breaking news
Kshudra Pooja
-
క్షుద్ర పూజల కలకలం.. నర బలి ఇచ్చారా..?
తూర్పు గోదావరి: మండలంలోని వెదురుపాకలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కంచి వెంకటరమణ (38) పాల వ్యాపారం చేస్తు న్నాడు. శుక్రవారం రాత్రి పాలకేంద్రం వద్ద వ్యాపారం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటల తర్వాత కూడా రాకపోవడంతో వెంకట రమణ కు భార్య విజయలక్ష్మి కాల్ చేయగా ఫోన్ కలవలేదని సమాచారం. ఇదిలా ఉండ గా శనివారం ఉదయం వెదురుపాక నుంచి ఆరికరేవుల వెళ్లే దారిలో వెంకట రమణ పంట బోదెలో పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఇంటికి సమాచారం అందించారు. అతడి మృతదేహం కాలువలో పడి ఉండగా, మోటార్ సైకిల్ వంతెనపై ఉంది. అక్కడకు సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటం స్థానికంగా అలజడి రేపింది. తలపై బలమైన గాయం వెంకట రమణ తలపై బలమైన గాయం ఉండటంతో అతడిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఎవరైనా అతడిని హత్య చేశారా? లేక హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించడానికి క్షుద్ర పూజలు చేసినట్లు సృష్టించారా అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై జి.నరేష్, ఏఎస్సై పి.వెంకటేశ్వరరావులు సిబ్బందితో సంఘటన స్థలాని కి చేరుకుని విచారణ చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, మండపేట రూరల్ సీఐ కె.శ్రీధర్ కుమార్ కూడా అక్కడకు చేరుకున్నారు. వెంకట రమణకు ఎవరితోనైనా పాత కక్షలున్నాయా, వివాహేతర సంబంధం వంటి కారణాలు, రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు, అతడి వెంట ఎవరున్నారు, ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది, హత్యకు అసలు కారణాలేమై ఉంటాయనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. వెంకట రమణకు భార్య విజయలక్షి్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం రాత్రి వరకూ అందరితో మాట్లాడిన అతడు ఉదయానికి విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాము ఎలా జీవించాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సంఘటనపై భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య
మైసూరు: భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య ఉదంతం మైసూరు నాచనహళ్లిపాళ్య 8వ క్రాస్లో జరిగింది. రఫీ, సమ్రిన్ దంపతులు. కాగా భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని భావించిన సమ్రిన్ భర్త రఫీపై క్షుద్రపూజలు చేయించింది. ప్రతి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు తదితర వస్తువులను వేయిస్తుం డేది. మంగళవారం రాత్రి కూడా సమ్రిన్ ఆ వస్తువులను పడేస్తూ ఉండగా బంధువులు స్థానికుల సహాయంతో సమ్రిన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విద్యారణ్యపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
క్షుద్ర పూజల కలకలం..
-
అది క్షుద్ర పూజ కాదు.. చండీ హోమం మాత్రమే!
శ్రీశైలం: తాను శ్రీశైలం దేవస్థానం పరిధిలో క్షుద్ర, తాంత్రిక పూజలు చేశానని ఒప్పకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను వేద పండితుడు గంటి రాధాకృష్ణ శర్మ ఖండించారు. తన చేత బ్రాహణ సంఘం నేతలు బలవంతంగా వివరణ లేఖపై సంతకం పెట్టించారని రాధాకృష్ణ ఆరోపించారు. తన నివాసంలో చేసింది కేవలం చండీ హోమం మాత్రమేనని స్పష్టం చేశారు. క్షుద్ర పూజలు చేశానంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పడానికే మీడియా ముందుకొచ్చానని రాధాకృష్ణ తెలిపారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆలయం వేద పండితుడు రాధాకృష్ణ శర్మ తన ఇంటి వద్ద తాంత్రిక పూజలు చేశారన్న వ్యవహారం ఇటీవల వెలుగుచూసింది. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. దీంతో ఆయన హైకోర్టు, హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా విచారణ కమిటీ నియమించింది. ఈ నేపథ్యంలో తాంత్రిక పూజలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు వార్తలు వెలుగుచూశాయి. దానిపై స్పందించిన రాధాకృష్ణ శర్మ... క్షద్ర పూజలు చేశానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
కృష్ణా జిల్లాలో క్షుద్రపూజల కలకలం