-
లక్షే లక్ష్యం..
హన్మకొండ: టీఎస్ ఆర్టీసీ.. ఆదాయం పెంచుకునే దిశలో సరికొత్త చాలెంజ్లతో ముందుకెళ్తోంది. ఆర్టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పరిరక్షణ, ఆదాయ పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే దసరా, రాఖీ, సంక్రాంతి, ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్, 100 రోజుల చాలెంజ్, ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం, విధుల్లో నైఫుణ్యం ప్రదర్శించాలి వంటి కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ‘లక్షే లక్ష్యం’ అనే పేరుతో మరో చాలెంజ్ తీసుకువచ్చింది. పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వేతన సవరణ చేసింది. వేతన సవరణ ద్వారా పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ప్రతి రోజు ఆదాయం పెంచుకోవాలని చాలెంజ్ తీసుకువచ్చింది. రోజు అదనంగా రూ.లక్ష ఆదా యం తీసుకురావాలన్నదే ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈ చాలెంజ్ ఏడాది పాటు కొనసాగుతుంది. వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఈ లెక్కన రీజియన్లో ప్రతి రోజు అదనంగా రూ.9 లక్షల ఆదాయం తీసుకురావాలి. ఆదాయం పెంచుకోవాలంటే ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించాలి. ప్రస్తుత ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటేనే ఈ చాలెంజ్లో రాణిస్తారు. అదనపు ట్రిప్పులు నడపడం, ప్రయాణికులను పిలిచి బస్సు ఎక్కించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోనున్నారు. డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం.. వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు ఆయా డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం నిర్దేశించుకున్నారు. వరంగల్ రీజియన్లో జీరో టికెట్తో కలిపితే రోజూ సగటున రూ.2.20 కోట్ల ఆదాయం వస్తోంది. జీరో టికెట్ను మినహాయిస్తే నగదు రూపేణ రోజూ సగటున రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయానికి అదనంగా మరో రూ.9 లక్షలు రాబట్టుకోవడమే ఈ చాలెంజ్ లక్ష్యం. ఆదాయం తక్కువగా వచ్చే డిపోల నుంచి అధిక ఆదాయం వచ్చే డిపోల వారీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా రాబట్టుకోవాలని నిర్దేశించుకున్నారు. రోజుకు రూ.9 లక్షల లెక్కన నెలకు రూ.2.70 కోట్లు, సంవత్సరానికి రూ.64,80 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా వరంగల్ రీజియన్ యాజమాన్యం ముందుకెళ్తోంది. కాగా, వరంగల్ రీజియన్లో ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్ను గురువారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో వరంగల్ రీజినల్ మేనేజర్ జాస్తి శ్రీలత ప్రారంభించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతి స్టేజీలో పిలిచి ఎక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎం వంగల మోహన్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో మరో చాలెంజ్ ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వరంగల్ రీజియన్లో ప్రారంభం -
ఎన్నికల ఖర్చులు లెక్కించండి
కాళోజీ సెంటర్: పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చుల వివరాల్ని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ వ్యయ పరిశీలకులు ఏ.ధిలీబన్, ధీరజ్ సింగా అన్నారు. రిటర్నింగ్ అధికారి, గురువారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎన్నికల వ్యయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో వ్యయ లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన కమిటీలు, బృందాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న అప్పగించిన నగదు, మధ్యం, తదితర వివరాల్ని ఎస్ఎస్టీఎఫ్ఎస్టీ బృందాలు వ్యయ పరిశీలకులకు వివరించారు. ఈ సందర్బంగా ధిలీబన్ ధీరజ్ సింగా మాట్లాడుతూ.. రాజకీ య పార్టీలు, అభ్యర్థుల ఆమోద, ఆమోద యోగ్యం కాని ప్రతీ ఖర్చును సహాయ వ్యయ పరీశీలకులు, అకౌంటింగ్ టీమ్, వీఎస్టీవీవీటీలు నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలన్నింటీని వీడియో సర్వేలెన్స్ టీమ్ సభ్యులు రికార్డ్ చేయాలన్నారు. అభ్యర్థుల వ్యయ వ్య య రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనుమతి తీసుకున్న వాహనాల కంటే ఎక్కువ ఉపయోగిస్తే అనుమతి రద్దు చే యాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఉచిత కానుకల్ని పంపిణీ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు, రామిరెడ్డి, సంజీవరెడ్డి, పుష్పలత, ఆయుబ్ అలీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.● ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు ● జిల్లా అధికారులతో సమీక్ష -
