Hanamkonda District Latest News
-
కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్పర, రాయ్పూర్, దుర్గ్, వాడ్స, చాంద్ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయ్చూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, గూటి, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఝెలహంకలో హాల్టింగ్ కల్పించారు. 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)లో ప్రవేశాలకు సెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శనివారం ముగిసింది. వీరు ఈ నెల 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బి.రంగయ్యనాయుడు కోరారు. అధికారిక వెబ్సైట్ https://deecet. cdse.telangana.gov.inలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే 9న సవరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 14న మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు డైట్ కళాశాలల్లో ఈనెల 17వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం జూలై 1వతేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. రామన్నపేట: ఫార్మసీ ఆఫీసర్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన మందులు, పీహెచ్సీల నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు, సిబ్బందికి పంపిణీ చేసిన మందుల బ్యాచ్ నంబర్, గడువు తేదీ ఇతర వివరాలను సంబంధిత రికార్డుల్లో పక్కాగా నిర్వహించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా వచ్చిన మందులను ముందుగా ఉపయోగించాలని అదేవిధంగా ఏదైనా పీహెచ్సీలో తక్కువ వినియోగంలో ఉన్న మందులను దగ్గర్లోని అవసరమైన పీహెచ్సీలకు పంపించాలని కోరారు. రాబోయే వర్షాకాలానికి అనుగుణంగా అవసరమైన అన్ని మందులను సరిపడా నిల్వ ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ సిస్టం దెబ్బతినకుండా వ్యాక్సిన్లను తగిన ఉష్ణోగ్రతలో భద్రపర్చాలన్నారు. ఈ ఔషదీ పోర్టల్లో అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గీసుకొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యూ–విన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు. వరంగల్ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ విషయమై కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ.. గర్భిణుల నమోదు, ప్రసవాలు, జనన సమయంలో ఇచ్చే టీకాల వివరాలను యాప్లో సకాలంలో నమోదు చేస్తే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. ఏరోజు వివరాలను ఆ రోజు నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డెమో అనిల్కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు. -
గడువులోగా సర్వే పూర్తి చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో కొనసాగుతున్న సర్వేను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో భూరికార్డులు, భూ కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లతో కలెక్టర్ వివిధ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ, పట్టా భూముల హద్దుల నిర్ధారణ, గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన సర్వే, రీ–సర్వే కార్యక్రమాలు, చెరువుల శిఖం (వెట్ల్యాండ్స్) భూముల గుర్తింపు, కొలతలు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో భూ రికార్డులు, భూ కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు సారంగపాణి, రాజనర్సయ్యతో పాటు జిల్లాలోని 14 మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు. ఈవీఎంల గోదాం తనిఖీ హనుమకొండ సుబేదారిలోని రెడ్క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపర్చిన గోదాంను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, టీపీసీసీ ఆర్యదర్శ ఈవీ శ్రీనివాస్రావు, బీజేపీ నుంచి రావు అమరేందర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి రజిని ఇతర పార్టీల ప్రతినిధులున్నారు. ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ట్రాన్స్జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి విశ్వజ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ సభ్యులు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’ను వేగంగా పూర్తి చేయండి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను బీఎల్ఓలు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. సమావేశంలో నాయబ్ తహసీల్దార్ ఎండీ.సుభాన్, బీఎల్ఓలు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
విద్యాసంస్థల పరిధిలో మత్తు పదార్థాల విక్రయాల నిరోధానికి పోలీసుల కార్యాచరణ
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026మరికొద్ది రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెనింగ్కు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిపై అవగాహన పెంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.ఎవరైనా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ –2003, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే జస్టిస్ జువైనల్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్) యాక్ట్ 77, 2015 ప్రకారం కేసులు పెడతారు. జైలుకు పంపడంతోపాటు జరిమానా విధించవచ్చు. -
అక్రమ నిర్మాణం కూల్చివేత
కాశిబుగ్గ: ‘నోటి మాట.. నోటు వాటా’ శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వరంగల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ గాంధీనగర్లోని 107 సర్వే నంబర్ ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను శనివారం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ స్థలంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై స్థానిక కాంటెస్ట్ కార్పొరేటర్ మంతెన అమరేశ్ పలుమార్లు మున్సిపల్ కమిషనర్, గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగాయి. మళ్లీ ఫిర్యాదు చేయడంతో అధికారులు పోలీసుల సమక్షంలో రెండుసార్లు నోటీసులు అందించారు. ఈ ఇంటి నిర్మాణ విషయంలో మున్సిపల్ అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసినప్పటికీ వారు నిబంధనల ప్రకారం సర్వే చేయాలని ఆదేశించారు. చివరకు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సీపీ ఉపేక్షించకుండా అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఆదేశించారు. కాగా, ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రమాదాలకు C/o ఎంజీఎం రోడ్డు
వరంగల్ అర్బన్ : నల్లా పైప్లైన్ లీకేజీని అరికట్టేందుకు ప్రధాన రహదారిపై భారీ గుంతలు తీశారు. పైపులైన్ మరమ్మతులు చేసి, మట్టిపోసి వదిలేశారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కీలకమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారింది. హనుమకొండ, వరంగల్ బస్స్టేషన్లకు, ఇతర ప్రాంతాలనుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఈ దారిలోనే వెళ్తుంటాయి. నగరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన రహదారిలో రెండు వైపులా తవ్వకాలు చేసిన బల్దియా ఇంజనీర్లు తారు వేయకుండానే మట్టితో పూడ్చివేసి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరగడం, రోడ్డుపై గుంతలను చూడలేక ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సైతం ఇదే రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, వీరికి ఈ గుంతలు, బారికేడ్లు కనిపించడం లేదా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే ఆర్అండ్బీ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. తవ్వకాలు చేసిన బల్దియా ఇంజనీర్లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోచమ్మమైదాన్–సీకేఎం కాలేజీ రహదారిలో, కాశిబుగ్గ వివేకానంద కాలేజీ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్డు, వరంగల్ రైల్వేగేట్ ఫ్లైఓవర్ కింద రోడ్లు, తిలక్ రోడ్డు, కరీమాబాద్ దసరా రోడ్లలో నల్లా పైపులైన్ల లీకేజీలను అరికట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బల్దియా బాధ్యతాయుతంగా వ్యవహరించి గంతలను పూడ్చివేయాలని, మరిన్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలుగా బారికేడ్లే దిక్కు పట్టించుకోని ఆర్అండ్బీ, బల్దియా ఇంజనీర్లు ప్రమాదాల బారిన వాహనదారులు -
చెరువు పనుల్లో వేగం పెంచండి
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: వరంగల్లోని చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనీఖీ చేశారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, బల్దియా ఈఈ సంతోశ్బాబు, ఎంహెచ్ఓ రాజేశ్, డీఈ ముజమ్మిల్ పాల్గొన్నారు. పనుల్లో నిర్లక్ష్యం తగదు వరంగల్ పోతన సర్కిల్ నుంచి హంటర్ రోడ్డు సర్కిల్ వరకు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న రహదారి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. రోడ్డును పరిశీలించి ఇంజనీర్లకు సూచనలిచ్చారు. మణిద్వీప గార్డెన్ వద్ద కల్వర్టుల నిర్మాణం, పెప్లైన్ ఏర్పాటు పూర్తయినందున మిగిలిన డ్రెయినేజీ నిర్మాణ పనులు త్వరగా ముగించాలన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: జయశంకర్ బడిబాట–2026 కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని మించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటా ప్రచారం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించాలని సూచించారు. ఏఐ ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు పెంపునకు భవిత కేంద్రాలను బలోపేతం చేయాలని, వారికి అందే సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ఇంటర్ పూర్తిచేసిన వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. బడిబాట కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులకు ప్రభుత్వం విదేశీ పర్యటన అవకాశం కల్పించనుందని కలెక్టర్ తెలిపారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను గుర్తించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఈఓ రంగయ్యనాయుడు, డీఐఈఓ శ్రీధర్ సుమన్, విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట
మెదక్ ఎంపీ రఘునందన్రావు న్యూశాయంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కశాశాలలో శనివారం వరంగల్ జిల్లా కార్యకర్తల రెండు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చాకే మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని కొని రైతాంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రం పీఎం కిసాన్, తదితర పథకాల ద్వారా దళారులు లేకుండా ప్రతీ పైసా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఏ చర్చకై నా తాము సిద్ధంగా ఉన్నామని, ఏ చౌరస్తాకై నా వస్తామని సవాల్ విసిరారు. రామగుండంలో యూరియా ప్లాంట్ను పునఃప్రారంభించింది ఎన్డీఏ మోదీ హయాంలోనే అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైన ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యువతకు మోదీతో కనెక్టివిటీ ఉందని, వారు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నాయకులు మల్లాడి తిరుపతిరెడ్డి, రాణీ రుద్రమదేవి, రాణా ప్రతాప్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఎస్హెచ్జీ సభ్యులకు పారిశ్రామిక శిక్షణ
వరంగల్ అర్బన్ : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణ నిర్వహించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ప్రతిరోజూ 120 మంది సభ్యులు పాల్గొననున్నారు. మొదటిరోజు శిక్షణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు, వ్యాపారం నిర్వహణలో మెళకువలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ, వ్యాపార విస్తరణ వంటి అంశాలపై బల్దియా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, మెప్మా ప్రతినిధులు అవగాహన కల్పించారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆమోదిత శిక్షణ భాగస్వామ్య సంస్థకు చెందిన నిపుణుడు మోహన్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సందీప్ కుమార్, శ్రీలత, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ రమేష్, సీఓలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్కు శవయాత్ర.. ప్రకృతికి జీవయాత్ర
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంనుంచి అంబేడ్కర్ కూడలి వరకు ప్లాస్టిక్ బొమ్మకు శవయాత్ర నిర్వహించింది. ప్లాస్టిక్ను నియంత్రించి ప్రకృతికి జీవం పోయాలని ఆ సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ తెలిపారు. – హన్మకొండ/ హన్మకొండ చౌరస్తా -
నేను చేసిన మంచిపని
దుగ్గొండి: నాపేరు దీక్షిత్. నేను దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నాకు మొక్కలు, జంతువులు అంటే ఇష్టం. ఈ వేసవికాలంలో పక్షులు నీరు దొరకక చనిపోతూ ఉంటాయి. అందుకని వాటికోసం నేను ప్రతీ రోజు ఓ బేషన్(ీస్టీల్ బౌల్)లో నీళ్లు పెడుతూ ఉంటాను. కొన్ని తిండి గింజలు వేస్తాను. దాంతో ఆ పక్షులు వచ్చి గింజలు తిని, నీరు తాగి ఉత్సాహంగా ఎగిరిపోతుంటే ఆనందంగా ఉంటుంది. మీరు ప్రకృతిని, పక్షులను కాపాడుతారని ఆశిస్తున్నాను. బేషన్లో పక్షులకు నీరు పెడుతున్న దీక్షిత్ -
పోరాడితేనే వేతన సవరణ
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కోసం పోరాటం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డెపల్లిలోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామిక శక్తి అవార్డు అందుకున్న యూనియన్ వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్య గౌడ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు పి.మాధవ రావు, శ్రీనివాస్, ఎండీ అబ్దుల్ మజీద్, పి.రమేష్, కె.వెంకటేశ్వర్ రావు, తులసీ శ్రీమతి, బి.విజయభాస్కర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. త్వరలోనే బదిలీలు ఉంటాయన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ ఎ.ఆనందం మాట్లాడారు. టీఎస్ ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, డీఈలు మల్లికార్జున్, రాంబాబు, టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, నాయకులు భూపాల్డ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, రవికుమార్ పాల్గొన్నారు. టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా మదన్మోహన్
విద్యారణ్యపురి: వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) ఆర్జేడీగా పి.మదన్మోహన్ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. హైదరాబాద్లోని సమగ్రశిక్షలో జాయింట్ డైరెక్టర్ –1గా విధులు నిర్వర్తిస్తున్న మదన్మోహన్ను ఎఫ్ఏసీ ఆర్జేడిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఉత్తర్వులు జారీచేయడంతో ఇన్చార్జ్ ఆర్జేడీగా ఉన్న రంగయ్యనాయుడు నుంచి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా ఇటీవల హైదరాబాద్లోని విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మిని బదిలీ చేశారు. కానీ ఆమె ధీర్ఘకాలిక సెలవులో ఉన్నందున బాధ్యతలు చేపట్టలేదు. ఇక్కడ ఆర్జేడీగా బాధ్యతలను నిర్వర్తించిన సత్యనారాయణరెడ్డి హైదరాబాద్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే విజయలక్ష్మి సెలవు ముగించుకొని బాధ్యతలు చేపట్టేవరకు మదన్మోహన్ ఆర్జేడీగా కొనసాగుతారని నవీన్నికోలస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎఫ్ఏసీ ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన మదన్మోహన్ను టీఎన్జీఓ ఫోరం స్కూల్ ఎడ్యూకేషన్ సెక్రటరీ ఎండీ ఫక్రుద్దీన్ అహ్మద్, ఉపాధ్యక్షుడు రాయిశెట్టి అశోక్ శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ హనుమకొండ జిల్లా సెక్రటరీ రాజేశ్వర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్య కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని కాశిబుగ్గ పద్మానగర్లో నివాసముంటున్న హెడ్కానిస్టేబుల్ తోరెట్టి రామారావు (54) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1990 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ రామారావు మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో కొంతకాలం పనిచేశారు. ఇటీవల సంగెం పీఎస్కు బదిలీ అయ్యారు. ఈక్రమంలో అనా రోగ్య కారణాలతో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామారావుకు భార్య రజిత, ఇద్దరు కుమారులు వీనిత్రాజ్, సిద్దార్థ్రాజ్ ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు ఇంతెజార్గంజ్ ఎస్సై సందీప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వడదెబ్బతో చిరువ్యాపారి మృతి కమలాపూర్: వడదెబ్బతో బోళ్లు విక్రయించే చిరువ్యాపారి శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తుల వివరా ల ప్రకారం.. మండలంలో ని కానిపర్తికి చెందిన పస్తం వినోద్ (31) గ్రామాల్లో తిరిగి బోళ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే వినోద్ గురువారం వ్యాపారం నిమిత్తం గ్రామాలు తిరుగుతూ వడదెబ్బకు గురయ్యాడు. రాత్రి ఇంటి వద్ద భోజ నం చేసి పడుకుని తెల్లారే సరికి మృతి చెందా డు. వినోద్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. -
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
● పర్యావరణ దినోత్సవ ర్యాలీలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ ఓసిటీ నుంచి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ర్యాలీని శుక్రవారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఽథీమ్ ‘ప్రకృతి నుంచి ప్రేరణ’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ వంటి ఇంధనంపై ఆధారపడకుండా, గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆమె సూచించారు. పూర్వీకులు వాడిన మట్టి కుండలు, మట్టి పాత్రలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రిటైర్డు ఆఫీసర్ పురుషోత్తం, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, జెడ్సీ సీఈఓ రాంరెడ్డి, టి.శ్రవణ్కుమార్, ఎ.సంపత్కుమార్, వి.శ్రీనివాస్, భగవాన్, వెంకన్న, మండల పరశురాములు, రాజగోవింద్, డాక్టర్ సాంబమూర్తి, డాక్టర్ కొణతం కృష్ణ, ఫైజల్ రహమాన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభ
వరంగల్ స్పోర్ట్స్: అమరావతిలోని ఏపీ యూనివర్సిటీ వేదికగా శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో హనుమకొండ చిన్నారులు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–7 బాలుర విభాగంలో అక్షత్ చౌహాన్ లావుడియా, బాలికల విభాగంలో గుండెకారి హయాతి ఓపెన్ కేటగిరీలో క్లాసిక్ విభాగంలో విజేతలుగా నిలిచారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ట్రోఫీతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. విద్యారణ్యపురి: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాకు సంబంధించి తొలిరోజు తెలుగు పరీక్షకు 63 మంది విద్యార్థులకు 50 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. వరంగల్ జిల్లాలో కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 64 మంది విద్యార్థులకు 50 మంది హాజరయ్యారని డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు. న్యూశాయంపేట: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో (స్కిల్ డెవలప్మెంట్) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం అనుభవం ఉన్న భాగస్వామ్య సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల సంస్థలు తమ వివరణాత్మక ప్రతిపాదనలతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఉచిత శిక్షణ కోసం.. తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి అవసరమైన ఐఈఎల్టీఎస్ శిక్షణ ఉచితంగా ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ ఇన్చార్జ్ మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 15లోగా అందించాలని, పూర్తి వివరాల కోసం కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కాశిబుగ్గ: వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్గా జీఎస్కే ధర్మరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేసి, పదోన్నతిపై సూపరింటెండెంట్గా వరంగల్కు వచ్చారు. ఇంతవరకు ఆస్పత్రి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ హరికిషన్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరించారు. కాగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మరాజుకు పలువురు వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మొబైల్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రిక్నగ్నేషన్ అటెండెన్స్) మొబైల్ యాప్ సేవలకు అంతరాయం కలిగిందని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీచేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పనిచేయడం లేదని, ఈనెల 7వతేదీ వరకు మాన్యూవల్గా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ, వివిధ కార్యాలయాల్లోని పలు విభాగాల్లో, కళాశాలల్లో డివైస్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు పనిచేస్తోందని, వారు యథావిధిగా హాజరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి
● సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్కాజీపేట రూరల్ : ప్లాస్టిక్ రహిత సమాజానికి అందరూ కృషి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్ అన్నారు. శుక్రవారం ఆయన కాజీపేట జంక్షన్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ పనులను తనిఖీ చేశారు. అనంతరం ప్రపంచ పర్యావరణ ది నోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే కాలనీలోని ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్లో మొక్కలు నాటారు. కాజీపేట రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంపై ప్లాస్టిక్ వాడరాదు.. మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించాలని శేఖర్ టీం ఆధ్వర్యంలో ప్రదర్శించిన వీధి నాటకాన్ని తిలకించారు. అనంతరం ప్రయాణికులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సికింద్రాబాద్, కాజీపేట రైల్వే అధికారులు హర్షసాయి, ప్రజంల్ కేశర్వాణి, సూర్యనారాయణ, వెంకటకుమార్, డాక్టర్ నరేందర్ హిర్వాని, అగ్గి రవీందర్ పాల్గొన్నారు. కాజీపేట రైల్వే బస్టాండ్ స్థలంపై సమావేశం కాజీపేట రైల్వే జంక్షన్లో బస్టాండ్ నిర్మాణానికి కావాల్సిన స్థలంపై శుక్రవారం డీఆర్ఎం గోపాలకృష్ణన్, హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవానిప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, హనుమకొండ డీఎం ధరమ్సింగ్లు సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలోని రైల్వే స్థలాన్ని ఓకే చేసి ఆర్టీసి బస్టాండ్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. -
అప్పుడే.. బా’గుండె’!
కాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థొరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. నేడు మూతపడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ యూనిట్లో గతంలో ఓపె న్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్రచికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు -
క్రీడాభివృద్ధికి కృషి చేయాలి..
హైదరాబాద్లో హాకీ ఫీల్డ్ గ్రౌండ్స్ మూడుకు పైగా ఉన్నాయి. రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ నగరంలో ఒక్క కోర్టు లేకపోవడం బాధాకరం. ఇటీవల హనుమకొండకు వచ్చిన అంతర్జాతీయ హాకీ కోచ్ మధుకరన్ తన వంతుగా సాయం చేస్తానన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు సైతం హాకీ క్రీడా సదుపాయాల కల్పనకు పాటుపడాలి. – లేగల శివరామ్, సీనియర్ హాకీ క్రీడాకారుడు నేర్చుకోవాలన్న తపన ఉంది..హాకీ క్రీడలో శిక్షణ పొందాలన్న ఆకాంక్ష, పట్టుదల నగరంలో అనేక మంది పిల్లల్లో ఉంది. అయితే అందుకు తగిన సదుపాయాలు లేక నిరుత్సాహంతో వెనుకడుగు వేస్తున్నారు. అత్యాధునిక వసతులు కల్పిస్తే ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. – ములకల సుజిత్, కోచ్, నయీంనగర్ -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబవరంగల్ లీగల్: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కాళోజీ మార్గ్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా కోర్టు ఆవరణలో మొక్క నాటిన అనంతరం ర్యాలీని జెండా ఊపి న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, పచ్చని వాతావరణాన్ని మన భవిష్యత్తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలను కాపాడుకోవడంతోపాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నప్పుడు కాలుష్యాన్ని నిర్మూలించగలమని వివరించారు. కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు డాక్టర్ టి.శ్రీనివాసరావు, నారాయణబాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేశ్, వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాధిక, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా..
హాకీ అంటే ఎంతో ఇష్టం, మేజర్ ధ్యాన్చంద్ స్ఫూర్తితో నాలుగేళ్లుగా నయీంనగర్ హాకీ క్లబ్లో శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది జార్ఖండ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ఆడాను. భవిష్యత్లో మరింత సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం. – టిక్క అరవిందరాజు, గోపాలపురం రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించాం..మూడేళ్లుగా హాకీలో శిక్షణ తీసుకుంటున్నా. జూనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు నుంచి పాల్గొన్నా. ఒక్క టోర్నమెంట్లో జిల్లాకు కాంస్య పతకం రావడం సంతోషం. ఇక్కడ మెరుగైన వసతులు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధిస్తాం. – ప్రతీక్ధావన్, నయీంనగర్ -
టూరిజం స్పాట్గా పోచాపూర్
ఎస్ఎస్తాడ్వాయి: సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న పోచాపూర్ ఊటీని తలపిస్తోందని త్వరలో ఈ అటవీ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోచాపూర్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె మాట్లాడారు. పోచాపూర్ చుట్టూ విస్తరించి ఉన్న అడవులు, కొండలు, ప్రకృతి వైభవాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఊటీని గుర్తు చేసే వాతావరణం పోచాపూర్ చుట్టూ ఉందని పేర్కొన్నారు. అటవీ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా ఎకో–టూరిజం తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఊటీ తరహా ప్రకృతి అందాలతో అలరారుతున్న పోచాపూర్ భవిష్యత్లో రాష్ట్ర పర్యాటక మ్యాప్పై ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క -
నేటినుంచి రోడ్డెక్కనున్న నేతన్నలు
కాశిబుగ్గ: ప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు టెండర్ విధానం రద్దు చేసి, టెస్కో ద్వారా కొనుగోలు చేసేవరకు ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం వరంగల్ కొత్తవాడలో చేనేత పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏకీకృత టెండర్ విధానం రద్దు చేయాలని చేనేత కార్మికులు ఐదు రోజుల నుంచి మగ్గాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారం నుంచి గోపాలస్వామి గుడి సెంటర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు చేస్తామని ప్రకటించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం టెండర్ విధానం ఉపసంహరిచుకోకపోతే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. దీనిపై మూడు నెలల నుంచి రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఇకనైనా ఏకీకృత టెండర్లోంచి చేనేత పరిశ్రమ ద్వారా తయారైన కార్పెట్లు, బెడ్షిట్లు తొలగించి, చేనేత మాతృ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కో మాజీ డైరెక్టర్ దేవులపల్లి సత్యనారాణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, టీపీసీసీ చేనేత విభాగం అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జిల్లా నాయకుడు భీమనాఽథుల సత్యనారాయణ, పలు సంఘాల పర్సన్ ఇన్చార్జులు పంతగాని శ్రీనివాస్, ఝెలగం వెంకటమల్లు, అడిగొప్పుల సంపత్, ఝెలగం చిన్న భద్రయ్య, కొలిపాక మదనయ్య ఎలగం సాంబయ్య పాల్గొన్నారు. టెండర్ విధానం రద్దు చేసేవరకు ఉద్యమాలు కొత్తవాడ చేనేత అవగాహన సదస్సులో వక్తలు -
వడ్రంగి.. నక్క కథ
సైకిల్కూ నంబర్ ఉంది..కాజీపేట: హాయ్ ఫ్రెండ్స్.. నాపేరు టి.హర్ష ఆదిత్య. నేను కాజీపేట నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం రొంపె డుకు వేసవి సెలవులకు వెళ్లాను. అక్కడ మా అమ్మమ్మ నాకు మా అన్నయ్యకు చాలా కథలు చెప్పింది. ఇందులో వడ్రంగి.. నక్క కథ నాకు బాగా నచ్చింది. ‘ఒకప్పుడు ఒక అడవిలో నక్క నివసించేది. ఒక రోజు నక్క వేటకుక్కల గుంపు నుంచి తప్పించుకోవడానికి పరుగెడుతోంది. ఆ సమయంలో ఒక వడ్రంగి చెట్లను కోస్తూ కనిపించాడు. నక్క అతని దగ్గరకు వెళ్లి స్వామీ దయచేసి నన్ను వేటకుక్కల నుంచి రక్షించండని కోరింది. వడ్రంగా తన ఇంటిని చూపించి అక్కడ దాక్కోమన్నాడు. నక్క వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక మూలలో దాక్కుంది. కొంతసేపటికి వేటకుక్కలు అక్కడకు చేరాయి. వాటిని నడిపిస్తున్న వేటగాడు వడ్రంగిని మీరు నక్కను చూశారా.. అని అడిగాడు. వడ్రంగి నోటితో లేదు అని చెప్పాడు. కానీ తన వేలితో ఇంటివైపు సూచించాడు. అయితే వేటగాడు వడ్రంగి సంకేతాన్ని గమనించలేదు. దీంతో వేట కుక్కలతో అడవిలోకి వెళ్లిపోయాడు. వేటగాడు, వేట కుక్కలు వెళ్లిపోయిన తర్వాత నక్క బయటకు వచ్చింది. వడ్రంగి.. నక్కను చూసి నీవు ధన్యవాదాలు చెప్పకుండా వెళ్తున్నావు.. నేను నిన్ను దాచాను కదా అంటాడు. దానికి నక్క సమాధానం ఇస్తూ మీ మాటలు నన్ను రక్షించాయి. కానీ మీ చేతులు నన్ను మోసం చేశాయి. మీరు నిజాయితీగా ఉంటే నేను మీకు ధన్యవాదాలు చేప్పే వాడిని అంటూ అడవిలోకి జారుకుంది. నీతి: మన మాటలు, చర్యలు ఒకేలా ఉండాలి. ఒకటి చెప్పి మరొకటి చేయడం నైతికం కాదుఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు తన తండ్రి మోటార్ బైక్ నంబర్ను ఒక అట్టముక్కపై రాసి తన సైకిల్కు అమర్చుకున్నాడు. బండి, కార్లకే కాదు.. నా సైకిల్కూ నంబర్ ఉందంటూ తెగ మురిసిపోతున్నాడు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన గండి సతీష్ కుమారుడు అద్విత్. – ఇనుగుర్తి -
హాకీ.. వసతులు హుష్కాకి!
వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడకు వరంగల్ మహానగరంలో ఆదరణ కరువైంది. తమ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్న పాలకుల మాటలు ఆచరణలో శూన్యంగానే మిగులుతున్నాయి. హైదరాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లో హాకీ క్రీడా మైదానం లేకపోవడం బాధాకరం. హాకీ నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ అందుకు తగిన కనీస సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు క్రీడను మధ్యలోనే వదిలేయాల్సిన దుస్థితి. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా హనుమకొండలోని నయీంనగర్లో హనుమకొండ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ క్రీడా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వసతులను ఉపయోగించుకుంటూ చిన్నారులకు శిక్షణ అందిస్తున్నారు. ఈనేపథ్యంలో నయీంనగర్ హాకీ క్లబ్పై ప్రత్యేక కథనం. 40 ఏళ్ల చరిత్ర.. సుమారు 40 ఏళ్ల క్రితం స్థానిక హాకీ క్రీడాకారులు ములకల నర్సయ్య, గొడిశాల ఈశ్వరయ్య మొదటిసారిగా నయీంనగర్లో హాకీ ఫీల్డ్ కోర్టుకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన సుమారు అర ఎకరం స్థలంలో ఏర్పాటైన హాకీ ఫీల్డ్ గ్రౌండ్ కొన్నేళ్ల తర్వాత హాకీ క్లబ్గా రూపుదిద్దుకుంది. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటైన నయీంనగర్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రస్తుత వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొనసాగాడు. సుమారు పదేళ్ల క్రితం పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో క్లబ్ అధ్యక్షుడిగా ఉండడం విశేషం. ఎమ్మెల్యే నాగరాజు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు, అంతేకాదు ఆయన హాకీ క్రీడా కోటలోనే పోలీస్ ఉద్యోగం సాధించినట్లు అనేక సందర్భాల్లో తెలిపారు. ఆయన సోదరుడు కృష్ణమూర్తి సైతం హాకీ క్రీడాకారుడు కావడం విశేషం. కనీస వసతులు కరువు? ప్రస్తుతం నయీంనగర్లో గ్రావెల్ కోర్టులోనే క్రీడాకారులు సాధన చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో రాణించాలంటే సుమారు మూడెకరాల స్థలం అవసరం. అందులో ఆస్ట్రో టర్ఫ్ కోర్టు ఏర్పాటుతో పాటు ఆధునిక హాకీ కిట్లు అవసరం ఉంటుంది. అయితే నయీంనగర్ హాకీ క్లబ్లో గ్రావెల్ కోర్టులో కనీస సదుపాయాలు లేకుండా క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో జట్టులో 11 మంది చొప్పున 70 నిమిషాల పాటు కొనసాగే హాకీ మ్యాచ్లో రాణించాలంటే సదుపాయాలు ఆ స్థాయిలో ఉండాల్సిందే. లేదంటే ఎన్నిరోజులు సాధన చేసిన కాలక్షేపమే తప్పితే ఫలితాలు ఉండవు. ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి పలువురు జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నత స్థానాల్లో ఉన్నా పట్టింపు కరువు నయీంనగర్ హాకీ క్లబ్లో హాకీ సందడి ఆడుకోవాలని ఉన్నా సదుపాయాలు కరువు -
భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడుదాం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అడవులు తగ్గడం.. వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరగంతో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీనిని నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు నర్సింహారావు, నాగయ్య, అంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీష్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీధర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణలో రెండుసార్లు బీఆర్ఎస్కు, మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని ఈసారి జరగనున్న అంసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీకి ప్రజలు అధికారం అందిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రామచందర్రా వు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరి పాలనలో ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వా గ్ధానాలను మరిచిపోయిందని ఆరోపించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరు తల్లి పేరుతో మొక్కలు నాటాలన్నారు. ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్, చేవెళ్ల, కామారెడ్డిల డిక్లరేషన్లు ఏమయ్యాయన్నాని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం, మంత్రులు తలో మాటా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా అధ్యక్షుడు వల్లాభూ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్గౌడ్, గడ్డం అశోక్ కుమార్, మదన్లాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రామచంద్రరావు, లింగాల సుధీర్రెడ్డి , శ్యామ్సుందర్శర్మ, గిరిజప మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, ఉపాధ్యక్షుడు కల్యాణ్నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర నాయకులు ఎండ్ల అశోక్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, వెంకన్న, నర్సిహరెడ్డి, సందీప్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు -
అదనంగా రూపాయి కూడా తీసుకురాలే
స్టేషన్ఘన్పూర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూపాయి కూడా అదనపు నిధులు తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు మన కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్లుగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుయే ప్రధాని మోదీకి, బీజేపీ నేతలు ఇష్టం లేదని, మొదటి నుంచి తెలంగాణ అభివృద్ధికి ఆ టంకాలు సృష్టించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. కిషన్రెడ్డి, సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తెలంగాణ ద్రోహి అని సంబోధించడం ఆయన అహంకారానికి నిదర్శమని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య పాల్గొన్నారు. కేంద్ర మంత్రులను నిలదీసిన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశం పొందడానికి ఆసక్తిగల అభ్యర్థులు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్ teluguuniversity.ac.in,www.pstucet.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను 2026 జూన్ 24లోగా సాధారణ రుసుముతో, 2026 జూన్ 30వరకు ఆలస్యరుసుముతో సమర్పించాలన్నారు. వివరాలకు 9989417299, 9989139136, 7989385451 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నేటినుంచి హాస్టళ్లు, మెస్ల రీఓపెన్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పలు హాస్టళ్లు, కామన్మెస్, మహిళా హాస్టల్తోపాటు మెస్, ‘లా’ హాస్టల్తోపాటు మెస్ను ఈనెల 5వతేదీ నుంచి రీఓపెన్ చేయబోతున్నామని హాస్టళ్ల డైరెక్టర్ పి. శ్రీనివాస్ గురువారం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 8నుంచి జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి హాస్టళ్లు, మెస్లను రీఓపెన్ చేస్తున్నామన్నారు. పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఈనెల 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేరోజు నుంచి హాస్టల్, మెస్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. బెటాలియన్ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్లు మామూనూరు : తెలంగాణకు కేటాయించిన 2024 బ్యాచ్కు చెందిన నలుగురు ట్రైనీ ఐపీఎస్లు అయేషా ఫాతిమా, సోహమ్ సునీల్, మనీషా నెహ్రా, రాహుల్ కాంత్ ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం గురువారం మామూనూరులోని టీజీఎస్పీ 4వ బెటాలియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్ల నిర్మాణం, కమాండ్ కంట్రోల్, శిక్షణ, వసతి, సంక్షేమం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల పనితీరు పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ గురించి బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి వివరించారు. అసిస్టెంట్ కమాండెంట్ జె.రాజేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వడదెబ్బతో యువకుడి మృతి కాజీపేట : కాజీపేట మండలం సోమిడికి చెందిన నాగపూరి మురళీధర్ గౌడ్ (35) వడదెబ్బతో మృతి చెందాడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మురళీధర్ గౌడ్ రాత్రి ఇంటికి చేరుకున్న అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్ల వారుజామున మృతి చెందాడు. దేవరుప్పులలో వృద్ధుడు.. పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కొత్త శ్రీనివాస్రెడ్డి(70) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. శ్రీనివాస్రెడ్డి రేకుల ఇంట్లో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పోటెత్తారు..
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో భూమి మార్కెట్ విలువలను శుక్రవారం నుంచి పెంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో గురువారం భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయలకు పోటెత్తారు. వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో గురువారం ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినప్పటికీ సాయంత్రం 6.30 గంటలకు సర్వర్ పని చేయకపోవడంతో నూతన మార్కెట్ విలువలను అనుసంధానం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం 172 స్లాట్లకుగాను 130 స్లాట్స్ బుక్ చేసుకున్నారు. కాగా, సాయంత్రం 6.30 నిమిషాల వరకు కేవలం 109 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. -
ఉమ్మడి రైల్వేల స్టేట్ ట్రైనింగ్ కమిషనర్గా ఏలియా
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్లో సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఎర్ర ఏలియా ఉమ్మడి రైల్వేలు సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్గా ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు సికింద్రాబాద్లో భారత్ స్కౌట్ అండ్ గైట్స్ స్టేట్ సెక్రటరీ శేఖర్బాబు చేతుల మీదుగా నియామకపత్రం స్వీకరించినట్లు ఏలియా గురువారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఏలియా నియామకంపై స్థానిక స్కౌట్ అండ్ గైడ్స్, రైల్వే అధికారులు, నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. -
వాహనాలు అందుబాటులో ఉండాలి
బల్దియా ప్రత్యేకాధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్వరంగల్అర్బన్: పారిశుద్ధ్య సేవలకు ఉపయోగించే వాహనాలు ఎట్టి పరిిస్థితుల్లో నిలిచిపోకుండా.. మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కల్టెకర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వాహనాల నిర్వహణ, మరమ్మతులు, ఇంటింటా చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణపై బల్దియా ప్రత్యేకాధికారి ఇంజనీరింగ్, పారిశుద్ధ్య అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఇంటింటా చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోల మరమ్మతులను నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పడు మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఇంజనీరింగ్ అధికారులు రాజకమలాకర్, ఈఈ మాధవీలత, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’ వేగవంతం చేయండివరంగల్ అర్బన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, బూత్లెవెల్ సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో ఇన్చార్జ్ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు వివిధ డివిజన్లలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిపై బూత్లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లతో ఆమె సమీక్షించారు. సమావేశంలో తహసీల్దార్లు మహ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, డీటీ సుభాన్, సూపర్వై జర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. పంట అవశేషాలు కాల్చడం నిషేధం..హన్మకొండ అర్బన్: జిల్లాలో పంట అవశేషాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు నేల సారవంతం తగ్గడం, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన వల్ల ప్రజారోగ్యానికి, ప్రాణాలకు ముప్పు వాటిల్లితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రైతులు పంట అవశేషాల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
ఫీజుల పేరుతో వేధించొద్దు..
హసన్పర్తి: ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించొద్దని డీఈఓ ఎల్వీ.గిరిరాజ్గౌడ్ అన్నారు. హసన్పర్తి మండలం భీమారంలోని స్కిల్స్ స్టార్క్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలకు చెందిన బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. నోట్బుక్లతో పాటు బూట్లు, సాక్స్, బెల్ట్లు, టైలు, యూనిఫాం వంటి వస్తువులను పాఠశాలల్లో విక్రయించొద్దని, వాటి కొనుగోలుకు మూడు దుకాణాలను సూచించాలని తెలిపారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమకు నచ్చినచోటే వస్తువులను కొనాలన్నారు. సమావేశంలో జిల్లా సీఎంఓ సుమాదేవి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ ఎంఈఓలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నూతనంగా ఈవిద్యాసంవత్సరం 39 ప్రీప్రైమరీ సెక్షన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరగతుల బోధనకు ఇన్స్ట్రక్టర్లను, అదేవిధంగా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒకటి లేదా అంతకన్న ఎక్కువ పాఠశాలలకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఎంపిక ప్రక్రియలో సంబంధిత పాఠశాల ఉన్న గ్రామం, హ్యబిటేషన్కు చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను నిర్దేశిత దరఖాస్తు నమూనాను పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలతోపాటు సంబంధిత పాఠశాల హెచ్ఎంలకు సమర్పించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 8వరకు గడువు ఉందని తెలిపారు. ఇన్స్ట్రక్టర్ల దరఖాస్తులకు ఇంటర్మీడిఝెట్ విద్యార్హత, లేదా ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్ కోర్సును పూర్తి చేసి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రీప్రైమరీ ఆయా పోస్టులకు 7వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం -
నీళ్లు పారే నేలలో నెత్తురు పారించే కుట్ర
● ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ● హోటల్ అశోకాలో కవిసమ్మేళనం హన్మకొండ చౌరస్తా: నీళ్లు పారే తెలంగాణలో నెత్తురు పారించేలా కుట్రలు సాగుతున్నాయని ఎమ్మెల్సీ, తెలంగాణ వికాస సమితి గౌరవ అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని అశోకా కాన్ఫరెన్స్ హాల్ (అనిశెట్టి రజిత ప్రాంగణం)లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు పాతబస్తీ వద్దు.. కానీ, హైటెక్సిటీ, ఓఆర్ఆర్ కావాలి’ అని విమర్శించారు. ఎవరో వచ్చి మీ అయ్య జాగీరా అంటే ఎలా ఉంటుంది? వరంగల్ కోటలో రాళ్లు ఎత్తింది మా తాతలు, ముత్తాతలని అన్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని కోన్ కిస్కాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం అనిశెట్టి రజిత మహిళా రచయితలను ఒకటి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ తన పా టలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో కార్యదర్శి విజయ్, భిక్షపతినాయక్, నాగిల్ల రామశాస్త్రి, కవులు వీఆర్ విద్యార్థి, రామా చంద్రమౌళి, శివకుమార్, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వర్రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో గృహ జ్యోతి పథకానికి 26,17,502 మంది నమోదు చేసుకోగా.. 24,63,206 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. 1,70,438 మంది 200కుపైగా యూనిట్లు వినియోగించడంతో జీరో బిల్లులు జారీ కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేనెలలో గృహజ్యోతి లబ్ధిదారులు 5,95,805 ఉండగా విద్యుత్ వినియోగం పెరగడంతో 5,42,026 జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇక్కడ 53,779 సర్వీస్లకు జీరో బిల్లులు జారీ కాలేదు. 200 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారులు బిల్లులు చెల్చించాల్సి వచ్చింది. కాగా, గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్ల పరి మితిలో విద్యుత్ను వినియోగించి వాడకాన్ని నియంత్రిస్తేనే జీరో బిల్లు ప్రయోజనం పొందవచ్చని సూచి స్తున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడితే తిరిగి జీరో బిల్లులు జారీ అవుతాయని అధికారులు సూచిస్తున్నారు. మేలో జిల్లాల వారీగా వివరాలు.. పెరిగిన విద్యుత్ వినియోగం.. తగ్గిన జీరో బిల్లులు హన్మకొండ: భారీ ఉష్ణోగ్రతల కారణంగా గృహాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. మండుతున్న ఎండలకు వడగాలులు, ఉక్క పోత నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు, ఏసీల వినియోగం మునుపెన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. ఈవేసవిలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటడంతో భరించలేని వేడి పెరిగింది. ఫ్యాన్లు వాడినప్పటికీ వేడి తగ్గకపోవడంతో కూలర్లు, ఏసీలు వినియోగించారు. విద్యుత్ వినియోగం పెరగడంతో మీటర్లు గిర్రున తిరిగాయి. యూనిట్లపై యూనిట్లు నమోదయ్యాయి. ప్రతీ నెల 200 యూనిట్లలోపు నమోదయ్యే యూనిట్లు ఆపైన రికార్డు అయ్యాయి. దీంతో జీరో బిల్లులు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఉచిత విద్యుత్ బిల్లులో భాగంగా.. 200 యూనిట్లలోపు నమోదయ్యే సర్వీస్లకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ ఉపకరణాలైన కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో 200 యూనిట్లు దాటడంతో జీరో బిల్లులు తగ్గాయి. 46,16542,83697,66092,6261,39,3561,20,8801,14,187 1,06,99660,61656,0971,37,8211,22,591మహబూబాబాద్వరంగల్ములుగుభూపాలపల్లిహనుమకొండజనగామగృహజ్యోతి వినియోగదారులుజారీ అయిన జీరో బిల్లులు -
సన్నాలు సాగు చేయండి
హసన్పర్తి: అధిక దిగుబడి, మంచి మార్కెట్ ధర పొందేందుకు సన్నరకాలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్చంద్ర సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం అన్నాసాగరం, సీతంపేటలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్చంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులకు సూచనలిచ్చారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు మేక రమ్య, రామంచ వెన్నెల, ఉపసర్పంచ్ బండారు సాగర్, ఏఓ అనురాధ, హెచ్ఓ సుష్మిత, ఏఈఓ ప్రవళిక, సాయి, పంచాయతీ కార్యదర్శులు అనూష, సరితతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
డెయిరీ పనులు వేగవంతం చేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మరింత వేగంగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, డీఆర్డీఓలు మేన శ్రీను, నాగ పద్మజతో పాటు సంబంధిత శాఖల అధికారులతో డెయిరీ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఏడీడీబీ) అధికారులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. పరకాల మహిళా డెయిరీ పరిధి హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆరు మండలాలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి అవసరమైన చర్యలను అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సమీక్షలో సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారులు రాధాకిషన్, బాలకృష్ణ, అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంలు సరిత, వరలక్ష్మి, మెప్మా కో–ఆర్డినేటర్లు రజిత రాణి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణంపై ఆ‘మంచి’ కుంచె
సూర్యుడే దుఃఖ పడుతున్నాడు.. సూర్యుడు తన చేతిలో విసనకర్రతో అత్యధిక వేడిమిని భరించలేక తనకు తానే విసురుకుంటున్నాడు. చెట్ల నరకడం వల్ల భూమి వేడెక్కి ఓజోన్ పొర దెబ్బతిని సూర్యుని వేడి నేరుగా భూమిని తాకుతుంది. సూర్యుడు నవ్వాలంటే మొక్కలను పెంచాలని చెప్పడానికి ఈ చిత్రం గీశాడు. నేడు వర్సెస్ రేపు.. అభివృద్ధి పేరుతో అడవులు నరకబడుతున్నాయి. దీంతో రేపు ఆక్సిజన్ కోసం మొక్కను మోయాల్సి వస్తుంది. నేడు ఉచితంగా లభించే ఆక్సిజన్ను రేపు కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పడానికి ఈ చిత్రం గీశాడు. భూమాత.. చెట్లు, నదులు, జంతువులు, పక్షులతో నిండి ఆరోగ్యంగా ఉంది. ఆమె చేతిలో ఆకులు, పూలు, వేర్లతో చేసిన విల్లు ఉంది. రాక్షసుడి రూపంలో ఉన్న కాలుష్యం విల్లు దెబ్బకు పారిపోతుందని తెలిసేలా ఈ చిత్రం గీశాడు. దుగ్గొండి: ఆధునిక పోకడలు శరవేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో అభివృద్ధి పేరుతో చెట్లు అంతరించి పోతున్నాయి. వాహనాలు, పరిశ్రమల పొగతో కాలుష్యం పెరిగిపోతోంది. కార్బన్డైయాకై ్సడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గిపోతోంది. సూర్యుడి తాపం పెరిగి సరిగా వర్షాలు కురువని పరిస్థితి నెలకొంటోంది. దీంతో భవిష్యత్ తరం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై వరంగల్ జిల్లా దుగ్గొండి మండల ప్రశాంతి మండల సమాఖ్య కార్యాలయంలో కమ్యూనిటీ సర్వేయర్ ఆమంచ రవి పలు కార్టూన్లు గీసి అవగాహన కల్పిస్తున్నాడు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్య వంతం చేసేందుకు రవి గీసిన చిత్రాలు ఇలా ఉన్నాయి. నరికితే నష్టం.. నాటితే లాభం. నేడు చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల రేపు ఆక్సిజన్ సిలిండర్ను వీపున మోస్తూ మాస్కు పెట్టుకుని భవిష్యత్ వైపు చూడాల్సి వస్తుంది. దీనిని వర్ణిస్తూ ఈ చిత్రం గీశాడు. ప్రకృతి పరిక్షణకు వినూత్న కార్టూన్లు గీసి అవగాహన కల్పిస్తున్న రవి ప్రశంసిస్తున్న పర్యావరణవేత్తలు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం -
పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం
జనగామ: తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఓ పసికందుకు వైద్యులే అమ్మానాన్నలుగా మారి 72 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన మానవీయ ఘటన జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు గురువారం శిశుగృహకు అప్పగించారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. లింగాలఘనపురం మండలం (ఏపీ వసల కూలీలు) కళ్లెం గ్రామానికి చెందిన తిక్కవరపు పద్మ, నరేశ్ దంపతులు ఇటుక బట్టీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23న పద్మ ఐదో సంతానంగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. కేవలం 1.24 కిలోల బరువు, చిన్న ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఎస్ఎసీయూలో ఇన్నాళ్లు చికిత్స అందించారు. అయితే ఆడపిల్ల కావడం, అత్యల్ప బరువుతో జన్మించడం వంటి కారణాలతో డెలివరీ జరిగిన వారం రోజులకే తల్లిదండ్రులు పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం ఆధ్వర్యంలో, డిప్యూటీ సూపరింటెండెంట్ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆ చిన్నారికి అండగా నిలిచారు. పాపకు ‘అనామిక’ అని పేరు పెట్టి నెల బర్త్డే వేడుకలతోపాటు మినీ బారసాల కార్యక్రమం కూడా నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా మారడంతో డాక్టర్ మధుసూధన్రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో గురువారం హనుమకొండ శిశు గృహకుప్రత్యేక వాహనంలో తరలించారు.వీడ్కోలు సమయంలో అక్కడున్న ప్రతీ ఒక్కరు భావోద్వేగానికి గుర య్యారు. 72 రోజులుగా తమ చేతుల్లో పెరిగిన చిన్నారిని పంపించే సమయంలో వైద్యులు, సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. పేగుబంధం లేకపోయినా ప్రేమతో పెంచిన అనామికకు వీడ్కోలు పలుకుతూ వారు చూపిన ఆప్యాయత అందరినీ కదిలించింది. కన్నవారు వదిలేసినా.. 72 రోజుల ‘వైద్య’అనుబంధం పూర్తి ఆరోగ్యవంతురాలు కావడంతో హనుమకొండ శిశు గృహకు తరలింపు -
