్కస్– సరిత(బీసీ); చాంద్రాయణగుట్ట– సంతోష్రాణి(బీసీ); ఉప్పుగూడ– ఎం శోభారాణిరెడ్డి(ఓసీ); జంగమ్మెట్– కె.స్వరూపరాంసింగ్నాయక్(ఎస్టీ); ఫలక్నుమా– గిరిధర్నాయక్(ఎస్టీ); నవాబ్సాబ్కుంట– సమీనాబేగం(మైనార్టీ); శాలిబండ– రాధాకృష్ణ(బీసీ); ఘాన్సీబజార్– ఇషిత(బీసీ); గోషామహల్– ముకేష్సింగ్(బీసీ); పురానాపూల్– లక్ష్మణ్గౌడ్(బీసీ); దూద్బౌలి– షబానా అంజుమ్(మైనార్టీ); జాహనుమా– పల్లె వీరమణి(బీసీ); రాంనాస్పుర– మహ్మద్ ఇంకేషాఫ్(మైనార్టీ); కిషన్బాగ్– షకీల్ అహ్మద్(మైనార్టీ); జియాగూడ– కృష్ణ(ఎస్సీ); మంగళ్హాట్– పరమేశ్వరిసింగ్(బీసీ); దత్తాత్రేయనగర్– ఎండీ సలీం(మైనార్టీ); కార్వాన్– ముత్యాల భాస్కర్(బీసీ); లంగర్హౌస్– పర్వతమ్మయాదవ్(బీసీ); గొల్కొండ– ఆసిఫాఖాన్(మైనార్టీ) టోలిచౌకి– నాగజ్యోతి(బీసీ); నానల్నగర్– ఎస్కే హజర్(మైనార్టీ); మెహిదీపట్నం– సంతోష్కుమార్(మరాఠ); గుడిమల్కాపూర్– బంగారి ప్రకాష్(బీసీ); ఆసిఫ్నగర్– ఎం.సాయిశిరీష(బీసీ); విజయనగర్కాలనీ– స్వరూపరాణి(బీసీ); రహమత్నగర్– సారిక(బీసీ); రెడ్హిల్స్– ప్రియాంకగౌడ్(బీసీ); మల్లెపల్లి– ఎం.పద్మావతి(బీసీ); జాంబాగ్– ఆనంద్గౌడ్(బీసీ); గన్ఫౌండ్రీ– మమతాగుప్తా(ఓసీ); రాంనగర్– శ్రీనివాసరెడ్డి (ఓసీ); గాంధీనగర్– పద్మనరేష్(బీసీ); ఖైరతాబాద్– విజయారెడ్డి(ఓసీ); వెంకటేశ్వరకాలనీ– కవితారెడ్డి(ఓసీ); బంజారాహిల్స్– విజయలక్ష్మి(బీసీ); జూబ్లీహిల్స్– కె. సూర్యనారాయణ(ఓసీ); సోమాజిగూడ– వి.సంగీతా యాదవ్(బీసీ); అమీర్పేట్– శేషుకుమారి(కాపు); సనత్నగర్– లక్ష్మి(ఓసీ); ఎర్రగడ్డ– పి.మహేందర్యాదవ్(బీసీ) బోరబండ– బాబా ఫసియొద్దీన్(మైనార్టీ); కొండాపూర్– షేక్ హమీద్పటేల్(మైనార్టీ); గచ్చిబౌలి– ఎస్కే బాబా(బీసీ); మాదాపూర్– జగదీశ్వర్గౌడ్(బీసీ); మియాపూర్– ఉప్పలపతి శ్రీకాంత్(ఓసీ); హఫీజ్పేట్– వీపీ జగదీశ్వర్(బీసీ); భారతినగర్– సింధూ ఆదర్శ్రెడ్డి(ఓసీ); ఆర్సీపురం– పి.నగేష్ యాదవ్(బీసీ); పటాన్చెరు– ఎం.కుమార్యాదవ్(బీసీ); కేపీహెచ్బీకాలనీ– ఎం.శ్రీనివాసరావు(ఓసీ); బాలాజీనగర్– శీరిషబాబురావు(బీసీ); అల్లాపూర్– సబీహాబేగం(మైనార్టీ); మూసాపేట్– శ్రవణ్కుమార్(బీసీ); ఫతేనగర్– సతీష్గౌడ్(బీసీ) బోయిన్పల్లి– ఎం.నర్సింహ్మాయాదవ్(బీసీ); అల్విన్కాలనీ– వెంకటేష్గౌడ్(బీసీ); గాజులరామారం– రావుల శేషగిరి(బీసీ); జగద్గిరిగుట్ట– కె.జగన్(బీసీ); రంగారెడ్డినగర్– విజయశేఖర్గౌడ్(బీసీ); చింతల్– రషీదాబేగం(మైనార్టీ); సూరారం– ఎం.