breaking news
Huge fines
-
ట్రంప్ భయం.. ఈసారి భారీ ఫైన్లు, జైలు శిక్ష కూడా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచదేశాలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే స్వయంగా దేశం విడిచిపోవాలని.. లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. అక్రమ వలసదారులు ముందుగా సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ తుది ఆదేశాలు అందుకున్నాక కూడా దేశాన్ని వీడకుంటే.. రోజుకు 998 డాలర్లు(రూ.86వేల చొప్పున) జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అప్పటికీ వీడకుంటే పర్యవసనాలు మరోలా ఉంటాయని డీహెచ్ఎస్ హెచ్చరించింది. తమంతట తాముగా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలి. లేకుంటే.. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బు జరిమానా రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. వెయ్యితో మొదలై.. ఐదు వేల డాలర్ల దాకా జరిమానా విధించవచ్చు. జైలు శిక్ష ఎదుర్కొనడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశమూ కోల్పోతారు అని డీహెచ్ఎస్ హెచ్చరించింది. అయితే ఈ తరహా హెచ్చరికలను న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ భయాల్లో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. -
శబ్ద కాలుష్యానికి పాల్పడితే తప్పదు భారీమూల్యం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా శబ్ద కాలుష్యం బారిన పడేవారికే గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నగరాల్లో జీవించేవారు శబ్దకాలుష్యం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఢిల్లీ వంటి నగరాల్లో శబ్ద కాలుష్యం మరీ అధికంగా ఉంటుంది. కాగా, ఢిల్లీలో శబ్ద కాలుష్య నియంత్రణకు.. కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శబ్ధ కాలుష్యానికి పాల్పడితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. శబ్ధ కాలుష్యాని పాల్పడే వారిపై సుమారు రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ సూచించింది. వేడుకలు, ర్యాలీల్లో బాణాసంచా కాలిస్తే రూ.10వేలు జరిమానా విధించనున్నారు. సైలెంట్ జోన్లలో బాణాసంచా పేలిస్తే రూ.20వేల జరిమానా విధించాలని కమిటీ సూచించింది. నిబంధనలను మళ్లీ మళ్లీ ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. Delhi Pollution Control Committee revises penalty for violation of noise rules: Rs 10,000 for noise through loudspeakers/public address systems, Rs 1 Lakh for Diesel Generator sets of over 1000 KVA; Rs 50,000 for sound-emitting construction equipment. The equipment will be seized pic.twitter.com/YvY2PxK3jT — ANI (@ANI) July 10, 2021 -
గీత దాటితే..ఇంటికే ఈ చలానా
ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసుల ప్రత్యేక దృష్టి అమలులోకి ఈ చలానా విధానం రెండున్నర నెలల వ్యవధిలో 10,077 కేసులు నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారు భారీ జరిమానాలు చెల్లించకతప్పని పరిస్థితి నెలకొంది. నెల్లూరుతో పాటు ప్రధాన పట్టణాల్లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్పీ విశాల్గున్నీ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మెట్రో సిటీలకే పరిమితమైన ఈ చలానా విధానాన్ని తొలిసారిగా మే 6వ తేదీన నెల్లూరులో, జూన్ ఒకటిన కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట అమలులోకి తెచ్చారు. నగర, పట్టణాల్లోని ప్రధాన కూడళల్లో శాంతిభద్రతల అధికారులు, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందం సభ్యులు పర్యటిస్తూ ఉల్లంఘనను ట్యాబ్(మల్టీపర్పస్ డివైజ్)లు, డిజిటల్ కెమెరాల్లో చిత్రీకరించి రెండు విభాగాల్లో ఈ–చలానా ద్వారా వాహనచోదకులకు జరిమానాలు విధిస్తున్నారు. భారీగా జరిమానాలు ఈచలానాతో వాహనదారుడు భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తోంది. గతంలో నోపార్కింగ్, పొల్యూషన్, సెల్ఫోను డ్రె వింగ్, రిజిస్ట్రేషన్ లేని, ఇన్సూరెన్స్లేని వారికి రూ. 100 నుంచి రూ. 500లోపు ఫైన్ విధించేవారు. ఇప్పుడు ఆపరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం నిర్దేశించిన జరిమానాలు విధిగా మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తున్నారు. నోపార్కింగ్కు రూ.100, ఇన్సూరెన్స్కు రూ. 1,000, రిజిస్ట్రేషన్ లేకపోతే రూ. 2వేల నుంచి రూ.5వేల వరకు, సెల్ఫోను డ్రైవింగ్కు రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి వస్తోంది. జరిమానాలతో పాటూ యూజర్ ఛార్జీలను సైతం వాహనదారుడే చెల్లించాలి. కొందరు వాహనదారులకు తనిఖీల సమయంలోనే ఈచలానా బిల్లు చేతికి ఇస్తుండగా, డిజిటల్ కెమెరాల్లో పట్టుబడిన వారికి ఇళ్లకు ఈ చలానా పంపుతున్నారు. భారీగా కేసుల నమోదు ఈ చలానా విధానం అమలులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10,077కేసులు నమోదయ్యాయి. అందులో ట్యాబ్(మల్టీపర్పస్ డివైజ్)ల ద్వారా 6,887, కెమెరాల ద్వారా 3,189 కేసులను నమోదు చేసి రూ 42,75,200 జరిమానా విధించారు. చల్లానా ఉల్లంఘునులపైనా చర్యలు జిల్లాలో ఇప్పటి వరకు 10,077కేసులు నమోదు కాగా అందులో 3,9098 కేసుల్లో వాహనదారులు మీసేవ కేంద్రాల్లో జరిమానా చెల్లించారు. 6,618 కేసుల్లో చలానాలు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. చలానాలు కట్టకపోతే ఏమి కాదన్న భ్రమలో వాహనదారులు ఉన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ను ట్యాబ్లో కొట్టిచూస్తే ఎన్ని చలానాలు చెల్లించాల్సి ఉందో తెలుస్తోందనీ, మూడు చలానాలు చెల్లించకపోతే వాహనదారునిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పించుకు తిరగడం మాని చలానాలు చెల్లిస్తేనే మంచిదని అధికారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన...... ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై ఈచలానా విధించడంతోనే అధికారులు సరిపెట్టుకోవడం లేదు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ఈచలానాపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.