‘అడ్వాన్స్’గా భోంచేశారు!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల మెస్ల నిర్వహణలో నిధులను ముందస్తు చెల్లింపుల పేరిట భోంచేసినట్లు తెలుస్తోంది. గత డైరెక్టర్ హయాంలో అడ్వాన్స్ల రూపంలో రూ.30లక్షలకు పైగానే చెల్లించినట్లు విచారణ కమిటీ గుర్తించింది. దీనిపై గత హాస్టళ్ల డైరెక్టర్తోపాటు మరికొందరికి రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కామన్మెస్లో గత ఏడాదిలో ఒక్కసారిగా బిల్లులు పెరిగిపోవడంతో విద్యార్థులకు అనుమానం వచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 29న ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్ చైర్మన్గా విచారణ కమిటీని వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రార్ రామచంద్రం వేశారు. పది నెలలకు సంబంధించిన మెస్బిల్లులను పరిశీలించాలని ఆదేశించగా ఆ కమిటీ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి విచారణ జరిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు వివిధ బిల్లుల పరిశీలనకు మరో విచారణ కమిటీని గత మార్చి 4న నియమించారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ చైర్మన్గా ఉన్న ఈ కమిటీ.. నిధుల వినియోగంలో ఏమేమి అవకతవకలు జరిగాయి, బాధ్యులెవరు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో పూర్తి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ రామచంద్రం ఆదేశించారు. ఇష్టారాజ్యంగా అడ్వాన్స్లు కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో గత డైరెక్టర్ హయాంలో హాస్టళ్ల, మెస్లకు కలిపి 20మందికిపైగా జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. వీరికి అడ్వాన్స్ల రూపంలో డబ్బులు చెల్లించారు. మరో నలుగురు కేర్టేకర్లకు కూడా అడ్వాన్స్లు చెల్లించారు. ఈ అడ్వాన్స్లు హాస్టళ్ల, మెస్ల నిర్వహణ కోసమని ఇచ్చారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లకు రూ.50వేల నుంచి రూ.2లక్షలకుపైగా అడ్వాన్స్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఒక్కో జాయింట్ డైరెక్టర్కు ఎంతెంత అడ్వాన్స్ల రూపంలో చెల్లించారనేది విచారణ కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఇలా మొత్తం రూ.30లక్షలకు పైగానే చెల్లించినట్లు విచారణ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అడ్వాన్స్లు తీసుకొని వ్యయం చేసినట్లు సెటిల్మెంట్లు చేయడంలో ఎక్కువ శాతం మంది జాయింట్ డైరెక్టర్లు, నలుగురు కేర్టేకర్లు జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు సమర్పించిన సెటిల్మెంట్ల బిల్లులు సరిగా లేవనే అరోపణలున్నాయి. ఏ అవసరం ఉందో వాటికి అడ్వాన్స్ల రూపంలో డబ్బులు చెల్లించాక జాయింట్ డైరెక్టర్లు/ కేర్టేకర్లు ఆయా డబ్బులను ఖర్చు చేసి బిల్లులు సమర్పించాకే మరో అడ్వాన్స్ ఇవ్వాల్సింటుంది కానీ, అడ్వాన్స్ సెటిల్చేయకున్నా కొత్తగా అడ్వాన్స్లు ఇచ్చుకుంటూ పోవడంలో ఆంతర్యమేమిటి అనేది చర్చగా ఉంది. హాస్టళ్ల డైరెక్టర్ నుంచి వివరాల సేకరణ ప్రొఫెసర్ మనోహర్ విచారణ కమిటీ గత హాస్టళ్ల డైరెక్టర్ను పిలిపించి విచారణ జరిపింది. కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆ డైరెక్టర్ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లు, కేర్ టేకర్లకు అడ్వాన్స్లు ఇచ్చిన విషయంతోపాటు అదనపు కార్మికుల అనుచిత వినియోగం, మరికొన్ని అంశాలను అడిగినట్లు తెలిసింది. విచారణ కమిటీ మే 11న కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రానికి నివేదిక అందజేసింది. హాస్టళ్ల, మెస్ల నిర్వహణ, అడ్వాన్స్లపై నియంత్రణ లేకపోవడం, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నివేదికను వీసీ, రిజిస్ట్రార్ పరిశీలించారు. దీంతో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. 18మందికి షోకాజ్ నోటీసుల జారీ కాకతీయ యూనివర్సిటీలోని గత హాస్టళ్ల డైరెక్టర్, ప్రస్తుత హాస్టళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్, 12మంది హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్లు, నలుగురు కేర్టేకర్లకు రిజిస్ట్రార్ రామచంద్రం ఈ నెల 2న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లు / కేర్టేకర్లు అడ్వాన్స్లుగా తీసుకున్న నిధుల వినియోగంలో సరైన లెక్కలు చూపడంలో విఫలమైనందున, ఆర్థిక ధ్రువీకరణ విధానాలను ఉల్లంఘించినందుకు మీపైన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా ఏడు పనిదినాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నిర్దిష్ట గడువులోపు వివరణ ఇవ్వకపోతే ఆరోపణలు అంగీకరించినట్లుగా పరిగణించి తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గత డైరెక్టర్, ప్రస్తుత హాస్టళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్ కూడా ఏడు పనిదినాల్లో వివరణ సమర్పించాల్సి ఉంటుంది. కేయూ హాస్టళ్ల మెస్ల నిర్వహణలో అవకతవకలు ఇష్టారాజ్యంగా ముందస్తు చెల్లింపులు రెండు విచారణ కమిటీల నివేదికలు అందజేత హాస్టళ్ల గత డైరెక్టర్తో సహా 18మందికి షోకాజ్ నోటీసుల జారీ -
యువిన్ పోర్టల్లో నమోదు తప్పనిసరి
రామన్నపేట : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణుల నమోదు, ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎ.అప్పయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని బర్త్ డెలివరీ పాయింట్ ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యువిన్, హెచ్ఎంఐఎస్ ఆన్లైన్ పోర్టల్లో రిపోర్టుల నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలు నమోదు చేయడం ద్వారా వారిని ఫాలోఅప్ సేవలు, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చిన వివరాలతో పాటు ఇంకా మిగిలిన టీకాల, అలాగే వివిధ కార్యక్రమాల ప్లానింగ్ కోసం ఈ డేటా ఉపయోగపడుతుందన్నారు. యువిన్ కోఆర్డినేటర్ జ్యోత్స్న, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ల మేనేజర్ శిరీష, డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ ప్రవీణ్ ఆన్లైన్ పోర్టల్ సంబంధించిన వివరాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జ్ఞానేశ్వర్, మాతాశిశు సంక్షేమం ప్రో గ్రాం అధికారి రుబీనా అఫ్రోజ్, ప్రసన్నకుమార్, అశోక్ రెడ్డి, స్వప్న మాధురి పాల్గొన్నారు. అమృత్ భారత్ పనుల తనిఖీ కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే జంక్షన్లో చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పునరాభివృద్ధి పనులను సికింద్రాబాద్ సెంట్రల్ డివిజనల్ ఇంజనీర్ (డీఈఎన్) ప్రంజల్ కేశర్వాణి బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ ఎదుట గల సర్క్యులేటింగ్ ఏరియాలో పనులు తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కాజీపేట రైల్వే వర్క్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసులు, సూపర్వైజర్ పి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాశిబుగ్గ : వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలి టీ ఆస్పత్రి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ సనత్ రోషన్ సంకు ఇండియన్ ఐకానిక్ విజ నరీ డాక్టర్–2026 అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లో ప్రైడ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా వైద్యరంగంలో డాక్టర్ సనత్ రోషన్ అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ప్రముఖ సినీనటి హెబ్బా పటేల్ ఈ అవార్డును అందజేశారు. రేపటినుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు విద్యారణ్యపురి : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వతేదీ నుంచి 12వ తేదీవరకు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో ఫెయిల్ అయిన 197 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ బుధవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హై స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ను నియమించారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని, అనంతరం పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని వివరించారు. హాల్టికెట్లు అధికారిక వెబ్సైట్ బీఎస్ఈ తెలంగాణ.గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఆర్టీఓగా రంగారావు బాధ్యతల స్వీకరణ
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా పి.రంగారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులను బదిలీ చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా పెద్దపల్లి ఆర్టీఓగా విధులు నిర్వర్తిస్తున్న రంగారావు వరంగల్ జిల్లా ఆర్టీఓగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనచోదకులకు మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎంవీఐ జె. శ్రీనివాస్, ఏఓ జి. సుభాషిణీ, సీనియర్ అసిస్టెంట్ సీహెచ్.నవీన్, ఏఎంవీఐలు ఎం.శంకర్, ఎస్.నిహారిక బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీఓ రంగారావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ కల్చరల్ : వరంగల్ జోన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్గా డి.కృష్ణప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ధార్మిక భవన్లోని వరంగల్ జోన్ దేవాదాయశాఖ ఉపకమిషనర్ కార్యాలయం ఇన్చార్జ్ డీసీ రామల సునీత నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. వరంగల్ జోన్లోని 19 జిల్లాల్లో ఉన్న దేవాలయాల పర్యవేక్షణ, అర్చక ఉద్యోగుల సమస్యలు, కార్యాలయ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం డీసీగా బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు బండారు శేషగిరిరావు, టక్కరసు సత్యం, తనుగుల రత్నాకర్, సూపరింటెండెంట్లు, వివిధ దేవాలయాల సిబ్బంది పాల్గొన్నారు. -
మధ్యవర్తులను మందలించండి
వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ హసన్పర్తి : భూ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించే వారిని మందలించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ నర్సింహారావు, పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సీపీకి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్, క్రీడా మైదానాన్ని సీపీ పరిశీలించారు. రౌడీషీటర్లు, అనుమానితుల రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిధిలో యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. తగదాల్లో సెటిల్మెంట్లు చేసే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రౌడీషీటర్లపై సానుభూతి ప్రదర్శించొద్దన్నారు. విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సై నవీన్, కళ్యాణ్ కుమార్, రాజమౌళి, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం
కాశిబుగ్గ : ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ ఎంజీఎంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్పర్సన్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్, వైద్య పరికరాలు, నర్సింగ్ పాఠశాల, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులు, అత్యవసర విభాగంలో రద్దీ, ఆధునిక వైద్య పరికరాలు, పెండింగ్ బిల్లులు, పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి నిర్వహణ సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న నర్సింగ్ స్కూల్ భవనం, పరికరాల మరమ్మతులు, సిబ్బంది భర్తీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆస్పత్రి అభివృద్ధికి తమ నిధులనుంచి రూ.50లక్షలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ అశ్విన్కుమార్,జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, డాక్టర్ అనిల్ బాలరాజు, డాక్టర్ రామ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు వనపర్తి శ్రీనివాస్, కన్నోజు లావణ్య, రాజ్కమల్, లత, పాల్గొన్నారు. కాగా ఈ అభివృద్ధ్ది కమిటీ సమావేశం 2018 సంవత్సరంలో జరగగా మళ్లీ 8 ఏళ్ల తర్వాత బుధవారం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఎంసీ కేర్ సెంటర్ను మంత్రి సురేఖ సందర్శించి, రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు నెలల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిద్ధం : మంత్రి కొండా సురేఖ వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నాలుగైదు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం ఆమె ఎంజీఎంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎంజీఎంలో రోగులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి మార్చిన తర్వాత ఇందులోనే కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలను ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీ గడువు ముగిసిందని, వేరే ఏజెన్సీని నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే సస్పెండ్ చేయాలని, ప్రజలు ఇలాంటివారి గురించి కలెక్టర్, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉంటే రాతపూర్వకంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బాక్స్లో వేయాలని పేర్కొన్నారు. వీరిని గుర్తించడానికి ప్రత్యేకంగా ఓ సూపర్వైజర్ను నియమించాలని ఆదేశించారు. అలుమిని డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి విరాళాలు పోగుచేసి ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. ఎంజీఎం అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ -
రైతు సంక్షేమమే పాలకవర్గ ధ్యేయం
ఖిలా వరంగల్: మార్కెట్ అభివృద్ధితోపాటు రైతు సంక్షేమమే పాలకవర్గ ధ్యేయమని, రైతులకు మెరుగైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు 18 మందితో కూడిన పాలక వర్గాన్ని మంగళవారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది. చైర్పర్సన్గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్గా బండి జనార్దన్, సభ్యులుగా గాదరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్ల వాసుదేవ రెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహ నాయక్, ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్ కుమార్, కత్తి సంపత్, మహమ్మద్ సాబీరా, అచ్చ నాగరాజు, దుగ్యాల గోపాల్ రావు, గజ్జెల శ్యామ్ సుందర్, హసన్పర్తి పీఏసీఎస్ చైర్మన్, డిస్ట్రిక్ మార్కెటింగ్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్, బల్దియా మేయర్తో కలిపి 18 మందితో నూతన పాలక వర్గం ఏర్పడింది. ఈ మేరకు వరంగల్ మార్కెట్ పరిపాలన భవనంలో బుధవారం చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్ బండి జనార్దన్, డైరెక్టర్లు గజ్జెల శ్యామ్ సుందర్, దుగ్యాల గోపాల్రావు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గాన్ని మార్కెట్ అధికారులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ప్రియాంక -
జల్సాలకు అలవాటు పడి చోరీలు
శాయంపేట: జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు కల్లాలనుంచి ధాన్యం బస్తాల దొంగతనాలకు పాల్పడ్డారు. 8మందితో కూడిన దొంగల ముఠాను శాయంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీష్ బాబు బుధవారం వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ఓ యువతి, ముగ్గురు బాలురుతోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఏసీపీ సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జీడి రాహుల్, కోడెపాక హేమంత్ కుమార్, ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ఓ యువతి, మరో ముగ్గురు మైనర్ బాలురు కలిసి ఐనవోలు, కమలాపూర్, దామెర, హసన్పర్తి, శాయంపేట మండలాల పరిధిలోని వడ్ల కల్లాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 242 ధాన్యం బస్తాలు (135.86 క్వింటాళ్లు) దొంగిలించారు. వాటి విలువ సుమారు రూ.3.26లక్షల ఉంటుందని ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. నిందితులు సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని, స్నేహితుడి వద్ద తీసుకున్న మరో కారులో కల్లాలనుంచి వడ్ల బస్తాలను తరలించిన అనంతరం ట్రాలీలు, డీసీఎంలో లోడ్ చేసి గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామ శివారులోని గణేష్ రైస్మిల్లుకు విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులను జల్సాలకు వినియోగించుకుని మిగిలిన మొత్తాన్ని పంచుకున్నట్లు గుర్తించామని తెలిపారు. మరో చోరీకి ప్రణాళిక రచించి మండలంలోని వసంతాపూర్ గ్రామ పరిసరాల్లో రెక్కీ చేస్తున్న సమయంలో కొప్పుల బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై జక్కుల పరమేష్, సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారిపై కేసు నమోదు చేసి రూ.3,05,200 నగదు, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జక్కుల పరమేష్తో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. యువత వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు. సెల్ఫోన్లలో ఏం చూస్తున్నారో గమనిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు. ధాన్యం బస్తాల దొంగల ముఠా అరెస్ట్ నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు, ఓ యువతి నిందితులను రిమాండ్కు తరలింపు -
నేను గీసిన బొమ్మ
హైదరాబాద్ అద్భుతంగా ఉంది మండలంలోని పాతదుబ్బతండాకు చెందిన భార్గవి, పూజ, రేవంత్ డోర్నకల్ సెయింట్ ఆగ్నేస్ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల సందర్భంగా ఇటీవల హైదరాబాద్లోని చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్బండ్, లుంబినీ పార్క్, అంబేడ్కర్ విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. –డోర్నకల్ పట్టుకుంటే ఔట్.. ఒకప్పుడు నలుగురు బాలబాలికలు కలిస్తే చాలు కుంటుడు ఆట ఆడేవారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆటను పూర్తిగా మరిచిపోయారు. కానీ ప్రస్తుత కాలంలో కొందరు గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులు తమ పిల్లలకు నాటి ఆటలు నేర్పిస్తుండడం విశేషం. ఒక కాలును పైకి లేపి ప ట్టుకుని మరో కాలుతో కుంటుతూ మిగతా పిల్ల లను పట్టుకోవడాన్ని ఔట్గా పిలుస్తారు. కుంటుకుంటూ వచ్చే వ్యక్తిని తప్పించుకోవడం ఈ ఆటలో ప్రధానం. –కాజీపేట -
భూసేకరణపై రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: ఎన్హెచ్–163 (జి) భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన గీసుకొండ మండలం మచ్చాపూర్ రైతులతో బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల అభ్యంతరాలు, పరిహారం తదితరల అంశాలపై కలెక్టర్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక సాధికారతకు
మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్కాజీపేట అర్బన్ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ను అందజేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని దుర్గాబాయి శిశు మహిళా ప్రాంగణంలో డీఆర్డీఏ, సెర్ఫ్ సంయుక్తంగా రూ. 1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ నిర్మాణానికి బుధవారం ఎంపీ కడియం కావ్య.. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ మేన శ్రీనుతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించే తొలి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలు ఆదాయ వనరుల విస్తరణకు పెట్రోల్ బంక్ దోహదపడుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఐనవోలు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మహిళా సభ్యులకు రూ.51 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేణ శ్రీను, బీపీసీఎల్ ఎండీ సుధీర్, ఐకేపీ రీజినల్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
బిలాస్పూర్– యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా బిలాస్పూర్– యెలహంక మధ్య అప్ అండ్ డౌన్లో 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. ఈ నెల 3 నుంచి జూలై 1వ తేదీ వరకు 5 సర్వీ స్లుగా బిలాస్పూర్–యెలహంక (08261) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్ చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా ఈ నెల 4 నుంచి జూలై 2వ తేదీ వరకు 5 సర్వీ స్లుగా యెలహంక –బిలాస్పూర్ 908262) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు భాతప్రా, రాయ్పూర్, దుర్గ్, రంజన్గాం, డోంగ్రఘర్, గొండియా, వడ్సా, చాదాపోర్టు, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, మంచిర్యాల, కాజీ పేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికా రాబాద్, తాండూర్, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. మాదిగ హక్కుల దండోరా నియోజకవర్గ ఇన్చార్జుల నియామకంహన్మకొండ చౌరస్తా: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్డీ) ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణలు తెలిపారు. ఈ మేరకు ఆయా ఇన్చార్జులకు నియామకపత్రాలు అందజేశారు. రాము – పరకాల, వక్కల ప్రభాకర్ – స్టేషన్ ఘన్పూర్, కొమిరె యాకాస్వామి – డోర్నకల్, రాజు – వరంగల్ పశ్చిమ, గనిపాక మహేందర్ – జనగామ, మాచర్ల ప్రభాకర్ – పాలకుర్తి, కొట్టెపాక శ్రీనివాస్ – ములుగు, సదానందం –వరంగల్ తూర్పు, మేకల ఓంకార్ – భూపాలపల్లి ఇన్చార్జులుగా నియమితులైనట్లు వివరించారు. మాదిగ సమాజ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు సునీల్ మాదిగ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో ల్యాబ్టెక్నీషియన్ మృతి
పరకాల: దోస్తులు ఫోన్ చేశారు..అర గంటలో మళ్లీ వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డుపై తీవ్రగాయాలతో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పరకాల పట్టణంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండల చర్లపల్లి గ్రామానికి చెందిన ఎం.డీ షర్పోద్దీన్(38), హాజీరాబేగం దంపతులు పరకాలలో అద్దెకుంటున్నారు. హాజీరాబేగం చిట్యాల మండలం కై లాసపురం గ్రామకార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా మృతుడు షర్పోద్దీన్ హనుమకొండలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8.30 గంటలకు దోస్తులు ఫోన్ చేశారు.. కొద్ది సమయంబయటకు వెళ్లొస్తానంటూ వెళ్లిన షర్పోద్దీన్ గంట వరకు కూడా ఇంటికి రాకపోవడం.. పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో భార్య ఆందోళనకు గురైంది. అనంతరం షర్పోద్దిన్ తండ్రి కూడా తన బంధువుతో ఫోన్ చేయించగా రాత్రి 9.30 గంటకు లిఫ్ట్ చేశాడు. కొంత తడిబడుతూ మాట్లాడిన షర్పోద్దీన్ కొద్ది గంటల్లోనే రోడ్డు పక్కన తీవ్రగాయాలతో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఘటనాస్థలికి కొద్ది దూరంలోనే షర్పోద్దీన్తోపాటు మరికొందరు మద్యం సేవించినట్లు.. అక్కడే రక్తపు మరకలు ఉండడంతో మృతుడి సోదరుడు రజాక్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు. పరకాలలో ఘటన -
ఎన్సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ
రామన్నపేట : ఎన్సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందుతాయని పదో తెలంగాణ బెటాలియన్ అడ్మినిస్ట్రేవ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే అన్నారు. బుధవారం నగరంలోని ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో వరంగల్ పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్సీసీ –2026 ‘ బి సర్టిఫికెట్’ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్ ఎన్సీసీ కేడెట్లకు బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ఎస్ రామదురై పర్యవేక్షణలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్సీసీ రెండు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి పాసై ‘ బి ’ సర్టిఫికెట్ పొందిన కేడెట్లకు ఆర్మీలో ప్రవేశించడానికి రాజమార్గమని తెలిపారు. కాగా, 355 మంది కేడెట్లు ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్లు పొందినట్లు ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ డీఎహెచ్రావు తెలిపారు. కెప్టెన్ ముండ్రాతి సదానందం, నాయబ్ సుబేదారి అనిల్ జాదవ్, బెటాలియన్ హవల్దార్ మేజర్ బెటా గేరికరూ సందీప్, లెఫ్టినెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, ట్రైనింగ్ విభాగం ఇన్చార్జ్ కుమారస్వామి, హవల్దార్లు విష్ణు, నిషాద్, నిక్లేష్, రాజేందర్, ఈశ్వర్ పాల్గొన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే -
మా పోరాటం లంబాడీలపై కాదు.. పాలకులపై
కొత్తగూడ: ఆదివాసీల పోరాటం లంబాడీలపై కాదని వారిని చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన పాలకులపై అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోరు కేక బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహారాష్ట్రలో బీసీలు, ఛత్తీస్గఢ్లో ఎస్సీలుగా ఉన్న లంబాడీలను ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఓ జీఓ ద్వారా ఎస్టీ జాబితాలో కలిపారని ఆరోపించారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోకి వలసలు పెరిగాయన్నారు. దీంతో ఆదివాసీలు విద్య, ఉద్యోగం, రాజకీయ, వనరుల దోపిడీకి గురవుతున్నారన్నారు. దీనిపై జూన్ 30 లోగా ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తుడుందెబ్బ స్వయంగా చట్టాల అమలుకు పూనుకుంటుందని హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి నీరు, ఇసుక మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. వాటిని దిగ్భందించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. రిజర్వేషన్ సమస్య పరిష్కారానికి జ్యుడీషియల్ కమిషన్ నియమించి ఏజెన్సీ గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులపై సుమోటోగా కేసు నమోదు చేసి ఆదివాసీ సమాజాన్ని కాపాడాలని కోరారు. సభలో నాయకులు చుంచు రామకృష్ణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ఈసం సుధాకర్, కల్తి వీరస్వామి, కుర్సం సీతారాం, దాట్ల నాగేశ్వరరావు, పొడెం బాబు, నిమ్మక సింహసనం, వంశీకృష్ణ, గోప వీరయ్య, సువర్నపాక పాపారావు, వట్టం సాయిలు, సుంచ సారయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసుల దిగ్బంధంలో కొత్తగూడ.. తుడుందెబ్బ పోరు కేక బహిరంగ సభను అడ్డుకుంటామని లంబాడీ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో పోలీసులు కొత్తగూడ మండల కేంద్రాన్ని దిగ్బంధించారు. ముందస్తుగా వర్తక, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. బహిరంగ సభ స్థలంలోకి ఇతరులు రాకుండా తనిఖీలు చేపట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో భద్రతాఏర్పాట్లు చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి తుడుందెబ్బ పోరు కేక సభలో వక్తల డిమాండ్ -
సర్వీస్ రికార్డే కీలకం..!?