సత్యనారాయణ(బీసీ); సుభాష్నగర్– ఆదిలక్ష్మి(ఓసీ); కుత్బుల్లాపూర్– పారిజాతగౌడ్(బీసీ); జీడిమెట్ల– పద్మప్రతాప్గౌడ్(బీసీ); మచ్చబొల్లారం– జితేందర్నాథ్(ఎస్సీ), అల్వాల్– విజయశాంతి(ఓసీ); వెంకటాపురం– సబితా కిషోర్(ఎస్సీ); మల్కాజ్గిరి– జగదీష్గౌడ్(బీసీ); సీతాఫల్మండి– హేమ(బీసీ); బన్సీలాల్పేట్– హేమలత(ఎస్సీ); రాంగోపాల్పేట్– అరుణ(బీసీ); మోండామార్కెట్– ఆకుల రూప(బీసీ) కాంగ్రెస్ అభ్యర్థులు.. కాప్రా– శ్రీపతికుమార్(ఎస్సీ); ఏఎస్రావు నగర్– శిరీషారెడ్డి (ఓసీ); ఉప్పల్– ఎం.రజిత(ఓసీ); నాగోల్– ముస్కు శైలజ(ఓసీ); మన్సూరాబాద్– జక్కిడి ప్రభాకర్రెడ్డి(ఓసీ); హయత్నగర్– గుర్రం శ్రీనివాసరెడ్డి(ఓసీ); హస్తినాపురం– సంగీతానాయక్(ఎస్టీ); ఆర్కేపురం– పున్న గణేష్ నిర్మలానేత(బీసీ); గడ్డిఅన్నారం– వెంకటేష్యాదవ్(బీసీ); సులేమాన్నగర్– రిజ్వానాబేగం(బీసీ); మైలార్దేవులపల్లి– శ్రీనివాస్గౌడ్(బీసీ); రాజేంద్రనగర్– బి.దివ్వ(ఎస్సీ); అత్తాపూర్– భాస్కర్గౌడ్(బీసీ); కొండాపూర్– మహిపాల్యాదవ్(బీసీ); మియాపూర్– ఇలియాస్ షరీఫ్(మైనార్టీ), అల్లాపూర్– కౌసర్బేగం(మైనార్టీ) మూసాపేట్– రాఘవేందర్(ఓసీ); ఓల్డ్బోయిన్పల్లి– అమూల్య(ఓసీ); బాలానగర్– సత్యం శ్రీరంగం(ఓసీ); కూకట్పల్లి– వెంకటేశ్వర్రావు(ఓసీ); గాజుల రామారం– కూన శ్రీనివాస్గౌడ్(బీసీ); రంగారెడ్డినగర్– గిరిగి శేఖర్(బీసీ); సూరారం– వెంకటేష్(ఓసీ); జీడిమెట్ల– బండి లలిత(ఓసీ); నేరేడ్మెట్– మరియమ్మ(ఓసీ); మౌలాలి– ఉమా మహేశ్వరి(బీసీ); మల్కాజ్గిరి– శ్రీనివాస్గౌడ్(బీసీ); గౌతంనగర్– తపస్వినీ యాదవ్(బీసీ); బేగంపేట్– మంజులారెడ్డి(ఓసీ); మూసారంబాగ్– లక్ష్మి(ఓసీ); ఓల్డ్మలక్పేట్– వీరమణి(బీసీ) పత్తర్గట్టి– మూసాఖాసీం(మైనార్టీ); ఐఎస్ సదన్– కె.మంజుల(ఓసీ); సంతోష్నగర్– మతీన్ షరీఫ్(బీసీ); పురానాఫూల్– మహ్మద్సాహిల్ అక్బర్(బీసీ); లలితాబాగ్– అబ్దుల్ ఇర్ఫాన్(మైనార్టీ); రియాసత్నగర్– సయ్యద్ముస్తాఫా ఖాద్రీ (మైనార్టీ); కంచన్బాగ్– అమీనాసబా(బీసీ); బార్కస్– షహనాజ్బేగం(బీసీ); చాంద్రాయణగుట్ట– షేక్ అఫ్జల్(బీసీ); నవాబ్సాబ్కుంట– మెహరాజ్బేగం(బీసీ); శాలిబండ– చంద్రశేఖర్(బీసీ); కిషన్బాగ్– అసద్అలీ(బీసీ); బేగంబజార్– పురుషోత్తం(ఓసీ); దత్తాత్రేయనగర్– అజయ్ నారాయణ(బీసీ) బీజేపీ అభ్యర్థులు.. పత్తర్గట్టి– అనిల్బజాజ్(ఓసీ); మొగుల్పుర– మంజుల(ఓసీ); పురానాపూల్– సురేందర్కుమార్(బీసీ); కార్వాన్– కె.అశోక్(బీసీ); లంగర్హౌస్– సుగంద పుష్ప(బీసీ); టోలిచౌకి– రోజా(బీసీ); నానల్నగర్– కరణ్కుమార్(బీసీ), సైదాబాద్– కె.అరుణ(ఓసీ); అక్బర్బాగ్– నవీన్రెడ్డి(ఓసీ); డబీర్పుర– మిర్జా అఖిల్ అఫండి(మైనార్టీ); రెయిన్బజార్– ఈశ్వర్ యాదవ్(బీసీ);లలితాబాగ్– చంద్రశేఖర్(ఎస్సీ); కుర్మగూడ– శాంత(బీసీ); ఐఎస్ సదన్– జంగం శ్వేత(ఓసీ); రియాసత్నగర్– మహేందర్రెడ్డి(ఓసీ); చాంద్రాయణగుట్ట– నవీన్కుమార్(బీసీ); ఉప్పుగూడ– శ్రీనివాసరావు(బీసీ); గౌలిపుర– భాగ్యలక్ష్మి(బీసీ); శాలిబండ– నరే ష్(బీసీ); దూద్బౌలి– నిరంజన్కుమార్(బీసీ); ఓల్డ్ మలక్పేట్– రేణుక(బీసీ) -