వరల్డ్ హెరిటేజ్ డే సంబురాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్లో గురువారం వరల్డ్ హెరిటేజ్ డే సంబురాలు జరి గాయి. ఈ సందర్భంగా డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ ఆధ్వర్యంలో షెడ్లో కార్మికులు పది రోజలపాటు శ్రమించి తొలి తరం హెరిటేజ్ లోకోకు పెయింటింగ్ వేసి విద్యుత్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. రైల్వే అధికారులు కార్మి కులకు హెరిటేజ్ లోకో గొప్పతనం, చరిత్రను వివరించి అవగాహన కల్పించారు. షెడ్ కార్మికులకు క్వి జ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెలలో నిర్వహించే డీజిల్షెడ్ 51వ వార్షికోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధి కారులు వెల్లడించారు. రైల్వే డీజిల్ లోకోషెడ్లో నిర్వహణ కార్మికులకు క్విజ్, వ్యాసరచన పోటీలు -
ఓటుహక్కుపై ముగ్గులతో చైతన్యం
ఓటు హక్కు ప్రాధాన్యంపై మహిళలకు అవగాహన కలిగించేలా గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా ముగ్గులను పరిశీలించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – హన్మకొండ అర్బన్ తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపుహన్మకొండ: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఆన్లైన్, ఆఫ్లైన్లో బుక్ చేసుకునేందుకు ఈనెల 25 వరకు గడువు పెంచినట్లు ఆర్టీసీ కార్గో వరంగల్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా తలంబ్రాలు అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలంబ్రాల కోసం డిపోల వారీగా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. వరంగల్–1 డిపో 91542 98759, హనుమకొండ 91542 98761, జనగామ డిపో 91542 98762, పరకాల, భూపాలపల్లి డిపో 91542 98764, నర్సంపేట 91542 98763, తొర్రూరు 91542 98766, మహబూబాబాద్ 91542 98768, వరంగల్ రీజియన్ 93913 20465 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
కోడిపిల్లను గాబులో వేశాం..
బయ్యారం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ కాని కోడిపిల్ల(భద్రాచలం ఎమ్మెల్యే) ను గాబులో వేశాం.. ఇక కాంగ్రెస్కు తిరుగేలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్లో శుక్రవారం నిర్వహించే సీఎం బహిరంగసభకు జనసమీకరణ నిమిత్తం గురువారం బయ్యారంలోని కోదండరామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో గార్ల–బయ్యారం మండలాల్లోని పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పది ఎమ్మెల్యే స్థానాల్లో గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థి (కోడిపిల్లగా మంత్రి సంబోధించారు) కాంగ్రెస్లో చేరడంతో పదికి పది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాయని.. ఇక మనం ఏ అభివృద్ధి పని గురించి అడిగినా సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో మిగతా పార్టీల దుకాణాలు ఖాళీ అవుతాయన్నారు. సీఎం బహిరంగ సభకు పార్లమెంట్స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తరలించనున్నామన్నా రు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ను గె లిపించే బాధ్యత తీసుకుంటే అభివృద్ధి చేసే బాధ్య త తాము తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నం శ్రీకాంత్రెడ్డి, గార్ల జెడ్పీటీసీ ఝాన్సీ, ఎంపీపీ నాగరాజు, బయ్యారం, గార్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముసలయ్య, రామారావు, సొసైటీ చైర్మన్లు మధుకర్రెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
రూ.7.14 లక్షల నగదు పట్టివేత
రామన్నపేట : లోక్సభ ఎన్నికల్లో భాగంగా పోలీసులు గురువారం పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ఆధారం లేకుండా తరలిస్తున్న నగదు మొత్తం 7.14 లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్ ఏసీపీ బి.నందిరాం ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్కు చెందిన బండారి మణికంఠ నుంచి రూ.2.80 లక్షలు, షేక్ జిజ్వాద్ వద్ద రూ.84 వేలు, నద్దునూరి రవి వద్ద రూ.63 వేలు, తుపాకుల శ్రీకాంత్ వద్ద రూ.56వేలు, సార భాస్కర్ వద్ద రూ.54వేలు.. మొత్తం రూ.4.65 లక్షలు స్వాధీనం చేసుకుని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జ్కు అప్పగించారు. స్టేషన్ఘన్పూర్లో రూ.లక్ష.. ేస్టషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. లక్ష నగదు పట్టుకున్నట్లు సీఐ ముస్క రాజు తెలి పా రు. మండలంలోని మాన్సింగ్తండాకు చెందిన భూక్య రవీందర్ బైక్పై ఘన్పూర్ నుంచి మాన్సింగ్ తండాకు వెళ్తుండగా తనిఖీ చేసినట్లు పేర్కొన్నా రు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.లక్ష లభించడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిల్పూరులో రూ.1.49 లక్షలు.. చిల్పూరు: మండల పరిధి వెంకటాద్రిపేట–తరిగొప్పుల రోడ్డులో గురువారం రూ.1.49 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. వెంకటేశ్వరపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిల్పూరు పంచాయతీ పరిధి వడ్డెగూడేనికి చెందిన కస్తూరి వెంకట్రాజం బైక్పై వెళ్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆధారాలు లేని నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు వివరించారు. -