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్సై స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్సైలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ తదితర లూప్లైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికారులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. లూప్లైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూప్లైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. పోలీస్ శాఖలో కొత్త ఫార్ములా.. పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్ వర్గాల్లో కలకలం -
కేయూలో ఈ–ఆఫీస్ విధానం అమలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈ– ఆఫీస్ విధానం అమలుకు ఉపక్రమించారు. యూ నివర్సిటీలోని వివిధ విభాగాల నుంచి వైస్ చాన్స్లర్ కార్యాలయం వరకు అన్ని ఫైళ్లు, పత్రాలు పరిపాలన వ్యవహారాలను ఈ–ఆఫీస్ద్వారా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం బుధవారం వెల్లడించారు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరిపాలనాభవనం టీచింగ్, నాన్టీ చింగ్విభాగ నుంచి ఒక ఫైల్ను ఈ –ఆఫీ స్ విధానం ద్వారా పరిశీలించి వీసీ ప్రతాప్రెడ్డి ప్రా రంభించి ఆమోదించారు. డిప్యూటీ రిజిస్ట్రార్, విశ్వవిద్యాలయం ఈ –ఆఫీస్ నోడల్ ఆఫీసర్గా పంజా ల శ్రీధర్ ఈ విధానంలో ఫైళ్ల కదలిక, వివిధ దశల కు సంబంధించిన అంశాలను వీసీ,రిజిస్ట్రార్లకు తె లిపారు. ఈ –ఆఫీస్ విధానాన్ని క్రమక్రమంగా అన్ని విభాగాలకు విస్తరించనున్నారు. ఈ –ఆఫీస్ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ ప్రవీణ్తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
రూల్స్ పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్
హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్బాజ్పాయ్వరంగల్ అర్బన్ : నగర పరిధిలోని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరులో నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. భవనాల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీపై బుధవారం హనుమకొండ నిట్ సమీపంతో పాటు కాజీపేట రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన పలు భవనాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భవన యజమానులు సమర్పించిన పత్రాలను పరిశీలించడంతో పాటు, నిర్మాణాలకు సంబంధించిన కొలతలు, సెట్బ్యాక్లు, పార్కింగ్ సౌకర్యాలు, ఇతర సాంకేతిక ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతి షరతులు, సాంకేతిక ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించిన వారికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. భవన యజమానులు నిర్మాణాల సమయంలో అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టి నగరాభివృద్ధికి సహకరించాలని సూచించారు. సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026
అత్యవసరంగా కావాల్సినవి.. పరికరం సంఖ్య వ్యయం ఫుల్రూమ్ డీఆర్ ఎక్స్రే 2 70 లక్షలు మొబైల్ డీఆర్ ఎక్స్రే 4 80 లక్షలు అల్ట్రాసౌండ్ 4 1.20 కోట్లు హారిజొంటల్ ఆటోక్లేవ్స్ 3 15 లక్షలు ఓటీ టేబుల్స్ 4 16 లక్షలుసాక్షి, వరంగల్: పాతవి కదలవు.. కొత్తవి నడవవు.. అన్నట్లుంది ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణకే తలమానికమైన మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి, దాని అనుబంధమైన కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కీలక వైద్య పరికరాల మొరాయింపు, తరచూ మరమ్మతు, ఏఎంసీ (అన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) లేక పనిచేయకపోవడంతో వేలాది మంది రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంజీఎంలో ఉన్న 16 వైద్య యంత్రాల్లో 14 తరచూ మరమ్మతు, రెండు పనిచేయడం లేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 11 యంత్రాల్లోనూ ఐదు పనిచేయకపోవడం, మూడు మాత్రమే పనిచేయడం, సీఆర్ క్యాసెట్ల కొరతతో రెండు, మరొకటి ఏఎంసీ డ్యూ ఉండడం కలవరపెడుతోంది. ఫలితంగా రోగులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేద కుటుంబాలకు ఇది అదనపు ఆర్థికభారం అవుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత బుధవారం జరిగిన ఎంజీఎం ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు రావడంతో ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్లో ఉన్న రూ.8 కోట్లతోనైనా కొత్త పరికరాల కొనుగోలు, పాత యంత్రాల మరమ్మతుకు మార్గం సుగమమవుతుందా! అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పరికరాల కొనుగోలుకు రూ.4,01,00,000 లు అవసరమవుతాయని, పాత పరికరాల మరమ్మతుకు మిగిలిన నగదును వాడుకోవాలని హెచ్డీఎస్ కమిటీ నిర్ణయించింది. ఇది సమావేశాలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలోకి తీసుకురావడం ద్వారా వేలాది మంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. గుండె రోగులకు ఇబ్బందులు సూపర్ స్పెషాలిటీలోని క్యాథ్ ల్యాబ్ పనిచేయకపోవడంతో గుండెరోగులకు పెద్ద సమస్యగా మారింది. అత్యవసర యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ కోసం ఇతర ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సీటీ స్కాన్ యంత్రం కూడా నిలిచిపోవడంతో సూపర్ స్పెషాలిటీ సేవల లక్ష్యం దెబ్బతింటోంది. ప్రధాన పరికరాల పరిస్థితి ఇలా పరికరం ఎంజీఎం సూపర్ స్పెషాలిటీఎంఆర్ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు సీటీ స్కాన్ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు) క్యాథ్ ల్యాబ్ లేదు 1 (పనిచేయదు) డీఆర్ ఎక్స్రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ) అల్ట్రాసౌండ్ 4 (పాతవి, మరమ్మతు) 2 2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయిఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా) రోజువారీ ఓపీ : 2,000 ఇన్పేషంట్లు : 1,000 ఎంఆర్ఐ/సీటీ స్కాన్ అవసరమయ్యే వారు : 500 ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50 అల్ట్రాసౌండ్ అవసరమయ్యే వారు : 200 ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్లు: 100లోపు ఎంజీఎంలో పాత యంత్రాల మొరాయింపు సూపర్స్పెషాలిటీలోనూ పనిచేయని కొత్త యంత్రాలు క్యాథ్ ల్యాబ్ మూసివేతతో గుండె రోగులకు తప్పని ఇబ్బందులు కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ నిర్ణయం ఆచరణ రూపంలోకి తీసుకొస్తేనే రోగులకు మెరుగైన సేవలు -
రూ.5 వేల కోట్లు
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026హన్మకొండ అర్బన్: హనుమకొండ–వరంగల్ జంట నగరాల అభివృద్ధికి దాదాపు రూ.5 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. అనంత రం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హనుమకొండ–వరంగల్ జంట నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. 2040 వరకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు, 2057 జనాభా అంచనాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్లు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోందన్నారు. హనుమకొండ–కాజీపేట రహదారిపై రూ.78 కోట్లతో, ఫాతిమా–మామునూరు మార్గంలో రూ.68 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణం, భద్రకాళి చెరువు పూడికతీత పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ బంగ్లాను ఆధునికీకరించి వారసత్వ కట్టడంగా పరిరక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం జిల్లాలో 771 చెరువుల్లో కోటికి పైగా.. చేపపిల్ల లను ఉచితంగా వదిలామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. వన మహోత్సవంలో 25 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించామని వెల్లడించారు. ధరణి సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు అదాలత్ సర్కిల్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.అర్హులందరికీ సంక్షేమ ఫలాలు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు -
అభివృద్ధి, సంక్షేమంలో ‘వరంగల్’ ముందడుగు
సాక్షి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమంలో వరంగల్ జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఖిలావరంగల్లోని ఖుష్మహల్లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేసి జిల్లా ప్రగతిని మంత్రి కొండా సురేఖ వివరించారు. ధాన్యం కొనుగోలు.. జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్, యాసంగి సీజన్లలో .8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.913 కోట్లకు పైగా జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల ద్వారా మరో రూ.303 కోట్లు, రైతు భరోసా కింద 1.59 లక్షల మందికి రూ.118.70కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు. 9,483 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 6.58 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,483 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 1,793 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. పాకాల, దేవాదుల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. వరంగల్ హెల్త్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.1,100 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. 458 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మూడు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మామునూరు విమానాశ్రయ విస్తరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి–163జీ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. చివరిదశకు పాకాల పనులు.. అటవీ పరిరక్షణలో భాగంగా 31.40 లక్షల మొక్కలు నాటామని, పాకాల ఎకో టూరిజం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. వేడుకల్లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీసీపీ అంకిత్కుమార్, డీఎఫ్ఓ నిఖిత, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమమ, ఉమారాణి పాల్గొన్నారు. ఇందిరమ్మ పత్రాలు, చెక్కుల పంపిణీ స్నేహ గ్రూప్స్ ద్వారా 11 మంది విద్యార్థినులకు సైకిళ్లు, రెండో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుపత్రాలు, 102 మహిళా సంఘాలకు రూ.12 కో ట్ల రుణాల చెక్కులు అందించారు. విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్షేమం, సదుపాయాల కల్పనలో రాష్ట్రం పురోగతి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్ ఖుష్ మహల్లో రాష్ట్ర అవిర్భావ వేడుకలు -
ఉద్యమ దివిటీలు
కొందరు తెలంగాణ ఉద్యమంలో సమిధలయ్యారు. ఇంకొందరు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దివిటీలయ్యారు. మరికొందరు ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఊపిరిగా భావించి ఆంధ్రుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి.. జైల్లో ఊచలు లెక్కించారు. అలా ఎవరికి తోచినట్లుగా వారు పోరుబాట పట్టి పుట్టిన నేల రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యమ గుర్తులు ‘సాక్షి’ ప్రత్యేకం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబాల వేడుకోలు -
మహా నగర సమగ్రాభివృద్ధి
హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: ప్రభుత్వ సహకారంతో వరంగల్ మహానగరం సమగ్రాభివృద్ధి చెందుతుందని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధికి విడుదల చేసిన నిధులు, జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ ఇసంపల్లి జోనా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, అకౌంట్స్ ఆఫీసర్ శివలింగం, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్లుగా గ్రామసభలు హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ జిల్లాలో ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ సభలు, గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ‘పంట అవశేషాలను కాల్చొద్దు.. పర్యావరణాన్ని కాపాడండి’ అంశంతో రూపొందించిన వాల్పోస్టర్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీసీపీ దార కవిత, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర పాల్గొన్నారు. వరంగల్ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్ అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులకు అభినందన
వరంగల్ క్రైం: పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకాలను అందుకున్న పోలీసు అధికారులను మంగళవారం సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మహోన్నత సేవ పతకాన్ని అందుకోగా, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఎస్సై వేణుగోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ ఉత్తమ సేవా పతకాలను, ఎస్సై కనకచంద్రం, ఏఎస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, స్వర్ణ లత సేవా పతకాలు అందుకున్నారు. -
అమరవీరులకు సీపీ నివాళి
వరంగల్ క్రైం: హనుమకొండ అదాలత్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరవొద్దని, వారి ఆశయ సాధనకు మనమందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని అంబులెన్స్లకు డీజిల్ కొరత ఏర్పడింది. మూడు రోజుల నుంచి ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎం, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, టూడీఈకో పరీక్షల కోసం తీసుకెళ్లే అంబులెన్స్లకు డీజిల్ లేదని చెబుతూ చేతులెత్తేస్తున్నారని రోగుల అంటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రికి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలు ప్రైవేట్ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని అటెండెంట్లు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్లు ఆగిపోతే వైద్యసేవలు ఎలా అందుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబులెన్స్లను నడిపించాలని కోరుతున్నారు. నయీంనగర్: వరంగల్ కోట పరిసరాలను, చారిత్రక అగడ్త అభివృద్ధి పనులను ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ కోట చుట్టూ ఉన్న అగడ్త రక్షణ, సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి ‘కుడా’ చైర్మన్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా అగడ్తను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్గా ప్రియాంకవైస్ చైర్మన్గా బండి జనార్దన్ ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంగళవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. చైర్ పర్సన్గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్గా బండి జనార్దన్ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెట్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. వరంగల్ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిందని పేర్కొన్న ఆయన నూతన పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకై న పాత్ర పోషిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జనవరిలో కమిటీని నియమించగా కొన్ని కారణాలతో హోల్డ్లో పెట్టారు. ఏనుమాముల మార్కెట్ కార్యదర్శిగా శ్రీనివాస్ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న మల్లేశం జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీపీ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రవాణాశాఖలో బదిలీలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐలు)లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పలువురు అధికారులు వచ్చారు. అదే సమయంలో ఈ జిల్లాల నుంచి మరికొందరు ఇతర డిస్ట్రిక్ట్లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఎంవీఐలు.. టి.జయపాల్రెడ్డి డీటీఓ వరంగల్ నుంచి డీటీసీ కరీంనగర్కు, రమేశ్ రాథోడ్ డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ నిజామాబాద్కు, బి.కిశోర్బాబు డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ ఆదిలాబాద్కు మహ్మద్ సంధాని డీటీఓ భూపాలపల్లి నుంచి డీటీఓ జగిత్యాలకు, మహ్మద్ గౌస్పాషా (సస్పెన్షన్లో) డీటీఓ మహబూబాబాద్ నుంచి డీటీసీ ఆదిలాబాద్ అటాచ్డ్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన ఎంవీఐలు.. బి. కిరణ్కుమార్ నిజామాబాద్ డీటీసీ నుంచి హనుమకొండ డీటీసీకి, టి.జనార్దన్రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం నుంచి హనుమకొండ డీటీసీకి, వి. వెంకటరమణ ఖమ్మం డీటీఓ నుంచి హనుమకొండ డీటీసీకి, ఆర్. నాగలక్ష్మి కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, జి.వేణుగోపాల్ హనుమకొండ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, జె.శ్రీనివాస్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్ డీటీఓకు, శివపల్లి శ్రీనివాస్ ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, ఠాకూర్ ఈశ్వర్సింగ్ నిర్మల్ జిల్లా నుంచి ములుగు డీటీఓకు, ఎం.వెంకన్న జగిత్యాల డీటీఓ నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు, బి.శంకర్ కొమురంభీం ఆసిఫాబాద్ నుంచి మహబూబాబాద్ డీటీఓకు, ఎ.మహేందర్ నిర్మల్ జిల్లా నుంచి మహబూబాబాద్ డీటీఓకు, బి.శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఏఎంవీఐలు.. ఎం.సాయిచరణ్ మహబూబాబాద్ నుంచి జగిత్యాలకు, బి.విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్కు, కీర్తి ఉదయ్ హనుమకొండ డీటీసీ నుంచి కరీంనగర్ డీటీసీ (స్పౌజ్ గ్రౌండ్స్)కి బదిలీ అయ్యారు. ఉమ్మడి వరంగల్కు వచ్చిన ఏఎంవీఐలు.. కొమ్ము శ్రీనివాస్ కామారెడ్డి నుంచి ములుగుకు, డి. శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి ములుగుకు, ఎం.డి. అఫ్రోజుద్దీన్ కామారెడ్డి నుంచి వరంగల్కు, శంకర్ మూడ్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్కు, షేక్ కాసీం మంచిర్యాల నుంచి మహబూబాబాద్కు, బి. విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్కు, ఎం.శాలిని కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, జి.మాధవి కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, బి.అపర్ణ ఆదిలాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, కొట్టె మధుకర్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, బి.శ్రావణ్ కుమార్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, నిహారిక సర్జన ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు వచ్చారు. ఏఓలకు స్థానచలనం.. ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారు(ఏఓ)లకు స్థానచలనం కలిగింది. వరంగల్ డీటీఓ కార్యాలయం ఏఓ బి.నరేందర్ హనుమకొండ డీటీసీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం ఏఓ జి.సుభాషిణిని నియమించారు. జనగామ ఏఓ ఖలీల్ సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి కె.బెంజమిన్ జనగామకు బదిలీ అయ్యారు. పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐలకు స్థానచలనం ఉమ్మడి వరంగల్ నుంచే ఎక్కువ మంది.. అదే స్థాయిలో నియామకాలు ఇన్చార్జ్ డీటీఓలుగా కొందరు ఎంవీఐలు రెండున్నరేళ్లలో ఇదే మొదటిసారి -
3 నెలల్లో ‘సూపర్’ పనులు పూర్తి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాశిబుగ్గ: వరంగల్లో నిర్మస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ సూపర్ మల్టిస్పెషాలిటీ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రిలోని మొదటి, రెండో అంతస్తులను పరిశీలించి, పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షించాలి..హన్మకొండ అర్బన్: పర్యావరణాన్ని పరిరక్షించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కుడా కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, పర్యావరణ శాస్త్రవేత్త జీమూత వాహన్ ఉన్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్కు పీఎస్యూ ఐటీ అవార్డు
హన్మకొండ: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) ప్రతిష్టాత్మక పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఐటీ అవార్డు అందుకుంది. ఈ అవార్డును సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) కర్నాటి వరుణ్రెడ్డికి కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, ఐటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అందించారు. డిజిటల్ సేవల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తున్నందుకు, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు గవర్నెన్స్ నౌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మే 29న న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గవర్నెన్స్ నౌ 11 ఇండియా పీఎస్యూ ఐటీ అవార్డును టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కె.వెంకటేశం, ఐటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నిర్వాహకుల నుంచి అందుకున్నారు. -
పోరు సల్పిన ఓరుగల్లు
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి బీజం పడింది ఇక్కడే. దశాబ్దాల కిందటి పోరాటానికి నాయకత్వం వహించిన ముఖ్యులూ ఇక్కడి వారే. ప్రత్యేక పోరులో అసువులుబాసిన ఎక్కువ మందీ ఈ నేల బిడ్డలే. ఉద్యమానికి ఊపిరి పోసి.. పోరు సల్పిన ఓరుగల్లుది తెలంగాణ అధ్యాయంలో కీలకభూమిక. నేడు (మంగళవారం) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12 ఏళ్ల తెలంగాణకు ఏర్పాటులో కీలకమైన కొన్ని ఘట్టాలు ‘సాక్షి’ ప్రత్యేకం. సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్–హనుమకొండ జంట నగరాలు కీలక పాత్ర పోషించాయి. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి 2014 రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన ప్రతీ ప్రధాన ఉద్యమ ఘట్టానికి కాకతీయుల గడ్డ కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉద్యమానికి ఊపిరిగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఉద్యమ ఘట్టాలు ● 1969: తొలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు. ● 2001: టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఉద్యమ కార్యక్రమాల విస్తరణ. ● 2009: కేసీఆర్ ఆమరణ దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం. కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలు. ● 2009 డిసెంబర్ 9: తెలంగాణ ప్రకటనతో సంబురాలు. ● 2009 డిసెంబర్ 23: కేంద్రం వెనక్కి తగ్గడంతో ఆందోళనలు, నిరసనలు. ● 2010–11: విద్యార్థి జేఏసీలు, ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో కీలక పాత్ర. ● 2011: సకల జనుల సమ్మె.. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించడం. ● రైల్రోకో, రాస్తారోకో: జాతీయ రహదారులు, రైల్వే మార్గాల్లో భారీ నిరసనలు. ● ధూంధాం కార్యక్రమాలు: తెలంగాణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంస్కృతిక ఉద్యమం. ● అమరవీరుల త్యాగాలు: ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు యువకులు, విద్యార్థుల బలిదానాలు ఉద్యమానికి బలాన్నిచ్చాయి. ● 2013: తెలంగాణ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీలు, సభలు. ● 2014 జూన్ 2: తెలంగాణ ఆవిర్భావంతో వరంగల్లో చారిత్రాత్మక సంబురాలు. ఉద్యమానికి గుర్తులు.. కాకతీయ విశ్వవిద్యాలయం, హనుమకొండ చౌరస్తా, ఏకశిల పార్కు, కలెక్టరేట్ పరిసరాలు, అమరవీరుల స్తూపాలు ప్రత్యేకత ఇదే.. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత అత్యధిక ఉద్యమ కార్యకలాపాలు జరిగిన కేంద్రంగా కేయూ గుర్తింపు పొందింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాయి. ఉద్యోగుల కీలక పాత్ర హన్మకొండ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగుల పాత్ర విశేషంగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో ఏ పిలుపు వచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్గా పరిటాల సుబ్బారావు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా కారం రవీందర్రెడ్డి తదితరులు ముందుండి నడిపించారు. కేసులు నమోదైనా, వేతనాలు నిలిపేసినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ సాధన కోసం పోరాటాన్ని కొనసాగించారు. అప్పటి ఉద్యమ నేత కేసీఆర్, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా రాష్ట్రస్థాయి నాయకులు వరంగల్లో నిర్వహించిన ఉద్యమ కార్యక్రమాలకు తరచూ హాజరయ్యేవారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ది కీలకభూమిక స్వరాష్ట్ర పోరాటానికి బీజం పడింది ఇక్కడే! తెలంగాణ అమరవీరుల సేవలు చిరస్మరణీయం నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమ ఘట్టాలు ‘సాక్షి’ ప్రత్యేకం.. -
బోనాల కిషన్కు మహోన్నత సేవా పతకం
హన్మకొండ: మహోన్నత సేవా పతకానికి వరంగల్ టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్ ఎంపికయ్యారు. 1995 ఎస్సై బ్యాచ్కు చెందిన ఆయన వరంగల్ రేంజ్ పరిధిలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కిషన్ డిప్యుటేషన్పై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంలో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవులపల్లి రమేశ్, కానిస్టేబుల్ కాలేరు ఉపేందర్ ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. వారికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అభినంధనలు తెలిపారు. పలువురు పోలీసులకు పతకాలువరంగల్ క్రైం: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులను ప్రభుత్వం పతకాలకు ఎంపిక చేసింది. ముగ్గురు పోలీసు అధికారులకు ఉత్తమ సేవా పతకం, 19 మందిని సేవా పతకానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక అధికారికి మహోన్నత సేవా పతకం కాశిబుగ్గ: జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.యజ్ఞనారాయణ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు (మంగళవారం) ఈ సేవా పతకాన్ని అందజేయనున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పతకానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యజ్ఞనారాయణకు అగ్నిమాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్–హనుమకొండ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పోరా టాలకు కేంద్రంగా నిలిచిన ఈ ప్రాంతం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రంగా మారింది. 2014లో పలు సమస్యలు ఉన్న నగరంలో నేడు విద్య, వైద్యం, రహదారులు, స్మార్ట్సిటీ ప్రాజెక్టులు, పర్యాటకం, ఐటీ తదితర రంగాల్లో పురోగతి సాధించాయి. రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో అనేక ప్రాజెక్టులు పూర్తికాగా.. హనుమకొండ జిల్లా పరిపాలన, విద్య, వైద్య కేంద్రంగా మరింత బలోపేతమైంది. మౌలిక సదుపాయాలు : నగరంలో 2014కు ముందు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండేవి. 2014 తర్వాత పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారాయి. తాగునీరు : వేసవిలో తాగునీటి కొరత ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథతో సమస్య పరిష్కారమైంది. వైద్యం: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, ఎంజీఎం విస్తరణ, కేఎంసీ బలోపేతంతో నగరం ప్రముఖ వైద్య కేంద్రంగా ఎదిగింది. విద్య: గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేయూతో విద్యారంగం బలోపేతమైంది. పర్యాటక, సాంస్కృతిక రంగం: వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం పరిసరాల అభివృద్ధి, కాకతీయ కళాతోరణం ప్రాచుర్యం, పర్యాటకులకు వసతులు మెరుగుపడ్డాయి. ఐటీ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐటీ కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించింది. అభివృద్ధి: నగరాభివృద్ధి హంటర్ రోడ్డు, మడికొండ, కాజీపేట, నయీంనగర్, వడ్డేపల్లి, ఎల్కతుర్తి రోడ్డు వైపు విస్తరించింది. హనుమకొండ జిల్లా ప్రత్యేకత.. తెలంగాణలో రెండో అతిపెద్ద విద్యా కేంద్రంగా హనుమకొండకు గుర్తింపు ఉంది. కేయూ, కేఎంసీ అభివృద్ధి చెందాయి. ఎంజీఎం, కలెక్టరేట్తో ప్రజలకు మరిన్ని సేవలు చేరువయ్యాయి. ఉత్తర తెలంగాణ కేంద్రంగా అభివృద్ధి.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన వరంగల్–హనుమకొండ జంట నగరాలు.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధికి చిరునామాగా మారాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఐటీ రంగాల్లో నమోదైన పురోగతి నగర రూపురేఖలను మార్చింది. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ 2014తో పోలిస్తే నేడు గ్రేటర్ వరంగల్–హనుమకొండ ప్రాంతం ఉత్తర తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా ఎదిగిందనడంలో సందేహం లేదు.గ్రేటర్ వరంగల్–హనుమకొండలో ప్రగతి పరుగులు మహానగర రూపురేఖలు మార్చిన పుష్కర కాలం -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు హనుమకొండ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం జరిగే వేడుకలకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఖుష్మహల్ ప్రాంగణంలో.. ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ ప్రాంగణం సర్వం సిద్ధమైంది. సోమవారం డిప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యశారద ఏర్పాట్లను పరిశీలించారు. ఖుష్మహల్, రాతికోట ముఖద్వారం, చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అమరవీరుల స్తూపాన్ని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్దీపాలతో అలంకరించారు. కాగా, నేడు (మంగళవారం) ఉదయం 7 గంటలకు వేడుకలు ప్రారంభంకానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 7:45 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులు, 8 గంటలకు జెండా ఆవిష్కరణ, 8.15 గంటలకు పరేడ్, 8.25 గంటలకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరణ, 8.30 గంటలకు జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి ప్రసంగం, 9.15 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.30 గంటలకు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 9.40 గంటలకు స్టాళ్ల సందర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. -
కూరగాయల బడి..
బెండకాయ టమాట బడికి వెళ్లాయి బడిలోకి వంకాయ వచ్చి చేరింది. వంకాయకు చింతకాయ నేస్తమయ్యింది అది చూసి బీరకాయ గంతులేసింది సొరకాయకు ఇది చూసి కోపమొచ్చింది పక్కనున్న దొండకాయ చెవిన వేసింది ఇవి రెండూ వంకాయతో గొడవపడ్డాయి గొడవలో దొండకాయ కింద పడ్డాది. ఏడుస్తూ సొరకాయ అలిగి కూర్చుంది మునక్కాడ గురువుగారు వచ్చి చూసారు పదపదమని తరగతికి తీసుకెళ్లారు అక్షరాలు చూపించి నేర్వమన్నారు. ఆలుగడ్డ చామగడ్డ దోసకాయలు చదువుకొని ఎదిగాయి చూడండి. అల్లరంత మాని మీరు చదవమని మునక్కాడ గురువుగారు చెప్పి వెళ్లారు. కూరగాయల బడిలోని కూరలన్నీ గురువుగారి మాట విని చదువుకున్నాయి. బాలగేయం -
ఇద్దరు అటవీ శాఖ అధికారులపై దాడి
● పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు భూపాలపల్లి రూరల్: జయశంకర్ భూపాలపల్లి జిలా గణపురం మండలం చెల్పూరు రేంజ్ పరిధి లోని ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో పోడు చేస్తున్న వారిని అడ్డకున్న అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. చెల్పూరు ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి కథనం ప్రకారం.. ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆముదాలపల్లి గ్రామ అటవీప్రాంతంలో ట్రాక్టర్ డోజర్తో పోడు పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ బీట్ ఆఫీసర్లు రాజేందర్, రంజిత్, నాగలక్ష్మి పనులపై ఆరాతీసి పోడు చేయవద్దని అడ్డుకున్నారు. గతంలో పోడు చేసిన భూమి చుట్టూ ట్రెంచ్ వేశారు. కమలాపూర్ గ్రామానికి చెందిన తోట సంతోష్ తన కుమారుడితో కలిసి ట్రెంచ్ను పూడ్చి, పోడు చేస్తుండగా అడ్డుకున్న అధికారులతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడిలో చెల్పూరు రేంజ్ పరిధికి చెందిన బీట్ ఆఫీసర్లు రంజిత్, రాజేందర్ స్వల్పంగా గాయపడినట్లు వెల్లడించారు. పోడుకు ఉపయోగించిన ట్రాక్టర్ను సీజ్ చేసి కమలాపూర్ ఫారెస్టు నర్సరీలో ఉంచినట్లు వివరించారు. దాడి చేసిన సంతోష్ కుటుంబ సభ్యులపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని బీట్ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. -
జిగేల్.. జిగేల్
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026విద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంఅమరవీరుల కీర్తిస్తూపంరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలో ప్రభుత్వ కార్యాలయాలను ఆదివారం రాత్రి అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయం, కలెక్టరేట్, అమరవీరుల కీర్తిస్తూపం కాంతులీనుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
బదిలీల్లో గందరగోళం
హన్మకొండ: వ్యవసాయ శాఖలో బదిలీలపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మేనెల లోపు బదిలీలకు అవకాశం ఇచ్చింది. మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు మినహా మిగతా అన్ని క్యాడర్లలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసింది. వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకుల బదిలీలపై స్పష్టమైన విధానం లేకుండా గందరగోళానికి గురి చేస్తోంది. వ్యవసాయాధికారులకు ఈ నెల 30 వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే అదేరోజు రాత్రి 8.30 గంటలకు జిల్లా వ్యవసాయాధికారులకు మెమో వచ్చింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు ఈ నెల 31న బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని మెసేజ్లు పంపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు ఆదివారం హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ గది వద్దకు చేరుకోగానే ఎలాంటి సీనియారిటీ జాబితా, ఖాళీ పోస్టుల వివరాలు విడుదల చేయకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పడంతో వ్యతిరేకించారు. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సమాచారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వర్చువల్లోకి వచ్చి సీనియారిటీ జాబితా విడుదల చేస్తున్నామని, ప్రతి వ్యవసాయాధికారి 10 చొప్పున ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు ఆప్షన్లు ఇచ్చారు. సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలు లేకుండానే కౌన్సెలింగ్ వ్యతిరేకించి నిరసన తెలిపిన వ్యవసాయ అధికారులు -
ఆటల్లో అన్నదమ్ముల ప్రేమలు..
ఒక రోజు శ్రీరాముడు తన తమ్ముళ్లు, మిత్రులతో కలిసి సరయు నది తీరంలో ఆటలు ఆడాలని నిర్ణయించాడు. రెండు జట్లుగా విడిపోవాలని చెప్పగా, లక్ష్మణుడు అన్నకు ఎదురుగా ఉండలేనని నిరాకరించాడు. భరతుడు మాత్రం శ్రీరాముడి ఆజ్ఞను గౌరవించి ప్రత్యర్థి జట్టుకు నాయకత్వం వహించాడు. ఆటలో శ్రీరాముడు ఉద్దేశపూర్వకంగా భరతుడి జట్టును గెలిపించాడు. ఈ సంఘటన ద్వారా లక్ష్మణుడి అంచలంచెల భక్తి, భరతుడి విధేయత, అన్నదమ్ముల మధ్య ఉన్న అపార ప్రేమ, పరస్పర గౌరవం వెలుగు చూశాయి. ఈ లీలను చూసి దేవతలు కూడా ఆనందించారు. –జనగామ -
బుడతలు.. కరాటేలో మెరికలు!