ఉత్కంఠ
* నేటితో ఎన్నికల ప్రచారానికి తెర * సాయంత్రం 5 గంటల వరకే అవకాశం * ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు * భారీ ర్యాలీలు, సభలతో బల ప్రదర్శన * అంతటా నేడు ఓటరు స్లిప్పుల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. సభలు, సమావేశాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అన్ని రకాల ప్రచారాన్నీ నిలిపివేయనున్నారు. బల్క్ ఎస్సెమ్మెస్ల ప్రచారం కూడా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజును వివిధ పార్టీలు డివిజన్ స్థాయిలోనే భారీ సభలు, ర్యాలీలతో బల ప్రదర్శనకు వాడుకునే దిశగా ఏర్పాట్లు చేసుకున్నాయి. టీఆర్ఎస్ శనివారం రాత్రి పరేడ్గ్రౌండ్లో నిర్వహించిన సభ విజయవంతం కావటంతో ఆ జోష్ను పోలింగ్ రోజు వరకు కొనసాగించే దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించింది. బీజేపీ, టీడీపీల తరఫున చివరి రోజు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు కూడా వివిధ సభల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ నేతలు వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్లో పాల్గొనే ఓటర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని పోలింగ్ బూత్లు, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఓటరు స్లిప్పులు అందజేయనున్నారు. ఇప్పటికే నగరంలో ఇంటింటికీవెళ్లి సుమారు 40 లక్షలు పంపిణీ చేశారు. వెబ్ నుంచి4.10 లక్షలు, యాప్ నుంచి 1.74 లక్షల స్లిప్పులు ఓటర్లకు చేరిపోయాయి. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాల్లో 25 వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. సుమారు 3,200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. 52, 722 ఓటరు స్లిప్పుల డౌన్లోడ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి శనివారం మొత్తం 52,722 మంది ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసున్నారు. వీరిలో వెబ్సైట్ నుంచి 14,027 మంది డౌన్లోడ్ చేసుకోగా, మరో 38,695 మంది మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసున్నారు. -
'హైదరాబాద్లో సీమాంధ్రులకు అండగా ఉంటాం'