నీటి గోస
వరంగల్ నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా దయనీయంగా ఉంది. వరంగల్ అండర్ రైల్వే గేట్, హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో చాలా కాలనీల్లో నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తికి 160 లీటర్ల నీరు అవసరం. కానీ.. ప్రస్తుతం 60–70 లీటర్లు అందడం లేదు. నల్లాలు విడవడమే ఆలస్యం.. మోటార్లు పెట్టుకుని లాగేస్తున్నారు. దీంతో చాలా కాలనీల్లో పేదలు నీళ్లు అందక అరిగోస పడుతున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని ఇంజనీర్లు చెబుతున్నా.. ట్యాంకర్లు జాడా పత్తా లేవని పేదలు ఆందోళన చెందుతున్నారు. -
కడియం కావ్యది ఆంధ్రానే
హన్మకొండ: కడియం కావ్యది ముమ్మాటికీ మెట్టినిల్లు అయిన ఆంధ్రానే అని, ఆమె స్థానికేతరురాలు అని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక భాగమేనన్నారు. అవసరమనుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. కడియం శ్రీహరి తన గురువైన చంద్రబాబును అడిగి బాపట్ల నుంచి టికెట్ అడిగి తీసుకోవచ్చుకదా అని అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి అని, టీడీపీలో మంత్రిగా ఉండి ఉద్యమకారులపై కేసులు పెట్టించారన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారన్నారు. ఈనెల 24న అరూరి రమేశ్ నామినేషన్ వేస్తారన్నారు. సమావేశంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి, నాయకులు ఒంటేరు జయపాల్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తిరుపతిరెడ్డి, సంతోశ్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు -
ప్రచార పర్మిషన్.. ఇక సులువు
ఖిలా వరంగల్: గతంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఓ సమావేశం నిర్వహించాలంటే అనుమతి కోసం తెల్ల కాగితాలపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. ఈ విధానం నాయకులకు తలనొప్పిగా ఉండేది. ప్రస్తుతం అనుమతులు సులువుగా లభిస్తున్నాయి. దీనికి కారణం ఓ యాప్. ఎన్నికల సంఘం‘సువిధ’ అనే పేరుతో యాప్ ప్రవేశపెట్టింది. దీని వల్ల సమావేశాల అనుమతుల జారీకి అధికారుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. యాప్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. అనుమతులు జారీ చేస్తారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన పత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నామిషనేషన్ల ఘట్టం పూర్తికాగానే ప్రచారం జోరుగా సాగనుంది. ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలపై దృష్టి సారించనున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. ర్యాలీలతో హోరెత్తిస్తారు. అయితే అభ్యర్థులు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా.. మందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందుకు ‘సువిధ’ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. పార్లమెంట్ పరిధిలో కలెక్టర్.. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక పార్టీకి చెందిన ప్రచార వాహనం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తిరగాల్సి వస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ అనుమతిస్తారు. ప్రధాన నాయకులు హెలికాప్టర్లలో వస్తే దీని అనుమతి కలెక్టర్ వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ‘సువిధ’ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ పరిధిలో ఏఆర్వోలు .. పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి ఏఆర్వోలు అనుమతులు జారీ చేస్తారు. నియోజకవర్గ పరిధిలో వాహనాలు, ప్రజలతో కలిసి ర్యాలీలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, లోడ్ స్పీకర్లు , జెండాలు, పోస్టర్ల వినియోగం, ఇంటింటి ప్రచారం.. ఇలా ఏ కార్యక్రమానికికై నా అనుమతి పొందాల్సిందే. ‘సువిధ’ యాప్లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. సెల్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ‘సువిధ’ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. సమావేశం నిర్వహించే వివరాలతో పాటు తమకు ఏ విధమైన అనుమతులు కావాలో అందులో నమోదు చేయాలి. అనుమతులకు సంబంధించి మీసేవ కేంద్రంలో చలాన్ చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన చలాన్ రసీదు, ‘సువిధ’ యాప్లో నమోదు చేసిన వివరాలు రిటర్నింగ్ అధికారికి, అసెంబ్లీ పరిధిలోని ఏఆర్వో కార్యాలయాల్లో అందజేయాలి. ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులు ఎన్నికల అధికారులకు చేరిన 48 గంటల్లోనే అనుమతులు జారీ చేస్తారు. అనుమతి జారీలో జాప్యం జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.‘సువిధ’ యాప్తో సులభం.. 48 గంటల్లోనే అనుమతులు గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి.. నేడు అంతా ఆన్లైన్లోనే.. -