పతకాల బాటలో.. మూడేళ్లు కరాటేలో తర్ఫీదు పొందుతున్నా. పలుచోట్ల జరిగిన జోనల్, జిల్లా స్థాయి పోటీల్లో 6 పతకాలు సాధించా. ఈ ఏడాది నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించా. –జయశ్రీ, విద్యార్థిని, కాజీపేట విజయంతోనే వస్తా..మూడున్నర ఏళ్లుగా మార్షల్ ఆర్ట్స్లో కుమార్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకుంటున్నా. కాస్త కఠినమైనా ఇష్టపడి నేర్చుకుంటున్నా. పోటీలు ఎక్కడ జరిగిన విజయంతోనే వస్తా. అండర్–15లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నా. జనగామ, బెల్లంపల్లిల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకం దక్కింది. –కొలిపాక కల్యాణి, విద్యార్థిని● కష్టమైన క్రీడలో ఇష్టంగా రాణిస్తున్న చిన్నారులు ● ఓవైపు చదువు.. మరోవైపు విజయాల పరంపర కాజీపేట : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెతను నిజం చేస్తున్నారు కాజీపేట మండలానికి చెందిన పలువురు చిన్నారులు. కష్టమైన కరాటేలో ఇష్టంగా రాణిస్తున్నారు. ఆత్మ రక్షణతోపాటు శారీరక, మానసికోల్లాసాన్ని ఇచ్చే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతున్నారు. మాస్టర్ల పర్యవేక్షణలో వయస్సు తారతమ్యం లేకుండా తర్ఫీదు పొందుతున్నారు. వేసవి సెలవులను ఉదయం, సాయంత్రం వేళలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కరాటేలో చక్కటి విజయాలు సాధిస్తున్నారు. -
వడదెబ్బతో నలుగురి మృతి
వరంగల్ జిల్లాలో దుగ్గొండి/సంగెం: దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మామునూరి నారాయణ(50) ఆదివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అలాగే, దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన రోజువారీ కూలీ పిట్టల రాజన్న( 60) దంచికొడుతున్న ఎండలకు శనివారం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స తీసుకుంటుండగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. అలాగే, సంగెం మండలం సోమ్లాతండాకు చెందిన గుగులోత్ రమేశ్ (42) గత నెల 26వ తేదీన వరిగడ్డి కట్టలు తీసుకుని రావడానికి కూలీకి వెళ్లాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన బి.ఉప్పలయ్య (65) ఆదివారం తోటల కాపలాకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చి అస్వస్థతకు గురై మృతిచెందాడు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం నలుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పదోన్నతితో బాధ్యతలు: సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సైగా పదోన్నతి పొందిన సయ్యద్ సిరాజ్ పాషా, ఏఎస్సైగా పదోన్నతి పొందిన రాజేంద్రప్రసాద్ ఆదివారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై పోలీసు కమిషనర్ పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
డీఏఓగా వి.విజయచంద్ర
హన్మకొండ : హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా వి.విజయచంద్ర (వి.జోజప్ప)ను ప్రభుత్వం నియమించింది. బదిలీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ సహాయ సంచాలకులుగా పని చేస్తున్న విజయచంద్రను హనుమకొండకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న రవీందర్ సింగ్ ఆదిలాబాద్ డీఏఓగా బదిలీ అయ్యారు. విద్యారణ్యపురి : డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్కు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, టెన్త్, ఇంటర్మీడియట్ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయ, టీసీ, ఎన్సీసీ/స్పోర్ట్స్, పీహెచ్సీ పత్రాలతో రావాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులు 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (సీబీసీఎస్), (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్షలు ఉంటా యన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉ దయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. న్యూశాయంపేట: సమీకృత జిల్లా కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఓసిటీలో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ పనుల కాంట్రాక్టర్ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, కాంట్రాక్టర్, అధికారులు ఉన్నారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం గ్రీవెన్ సెల్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్ : కులవర్గ విభేదాలను విస్మరించాలని చిన్మయానంద మిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీసువిరానందస్వామి ఉద్బోధించారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్మయ మిషన్ స్థాపించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
డివిజన్ కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది. అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు.. కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. డివిజన్ వస్తే కొత్తమార్గాలు.. ఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది. 1980 నుంచే ఉద్యమం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 1980 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కాజీపేట జంక్షన్ దేశంలోనే అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటిగా ఎదిగినప్పటికీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే కొనసాగుతోంది. కాగా, విశాఖపట్నం జోన్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ ఏడాదిలో డివిజన్ కోసం ఉద్యమాలు జరిగాయి. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తున్న సందర్భంగా కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ అమలు రైల్వే పునర్వ్యవస్థీకరణతో ప్రజల్లో ఆశలు డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలురానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. వరంగల్ను రైల్వే పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉండనుండగా, పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రోత్సాహం తద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఊతం ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు. -
ఇంటర్లో వినూత్న సంస్కరణలు
విద్యారణ్యపురి : ఇంటర్ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వినూత్న సంస్కరణలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ సిలబస్లో ఇంటర్బోర్డు మార్పులు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 9, వరంగల్ 11, మహబూబాబాద్ 10, జయశంకర్ భూపాలపల్లి 5, జనగామ 7, ములుగులో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలు రీఓపెన్ చేయనున్నారు. సైన్స్ సబ్జెక్టుల సిలబస్ తగ్గింపు.. ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాల సిలబస్లో మార్పులు చేశారు. సైన్స్ సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో సిలబస్ను తగ్గించారు. ఫిజిక్స్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,–ఫిజిక్స్ అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు. గణితం పేపర్ 1ఏలో కొత్తగా సెట్స్ అండ్ రిలేషన్స్ సీక్వెన్సెస్ అండ్ సీరిస్ పాఠ్యాంశాలు చేర్చారు. గతంలోఉన్న పలు పాఠ్యాంశాలు, రిపీటెడ్ అంశాలను తగ్గించారు. తెలంగాణ సంప్రదాయాలు, కళలతో తెలుగు పాఠ్యపుస్తకాలను రూపొందించారు. నీట్, జేఈఈలో లేని పాఠ్యాంశాలను కూడా తొలగించారు. బాటనీలో రెండు పాఠ్యాంశాలు తొలగించి కొత్తగా ఎకనామిక్స్ బాటనీ అధ్యాయాన్ని చేర్చారు. జువాలజీలో సెరికల్చర్తోపాటు రెండు అంశాలను చేర్చారు. ఇంటర్ విద్యలో సీబీఎస్ఈ సిలబస్కు అనుగుణంగా పలు మార్పులు చేశారు. పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్.. పాఠ్యపుస్తకాల కవర్పేజీలో మార్పులు చేసి మల్టీకలర్తో ముద్రించారు. ఈసారి క్యూఆర్కోడ్తో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తెరిచినరోజే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పాఠ్యపుస్తకాలను ఇంటర్బోర్డు పంపింది. ఈసారి యూనిఫాం, నోట్బుక్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. జూన్ 12 నుంచి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. కొనసాగుతున్న అడ్మిషన్లు.. ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 2,680 మంది విద్యార్థులు సెకండియర్లో ఉండగా.. శనివారం వరకు ఇంటర్ ఫస్టియర్లో 380 మంది విద్యార్థులు పవేశాలు పొందారు. 123 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. సెకండియర్లో 1,272 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 100 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. నాలుగు ఎయిడెడ్ కళాశాలలు, 11 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్లు పెరుగుతాయని భావిస్తున్నాం.. ఈసారి ఇంటర్లో వినూత్న మార్పులతోపాటు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. దీంతో ఇంటర్లో అడ్మిషన్ల సంఖ్య పెరగుతుందని భావిస్తున్నాం. విద్యార్థుల హాజరుశాతం పెరగనుంది. జూన్ ఒకటి నుంచి తరగతులకు విద్యార్దులు హాజరుకావాలి. – ఎ.గోపాల్, డీఐఈఓ హనుమకొండ ఫస్టియర్ సిలబస్లో మార్పులు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం నేటినుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభంఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. దీంతో విద్యార్థుల్లో ప్రయోగాత్మక విద్య అభ్యసనం పెరగుతుందని భావిస్తున్నారు. వివిధ సబ్జెక్టుల థియరీలో 80 మార్కులు ఇంటర్నల్లో 20 మార్కులు ఉంటాయి. ఈసారి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్తో ఏసీఈ అనే నూతన గ్రూపును కూడా ప్రవేశపెట్టారు. -
ట్రిపుల్ ఐటీకి 135 మంది విద్యార్థుల ఎంపిక
విద్యారణ్యపురి : బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో (ఆర్జీయూకేటీ ) 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన (బాసర అండ్ మహబూబ్నగర్) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాల తొలివిడత జాబితాను సంబంధిత అధికా రులు మే 30న విడుదల చేశారు. ప్రభుత్వ పా ఠశాలల విద్యార్థులను 85 శాతం, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను 15 శాతం మందిని ఎంపికచేశారు. టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్లో ప్రవేశాలు పొందబోతున్నారు. తొలివిడతలో 1 ,691మంది ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 135 మంది ఎంపికయ్యారు. హనుమకొండ జిల్లా నుంచి 17 మంది, వరంగల్ ముగ్గురు, ములుగు 11మంది, జయశంకర్భూపాలపల్లి 14 మంది, జనగామ 21 మంది , మహబూబాబాద్ జిల్లా నుంచి 69 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 5,6,8 తేదీల్లో బాసర(నిర్మల్) క్యాంపస్లో నిర్వహించబోతున్నారు. ఎంపికై న ఆయా విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఆ యూనివర్సిటీ వెబ్సైట్ హెచ్టీటీపీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆర్జీయూకేటీ.ఏసీ.ఇన్/అడ్మిషన్స్2026 హెచ్టీఎంఎల్లో చూసుకోవాల్సి ఉంటుంది. కేయూ ఫార్మసీ కాలేజీలకు సెలవులు పొడిగింపు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు సెలవులు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం సర్క్యూలర్ జారీ చేశారు. ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు 31తో వేసవి సెలవులు ముగిశాయి. జూన్1నుంచి రీఓపెన్ చేయాల్సిండగా జూన్ 7వతేదీ వరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ సర్క్యూలర్ జారీచేశారు. జూన్ 8 నుంచి పునఃప్రారంభించాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా విజయలక్ష్మివిద్యారణ్యపురి: హైదరా బాద్లో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ (రీజినల్ జాయింట్ డైరెక్టర్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇ.విజయలక్ష్మి వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా బదిలీ అయ్యారు. ఈమేరకు సంబంధి త ఉన్నతాధికారులు గతనెల 30న ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్లో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్యనారా యణరెడ్డికి హైదరాబాద్లో మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్గా, ఎఫ్ఏసీ అడిషనల్ డైరెక్టర్గా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు. విద్యారణ్యపురి: ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల వేతనాల నుంచి ఈహెచ్ఎస్ చందా పేరుతో కోత విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈహెచ్ఎస్ చందా విషయంలో డీడీఓలకు గాని ఉద్యోగులకు ఎలాంటి విధివిధానాలను తెలియజేయకుండానే ఎలా వేతనం నుంచి 1.5 శాతం కోత విధిస్తారని ప్రశ్నించారు.రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికై నా పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కోకన్వీనర్ ధర్మేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు మేకరి దామోదర్, కార్యదర్శులు సూర కు మారస్వామి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
బడి బస్సు భద్రమేనా?
ఖిలా వరంగల్: పాఠశాలల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈక్రమంలో బడి బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు మే 15తోనే ముగిసింది. బస్సులను మరమ్మతులు చేసి ఫిట్నెస్ పరీక్షలకు తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) గడువు ముగిశాక బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు ఉన్నాయి. ఫిట్నెస్ నిబంధనలు ఇలా.. బస్సుకు పవర్ స్టీరింగ్ ఉండాలి. డ్యాష్ ప్యానల్ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్స్ తప్పనిసరి. బ్రేకుల్లో లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్ ఉండాలి. ఫ్యూయల్ గేజ్, స్పీడో మీటర్, డ్రైవర్ సీట్ దగ్గర ఎయిర్ హైండ్ బ్రేక్ ఉండాలి. గేర్ లీవర్లో అంతర్గత స్ప్రింగ్ బాగుండాలి. వెనకదారి కనిపించేలా అద్దం తప్పనిసరిగా ఉండాలి. బస్సులో విద్యార్థుల కదలకలు కనిపించేలా ఇంటర్నల్ అద్దం, విద్యార్థులు ఎక్కుడం, దిగడం స్పష్టంగా కనిపించేలా కన్వీక్స్క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. ఫుట్బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించి ఉండరాదు. ఫార్మింగ్ లైట్లు, అత్యవసర ద్వారం విధిగా ఏర్పాటు చేయాలి. బస్ డ్రైవర్కు 60 ఏళ్లు పైబడి ఉండొద్దు. బస్సులో డ్రైవర్ లైసెన్స్, బస్నంబర్, ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ కలిగిన కాగితం పటం కట్టించి డ్రైవర్ కుడివైపు పెట్టాలి. స్కూల్ కరస్పాండెంట్ ఫోన్ నంబర్ ఉండాలి. బస్సు కండీషన్ పరిశీలించాలి.. స్కూల్ బస్సు కండీషన్ పరిశీలిస్తుండాలి. యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే ఆర్టీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డ్రైవర్ తీరును గమనిస్తుండాలి. మద్యం సేవించినట్లు గుర్తిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. బ్రేక్ నిబంధనలు ఇవే.. బస్ బ్రేక్ చేసేందుకు 32 నిబంధనలు పరిశీలిస్తారు. బస్సు పసుపు రంగులో ఉండాలి. డ్రైవర్కు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. పిల్లల జాబితా, ఎక్కడ ఎక్కుతున్నారో వివరాలు ఉండాలి. బ్రేక్ ఇంజన్, టైర్లు, లైటింగ్ సిస్టం మొత్తం పరిశీలించి ఆర్టీఏ అధికారులు ధ్రువపత్రం జారీ చేస్తారు. ఎంవీఐ రూల్స్.. ఎంవీఐ రూల్ 185 (జీ) ప్రకారం పాఠశాల యాజమాన్యాలు 32 నిబంధనలు పాటించాలి. నెట్లో స్కూల్ పూర్తి వివరాలు, స్కూల్ అడ్రస్, స్కూల్ బస్ నంబర్, డ్రైవర్ వివరాలు, లైసెన్స్, బ్యాడ్జీ నంబర్, బీమా, ట్యాక్స్ ఫోన్ నంబర్లు పొందుపరచాలి. డ్రైవర్, అటెండర్ ఫొటోలను నెట్లో అప్లోడ్ చేయాలి. అనంతరం ప్రభుత్వ ధ్రువపత్రాన్ని రవాణా అధికారులకు అందించి తగిన రుసుం తెల్లించాలి. పరీక్షల అనంతరం ఫిట్నెస్ ధ్రువీకరణ జారీ అవుతుంది. సెలవుల్లోనే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేసుకోవాలి. ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్) గడువు ముగిసిన బస్సులు రోడ్లపై కనిపిస్తే సీజ్చేస్తాం. తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. నిబంధనలు పాటిస్తేనే ఎంవీఐలు ఎఫ్సీ జారీ చేస్తారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ వరంగల్ ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు 444 225 219162 121 41ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే సీజ్ వాహనాలు తీసుకురావాలని యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారుల నోటీసులు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి -
భక్తులు మురిసె.. ‘త్రివేణి’ మెరిసె
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో తెల్లవారుజాము నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలొచ్చారు. ఈ సందర్భంగా సరస్వతీఘాట్లో పుష్కరస్నానాలు ఆచరించి గోదావవరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అరటి డొప్పల్లో దీపాలు వదిలారు. దంపతి స్నానాలు చేశారు. పితృతర్పనాలు, పిండప్రదాన పూజలు నిర్వహించారు. నదీమాతకు నైవేద్యం సమర్పించి, చీరసారె సమర్పించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. కిక్కిరిసిన క్యూలైన్లు.. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులుదీరారు. దీంతో అధికారులు వెనువెంటనే స్వామివారి దర్శనానికి భక్తులను పంపించారు. ఆలయంలో శివకల్యాణ మండపం వద్ద యాగశాలలో వేద పండితులు మహారుద్ర హోమం, నిర్వహించారు. రాత్రి 7గంటలకు వేములవాడ పండితులతో మహా లింగార్చన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి పూజలు.. మెదక్లోని కొల్చారం పీఠాధిపతి శ్రీమాధవానందసరస్వతిస్వామి ఉదయం పుష్కర స్నానం చేశారు. నదీమాతకు పసుపు, కుంకుమ, చీరసారె సమర్పించి పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందాదేవి, శ్రీసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆశీర్వచన వేదిక వద్ద భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాత్రి మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. జెన్కో సీఎండీ కృష్ణభాస్కర్, దేవాదాయశాఖ కమి షనర్ హనుమంతరావు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుశైలజా దంపతులు, అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా కాళేశ్వరముక్తీశ్వరస్వామివారిని దర్శనం చేసుకున్నారు. వైభవంగా హారతి.. కాశీ పండితులతో నవరత్నమాల హారతిని వైభవంగా నిర్వహించారు. దీనిని చూసి తరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. అనంతరం తెప్పోత్సవాన్ని హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి జలవిహారం చేశారు. కార్యక్రమంలో మాధవానంద సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, చైర్మన్ మోహన్శర్మ, ఈఓ మహేశ్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు లక్షన్నరకుపైగా భక్తులు పుష్కర స్నానం చేసి ఆలయంలో దర్శనాలు చేసుకున్నట్లు ఆలయ అదికారులు అంచనా వేశారు. పుష్కరాలకు పోటెత్తిన భక్తులు లక్షన్నర మంది పుణ్య స్నానం వైభవంగా నవరత్నమాల హారతి, తెప్పోత్సవం కొల్చారం పీఠాధిపతి పూజలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు -
రీల్స్ టు సిల్వర్ స్క్రీన్
విదేశాల్లో రీల్స్తో ఫేమస్ అయిన పాలకుర్తి వాసి● కోలీవుడ్లో ‘13/13 లక్కీ నన్’తో హీరోగా అరంగేట్రం ● త్వరలో రిలీజ్ కానున్న సినిమా ● ఐటీ ఉద్యోగంతో పాటు నటనలో రాణిస్తున్న నందుఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా.. నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం.. కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేస్తూనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. – రాపోలు నందు, సింగపూర్ -
ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●రావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు..
టెన్త్ విద్యార్థులుఇంటర్ విద్యార్థులు1,8621,1609878697908061,473687611550498భూపాల పల్లిజనగామమలుగుమానుకోటవరంగల్విద్యార్థులుఉత్తీర్ణత -
పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు
జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కై వసం చేసుకుంది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. హనుమకొండ 10వ ర్యాంక్ సాధించగా, మిగతా నాలుగు జిల్లాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. ఔట్కమ్స్, లెర్నింగ్ ఔట్కమ్స్, యాక్సెస్, టీచర్ అవైలబిలిటీ, ఎఫెక్టివ్ క్లాస్రూమ్ ట్రాన్సాక్షన్, లెర్నింగ్ మేనేజ్మెంట్, లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ కార్యకలాపాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, స్కూల్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్, పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యలు, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ విద్య అమలు, గవర్నెన్స్ ప్రాసెస్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్ లీడర్షిప్ విభాగాల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారు. కాగా, జనగామ జిల్లా మొదటిస్థానంలో నిలవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధా వులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా మార్కులు, ర్యాంకులు(రాష్ట్రస్థాయిలో) జిల్లా మార్కులు ర్యాంక్ జనగామ 357 01హనుమకొండ 306 10భూపాలపల్లి 295 20వరంగల్ 286 24ములుగు 266 29మహబూబాబాద్ 259 31 పీజీఐ–డీ 2024–25లో తెలంగాణలో నంబర్–1 హనుమకొండకు 10వ ర్యాంకు అంతగా ప్రభావం చూపని ఉమ్మడి వరంగల్లోని మిగతా నాలుగు జిల్లాలు కేంద్ర మానవ వనరుల శాఖ నివేదికలో వెల్లడి -
వేసవి సెలవుల పొడిగింపు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులను జూన్ ఐదో తేదీవరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం శనివారం సర్క్యూలర్ జారీచేశారు. వేసవి సెలవులు ఈనెల 31తో ముగిసి జూన్ ఒకటి నుంచి డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జె.చిన్న, ఇతర బాధ్యులు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎండల నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించాలని కోరగా.. జూన్ 5వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఈసెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు యథావిధిగానే విధులు నిర్వర్తించాలి. జూన్ 6 నుంచి కళాశాలలు రీ ఓపెన్ చేస్తారు. హన్మకొండ చౌరస్తా: మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బకాయిలను ప్రభుత్వం నిన్న జీపీఎఫ్ వందశాతం చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు తెలిపారు. శనివారం హనుమకొండలోని అలంకార్ జంక్షన్లోని టీఎన్జీఓస్ భవన్లో టి.రఘువీరు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను మోసం చేస్తోందని, జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా తాము నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ జిల్లాలకు ఇన్చార్జ్ లను నియమించినట్లు తెలిపారు. హనుమకొండకు ఎం.సంజీవరెడ్డి, ఎ.సురేందర్, వరంగల్కు టి.రఘువీర్ను నియమించినట్లు దేవదాసు తెలిపారు. కార్యక్రమంలో ఎ.సురేందర్, ఎం.పాపయ్య, పెద్ది ఆంజనేయులు, కామేశ్వర్, పి.సాంబయ్య, మీసా రాజమల్లయ్య, డాక్టర్ బి.కృష్ణమూర్తి, సాల్మన్, ప్రభుదాస్, వేణుగోపాల్రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. భువనేశ్వరి బదిలీ విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ)గా ఎ.మధుసూదన్రావు హైదరాబాద్ డీఈఓ కార్యాలయం నుంచి బదిలీపై వస్తున్నారు. ఈమేరకు సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏసీజీఈగా విధులు నిర్వర్తిస్తున్న భువనేశ్వరి ఇక్కడి నుంచి హైదరాబాద్లోని ఎస్సెస్సీ బోర్డులో ఏసీజీగా బదిలీ అయ్యారు. కాగా, మధుసూదన్రావు సోమవారం విధుల్లో చేరుతారని సమాచారం. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు (ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 8నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ ఆిసీం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8, 10, 12, 15, 17, 19, 20 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. టెన్త్ పరీక్షలకు 3,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,792 మంది (83.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా 91.72 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం, ములుగు జిల్లా 90.62 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం, హనుమకొండ జిల్లా 89.04 శాతం ఉత్తీర్ణత ఏడో స్థానంలో నిలిచింది. హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా ఫస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 6,568 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,174 మంది (78.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లా 81.66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 81.51 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు టెన్త్లో 83.17 శాతం, ఇంటర్లో 78.78 శాతం ఉత్తీర్ణత -
హోర్డింగ్.. హోల్డాన్!
ఖమ్మం రోడ్డులో ప్రైవేట్ భవనాలపై హోర్డింగులు వరంగల్ అర్బన్: నగరంలో బలహీన హోర్డింగులు, చిరిగిపోయిన ఫ్లెక్సీలు నగరవాసులను భయపెడుతున్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు ఏ హోర్డింగ్, ప్లెక్సీ అయినా వాహనదారులపై, బాటసారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయంపై దృష్టి సారించిన బల్దియా.. నగర ప్రజల రక్షణను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం కనిపించట్లేదనే విమర్శలున్నాయి. గతంలో న్యాయస్థానాలు హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీలతో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందేందుకు చొరవ తీసుకోకపోవడంపై ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అనధికారమే అధికం హోర్డింగులు, యూనిపోల్స్, ఫ్లెక్సీల ఏర్పాటులో బల్దియా అధికారులు నిబంధనలు పాటించారా? త గు జాగ్రత్తలు చేపడుతున్నారా? అనే అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ జంక్షన్లలో, పలు భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనల హోర్డింగ్ తీరును పరిశీలించిన దాఖలాలు లేవు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్ల వెంట ప్రకటన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగర పరిధిలో 1,200 వరకు హోర్డింగ్లున్నాయి. బల్దియా నుంచి అనుమతి పొందకుండానే సగానికి పైగా ఇష్టానుసారంగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. చర్యల మాటేంటి? అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రకటనల బోర్డులపై చర్యలు తీసుకునేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు సహసించడం లేదని తెలుస్తోంది. యాడ్ సంస్థలకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం స్వీయ నిర్ధారణ పత్రాలు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారని తెలుస్తోంది. కొందరు బల్దియా సిబ్బంది కొన్ని ప్రైవేట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందం చేసుఉని నిబంధనలు పాటించకపోయినా లైట్గా తీసుకుంటున్నారనే ఆరోపణలన్నాయి. నగరంలో ఏటా గాలులు, భారీ వర్షాల సమయంలో అనేక చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లు ధ్వంసమవుతున్నాయి. చెదురుముదురుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత హడావు డి చేస్తూ తదుపరి నివేదికలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈవిషయంపై బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని.. ప్రమాణాలు పాటించకపోతే హోర్డింగ్లు తొలగిస్తామని తెలిపారు.‘గ్రేటర్’వాసులను కలవరపెడుతున్న బలహీన హోర్డింగ్లు గట్టిగా గాలొచ్చినా నేలకొరిగే ప్రమాదం! నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండినిబంధనలేం చెబుతున్నాయంటే.. ఏదైనా ఒక భవనంపై హోర్డింగ్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో పరిశీలించాలి. భవన పటిష్టత, హోర్డింగ్ ఐరన్, నిర్దేశిత సైజు, స్థాయిలో ఉందా లేదా? అనేది చూడాలి. ప్రజాప్రయోగ (పబ్లిక్ ప్లేసెస్) ప్రాంతాల్లో కూడళ్లలో బహిరంగ ప్రచారం నిషేధం. నడిరోడ్లపై, ట్రాఫిక్ సిగ్నళ్ల వాహనాలు మూలమలుపుల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పార్కులు, శ్మశాన వాటికల వద్ద ప్రచారాలను అనుమతించకూడదు. మహా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకుండా చిన్న వాల్ పోస్టర్ కూడా అంటించకూడదు. దీన్ని ఎవరూ ఉల్లంఘించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తే రూ.5 వేలకు పైగా జరిమానా విధిస్తారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తారు. -
మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో జూన్ 15 నాటికి ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంపై తహసీల్దార్లు, బీఎల్ఓ, సూపర్వైజర్లతో శుక్రవారం కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ శ్రీనివాస్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు వెంకటేశ్, డీఎస్. వెంకన్న, తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బహిరంగంగా పొగ తాగితే చర్యలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఏటీసీపీ)లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ పొగాకు నియంత్రణ చట్టం (కోట్పా యాక్ట్) జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 31న నిర్వహించే ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య జిల్లాలో చేపడుతున్న పొగాకు నియంత్రణ కార్యక్రమాలను వెల్లడించారు. సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామకృష్ణ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ రాజారెడ్డి, డీఐఈఓ గోపాల్, ఏసీడీ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాస్, డీటీఓ వేణుగోపాల్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.‘ఎస్ఐఆర్’ హెల్ప్డెస్క్ల ఏర్పాటు ఎస్ఐఆర్–26 ప్రక్రియకు సంబంధించిన సమాచారం, సవరణలు, సహాయం కోసం హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి హెల్ప్డెస్క్ ఉంటుందని తెలిపారు. టోల్ఫ్రీ 1800–425–1126 /9701777182 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో ఆయా మండలాల ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులతో సమీక్ష -
ఇక.. ఇండోర్ సబ్స్టేషన్లు
పట్టణాలు, నగరాల్లో ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్ శ్రీకారంహన్మకొండ: ఇంటికి విద్యుత్ కావాలి కానీ, తన ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ పెట్టొద్దు.. ఇలా ప్రతి కాలనీలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు స్థానికుల నుంచి అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులు. సబ్స్టేషన్ ఏర్పాటుచేయాలంటే విశాలమైన స్థలం అవసరంనగరాలు, పట్టణాల్లో భూములకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంత ఖరీదు పెట్టి యాజమాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తక్కువ స్థలంలో నిర్మించాలనే ఆలోచనకు వచ్చిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మొదటిసారి ఇండోర్ సబ్ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆరు ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తుండగా, అందులో గ్రేటర్ వరంగల్ పరిధిలో రెండు ఉన్నాయి. స్థలం.. ఖర్చు ఇలా.. ● సాధారణంగా ఒక 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరం. కానీ, స్థల సమస్య కారణంగా ఎకరం స్థలం నుంచి 15 గుంటల స్థలానికి చేరుకున్నారు. ● నగరాలు, పట్టణాల్లో 15 గుంటల భూమి లభ్యత సమస్యగా పరిణమించడంతో తక్కువ స్థలం, సమయంలో సబ్ స్టేషన్ నిర్మించాలనే ఆలోచనలో భాగంగానే ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. ● ఇండోర్ సబ్ స్టేషన్కు కనీసం 600 గజాల స్థలం అవసరం కాగా, ఈ స్థలం కూడా లభించకపోవడంతో 400 గజాల్లోనే నిర్మిస్తున్నారు. ● సాధారణ సబ్ స్టేషన్తో చూసుకుంటే ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నది. ● సాధారణ 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల ఖర్చయితే, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.6.50 కో ట్ల నుంచి రూ.7 కోట్లు ఖర్చవుతుంది. ● టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ముందుగా రూ.3,770.43 లక్షల వ్యయంతో ఆరు ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి పూనుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి ఆరు చోట్ల.. అందులో గ్రేటర్ వరంగల్లో రెండు ఏర్పాటు స్థల సమస్య కారణంగా ఖర్చు ఎక్కువైనా భరించాలని నిర్ణయం -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట/ఖిలా వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలను రేపటిలోగా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా రవాణాధికారి శోభన్బాబు, డీఎంసీఎస్ సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. పోషకాహారం తీసుకోవాలి వరంగల్ చౌరస్తా: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ పైడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు’పై శుక్రవారం అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ కార్తీక్ వీడియోలు ప్రదర్శించారు. గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు 1,000 రోజుల ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా ఆటబొమ్మలు, అభ్యసన సామగ్రి తయారీని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. -
‘ప్రీ ప్రైమరీ’కి ప్రయారిటీ !
