jammalamadugu mla
-
కుందూ నది పరవళ్లు
సాక్షి, జమ్మలమడుగు : పెద్దముడియం మండలంలో కుందూ నది పరవళ్లు తొక్కుతోంది. నాలుగు రోజుల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పరివాహక గ్రామాలలో పంటలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం కుందూలో 16వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నాగరాజుపల్లి, పాలూరు, పెద్దముడియం, చిన్నముడియం, గరిశలూరు, నెమళ్లదిన్నె, బలపనగూడురు ప్రాంతాల ప్రజలు నది ఉధృతిపై ఆందోళన చెందుతున్నారు. పైన విపరీతమైన వర్షాలు కురవడంతో కృష్ణ, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కుందూ ప్రవాహం కూడా పెరిగిపోయింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నెమళ్లదిన్నె బ్రిడ్జిపై రెండు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం బ్రిడ్జి దిగువ వరకు నీరు ప్రవహిస్తుంది. కుందూ నీటి ఉధృతి గురించి ఎమ్మెల్యే డాక్టర్మూలే సుధీర్రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం ఆయన నెమళ్లదిన్నె ప్రాంతాలలో పర్యటించారు. నీట మునిగిన పత్తి, వరి పంటలను పరిశీలించారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు సూచనలిచ్చారు. సీతారామాపురం వద్ద చాపాడు: కుందూనది ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా మంగళ, బుధవారాల్లో కురిసే వర్షాలతో ఉధృతి మరింత పెరగనుంది. ఇప్పటికే మండలంలోని సీతారామాపురం వద్ద గల కుందూనది వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. కుందూ పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుందూనదికి రోజు రోజుకు వరద నీరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలోని రైతాంగం వ్యవసాయ పనుల్లో నిగ్నమైంది. -
ఆదినారాయణకు ఎమ్మెల్యే పదవి వైఎస్ఆర్ భిక్షే
కడప : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి భిక్షతోనే ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యే పదవి దక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి అన్నారు. ఆదివారం కడపలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, కడప కార్పొరేషన్ మేయర్ సురేష్బాబుతో కలసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ఆర్ బొమ్మపై గెలిచి రాజీనామా చేయకుండా ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం దారుణమని ఆరోపించారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమరనాథ్రెడ్డిని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆదినారాయణ కుటుంబం కష్టాల్లో ఉంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆదుకుని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను విమర్శించే అర్హత ఆదినారాయణకు లేదని వారు అన్నారు. -
'పార్టీ మార్పు పత్రికల ఊహాగానాలే'
జమ్మలమడుగు: నేను పార్టీ మారుతున్నట్లు అన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ఉహాగానాలతో వార్తలొస్తున్నాయి.. అసలు నాకు పార్టీ మారే అలోచన ఉందో లేదో గాని పత్రికలైతే పార్టీ మారాలని కోరుకుంటున్నట్లు ఉందని’ వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే (వైఎస్సార్సీపీ) సి. ఆదినారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం మాట్లాడారు. ‘15 రోజులుగా పత్రికల్లో విపరీతమైన కథనాలు వస్తున్నాయి.. ఇంకా కథనాలు రావాలి.. వాటిని నేను స్టడీ చేయాలనే ఉన్నా’నన్నారు. మరికొంత మంది ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు.. వీటన్నింటినీ గమనిస్తున్నానన్నారు. పత్రికల్లో ఇప్పటి వరకు 30 తేదీలను మార్చారు కాని ఇంత వరకు నేను పార్టీ మారలేదన్నారు. తాను ఏదైనా మాట్లాడితే ఓపెన్గానే మాట్లాడతానన్నారు.