పాలిటిక్స్ షురూ..
సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మురళీనాయక్, అభ్యర్థి బలరాంనాయక్ తదితరులు సాక్షి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మానుకోటలో సీఎం ప్రచారసభలో పాల్గొననున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు, మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వుడు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈరెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆపార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేతల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరా నేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న రేవంత్ సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరిశీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు. -
No Headline
వరంగల్ అర్బన్: ‘కారు కడిగితే రూ.5 వేలు జరిమానా. స్విమ్మింగ్ పూల్స్ వాడితే కఠిన చర్యలు. మోటార్లు పెట్టి నీటిని లాగితే జైలు శిక్ష’ ఇది కర్ణాటకలో పరిస్థితి. అక్కడ తాగునీటి క్యాన్ (20 లీటర్లు) రూ.200 ధర పలుకుతోందట! అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే నీటిని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. గ్రేటర్ వరంగల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మూడేళ్ల తర్వాత మళ్లీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అదీ గంట కూడా పైపులైన్ల చివరి నల్లాల వరకు అందడం లేదు. జూన్లో వర్షాలు కురవకపోతే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నగరానికి నీటి కష్టాలు తప్పకపోవచ్చు. ప్రత్యామ్నాయ జలాశయాలు లేక నీటి ఎద్దడి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయమేది? వరంగల్ మహానగర ప్రజలకు ధర్మసాగర్ చెరువు మాత్రమే శరణ్యమైంది. ధర్మసాగర్ జలాశయం సామర్థ్యం 1,500 ఎంసీఎఫ్టీ. ప్రస్తుతం ధర్మసాగర్లో ఉన్న నీరు మరో 80 రోజుల వరకు సరిపోతు ందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు, డెడ్ స్టోరేజీ, నీటి వాడకం తదితర కారణాలతో 60 రో జులే నీరందవచ్చని నిపుణుల అంచనా. లీకేజీలు.. అక్రమ నల్లాలు ప్రస్తుతం మహా నగరానికి రోజూ 6 ఎంసీఎఫ్టీల నీరు అవసరం కాగా.. 5 ఎంసీఎఫ్టీల రా వాటర్ సరఫరా అవుతోంది. ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీరు 35 శాతం నీటికి లెక్కలు దొరకడం లేదు. లీకేజీలు, అక్రమ కనెక్షన్లతో నీరు పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల మోటార్లతో నీటిని లాగుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇంజనీర్లు వైఫల్యం చెందుతున్నారనే విమర్శలున్నాయి. దేశాయిపేట ఫిల్టర్బెడ్ -
No Headline
వరంగల్ అర్బన్: ప్రభుత్వం కల్పించిన ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పన్ను వసూళ్లపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 5 శాతం పన్ను రిబేట్పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్ల మేర లక్ష్యం వసూలు చేయాలని ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోలేని అధికారులు, సిబ్బందికి ఈనెలాఖరు తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశించారు. పన్నుల చెల్లింపునకు వచ్చిన చెక్కులు బౌన్స్ అయితే ఆర్ఐలు వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, కృష్ణారెడ్డి, ఆర్ఓలు సుదర్శన్, యూసూపొద్దీన్, షాహజాదీ బేగం, శ్రీనివాస్, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దుఅభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పోతననగర్ ప్రాంతం, అజర హాస్పిటల్ ప్రాంతంలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు, నయీంనగర్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న పనులు, రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. పూర్తయిన అభివృద్ధి పనుల బ్యూటిఫికేషన్ చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, ఈఈలు రాజయ్య, సంజయ్ కుమార్, టీపీఎస్ బషీర్, ఏఈలు హరికుమార్, విజయ లక్ష్మి, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ షురూ!