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత విద్యాసంవత్సరంలో ప్రీప్రైమరీ తరగతులకు ఆదరణ లభించడంతో మరిన్ని స్కూళ్లలో ఏర్పాటుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించుకునేలా గది ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఒక్కో తరగతికి రూ.లక్ష నిధులు హనుమకొండ జిల్లాలో 39, వరంగల్ జిల్లాలో 48 స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్రీ ప్రైమరీ సెక్షన్కు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. చిన్నారులను ఆకర్షించేలా తరగతిగది గోడలపై అక్షరాలు, సంఖ్యలు, వివిధ చిత్రాలు పేయింటింగ్ చేయించనున్నారు. ఆటలతో కూడిన విద్యనందించేందుకు ఆటవస్తువులను కూడా అందిస్తారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రతీ ప్రైమరీ సెక్షన్కు ఒక ఇన్స్ట్రక్టర్ను ఒక ఆయా చొప్పున నియమిస్తారు. ప్రీప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. అంగన్వాడీ స్కూళ్లకు సమీపంలో ఉండేవారికి అదనంగా స్నాక్స్ కూడా అందించనున్నారు. ఎస్సీఆర్టీఈ పాఠ్యప్రణాళిక ఆధారంగా వారికి విద్యను అందిస్తారు. హనుమకొండలో 39, వరంగల్లో 48 స్కూళ్లలో సెక్షన్ల ఏర్పాటు ఒక్కో ప్రీప్రైమరీకి రూ.లక్ష నిధులు -
పొల్యూటెన్షన్ !
మూడు నెలలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (పీఎం10) ఇలా..గ్రేటర్ వరంగల్లో తగ్గుతున్న గాలి నాణ్యతసాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరవాసులకు వాయు కాలుష్యం టెన్షన్ పట్టుకుంది. 2025తో పోల్చుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 29 నుంచి 31 మైక్రోగ్రాముల మధ్య బాగా ఉంటే ఈ ఏడాది అది 77 మైక్రోగ్రాములకు చేరుకున్నా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది అఖరునాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం 10) పరిమితి 100 మెక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. మడికొండలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్ల నిర్మాణం, వివిధ పరిశ్రమల రాకతో ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య, వాహనాల రాకపోకలు పెరగడం ద్వారా వాటినుంచి వెలువడే ఉద్గారాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటోంది. ప్రతినెలా పీసీబీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తుండగా వేసవి కాలం వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డు ఉన్న మడికొండలో మాత్రం పీఎం 10, పీఎం 2.5 పరిమితికి మించి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలకు తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఆస్తమా బారిన పడుతున్న వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, నగ రంలో ప్రతినెలా గాలి నాణ్యతను పరీక్షించేందుకు వరంగల్ మీ సేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవా కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్ స్టేషన్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ సునీత తెలిపారు. నెలలో తొమ్మిదిసార్లు చెక్ చేస్తామని పేర్కొన్నారు. మరో ఆరు స్టేషన్లు అవసరమే.. ● వరంగల్, హనుమకొండలో కలిపి రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండగా, కీలకమైన ప్రాంతాల్లో మరో ఆరు స్టేషన్ల వరకు ఏర్పాటుచేస్తే ఏక్యూఐ సమాచారంతో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. లేదంటే నగరవాసులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే ఓజోన్ లెవల్స్, కార్బన్ మోనాకై ్సడ్ లెవల్స్ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి. ● హనుమకొండ శివారులోని చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. అందుకు సంబంధించి అక్కడ నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను ఇంకా అప్డేట్ చేయడం లేదు. పీసీసీబీ మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 లెవల్ 60 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే ప్రమాదం. హనుమకొండ ‘కుడా’ ఆఫీస్లో జనవరిలో 19, ఫిబ్రవరిలో 18, మార్చిలో 18, వరంగల్ మీ సేవాలో జనవరిలో 26, ఫిబ్రవరిలో 21, మార్చిలో 18 మైక్రోగ్రాములు ఉండడంతో ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు. సల్ఫర్ డైయాకై ్సడ్ (ఎస్ఓ 2), నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్ఓఎక్స్) 80 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా.. కానీ ఎనిమిదిలోపు, 16 మైక్రోగ్రాముల్లోపు నమోదైంది. అమ్మోనియా 400 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా 30 మైక్రోగ్రాముల లోపు ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ౖపైపెకి.. ఏక్యూఐ గతేడాది 31 ఉంటే ఈసారి 77 మైక్రోగ్రాములు ఎం 10 పరిమితి కూడా 77 మైక్రోగ్రాముల నమోదు డంపింగ్ యార్డ్తో మడికొండ చుట్టుపక్కల ప్రమాదకరస్థితి -
వరంగల్ మార్కెట్కు వరుస సెలవులు
ఖిలా వరంగల్: రోహిణి కార్తెలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రైతులు, వ్యాపారులు, గమస్తాలు, దడువాయి, కార్మికులు వడదెబ్బకు గురవకుండా జూన్ 1 నుంచి 7 వరకు సెలవు దినాలుగా ప్రకటించాలని మార్కెట్ కార్మిక సంఘాలు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యవర్గం ప్రతినిధులు కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు వరుస సెలవులు ప్రకటిస్తూ శుక్రవారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న తిరిగి మార్కెట్ యార్డు పునఃప్రారంభం కానుందని స్పష్టం చేశారు. రైతులు తమ సరుకులను సెలవు రోజుల్లో మార్కెట్కు తీసుకురావొద్దని కోరారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్ షురూ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–27) ప్రవేశాలకు పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెల్ప్లైన్ సెంటర్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న అభ్యర్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ధ్రువీకరణ పత్రాలను అందించారు. జూన్1వ తేదీ వరకు ఈ సర్టిఫికెట్ల ప్రక్రియ కొనసాగనుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: వరంగల్ బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ మంగళవారం బదిలీ అయ్యారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధి బీఈడీ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 8 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీం ఇక్బాల్ తెలిపారు. జూన్ 8, 9, 10, 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో చూడొచ్చని తెలిపారు. విద్యారణ్యపురి: ‘ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాడుదాం’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కార్యనిర్వాహక కార్యదర్శి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలోని ప్రభుత్వ సుబేదారి పాఠశాలలో నిర్వహించిన విద్యారంగ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించనున్న ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి, డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ఆయా సంఘాల రాష్ట్ర బాధ్యులు రావుల రమేశ్, అటుకుల శ్రీనివాస్రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, జి.ఉప్పలయ్య, అన్నారెడ్డి, మహేందర్రెడ్డి, కుమారస్వామి, రాంరెడ్డి, సుదర్శనం, శ్రీనివాస్రావు, సుదర్శన్ వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. సంప్రదాయాలు కాపాడాలిహన్మకొండ కల్చరల్/హన్మకొండ: ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి అన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లిన మహాస్వామి.. తిరుగు ప్రయాణంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు స్వగృహానికి శుక్రవారం వెళ్లారు. స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కెప్టెన్ వొడితల లక్ష్మీకాంత రావు, సరోజనీ దేవి దంపతులు, మనుమడు ఇంద్రనీల్, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారితో భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషుశర్మ, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ, పద్మాక్షి దేవాలయ అర్చకుడు నాగిళ్ల షణ్ముఖ శర్మ తదితరులు ఉన్నారు. -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్ట్టులకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3వ, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను 4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఓవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ. రూ.75 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే పింక్బుక్ 2026–27లో కేటాయింపు వరంగల్ ఆర్ఓఆర్ సర్వేకు రూ.10 కోట్లు కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ. 0.43 కోట్లు -
పూడికతీతతో భూగర్భ జలాల వృద్ధి
హసన్పర్తి: పూడికతీతతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపడుతున్న 56వ డివిజన్ గోపాలపురం ఊర చెరువు పూడికతీత పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఏటా వర్షాకాలంలో గోపాలపురం ముంపునకు గురవుతోందని, అయితే ఈ వరద ముంపు సమస్యలను తగ్గించేందుకు పూడికతీత పనులు దోహదపడతాయన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. గోపాలపురంలోని పలు కాలనీలు ముంపునకు గురవకుండా చెరువు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఊర చెరువును సుందరీకరించాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రుద్రోజు మహేందర్నాఽథ్, పూర్ణచందర్, మర్రి ప్రభాకర్, భూక్య విజయ్, దూలం రాజు, అనిత తుపాకుల దశరథం తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య గోపాలపురం చెరువు పూడికతీత పనులు ప్రారంభం -
రెవెన్యూ ఆఫీసర్స్
తహసీల్దార్ బాధ్యతలు ● భూ భారతి రిజిస్ట్రేషన్లు ● భూ కేటాయింపులు ● లా అండ్ ఆర్డర్ విధులు ● ఎన్నికల నిర్వహణ ● పౌర సరఫరాల పర్యవేక్షణ ● రేషన్ కార్డుల వ్యవహారాలు అదనపు తహసీల్దార్ బాధ్యతలు ● ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీ ● సహజ విపత్తుల సహాయక చర్యలు ● రెవెన్యూ రికవరీ కేసుల పర్యవేక్షణ ● భూ ఆక్రమణల తొలగింపు ● రైస్ మిల్లులు, ఫెయిర్ ప్రైస్ షాపుల తనిఖీలు ● ఎన్నికల నిర్వహణలో సహకారం పట్టణ, మండలాలకు అదనపు తహసీల్దార్ల నియామకం సాక్షిప్రతినిధి, వరంగల్: వేగంగా విస్తరిస్తున్న పట్టణాలు.. పెరుగుతున్న జనాభాతో రెవెన్యూ కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల కోసం ప్రజలకు నిరీక్షణ తప్పట్లేదు. వీటితో పాటు భూ వివాదాలు, భూ భారతి దరఖాస్తులతో మండల కార్యాలయాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణ మండలాల్లో అదనపు తహసీల్దార్ పోస్టులను సృష్టిస్తూ సీఎస్ఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలా వరంగల్, కాజీపేట, హనుమకొండ, హసన్పర్తి, మహబూబా బాద్ మండలాలకు కొత్త పోస్టులు మంజూరయ్యా యి. ప్రత్యేకంగా వరంగల్–హనుమకొండ నగర పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విస్తరణ, భూ లావాదేవీలు పెరగడంతో రెవెన్యూ శాఖపై ఒత్తిడి మరింత అధికమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అదనపు తహసీల్దార్ పోస్టులు సృష్టించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రెవెన్యూ సేవలు వేగవంతం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. కొత్త పోస్టులు ఎక్కడెక్కడంటే.. నాయబ్ తహసీల్దార్లను అదనపు తహసీల్దార్లుగా జిల్లాలకు కేటాయించిన ప్రభుత్వం.. వారిని సంబంధిత మండలాల్లో నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. హనుమకొండ జిల్లాకు మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెంలో నాయబ్ తహసీల్దార్లుగా పని చేస్తున్న ఆకుల రవి, గడ్డం రమేశ్, ఎంఎస్ గౌతమ్ను కేటాయించారు. హనుమకొండ జిల్లాలో నాయబ్ తహసీల్దార్లుగా ఉన్న ఎల్.భాస్కర మూర్తి, ఎండీ యూసుఫ్ ఖురేషీలను వరంగల్ జిల్లాకు, హనుమకొండ జిల్లాలోనే నాయబ్ తహసీల్దారుగా ఉన్న ఎం.రంజిత్కుమార్ను మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు. హనుమకొండ జిల్లాలో నాయబ్ తహసీల్దార్లుగా పని చేస్తున్న శ్రీధర్, వి.శైలజను పెద్దపల్లికి, వరంగల్లో ఉన్న ఎస్.రాజరేణుకను ఖమ్మం, ఐ.పవన్కుమార్ను భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ చేశారు. ఒత్తిడి తగ్గేనా? పట్టణ మండలాల్లో రోజుకు వందల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల కోసం తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. ఒకే అధికారిపై అధిక భారం ఉండడంతో ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తోందనే విమర్శలున్నాయి. కొత్త పోస్టులతో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న రెవెన్యూ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు కేటాయింపు మూడు జిల్లాల్లో ఆరు మండలాలకు కొత్త పోస్టులు భూ భారతి నుంచి ధ్రువపత్రాల సేవలకు వినియోగం -
రిజిస్ట్రేషన్లు మరింత భారం
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భూమి విలువలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం సూచించిన మార్కెట్ వ్యాల్యూ, మార్కెట్లో భూమి విలువను పోలుస్తూ 25 శాతం నుంచి వందశాతం ప్లాట్లకు, వ్యవసాయానికి మూడింతలు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు మార్కెట్ వ్యాల్యూను అనుసంధానం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో పెంచిన మార్కెట్ వ్యాల్యూ ఆచరణలోకి రానున్నట్లు సమచారం. నాలుగేళ్ల తర్వాత పెంపు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో దస్తావేజుల రిజిస్ట్రేషన్కు 1 ఫ్రిబవరి 2022 రిజిస్ట్రేషన్ ఫీజు 0.5, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 స్టాంప్స్ డ్యూటీ 4.5 నుంచి 7.5 స్టాంప్స్ డ్యూటీగా పెంచారు. కాగా, 2024లో ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రతిపాదించినప్పటికీ ధరలు పెరగలేదు. నా లుగేళ్ల తర్వాత భూమి మార్కెట్ విలువలను పెంచేందుకు జీఓ నంబర్ 101ను మే 5న విడుదల చేసి, 2024న ప్రతిపాదించిన మార్కెట్ వ్యాల్యూతో పెంచాలని సూచించింది. దీంతో భూమి మార్కెట్ విలువ 7.5 నుంచి 8.5 వరకు స్టాంప్స్ డ్యూటీ, మ్యూటేషన్ ఫీజు 3 వేల నుంచి 4 వేలకు పెరిగే అవకాశం ఉంది. దీంతో క్రయవిక్రయదారులకు పెంచిన మార్కెట్ విలువతో భారం పడనుంది. భూముల విలువ ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిల్ల పల్లిలో అత్యల్పంగా 600 మార్కెట్ వ్యాల్యూ ఉండగా, వందశాతం పెంచితే 1,200 అవుతుంది. అత్యధికంగా హనుమకొండ చౌరస్తాలో రూ.46 వేలు ఉండగా 70 నుంచి 85 శాతం పెరిగే అవకాశం ఉంది. అపార్ట్మెంట్లకు స్క్వేర్ ఫీట్కు రూ.2,300 ఉండగా రూ.3 వేలు అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు మూడింతలు పెంచితే ప్రస్తుతం రూ.1.35 కోట్లు విలువ ఉండగా.. రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు వరకు పెరిగే అవకాశం ఉంది. భారం తగ్గించుకునేందుకు.. పెరగనున్న మార్కెట్ వ్యాల్యూతో భారం పడుతుందని, తగ్గించుకునేందుకు ముందే రిజిస్ట్రేషన్లు చేసుకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భూక్రయవిక్రయదారులకు పోటెత్తుతున్నారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో110 స్లాట్లు ప్రతీ రోజు అందుబాటులో ఉండగా.. సాధారణంగా 60 నుంచి 80 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో 605 రిజిస్ట్రేషన్ల దస్తావేజులు పూర్తి చేసుకున్నాయి. తేదీ రిజిస్ట్రేషన్లు మే 21 105 22 100 23 107 25 92 26 93 27 108మార్కెట్ వ్యాల్యూ సవరణలో భాగంగా రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తకుండా కార్యాలయాల పని వేళలు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రాజీవ్గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ఉదయం 10.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి రాత్రి 7.30 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 48 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అందుబాటులో ఉంటే 98తో పాటు మరో 10 స్లాట్లు అందుబాటులో ఉండగా.. రిజిస్ట్రేషన్ల అవసరం నిమిత్తం స్లాట్స్ మ రింత పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్ రెండో వారంలో భూమి విలువ పెంపు ఆదాయం పెంచుకునే యోచనలో సర్కారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తుతున్న భూ క్రయవిక్రయదారులు -
ఈద్గాలను సందర్శించిన సీపీ
వరంగల్ క్రైం: బక్రీద్ పండుగను పురస్కరించుకుని హనుమకొండలోని బొక్కలగడ్డ ఈద్గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గురువారం సందర్శించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ప్రార్థనలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ నర్సింహారావు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాజీపేట: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి, దానమ్మ దంపతులు పుట్టిన గడ్డపై నాలుగున్నర దశాబ్దాల తర్వాత అడుగుపెట్టారు. గురువారం రాత్రి సోమిడికి వచ్చిన ఆ దంపతులకు గ్రామస్తులు, బంధుమిత్రులు కాజీపేట చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. సన్మానించి అభినందనలు తెలిపారు. కాజీపేట వాటర్ ట్యాంక్ నుంచి భారీ ఊరేగింపుగా నరహరి దంపతులను సోమిడి గ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను చూసిన నరహరి భావోద్వేగానికి గురయ్యారు. ఈసందర్భంగా పాత కాలం నాటి జ్ఞాపకాలను ఆనాటి మిత్రులతో నరహరి పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బి.వెంటేశ్, మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి, సుంచు అశోక్, బస్వా యాదగిరితో పాటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హెల్త్కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలి కాళోజీ సెంటర్: హెల్త్కార్డుల మార్గదర్శకాలు విడుదల చేయాలని, కార్డుల ద్వారా అందించే సేవలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు డి.మహేందర్రెడ్డి అధ్యక్షతన గురువారం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ కార్డుల ద్వారా అందించే సేవలపై సందేహాలు నెలకొన్నాయని, హడావుడిగా అమలు చేసి ఉద్యోగుల నుంచి చందా తీసుకోవద్దని కోరారు. ఉపాధ్యాయులు జనగణనలో ఉన్నందున సర్వీస్ వివరాలను ఐఎఫ్ఎంఎస్లో పొందుపర్చడానికి గడువు పొడిగించాలని పేర్కొన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్త్కార్డులపై సేవలను పొందడం ఐచ్ఛికం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, సభ్యులు ఎస్.సుధారాణి, డి.కుమారస్వామి, టి.సూరయ్య, టి.ఆనందచారి, నర్సింహులు, ఆర్.రాంరెడ్డి, డి.శ్రీనివాస్, ఫ్రాన్సిస్ జేవియర్ పాల్గొన్నారు. -
బిషప్ విజయపాల్రెడ్డికి అభినందనలు
కాజీపేట రూరల్: ఇటీవల ఎన్నికై న వరంగల్ క్యాథలిక్ డయాసిస్ పీఠాధిపతి బిషప్ దుగ్గింపుడి విజయపాల్రెడ్డిని కాజీపేట ఫాతిమానగర్ బిషప్ హౌస్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు బొకే అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు కొమ్మారెడ్డి జోసెఫ్రెడ్డి, గంగారపు అనుకిరణ్, నారాయణరెడ్డి, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, కాంగ్రెస్ నాయకులు సింగారపు రవిప్రసాద్, డాక్టర్ శ్రావణ్, ఏనుగుల రాంప్రసాద్, అమర్, అరూరి సాంబయ్య, మట్టెడ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయినిని కలిసిన ఆర్డీఓ వెంకటేష్ హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ఆర్డీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్.. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆర్డీఓకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. -
‘ముఖ గుర్తింపు’లో ఇబ్బందులు
కాశిబుగ్గ: ప్రభుత్వం ఆసరా ఫించన్దారుల కోసం నిర్వహిస్తున్న ముఖ గుర్తింపు (ఫేస్ అథెంటిక్) ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతీ డివిజన్లో ఫించన్దారుల ముఖగుర్తింపు కోసం ఫొటోలు తీయడంలో ఇక్కట్లకు గురవుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఫొటోల అప్లోడ్లో సమస్యలు చాలా ఏళ్ల క్రితం పింఛన్దారులు ఫొటోలు దిగడం, సుమారు పదిహేను ఏళ్ల క్రితం ఆధార్కార్డు తీసుకోవడం వల్ల అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పింఛన్దారుల ఆధార్కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉండడంతో అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక మీసేవ కేంద్రాల చుట్టూ ఫించన్దారులు తిరగాల్సి వస్తోంది. ఆధార్లో తెలంగాణగా మార్చుకోవడానికి రెసిడెన్షియల్ పత్రం తీసుకురావాలని ఆధార్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పింఛన్దారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి రెసిడెన్షియల్ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవలో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ కార్యాలయం ద్వారా సదరు సర్టిఫికెట్ జారీ చేయడానికి కనీసం వారం, పది రోజులు పడుతోందని పింఛన్దారులు చెబుతున్నారు. త్వరగా రావాలంటే మీసేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా డబ్బులు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ గుర్తింపు ప్రక్రియలో ఫొటో సెల్లో తీసుకున్నప్పుడు వృద్ధుల ముఖ కదలికలు మారితే తీసుకోవడం లేదని అధికారులు అంటున్నారు. కంటి ఆపరేషన్లు చేసుకున్న వారి ఫొటోలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ముఖగుర్తింపునకు బదులు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దివ్యాంగులు, మానసిక దివ్యాంగులకు తప్పని తిప్పలు దివ్యాంగులు, మానసిక దివ్యాంగులు ముఖ గుర్తింపు కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అసలే, వేసవికాలం ఆపై ఎండలు తీవ్రంగా ఉండడంతో భయపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ముఖ గుర్తింపు కోసం సిబ్బందిని ఇళ్ల వద్దకే పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వయస్సు పైబడి నడవలేని వారి ఫొటోలను కూడా ఇంటి వద్దే తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ గుర్తింపు గడువును జూన్ 15 కాకుండా మరో నెల రోజుల పాటు పొడిగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆధార్కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండడంతో నిరాకరిస్తున్న అధికారులు మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న ఆసరా లబ్ధిదారులు -
ముస్లింల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కాశిబుగ్గ: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్లోని ఎల్బీనగర్లో ఈద్గాలో గురువారం నిర్వహించిన ప్రార్థనలో మంత్రి సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది ముస్లింల జీవితాల్లో మార్పు వచ్చిందని గుర్తుచేశారు. ఎల్బీనగర్ ఈద్గాను మరింత అభివృద్ధి చేసి, ఖబ్రస్తాన్ కోసం భూమి కేటాయింపునకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ తరఫున కొండా దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, డాక్టర్ షేక్ హుస్సేన్, ఎండీ సర్దార్ పాషా, ఎంఏ ఖాధర్, ఎండీ వాజీద్, మౌలానా అత్ఖర్ రహ్మాన్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
అత్యవసర వైద్యసేవలపై అవగాహన
హన్మకొండ చౌరస్తా: ప్రపంచ అత్యవసర వైద్యసేవల దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని అజర ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవల ప్రాముఖ్యం, వేగవంతమైన చికిత్స, ప్రాణ రక్షణలో సమయస్ఫూరి అనే అంశాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అజర ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అత్యవసర వైద్య విభాగంలో ప్రతీ సెకన్ ఎంతో విలువైనది, సరైన సమయంలో నైపుణ్యంతో కూడిన వైద్యసేవలు అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. ఎల్లప్పుడూ అత్యాధునిక ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ సేవలను రోగులకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వివిధ ఆస్పత్రుల వైద్యులు ఒకే వేదికపై కలిసి అత్యవసర వైద్యసేవలపై చర్చించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ నగర, పరిసర ప్రాంతాలకు చెందిన పలు ప్రముఖ ఆస్పత్రుల వైద్యులు, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, అనస్తీషియన్లు, సర్జన్లు, పల్మనాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
29 నుంచి టీపీసీసీ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు
కాశిబుగ్గ: ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండలం స్తంభంపల్లిలోని ఏవీఎస్ హైస్కూల్లో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు తెలిపారు. ఈ మేరకు వరంగల్ ఓ సిటీలోని క్యాంపు కార్యాలయంలో రచయితల వర్క్షాపు వాల్పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కళాకారులకు కొదవ లేదని, ప్రతీ ఇంటిలో ఒక కళ ఉందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో కళాకారులకు ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా పాటలు, పల్లె సుద్దులు, వీధి నాటకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, టీపీసీసీ సాంస్కృతిక సేవా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సుధాకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలెపాక రమేష్, జన్ను శివకృష్ణ, గీకూరు సాంబయ్య పాల్గొన్నారు. -
ఇక బాల్య వివాహాల కట్టడి!