కాళోజీ సెంటర్ : లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ (రిజిస్టర్డ్ పార్టీ) అభ్యర్థిగా అంబోజు బుద్దయ్య, ఇండిపెండెంట్(స్వతంత్ర)అభ్యర్థిగా బరిగెల శివ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా(రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్) పార్టీ అభ్యర్థినిగా తౌటపల్లి నర్మదా ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి మొదటి రోజు మూడు దాఖలు.. -
బీఫాంలు అందుకున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
హన్మకొండ/మహబూబాబాద్: బీఆర్ఎస్ వరంగ ల్, మాహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు మారపల్లి సుధీర్కుమార్, మాలోత్ కవిత బీఫాంలు అందుకున్నారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స మావేశం అనంతరం పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు బస్వరాజు సార య్య, సిరికొండ మధుసూదనాచారి, సత్యవతి రా థోడ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్ , హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు. -
కావ్యకు నాకంటే ఎక్కువ మెజార్టీ తీసుకువస్తా
వరంగల్: వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎ క్కువ సాధిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నా రు. గురువారం రాత్రి పోచమ్మమైదాన్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మా ట్లాడుతూ కొండా దంపతులు సన్మానాలకు దూరమన్నారు. సన్మానాలకు అయ్యే ఖర్చుతో అనాథలకు భోజనం అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఆరు గ్యారంటీల్లోని ఐదింటిని 100 రోజుల్లో అమలు చేశామన్నారు. అంబేడ్కర్పై మాట్లాడే నైతిక విలువ కేసీఆర్కు లేదని, రాజకీయాల్లోకి అసభ్య పదజాలం తీసుకువచ్చింది కేటీఆర్, కేసీఆర్లే అని గుర్తించాలన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించిన క్షణం.. కొండా దంపతులు తన బిడ్డకు నిండు ఆశీర్వాదం అందించారన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ రాజకీయాల్లో ఎలా ముందుకు పోవాలో కొండా సురేఖ చెబుతున్నారని, ఈ సమావేశం చూస్తే తన గెలుపు ఖాయం అనిపిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు మాట్లాడుతూ కొండా మురళీధర్ మాట ఇస్తే.. తప్పడన్నారు. కడియం కావ్యకు 50వేల మెజార్టీ ఇస్తామన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్లు, నాయకులు నవీన్రాజు, ప్రకాశ్, ప్రభాకర్, శ్రీనివా స్, శ్రీనివాస్, రాజేష్, రవీందర్ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
రెండు మూడ్రోజులకోసారి..
కరీంనగర్ లోయర్ మేనేరు డ్యామ్(ఎల్ఎండీ) నుంచి ధర్మసాగర్ వద్ద ఉన్న మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ ప్రతీ రోజు 60 మిలియన్ లీటర్ ఫర్ డే (ఎంఎల్డీ)ల రా వాటర్ సరఫరా అవుతోంది. ఎల్ఎండీలో నీటి నిల్వలు కనీస స్థాయికి చేరాయి. దీంతో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 3 లక్షల జనాభాకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు, మూడ్రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. జూన్లో వర్షాలు పడకపోతే నగరానికి తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకానుంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోనైనా ప్రత్యామ్నాయ జలాశయాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం జలాశయాల విషయంలో మీనమేషాలు లెక్కించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గస్తీ షురూ..!
వరంగల్ క్రైం: లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. దీంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి తనిఖీలు మొదలయ్యాయి. ఇప్పటికే బెల్ట్ షాపులు నిర్వహించుకుండా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్షాపులు నిర్వహించినా.. సమయ పాలన తర్వాత మద్యం విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేస్తున్నారు. గతంలో కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసి.. ఎన్నికలకు ఎక్కువ సమయం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎత్తివేసిన చెక్పోస్టులను పోలీస్ అధికారులు తిరిగి గురువారం నుంచి ప్రారంభించారు. ప్రతి చెక్పోస్టులో పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. చెక్పోస్టుల దగ్గర భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పందంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కమిషనరేట్లో చెక్పోస్టులు ఇవే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్ అధికారులు 23 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈస్ట్జోన్ పరిధిలో నర్సంపేట నియోజకవర్గంలో అయ్యప్ప గుడి, నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లి, ఖానాపూర్ మండలం అశోక్నగర్, వరంగల్ తూర్పు నియోజవర్గం పరిధిలో లేబర్ కాలనీ జాన్పాక పీరీలు, నాయుడు పెట్రోల్ పంపు, వర్ధన్నపేట నియోజవర్గంలో హసన్పర్తిలోని అనంతసాగర్, డీసీతండా, చింత నెక్కొండ, సెంట్రల్ జోన్ పరిధిలో.. వరంగల్ పశ్చిమ నియోజవర్గం పరిధిలో కాజీపేట డిజీల్ కాలనీ, ఐశ్వర్యగార్డెన్ ములుగురోడ్డు, సీఎస్ఆర్ గార్డెన్, పరకాల నియోజవర్గ పరిధిలో కటాక్షపూర్ క్రాస్, గీసుగొండ కొమ్మాల, నడికూడ, హుజూరాబాద్ నియోజవర్గంలో ఎల్కతుర్తి పెంచికలపేట, స్టేషన్ఘన్పూర్ పరి ధిలో లింగాలఘణపురం జీడికల్, జఫర్గడ్ నల్లబండ, సాక్షి కార్యాలయం రాంపూర్, పాలకుర్తి నియోజవర్గంలో దేవరుప్పుల మండల కేంద్రం, రాయపర్తి కిష్టపూర్ క్రాస్, జనగామ నియోజవర్గం పరిధిలో.. జనగామ పెంబర్తి, బచ్చన్నపేట కొన్నె క్రాస్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. 23 చెక్ పోస్టులతోపాటు కమిషనట్ పరిధిలో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలుు ఏర్పాటు చేశారు. వీటితోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) బృందాలను 25 నియమించారు. ఇవి రెండు మండలాలకు ఒక బృందం చొప్పున పనిచేస్తాయి. ఒక్కో చెక్పోస్టులో 8మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు సివిల్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రెవెన్యూ సిబ్బంది, ఒక రెవెన్యూ అధికారి.. ప్రతి చెక్పోస్టులో వీడియోగ్రాఫర్ ఉంటారు. సరైన పత్రాలు ఉంటే రూ.49,900వరకు వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. 7ఫుల్ బాటిల్స్, కాటన్ (12) బీర్ల వరకు అనుమతి ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రచార వస్తువులు వెంట ఉంటే వారి దగ్గర రూ.10వేలు నగదు ఉన్న సీజ్ చేస్తారు. చెక్ పోస్టులతోపాటు ఎంసీసీ బృందాలు కూడా అడుగుడుగునా తనిఖీలు చేపడుతాయి. కమిషనరేట్ పరిధిలో 23చెక్ పోస్టులు నిరంతరం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు రూ.49వేల వరకు అనుమతి చెక్పోస్టులను తనిఖీ చేస్తున్న సీపీ -
రమేశ్ చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహాక సమావేశం హనుమకొండ హంటర్రోడ్లోని డీ కన్వన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్య నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ధ్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందన్నారు. వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
అమాయకులే లక్ష్యంగా దోపిడీ
ఎంజీఎంలో పేషెంట్ల వద్ద ఉండే మహిళలే టార్గెట్ ● లోన్ ఇప్పిస్తామని మాయమాటలు ● ఫొటోలు తీస్తామని ఒంటిపై నగలు తీయించి వాటితో ఉడాయింపు ● భార్యాభర్తతోపాటు మరొకరి అరెస్ట్రామన్నపేట: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కేంద్రంగా పేషెంట్ల వద్ద ఉండే అమాయక మహిళలను టార్గెట్ చేసుకొని వారికి లోన్ల ద్వారా డబ్బులిప్పిస్తానని నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మట్టెవాడ ఏసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరాంనాయక్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య మాట్లాడుతూ.. నిందితుల్లో