సాక్షి, వరంగల్: బాల్య వివాహాలను క్షేత్రస్థాయిలో కట్టడి చేసేందుకు వరంగల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) సరికొత్త పంథాతో ముందుకెళ్తోంది. విలేజ్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల నియామకాలు ఓవైపు చేపడుతూనే.. మరోవైపు సర్పంచ్ల నుంచి డిక్లరేషన్ తీసుకుంటూ బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో నియంత్రించే దిశగా అడుగులు వేస్తోంది. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మార్గదర్శనంలో జిల్లా సంక్షేమ విభాగాధికారి, ఇన్చార్జ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పర్వతగిరి, నెక్కొండ, ఖానాపురం మండలాల్లో ఇప్పటివరకు 50 మంది సర్పంచ్ల నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. మిగిలిన గ్రామసర్పంచ్ల నుంచి కూడా సాధ్యమైనంత తొందరగా తీసుకోనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బాల్యవివాహాలు కాకుండా ఉండేందుకు సర్పంచ్లనే బాధ్యులనే చేయడం ద్వారా ‘జీరో చైల్డ్ మ్యారేజ్’ చేయాలని ముందుకెళ్తున్నారు. చాలా బాల్యవివాహాల సమాచారం అందిన సందర్భాల్లో ఆ ఊరి పెద్దలు, కొందరు సర్పంచ్ల ప్రమేయం ఉందని తెలియడంతో.. వారికే బాధ్యత ఇవ్వడం ద్వారా బాల్యవివాహ రహిత గ్రామాలుగా మార్చవచ్చని డీసీపీయూ విభాగాధికారులు అంచనా వేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నియామకం దిశగా అడుగులు... వరంగల్ జిల్లాలో 392 వీసీపీసీ (విలేజ్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ)లు, అర్బన్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే 214 వీసీపీసీలు, ఐదు మండలాల (గీసుకొండ, నర్సంపేట, దుగ్గొండి, సంగెం, ఖానాపురం)కు బాలల పరిరక్షణ కమిటీలను నియమించింది. అలాగే, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నియామకం కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇంకోవైపు గ్రామస్థాయిలో కార్యదర్శి, సెక్టార్ లెవల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్, మండలస్థాయిలో తహసీల్దార్, ప్రాజెక్టు లెవల్లో సీడీపీఓలు, డివిజినల్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్ ‘చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్’గా వ్యవహరిస్తారు. బాల్యవివాహం ఘటనపై అంగన్వాడీ సూపర్వైజర్లే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. జీరో చైల్డ్ మ్యారేజ్ కోసం సర్పంచ్ల నుంచి డీసీపీయూ డిక్లరేషన్ మూడు మండలాల్లో ఇప్పటికే 50 మంది నుంచి లిఖితపూర్వక హామీలు కలెక్టర్ సత్యశారద పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ముందుకు.. స్నేహ గ్రూపులను జాగృతం చేసే దిశగా.. పాఠశాలల స్థాయిలో ఉన్న స్నేహ గ్రూపులను జాగృతం చేసే దిశగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ’ (బాల్యవివాహం...బతుకు ఆగం ట్యాగ్లైన్)తో బాల్యవివాహం నిరోధక చట్టం–2016పైనే కలెక్టర్తో సహా సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. 2025 నుంచి ఇప్పటివరకు 35 బాల్యవివాహాల కేసులు నమోదయ్యాయి. సీరియస్గా తీసుకున్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద బాల్య వివాహాలను పూర్తిగా కట్టడి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. బాల్యవివాహ నిషేధ చట్టం 2016 ప్రకారం.. 18 ఏళ్లలోపు అమ్మాయి, 21 ఏళ్లలోపు అబ్బాయికి పెళ్లి చేయడం నేరం. తల్లిదండ్రులు, బంధువులు, మధ్యవర్తులు, పురోహితులు...ఇలా ఎవరైనా సరే బాల్యవివాహం జరిపించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు విధించే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులో పెళ్లి ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది’ అని స్నేహ గ్రూపులను జాగృతం చేయనున్నారు. -
అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి
● మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దామెర : గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు సమష్టిగా పనిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికై న దుబాసి నవీన్ గురువారం ధర్మారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవీన్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అన్నారు. నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్లు దాడి వసంతరమేష్, పెండ్లి రాజు, వడ్డెపల్లి చంద్రు, తోట రజితశ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
హామీ నెరవేర్చిన సర్పంచ్
వేలేరు : సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో పుట్టే ప్రతి ఆడపిల్లకు తన సొంత డబ్బులు రూ.5,016లు ఇస్తానని సర్పంచ్ జక్కల మౌనిక హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామానికి చెందిన ఎండీ సమ్రీన్–సమీర్ దంపతులకు ఆడపిల్ల జన్మించగా గురువారం వారి ఇంటికి వెళ్లి నగదు అందజేసి హామీ నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్తులు తమపై నమ్మకంతో సర్పంచ్గా గెలిపించారని, వారి నమ్మకాన్ని కాదనకుండా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంపత్, వార్డు సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.శాయంపేట: బోధన చేస్తున్న ముస్లిం మతపెద్ద -
‘సురవరం’ రచనలు మార్గదర్శకం
కేయూ క్యాంపస్: నవయుగ వైతాళికుడు, చరిత్రకారుడు, తెలంగాణ సాహిత్యాభివృద్ధికి విశిష్టసేవలు అందించిన మహనీయుడు సురవరం ప్రతాప్రెడ్డి అని కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు కొనియాడారు. సురవరం ప్రతాప్రెడ్డి జయంతి వేడుకలను కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో గురువారం నిర్వహించారు. తొలుత ప్రతాప్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురవరం ప్రతాప్రెడ్డి రచనలు నేటి తరానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు సమాజ చైతన్యానికి దోహదపడుతాయని చెప్పారు. తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక భాషా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడిగా సురవరం అని అన్నారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ బానోతు స్వామి, డాక్టర్ నాగరాజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
● ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలుఐనవోలు : త్యాగం, సేవాభావానికి ప్రతీక బక్రీద్ అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. గురువా రం మండల కేంద్రంలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి పరస్పర ప్రేమాభిమానాలతో జీవించాలనే గొప్ప సందేశాన్ని పర్వదినం అందిస్తోందన్నారు. హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతీ ఒక్కరు సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడేలా జీవించాలని పిలుపునిచ్చారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ను జరుపుకున్నారు. శాయంపేట : త్యాగానికి ప్రతీకగా బక్రీద్ను ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మతపెద్ద అబ్దుల్లా, ముస్లింలు రాజ్ మహ్మద్, అంకూషావళి, కమురుద్దీన్, జానీసైదా, షారుఖ్ ఖాన్, జమాల్, కరీముల్లా, రఫీ, షఫీ, ఉస్మాక్, సల్మాన్ ఖాన్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులో.. ఆత్మకూరు : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం బక్రీద్ను ముస్లింలు జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఎల్కతుర్తిలో.. ఎల్కతుర్తి : త్యాగం, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా ముస్లింలు గురువారం బక్రీద్ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు సూరారంలో ముస్లింలు బక్రీద్ను జరుపుకున్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కమలాపూర్లో.. కమలాపూర్ : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముస్లింలు గురువారం బక్రీద్ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ముస్లింలు ప్ర త్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తె లుపుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక ముస్లింలు పాల్గొన్నా రు. పరకాలలో.. పరకాల : పరకాల పట్టణంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో గురువారం బక్రీద్ను జరుపుకున్నారు. పరకాల బస్టాండ్ సమీపంలోని ఈద్గాలో సాముహిక ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్ఠతను వివరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డితో పాటు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ త్యాగం, కరుణ, సోదర భావం నిండిన పవిత్ర పండుగ అని కొనియాడారు. స్వార్థాన్ని త్యజించి శాంతి సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరారు. టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీనుతో పాటు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు వీరాచారి, సారయ్య, రాంమోహన్ తెలిపారు. చైర్మన్గా ధన్రాజ్, అధ్యక్షుడిగా విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శిగా బండారి సంతోష్, కోశాధికారిగా డాక్టర్ నన్నపునేని భరత్ కుమార్, ఉపాధ్యక్షులుగా సంపత్, సలీం, విజయ్, అన్వర్, యాకూబ్, వినయ్, మహిళా ఉపాధ్యక్షులుగా జి.నర్మద, జి.వైష్ణవి, సీహెచ్.సుప్రియ, ఎండి.ఆసియా, సంయుక్త కార్యదర్శులుగా కోటేశ్వర్, తిరుపతి, దినేష్ తేజ్, గణేష్, వెంకటేష్, కె.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా జి.రాజు, దేవదాస్, హేమంత్, తిరుమల, రణదీప్, రూపేష్, సాయితేజ, హరి మధన్, శివాత్మిక, సాన్విమోహన్ ఎన్నికై నట్లు వివరించారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్!
విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: ప్రభుత్వ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కువశాతం టైటిల్ పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. కొన్ని టైటిల్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. నోట్బుక్స్తోపాటు ఈసారి వర్క్బుక్స్ను కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు. నోట్బుక్స్, వర్క్ బుక్స్ రావాల్సి ఉంది. అయితే వీటిని నేరుగా మండల కేంద్రాలకే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు 2,56,180 పుస్తకాలు రావాల్సి ఉండగా హైదరాబాద్ నుంచి హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోదాంకు ఇప్పటి వరకు 2,29,980 పాఠ్యపుస్తకాలు (89.73శాతం) చేరుకున్నాయి. ఇంకా 26,300 రావాల్సింది. జిల్లాలోని 14 మండలాల్లోని ఎంఈఓలు తమ మండలాల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తీసుకెళ్లాలని, అందుకయ్యే రవాణా వ్యయం తర్వాత అందజేస్తామని డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ ఆదేశించారు. అంతేకాకుండా గత శనివారంనుంచి మండల కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఎంఈఓలు తమ ఎంఆర్సీ కేంద్రాలకు తరలించాక అక్కడినుంచి హెచ్ఎంలు ఆయా స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జూన్ 12లోగానే ఈ ప్రక్రియ పూర్తి కావాలి. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 36,839 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని విద్యార్థులకు మొత్తం 2,35,750 (పార్ట్–1) పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 1,98,430 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 37,320 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. తగ్గనున్న బ్యాగు భారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘ద్విభాషా విధానం’(ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్) ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ద్విభాషా పుస్తకాల ముద్రణతో విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గనుంది. హనుమకొండ జిల్లా గోదాంకు చేరిన 89.73 శాతం పుస్తకాలు వరంగల్ జిల్లా గోదాంకు 1,98,430 పుస్తకాలు.. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు.. ఆయా పాఠశాలలకు పంపిణీ ప్రక్రియ షురూ.. -
భక్తి ప్రపత్తులతో బక్రీద్ పర్వదినం
కాజీపేట: సర్వమానవ సమైక్యత, సద్భావన, ప్రపంచానికి శాంతి సందేశం అందించిన ఇబ్రహీం ఖలీలుల్లాహ్ తన కుమారుడు ఇస్మాయిల్ను దైవానికి అంకితం చేయడానికి ప్రయత్నించిన పవిత్ర రోజైన బక్రీద్ పర్వదినాన్ని నగరవ్యాప్తంగా ముస్లింలు గురువారం భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. కాజీపేట పట్టణంలో ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మేకలు, గొర్రెలను బలి ఇచ్చి వాటి మాంసాన్ని పేదలకు పంపిణీ చేశారు. ఈద్గా మైదానానికి ముస్లింలు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. మతపెద్ద ఇమామ్ మహబూబ్ రహమాన్ మాట్లాడుతూ సర్వమానవ సమైక్యత, శాంతికోసం అందరూ కలిసిమెలసి జీవించాలని సూచించారు. ముస్లింలకు ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ శుభాకాంక్షలు తెలిపారు. హసన్పర్తిలో.. హసన్పర్తి: బక్రీద్ పర్వదినం సందర్భంగా హసన్పర్తి మండలంతో పాటు గోపాలపూర్, గుండ్లసింగారం, పలువేల్పులలోని ఆయా ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు శుక్రవారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. విష్ణుప్రియ మెయిన్ రోడ్డు, సోమిడిలోని ఉప్పలయ్య, సామ్యల్ డీటీఆర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు అయిల సరోజ (60) మూడు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాజీపేట పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరోజన తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త సంపత్ ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ ఆదేశాల మేరకు ఎస్సై తాళ్లపల్లి యాదగిరి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సరోజన వివరాలు తెలిస్తే 87126 83765, 87126 85008 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు. ఖిలా వరంగల్: బల్దియాకు చెందిన రోడ్డు ఊడ్చే వాహనం వరంగల్ హంటర్ రోడ్డు అవంతి హోటల్ వద్ద బుధవారం అర్ధరాత్రి బోల్తా పడింది. ఈ క్రమంలో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. బల్దియా అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని బోల్తాపడిన వాహనాన్ని జేసీబీ సహాయంతో సరిచేసి అక్కడి నుంచి పంపించారు. కాజీపేట: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కాజీపేట చౌరస్తాలో గురువారం జరుపుకున్నారు. వరంగల్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బర్ల యాకుబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుసుమ శ్యాంసుందర్, నార్లగిరి రామలింగం, ఎండి రహీం, మారగోని మనోహర్, తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్పంప్ జంక్షన్లో.. నయీంనగర్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హనుమకొండ పెట్రోల్పంప్ జంక్షన్లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ నాయకుడు పుట్టా రజనీకాంత్, పార్టీ మాజీ కోశాధికారి జయశంకర్, మనోహర్, శ్యాంసుందర్, ఎండి.రహీం, యాకూబ్, సురేష్, హరి పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కయ్యహన్మకొండ: ప్రతిపక్షాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.చుక్కయ్య విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్పై ఈడీని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ దాడులు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినరయి విజయన్ నాయకత్వంలో కేరళలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేకపోవడంతో రాజకీయ కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల చక్రపాణి, నాయకులు సీతారాం, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, కారు ఉపేందర్, వల్లెపు రాజు, ఎం.రమాదేవి, ఎన్టీఆర్, జంపాల రమేష్, సబిత, రాధ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వర్షాలు కురిసేలోగా కొనుగోళ్లు, లిఫ్టింగ్, నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి టీం వర్క్తో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓలు, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల మధ్య గోదాంల కేటాయింపులో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కొనుగోలు, రవాణా 80 శాతం పూర్తి.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జనగామ జిల్లా పరిధి పలు మండలాల్లో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యంగా జరుగుతోందని, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు, రవాణా ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ లారీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గన్నీ సంచుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం సేకరణ 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 97 శాతం ధాన్యం షిఫ్టింగ్ పూర్తయ్యిందన్నారు. జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ములుగు కలెక్టర్ హేమంత్ బొర్ఖడే సహదేవ రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశానికి రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు -
వృద్ధురాలి అదృశ్యం
కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు అయిల సరోజన (60) మూడ్రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కాజీపేట పోలీస్స్టేషన్లో వారు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరోజన తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త సంపత్ ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ ఆదేశాల మేరకు ఎస్సై తాళ్లపల్లి యాదగిరి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సరోజన వివరాలు తెలిస్తే 87126 83765, 87126 85008 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు. -
అన్నివర్గాలు ఆనందంగా జీవించాలి
నయీంనగర్: బక్రీద్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, త్యాగానికి ప్రతీక అని, సమాజంలోని అన్నివర్గాల ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు. బక్రీద్ సందర్భంగా 6వ డివిజన్ ఈద్గా మైదానంలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాలకతీతంగా ప్రజలు కలిసిమెలసి జీవించాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. -
పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి
దామెర : అమరుడు చిరంజీవి పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎంసీపీఐ (యూ) కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి అన్నారు. మండలంలోని తక్కళ్లపహాడ్లో గురువారం చిరంజీవి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధితో పాటు అవినీతి అక్రమాలను వెలికితీయడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. విద్యావ్యతిరేక విధానాలపై నిరంతం పోరాటం సాగించాడని వెల్లడించారు. ప్రజా సమస్యలపై జూన్ 1 నుంచి 7 వరకు నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్రెడ్డి హంసరెడ్డి, సహాయ కార్యదర్శి నీల రవీందర్, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, కార్యవర్గ సభ్యులు కర్ర రాజిరెడ్డి, చీపురు ఓదయ్య, ఎండీ ఉస్మాన్, వక్కల కిషన్, మంద భద్రయ్య, రమేష్, బండారి మమత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ విద్యాసంస్థలకు అధికారుల అండ
ఖిలా వరంగల్: విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిండా ముంచుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలకు అధికారులే అండగా ఉంటున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ విమర్శించారు. వరంగల్ శివనగర్లోని సీపీఐ తమ్మెర భవనంలో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో అభిరామ్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టెక్నో, డిజీ స్కూళ్ల పేర్లతో ఫ్లెక్సీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సూర్య, వంశీ, శ్రావణ్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బక్రీద్ సందర్భంగా గురువారం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్లోని ఈద్గా మైదానంలో బక్రీద్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎంఏ ఖలీక్ తన్వీర్ (ముతవల్లి) ఆధ్వర్యంలో ఈద్గా మత గురువు మౌలానా మహ్మద్ నౌమన్ రాజా నేతృత్వంలో వక్ఫ్ సీఈఓ మహమ్మద్ హస్సదుల్లా, బల్దియా అధికారుల సహకారంతో 30వేల మంది ముస్లింలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చౌర్బౌలి, ఎల్బీనగర్, శివనగర్, రంగశాయిపేట, శంభునిపేట, శాంతినగర్, ఏకశిల నగర్, కరీమాబాద్, చింతల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం అలయ్ బలయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు హాజరై ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావును ఈద్గా అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాశ్, ఎంఏ జబ్బార్, బాసాని శ్రీనివాస్, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై రాళ్లు.. స్పీడ్ బ్రేకర్లు
పరకాల : పరకాల పట్టణంలోని అంతర్గత రహదారులపై స్థానికులు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న స్పీడ్ బ్రేకర్లతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను తవ్వడంతో పాటు తమ పిల్లల జాగ్రత్త కోసం కొందరు వాహనాల స్పీడ్ నియంత్రణ కోసం ఇంటికో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణంలోని సగరవీధి నుంచి బ్రహ్మణవాడ వరకు 500 మీటర్ల దూరంలోనే 15 స్పీడ్ బ్రేకర్స్ ఉండగా..రాజిపేట కాలనీలో 100 మీటర్ల దూరంలో ఇంటికో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. అదే విధంగా చందుపట్ల వాడలో సైతం ఇంటికో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్లపై పెద్ద పెద్ద రాళ్లు పెట్టడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే మాదిరిగా ఓ కాలనీలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయగా ఓ యువకుడు వాహనం అదుపు తప్పి, బండపై పడి తలకు బలమైన గాయమై.. మృత్యువాత పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం బయటికి రాకుండా రాత్రికి రాత్రే అయా స్పీడ్ బ్రేకర్లు తొలగించారు. మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వారు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనదారులకు నరకం చూపిస్తుంటే పోలీసు యంత్రాంగం కానీ మున్సిపల్ అధికారులు కాని చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రాత్రి వేళల్లో ప్రమాదాలు వీధుల్లో ఇష్టారాజ్యంగా స్పీడ్ బ్రేకర్లు -
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
శాయంపేట : గ్రామంలో ఎక్కడ చూసిన పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు పక్కన మురుగు నీరు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నినాదాలకే పరిమితం.. మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో పారిశుద్ధ్యంపై అధికారులు, పంచాయతీ పాలకులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నా.. అది ఎక్కడా అమలు కా వడం లేదు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నినాదాలకే పరిమితమైందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామంలోని దళితకాలనీ పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు వెళ్లేందుకు సరైన కాల్వ లు లేవు. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గేట్వాల్వ్ లీకేజీ.. గ్రామస్తులకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన గేట్వాల్వ్ లీకేజీ అయింది. దీంతో దాని చుట్టూ మురుగు చేరి అస్తవ్యస్తంగా తయారైంది. గేట్వాల్వ్లో మురికి నీరు పేరుకుపోతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం లేదనే స్థానికులు చెబుతున్నారు. జీపీ సిబ్బంది గేట్వాల్వ్ ఆన్ చేసినప్పుడు పైపులోకి మురుగు నీరు వెళ్లి ప్ర జలు తాగేనీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు గ్రామంలోని రోడ్డు పక్కన ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర వ్యర్థాలు విచ్చలవిడిగా పడేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ప్రయాణికులకు, స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై న గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, పాలకవర్గం పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పేరుకుపోయిన ప్లాస్లిక్ వ్యర్థాలు పట్టించుకోని పాలకులు, అధికారులు -
రెండు రోజులే గడువు..
విద్యారణ్యపురి: విద్యార్థుల్లోని సాంస్కృతిక ప్రతిభను వెలికి తీసేందుకు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) నిర్వహిస్తున్న కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజులే గడువు ఉంది. జిల్లాలనుంచి దరఖాస్తుల సమర్పించేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలోని 10 ఏళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు కలిగిన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్నకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సాంస్కృతిక ప్రతిభ కలిగినవారికి .. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, హస్తకళలు సాహిత్యకళలు, సాంస్కృతికరంగాల్లో ప్రతిభ కనపర్చే విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా స్కాలర్షిప్ అందిస్తుంది. దీనికి ఎంపికై న వారికి ఏడాదికి రూ.3,600 స్కాలర్షిప్తోపాటు శిక్షకుడికి చెల్లించే ఫీజు కూడా అదనంగా అందజేస్తారు. దేశవ్యాప్తంగా ప్రతీ ఏడాది 650 కొత్త స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నారు. ఇందులో సాధారణ విభాగానికి 375, సంప్రదాయ కళాకార కుటుంబాలకు 125, గిరిజన సంస్కృతికి చెందిన విద్యార్థులకు 100, సృజనాత్మక రచన/సాహిత్య కళలకు 30, దివ్యాంగ విద్యార్థులకు 20 స్కాలర్షిప్లు కేటాయించారు. ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ అర్హులైన విద్యార్థుల ఎంపిక కోసం సీసీఆర్టీ కేంద్రస్థాయిలో ప్రత్యేక ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తుంది. షార్ట్లిస్టు అయిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు/పరీక్షల వివరాలు తెలయజేస్తారు. ఈ పరీక్షలు సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ప్రాంతీయస్థాయిలో నిర్వహించే అవకాశాలున్నాయి. www.ccrt.india.govt.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 30వ తేదీ చివరి గడువు సాంస్కృతిక ప్రతిభ గలవారికి అవకాశం -
రైతులు పంట వ్యర్థాలు కాల్చొద్దు
నడికూడ : పంట వ్యర్థాలను కాల్చొద్దని పరకాల ఏసీపీ సతీష్బాబు రైతులను కోరారు. ప్రమాదవశాత్తు పంట అవశేషాలకు మంటలు అంటుకొని మంటలు చెలరేగిన ఘటన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణపూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పంట పొలాల్లో మిగిలిన వ్యర్థాలకు మంటలు అంటుకొని వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఫైర్ ఇంజన్తో పాటు స్థానిక వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి పరకాల ఏసీపీ సతీష్బాబు పరిశీలించి మాట్లాడారు. గత ఏడాదిలో జరిగిన ప్రమాదంతో పాటు ఇటీవల పంట అవశేషాలు దగ్ధమవుతుండగా పొగ కారణంగా ప్రమాదం జరిగిందని, అవశేషాలను కాల్చే బదులు పొలంలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతం అవుతుందన్నారు. పంట వ్యర్థాలు కాల్చడం వల్ల దట్టమైన పొగతో శ్వాసకోశ సమస్యలు వస్తాయని, ఇప్పటికై నా రైతులు పంట అవశేషాలను కాల్చకుండా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేశ్వర్, ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పరకాల ఏసీపీ సతీష్బాబు -
బక్రీద్ పండుగ పూట విషాదం..
ఖిలా వరంగల్ : బక్రీద్ పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. టాస్ ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గవిచర్ల క్రాస్ రోడ్డుపై నక్కలపల్లి శివారు రైస్ మిల్లు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ కరీమాబాద్కు చెందిన ఓ కుటుంబానికి చెందిన 9 మంది బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం టాస్ ఏస్ వాహనంలో సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రోజంతా అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి రాత్రి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నక్కలపల్లి శివారులోని రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే టాటా ఏస్ వాహనం కమాన్ పట్టి విరిగింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రూహి రేష్మ (22) అక్కడికక్కడే దుర్మరణం చెందగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వి వరాలు సేకరించారు. క్షతగాత్రులను ఎంజీఎం తరలించగా.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. టాటా ఏస్ బోల్తా.. యువతి దుర్మరణం 9 మందికి స్వల్ప గాయాలు బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు -
త్రివేణి తీరం.. భక్తజనహారం
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు భక్తులు కిక్కిరిశారు. గురువారం సెలవుదినం కావడంతో తెల్ల వారుజాము నుంచి పుష్కర తీరం, ఆలయాల్లో బారులుదీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి తరలొచ్చారు. సరస్వతీఘాట్లో పుష్కరస్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, అరటి డొప్పల్లో దీపాలు వదిలారు. దంపతి స్నానాలు చేశారు. పితృతర్పనాలు, పిండప్రదాన పూజలు నిర్వహించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. రూ.100తో దర్శనం, రూ.300 స్పర్శ దర్శనాలు చేశారు. స్వామివారి గర్భగుడిలో కర్పూర గౌర హారతి.. భక్తులు ఉదయం 5 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలి రావడంతో పార్కింగ్ స్థలాలు నిండుగా కనిపించాయి. అధికారులు షటిల్ బస్సులు వేయడంతో భక్తులు నేరుగా ఘాట్, అక్కడి నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లలో బారులుదీరి ప్రాకారదేవతలకు మొక్కుతూ దర్శనాలకు వెళ్లారు. ఆలయంలో శివకల్యాణ మండపం వద్ద యాగశాలలో వేద పండితులు మేద దక్షిణమూర్తిహోమం, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అంత్యపుష్కరాలో భాగంగా 8వ రోజు ఎనిమిది మంది కాశీ పండితులు ఆశుతోష్పాండే ఆధ్వర్యంలో స్వామివారి గర్భగుడిలో కర్పూర గౌర హారతి నిర్వహించారు. సరస్వతీఘాట్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. రాష్ట్ర భాష సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పర్పర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒడిస్సీ నృత్యం అలరించింది. వైభవంగా హారతి, తెప్పోత్సవం: ఎనిమిదో రోజు కాశీ పండితులతో నవరత్నమాల హారతిని వైభవోపేతంగా నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ఏపీలోని విశాఖపట్నానికి చెందిన శారదపీఠం శ్రీ స్వరూపనందేంద్ర ప్రత్యక్షంగా సరస్వతి వీక్షించారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్శర్మ స్వాగతం పలికారు. అనంతరం తెప్పోత్సవాన్ని హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి జలవిహారం చేశారు. కాగా, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 40వేలకు మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేసి ఆలయంలో దర్శనాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. చైర్మన్ మోహన్శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఈఓ మహేశ్ ఉన్నారు. తెప్పోత్సవాన్ని వీక్షించిన మాజీ సీఎస్.. మాజీ సీఎస్ శాంతికుమారి గురువారం రాత్రి కాళేశ్వరం చేరుకుని నవరత్నమాల హారతి, తెప్పోత్సవాన్ని వీక్షించారు.శుక్రవారం ఉదయం పుష్కర స్నా నాలు చేసి ఆలయంలో దర్శనాలు చేయనున్నారు. పుష్కరాలకు ఎనిమిదో రోజు కిక్కిరిసిన భక్తులు కాశీ పండితులతో గర్భగుడిలో కర్పూర గౌర హారతి అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న విశాఖపట్నానికి చెందిన శారదపీఠం శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి, మంత్రి శ్రీధర్బాబు -
వడదెబ్బతో ఐదుగురి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బతో గురువారం ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.వరంగల్ జిల్లాలో.. చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు మాధవనగర్ కాలనీకి చెందిన రూపిక సారమ్మ(73) మంగళ, బుధవారాల్లో ఎండలో వంట చెరుకు కోసం గ్రామ శివారుకు వెళ్లింది. బుధవారం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో.. మల్హర్/టేకుమట్ల : మల్హర్ మండలం కాపురం గ్రామానికి చెందిన జంగ భీమయ్య (55) బుధవారం మేకలను మేపేందుకు సమీపంలో అడవికి తీసుకెళ్లాడు. ఇంటికొచ్చిన అనంతరం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురై అర్ధరాత్రి మృతిచెందాడు. అలాగే, టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన పర్వతనేని కాంతయ్య(65) గురువారం ఇంటి ఎదుట అస్తవ్యస్తంగా ఉన్న సామగ్రిని సరిచేశాడు. కాసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, బుధవారం తన చిన్న కూతురు నిశ్చితార్థం జరిగింది. మరుసటి రోజే కాంతయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వెంకటేశ్వర బజారుకు చెందిన స్వర్ణకారుడు పెందోట మోహనాచారి (52) వారం రోజులుగా ఎండలో పని కోసం ప్రతీ షాపు తిరిగాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ములుగు జిల్లాలో.. మంగపేట: మంగపేట మండలం వాగొడ్డుగూడెం జీపీ పరిధిలోని పాతచీపురుదుబ్బ గ్రామానికి చెందిన పెండెకట్ల సారమ్మ(90)వడదెబ్బతో బుధవారం సాయంత్రం మృతి చెందింది. -
వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దు
వరంగల్ క్రైం: నగరంలోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని, బలవంతంగా డబ్బులు అడగడం, వాహనదారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుబేదారి ఇన్స్పెక్టర్ మేకల రంజిత్కుమార్ హెచ్చరించారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా వ్యవహరించాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు పోలీస్ శాఖ ఎల్ల ప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఎక్కడైన బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుబేదారి ఎస్సై ఫణిందర్ పాల్గొన్నారు. -
మహిళలకు హక్కులపై అవగాహన ఉండాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతీ సంస్థ బాధ్యత అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రఽణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం జెడ్పీ సమావేశ హాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం (పోష్ యాక్ట్–2013)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం, పరస్పర గౌరవం నేర్పించాలన్నారు. షీ టీం ప్రతినిధి సుజాత మాట్లాడుతూ ఎక్కడైనా వేధింపులు జరిగితే 87126 85142 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఆకస్మిక తనిఖీ.. ఖిలా వరంగల్: మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం విద్యాశాఖ అధికారులతో కలిసి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. డీఈఓ రంగయ్యనాయుడు, తహసీల్దార్ ఇక్బాల్, స్థానిక నాయకులు దామోదర్యాదవ్, తీగల జీవన్గౌడ్, శ్యామ్, శివాజీ పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా తరలించాలి.. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా తరలించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వరంగల్ కలెక్టరేట్ నుంచి సత్యశారద పాల్గొన్నారు. -
యూనిఫామ్ ఊసేది?
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్ వైజ్గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్ బండిల్స్ రాగానే ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్ యూనిఫామ్కు క్లాత్ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్ కూడా చేరుకోలేదు. ఈసారి టెస్కోకు ఇచ్చారా? లేదా? రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటివరకు క్లాత్ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్ యూనిఫామ్ అందించడం సాధ్యం కాకపోవచ్చని పలువురు హెచ్ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. 24 వస్తువుల కిట్ ఎవరికి? మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా? ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులు -
కలెక్టర్ను కలిసిన ఆర్డీఓ వెంకటేశ్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్ బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ములుగు ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకటేశ్ బదిలీపై హనుమకొండ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. వెంకటేశ్కు కార్యాలయ ఉద్యోగులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండ డిపో నుంచి డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, వరంగల్, హసన్పర్తి, కమలాపూర్, కాజీపేట మండలాల ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో హెపటైటిస్–బీ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందక పేషెంట్లకు ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించి కొనుగోలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ను ఎంజీఎంలోని పిల్లల వార్డు వద్ద పంపిణీ చేస్తుంటారు. ఇక్కడ పిల్లలతో పాటు పెద్దలకు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాగా, ఈ వ్యాక్సిన్ కొరతపై జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాశ్ను వివరణ కోరగా.. పిల్లలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, పెద్ద వాళ్లకు మాత్రం వ్యాక్సిన్ లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ సరఫరా చేసినప్పుడు ఇస్తామని పేర్కొన్నారు. అయితే డయాలసిస్ రోగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్ ఇస్తుంటామని వివరించారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా మైనార్టీ అభ్యర్థులకు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ పార్సీ) సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను, వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సీఈటీ.సీజీజీ. జీఓవీ.ఇన్/టెమ్రిస్ లింక్లో ఈనెల 31వరకు దరఖాస్తులు అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం బాధితులు అబ్బు జనార్దన్రెడ్డి, అబ్బు రాజిరెడ్డి, అబ్బు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు, అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు ఉన్నారు. తహసీల్దార్ పరిశీలన పెద్దకోడెపాక అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈదురుగాలి రావడంతో పక్కనే మండుతున్న మొక్కజొన్న సొప్ప నుంచి మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. జీఓ 27 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు, పంట అవశేషాలను తగలబెట్టడం నిషేదమన్నారు. రైతులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5000 నుంచి రూ. 25,000 వరకు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. -
పంటవ్యర్థాలకు నిప్పు పెట్టొద్దు
ఎల్కతుర్తి : పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని స్థానిక ఎస్సై నరసింహారావు రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని సూరారం, గోపాల్పూర్, ఇందిరానగర్ గ్రామాల్లో ఏఓ రాజ్కుమార్తో కలిసి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. వరికొయ్యలు, వరిగడ్డి, పత్తికట్టె, మొక్కజొన్న చొప్ప ఇతర పంటవ్యర్థాలకు నిప్పు పెడితే గాలి ద్వారా ఇతర పంటలు, గ్రామాల్లోకి మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మల్చర్, శ్రడ్డర్ ఉపయోగించి పంటవ్యర్థాలను భూమిలోనే కలియదున్నుకోవాలన్నారు. ఏఈఓలు తిరుపతి, పూర్ణచందర్, బాబు తదితర రైతులు పాల్గొన్నారు. -
బక్రీద్కు ఈద్గా మైదానం ముస్తాబు
ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఈద్గా మైదానం బక్రీద్కు ముస్తాబైంది. గురువారం ఉదయం 9 గంటలకు జరగనున్న ఈద్–ఉల్–జుహా సామూహిక ప్రార్థనలకు సర్వం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముస్లిం, మైనార్టీ నేతలతో కలిసి ఈద్గా బక్రీద్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎంఏ ఖలీక్ తన్వీర్ (ముతవల్లి) మైదానాన్ని బుధవారం పరిశీలించారు. ఈద్గాలో మత గురువు మౌలానా హఫీజ్మహ్మద్ నోమాన్ రజా ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలకు 30 వేల మంది హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట షఫీయొద్దీన్, మహిమూద్పాషా, సయ్యద్ మోహిజ్, శౌకత్అలీ, ఎండీ యూసుఫ్ ఉన్నారు. -
నిత్యావసర సరుకుల అందజేత
శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన అలవాల రాజు అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు అమ్మ అశోక్, పరకాల 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 50కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులను అందించారు. వారివెంట కృష్ణ, తిరుపతి, రామూర్తి, రాజ్కుమార్, తిరుపతి, కుమార్, రాజు, శంకర్ తదితరులు ఉన్నారు. భీమదేవరపల్లి : పిడుగుపాటుతో పాడి ఆవు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు మారుపాటి యోగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం కురిసిన అకాల వర్షానికి పిడుగు పడటంతో సూమారు రూ.80 వేల విలువచేసే ఆవు మృతిచెందినట్లు తెలిపారు. పిడుగుపాటుతో ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు. శాయంపేట : దొంగతనం కేసులో ఐదుగురికి రీకాల్, చీటింగ్ కేసులో ఒకరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలకు చెందిన జనగ్గండుల సుజాత, కందెల కల్యాణ్, కుంభం లక్ష్మి, కండేల కల్యాణి, అబ్బాపూర్కు చెందిన కలువాల గణేశ్లపై దొంగతనం కేసు నమోదు కాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆలేరు మండలంలోని దిలవాలషాసూర్ గ్రామానికి చెందిన మచ్చ సత్యనారాయణపై 2020 సంవత్సరంలో చీటింగ్ కేసు నమోదు అయింది. బుధవారం పరకాల కోర్టులో వారిని ప్రవేశపెట్టగా కోర్టు వాయిదాలకు హాజరు కానందున జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సాయిశరత్ ఐదుగురికి రీకాల్ చేసి సత్యనారాయణకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. శాయంపేట : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చురెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 17 ఏళ్లు దేశ ప్రధానిగా పనిచేసి ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషిచేశారని కొనియాడారు. నవ భారతావనికి శాసీ్త్రయ దృష్టి కల్పిస్తూ శాస్త్ర, సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చల్లా చక్రపాణి, డీసీసీ ఉపాధ్యక్షుడు పోలెపల్లి శ్రీనివాస్రెడ్డి, నాయకులు రవి, డీటీ రెడ్డి, సాంబయ్య, కట్టయ్య. కుమారస్వామి, రాజు, శంకరాచారితో పాటు తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తి పనులను పూర్తిచేయాలి
● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హసన్పర్తి: అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. పెద్ద చెరువు వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బీజేపీ ప్రతినిధి బృంద సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అరంతరం కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ చెరువు మూలమలుపు నుంచి ఇటు హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం వరకు, అటు సీతంపేట క్రాస్ వరకు రోడ్డును విస్తరించి డివైడర్లతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. కమీషన్ల కోసం పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ‘సర్’కు ప్రజలు సహకరించాలి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ప్రజలు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కోరారు. అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. ప్రతీ ఓటరుకు న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, సర్పంచ్ కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రాంచంద్రారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్, నాయకులు తాళ్ల రమేష్, రాజు, శ్రీకాంత్, ఇమ్మడి కర్ణాకర్, శోక్, రవీందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా విధులు నిర్వహించాలి
వరంగల్ క్రైం: అప్పగించిన పనులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. సీసీఎస్, టాస్క్ఫోర్స్ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్లు దేవేందర్, హరికృష్ణ బుధవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ కీర్తిప్రతిష్టలు అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయన్నారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. కాశిబుగ్గ: పేద వర్గాల ఆరోగ్య రక్షణ కోసం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు అన్నారు. ఈ మేరకు రూ.50 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు వరంగల్ తూర్పులోని ఓసిటీ క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సీఎం ఫండ్ ద్వారా చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధికి సీఎం రేవంత్రెడ్డి ఎక్కువ నిధులు కేటాయిస్తూ పేదలకు ఆదుకుంటున్నారని తెలిపారు. హన్మకొండ: అల్లుడి హోటల్ కోసం న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ ఆలయ భూమిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ వడ్డేపల్లిలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశా, పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధ సమయంలో పక్క రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో ఏం తెప్పించావో గుర్తు చేసుకో.. అప్పుడు నీ వెంట పోలీసులు పడితే తప్పించుకొని వడ్డేపల్లిలోని మన కామన్ ఫ్రెండ్ చిన్నాను పట్టుకొని మా అన్న దగ్గరికి వచ్చిన విషయం మర్చిపోయావా.. అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తే ఖబడ్డార్ అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఆయనకు అండగా ఉంటామన్నారు. హసన్పర్తి: ఇటీవల మరణించిన 65వ డివిజన్ ఎల్లాపురానికి చెందిన మిద్దెల చిలుకమ్మ కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి బుధవారం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. తొలుత మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుదర్శన్, నాయకులు సురేష్, క్రాంతి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని రంగనాథ స్వామికి పంచామృతాలతో బుధవారం అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోషికొండ శకుంతల సుధాకర్, ధర్మకర్తలు నీలం అరుణ, పల్లకొండ రాజమణి, మేడుకుర్తి లోకేష్, రేణుక, పిట్టల కోటేశ్వర్, రిటైర్డ్ తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, కట్కూరి సత్యనారాయణరెడ్డి దంపతులు, ఆలయ మాజీ కో కన్వీనర్ ఆకెన వెంకటేశ్వర్లు, తలకోటి రమేష్ పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ తూర్పు ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావును స్థానిక సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రాజేష్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను మురళి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నయీంనగర్: కొత్తూర్ రోడ్డులోని దేవా ఫొటో స్టూడియో ప్రారంభించి 25 ఏళ్లు అయిన సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు బోనగాని యాదగిరి గౌడ్, ఫొటోగ్రాఫర్ దేవా కలిసి మజ్జిగ పంపిణీ చేశారు. మెరుగు వినోద్, శంకర్, శ్రీనివాస్, కుమార్, వీరస్వామి, రమేష్, సదానందం, సంజీవ్ పాల్గొన్నారు. -
పచ్చదనం.. ఆహ్లాదం
ఎల్కతుర్తి : పర్యావరణ పరిరక్షణకు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మండలంలోని కోతులనడుమ నుంచి వీరనారాయణపూర్, వల్బాపూర్ నుంచి దండేపల్లి వరకు ఇందిరానగర్ నుంచి గోపాల్పూర్ వరకు కోతులనడుమ క్రాస్ నుంచి జీల్గుల, జగన్నాథ్పూర్ వరకు తిమ్మాపూర్ నుంచి కేశవాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం భానుడి ప్రతాపానికి తల్లడిల్లుతున్న ప్రయాణికులకు ఆ చెట్లు నీడనివ్వడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వడ గాలులకు వాహనదారులు ఎండ తీవ్రత తట్టుకోలేక చెట్ల కింద వాహనాలను నిలుపుకొని సేదదీరుతున్నారు. ప్రస్తుతం చెట్ల ఆకులు రాలిపోయి కొత్త ఆకులతో పచ్చని హారంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే కురిసిన చిరుజల్లులకు చెట్లు పచ్చదనంతో నిండుకుని రహదారులకు ఇరువైపులా ఆకుపచ్చ తోరణాన్ని తలపిస్తున్నాయి. అటుగా వెళ్లే బాటసారులకు, ప్రయాణికులకు నీడనివ్వడంతో పాటు ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నాయి. రహదారుల వెంట నాటిని గానుగ చెట్లు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో మొక్కలు ఎండ తీవ్రతకు ఎండిపోకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు చెట్ల వినియోగం, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, మనుగడ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఎల్కతుర్తి నుంచి కరీంనగర్కు వెళ్లే ప్రధాన రహదారి, అలాగే అక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి నాటిన మొక్కలు సైతం చెట్లుగా ఎదిగి నీడను అందిస్తున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
స్వదేశీ వస్తువులనే వినియోగించాలి
విద్యారణ్యపురి: స్వదేశీ వస్తువులనే వినియోగించుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర బాధ్యుడు కంది శ్రీనివాస్రెడ్డి కోరారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో టీటీసీ శిక్షణ పొందుతున్న మహిళలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేస్తే తమ రూపాయి బలపబడుతుందని చెప్పారు. బహుళజాతి సంస్థల ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన సూచించారు. స్వదేశీ వస్తువులనే వినియోగించుకోవాలని కోరుతూ రూపొందించిన కరపత్రాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ నాయకులు, తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ్ గురిజాల రవీందర్, హనుమకొండ జిల్లా కన్వీనర్ మంద ప్రకాశ్, యూత్ ఇన్చార్జ్ శరత్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే పుస్తకాలు విక్రయించాలి
● వడుప్సా జిల్లా అధ్యక్షుడు సతీష్కుమార్విద్యారణ్యపురి: నిబంధనల మేరకే ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విక్రయించాలని వరంగల్ డిస్ట్రిక్ట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్కుమార్ పేర్కొన్నారు. ఎమ్మార్పీకి మించి పుస్తకాలను విక్రయించకూడదని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు లేఖ జారీచేశారని తెలిపారు. హనుమకొండలోని ఓప్రైవేట్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన వడుప్సా జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యాలు నియమ నిబంధనలు పాటించకపోతే జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వకూడదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఇటీవల ఓ సర్క్యూలర్ జారీచేశారని వెల్లడించారు. ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి నెదురుగొమ్ముల రమేశ్, వడుప్సా హనుమకొండ జిల్లా కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి ముక్తీశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామినేని రాజేశ్కుమార్, హసన్పర్తి జోన్ అధ్యక్షుడు ఎ.రాంబాబు, హనుమకొండ జోన్ కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సమర్థంగా విధులు నిర్వహించాలి
వరంగల్ క్రైం: అప్పగించిన పనులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. సీసీఎస్, టాస్క్ఫోర్స్ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్లు దేవేందర్, హరికృష్ణ బుధవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ కీర్తిప్రతిష్టలు అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయన్నారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. కాశిబుగ్గ: పేద వర్గాల ఆరోగ్య రక్షణ కోసం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు అన్నారు. ఈ మేరకు రూ.50 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు వరంగల్ తూర్పులోని ఓసిటీ క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సీఎం ఫండ్ ద్వారా చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధికి సీఎం రేవంత్రెడ్డి ఎక్కువ నిధులు కేటాయిస్తూ పేదలకు ఆదుకుంటున్నారని తెలిపారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు దామెర : తప్పిపోయిన పసిపాపను పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొర్రి మౌనిక–తిరుపతి దంపతుల మూడేళ్ల కుమార్తె బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో పాప తల్లిందుడ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీస్లు చిన్నారి ఆచూకీ కోసం మూడు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే పక్కింట్లోనే ఉన్నట్లు గుర్తించారు. గంట వ్యవధిలోనే పాప ఆచూకీని కనిపెట్టి దంపతులకు అప్పగించారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా నవీన్ దామెర : సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా మండలంలోని దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో బుధవారం మండలంలోని సర్పంచ్లు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 గ్రామాలకు 8 మంది బీఆర్ఎస్, 2 బీజేపీ సర్పంచ్లు హాజరై సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పెంచాల స్వరూప (పులుకుర్తి), ఉపాధ్యక్షులుగా కొట్టె శ్రీవాణి (పసరగొండ), దాడి వసంత (తక్కళ్లపహాడ్), కార్యవర్గ సభ్యులుగా చుక్క వనిత (కోగిల్వాయి), వడ్డెపల్లి చంద్ర (సింగరాజుపల్లి)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ.. సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన సర్పంచ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ: అల్లుడి హోటల్ కోసం న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ ఆలయ భూమిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ వడ్డేపల్లిలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశా, పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధ సమయంలో పక్క రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో ఏం తెప్పించావో గుర్తు చేసుకో.. అప్పుడు నీ వెంట పోలీసులు పడితే తప్పించుకొని వడ్డేపల్లిలోని మన కామన్ ఫ్రెండ్ చిన్నాను పట్టుకొని మా అన్న దగ్గరికి వచ్చిన విషయం మర్చిపోయావా.. అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తే ఖబడ్డార్ అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఆయనకు అండగా ఉంటామన్నారు. హసన్పర్తి: ఇటీవల మరణించిన 65వ డివిజన్ ఎల్లాపురానికి చెందిన మిద్దెల చిలుకమ్మ కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం చేశారు. బాధితురాలి ఇంటికి బుధవారం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు / నడికూడ / దామెర : బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరుఫున అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు, నడికూడ, చౌటుపర్తి, నర్సక్కపల్లి గ్రామాలతో పాటు దామెర మండలంలో వడదెబ్బ, ఇతర కారణాలతో మృతిచెందిన ఎలుకటి మొగిలి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే మండల కేంద్రంలో మృతిచెందిన వీర్ల హారిక కుటుంబాన్ని, హౌజుబుజుర్గ్ గ్రామంలో షేక్ హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, నాయకులు ఉన్నారు. -
బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
మామునూరు: బక్రీద్ పర్వదినాన్ని శాంతియుతంగా, మత సామరస్యంగా జరుపుకోవాలని ముస్లింలకు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేష్ సూచించారు. సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాలు, మామునూరు ఏసీపీ వెంకటేష్ సూచనల మేరకు వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్లో ముస్లిం మతపెద్దలతో పీస్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గురువారం జరగనున్న బక్రీద్ పర్వదినంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సహకారం అందించాలని కోరారు. -
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
హసన్పర్తి: ఇటీవల విధుల్లో నుంచి తప్పిన తమను వెంటనే తిరిగి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్పీసీ కంపెనీ ఎదుట బుధవారం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా కంపెనీల్లో పనిచేస్తున్న 30మంది కార్మికులను తొలగించి, ఒడిశాకు చెందిన కార్మికులతో పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళన చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుల్లా రవీందర్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి, నాయకులు సునీల్, లక్ష్మారెడ్డి, గరిగె రాజు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుడి వెన్ను విరుస్తున్న ప్రభుత్వాలు
● మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్హన్మకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల వెన్ను విరుస్తున్నాయని మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ వడ్డేపల్లిలోని ఓ కన్వెన్షన్లో 30 కార్మిక సంఘాలతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎన్నిసార్లు విన్నవించినా వారి సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని వాపోయారు. కేంద్రం 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తెచ్చి కార్మికుడి వెన్ను విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. కార్మికుల పక్షాన జూన్ 1న సమావేశం నిర్వహించి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పోరాడుతామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ వరంగల్ పశ్చిమ కన్వీనర్ నాయిని రవి, ఆయా కార్మిక సంఘాల నాయకులు రాజారపు రాజు, సిరికొండ భిక్షపతి, కాల్వ సుదర్శన్, బాషబోయిన తిరుపతి, రమా చారి, ఇస్మాయిల్, ఈసంపల్లి సంజీవ, శ్రీధర్ రెడ్డి, జయరాం, సుధాకర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రమ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
కమలాపూర్ : వైద్యులు, సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సర్పంచ్ పబ్బు సతీశ్ సూచించారు. కమలాపూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈసీజీ మిషన్కు పేపర్ రోల్ లేకపోవడంతో గుండె సంబంధిత పరీక్షలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ పబ్బు సతీశ్ స్వయంగా రెండు పేపర్ రోల్స్ తెప్పించి బుధవారం వైద్యాధికారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు చిన్న చిన్న కారణాలతో వైద్య పరీక్షలు నిలిచిపోయే పరిస్థితి రానివ్వొవద్దని వైద్యాధికారులను కోరారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
– 9లోuభూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్, మహిపాల్రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు, కాటారంలో పర్యటన