భార్యాభర్తలతోపాటు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 70.432 గ్రాముల (సుమారు రూ.5.80లక్షల విలువ గల) బంగారు ఆభరణాలు, రూ.80వేల నగదు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరానికి చెందిన చుంచు స్వప్న అలియాస్ సానియా జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని ఎంజీఎం ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చే కొందరు అమాయకులైన ఆడవారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకునేదని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి లోన్ల ద్వారా డబ్బులిప్పిస్తానని చెప్పి అందుకు ఫొటోలు దిగాల్సి ఉంటుందని, వారి ఒంటిపై బంగారం ఉంటే లోన్ రాదని నమ్మించేదని తెలిపారు. ఒంటిపై బంగారం తీయించి ఫొటో దిగాక ఇస్తానని చెప్పి, బాండ్ పేపర్ తీసుకొస్తానని బయటికి వెళ్లి అక్కడినుంచి ఉడాయించేదని వివరించారు. నిందితురాలు స్వప్న గతంలో ములుగు, హనుమకొండ పీఎస్ల పరిధిలో దొంగతనాలు, లోన్లు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన కేసుల్లో జైలు జీవితం గడిపినట్లు తెలిపారు. ఆర్నెళ్ల క్రితం స్వప్న మొదటి భర్త ఫిరోజ్ వరంగల్ ఆటోనగర్లో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోగా, అతడి స్నేహితుడైన ఖాజాపాషాను 3 నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఈక్రమంలో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని, గతంలో మాదిరిగా ఎంజీఎంకు వచ్చిన పేషెంట్స్ దగ్గర ఉన్నవారిని మోసం చేస్తున్నారని, ఇలా దొంగిలించిన బంగారాన్ని హనీఫ్ అనే వ్యక్తి కుదువపెట్టేవాడని తెలిపారు. పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సొత్తు రికవరీ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపీ, ఎస్సై విఠల్ ఉన్నారు. -
గూడ్స్ షెడ్డు సమీపంలో అగ్నిప్రమాదం
కాశిబుగ్గ : వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్డు సమీపంలో గురువారం ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారుల కథనం ప్రకారం.. వరంగల్ తాత్కాలిక బస్టాండ్ వెనుక, వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్డు సమీపంలోని టేకు చెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎవరో సిగరెట్ తాగి పడేయగా ఎండిన చెట్ల ఆకులకు అంటుకుని ఈ ఘటన జరిగిందని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీడీ, సిగరెట్ తాగి ఎక్కడ పడితే వేయొద్దన్నారు. కాగా, అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. -
వరంగల్ శివనగర్లో...
ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. ఉదయం అర్చకులు, కమిటీ బాధ్యులు. ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అర్చకులు వేదమంత్రసూక్తులతో మంగళశాసనం, రక్షాబంధనం, బాషిక పూజ, జీలకర్ర బెల్లం తంతు జరిపారు. మధ్యాహ్నం 12.05 గంటలకు చైత్రశుద్ధ నవమి పుష్యమి నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున మాంగళ్యధారణ గావించారు. శ్రీరాముడి కరకములకు మంగళసూత్రాలను తాకించి అమ్మవారి మెడలో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కల్యాణం తిలకించారు. అనంతరం మహాన్నదానం నిర్వహించారు. భక్తులకు కల్యాణ ముత్యాల తలంబ్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, ఆడెపు సాంబమూర్తి, బుదారపు భాస్కర్, కుడికాల సుధాకర్రావు, చింతం యాదగిరి, శ్రీరాంరాజేష్, డాక్టర్ బండి రమేష్, రావికంటి అశోక్, సాదుల దామోదర్ పాల్గొన్నారు. -
– మరిన్ని ఫొటోలు 9లో
హనుమకొండ రెవెన్యూ కాలనీలో...హన్మకొండ అర్బన్: హనుమకొండ రెవెన్యూ కాలనీలోని శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణ వేడుకలను తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణతంతు జరిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలయ ఆవరణలో భక్తుల కోసం షామియానాలు ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేశారు. అనంతరం భక్తులకు మహాన్నదానం చేశారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు సోమేశ్వర్రావు, సాంబమూర్తి, కాలనీ కమిటీ అధ్యక్షులు, ఆలయ కార్యదర్శి మురళీమోహన్, సభ్యులు కోట రమేష్, మల్లారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఓనర్షిప్ సర్టిఫికెట్తో విక్రయాలు
హసన్పర్తి: వంగపహాడ్లో ఇటీవల ఓ రియల్టర్ ఇంటి పక్కన ఉన్న సర్కారు భూమిని తన ఇంటినంబర్తో రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్ 516లో సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి పక్కనే రియల్టర్ తన పట్టా భూమిలో సొంతిల్లు కలిగి ఉన్నాడు. సదరు యజమాని తన కు ఉన్న ఇంటికి సంబంధించిన ఓనర్ షిప్ సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కార్పొరేషన్ అధికారుల సహకారం ఉన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిని 200 గజాల ప్లాట్లుగా విభజించి, ఒక్కో ప్లాటును రూ.12లక్షలకు విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. ఇలా మొత్తం ఐదు ప్లాట్లు విక్రయించడం ద్వారా రూ. 60 లక్షలు దండుకున్నట్లు చర్చజరుగుతోంది. ఇటు రిజిస్ట్రేషన్.. అటు నిర్మాణాలు ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినవారు తమపేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సర్కారు భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని స్థాని కులు.. కార్పొరేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రెవెన్యూ అధికారిని సంప్రదించగా.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని తెలిపారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పద్మాక్షి మహిళా హాస్టల్లో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏబీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు హాస్టల్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ విద్యార్థినులకు సరైన వసతి కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి వచ్చి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జ్ మచ్చ పవన్కల్యాణ్, అధ్యక్షుడు దూడపాక నరేందర్, చైతన్యగౌడ్, కార్తిక్, అశోక్, నవ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. సభాస్థలి పరిశీలన మడికొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 24న హనుమకొండ జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కాజీపేట మండలం మడికొండ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఉన్న స్థలంలో సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చర్చించారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి విద్యారణ్యపురి : ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశపరీక్షకు రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల విద్య సంయుక్త సంచాలకులు డీఎస్ఆర్ రాజేందర్సింగ్ కోరారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ ఉచిత శిక్షణను హైదరాబాద్ నుంచి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్సింగ్ మాట్లాడుతూ సబ్జెక్టు నిపుణులతో విద్యార్థులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. కేడీసీ కెమిస్ట్రీ విభాగం అధిపతి బి.రమేశ్ మాట్లాడుతూ 60 రోజులపాటు నిర్వహించే శిక్షణకు 750 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి, పింగిళి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, కెమిస్ట్రీ అధ్యాపకులు సత్యనారాయణ, సునీత, మొగిలి, జగదీశ్బాబు పాల్గొన్నారు. 21 నుంచి బీఎల్ఐఎస్సీ తరగతులు కేయూ క్యాంపస్ : కేయూ దూరవిద్య కేంద్రంలో ఈనెల 21, 28, 29, 30, మే 5, 6, 7, 8 ,9 తేదీల్లో బీఎల్ఐఎస్సీ కాంటాక్టు తరగతులు నిర్వహించనున్నట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వి.రాంచంద్రం తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
23న టీచర్లను రిలీవ్ చేయాలి
విద్యారణ్యపురి : బదిలీ అయిన ఉపాధ్యాయులను ఈనెల 23న రిలీవ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బదిలీ అయిన వారిని ఇప్పటికీ రిలీవ్ చేయకపోవడం సరికాదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత టీచర్లకు బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ను ప్రకటించాలన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎం.సదాశివరెడ్డిని ఘనంగా సన్మానించారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధక్షుడిగా సీహెచ్.రవీందర్రాజు, ఉపాధ్యక్షుడిగా అజ్మీరా రాజారామ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, జిల్లా కోశాధికారి డి.కిరణ్కుమార్, జిల్లా బాధ్యులు సీఎస్ఆర్.మల్లిక్, కె.మోజెస్, చంద్రయ్య, నవీన్కుమార్, సీహెచ్.లింగారావు, ఎం.శశిధర్రెడ్డి, మెరుగు ప్రసన్న, కె.సదానందం పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement