బండరాయి మీద పడి వ్యక్తి మృతి
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : రామగిరి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి వెంకటేశ్వర్లు(42) అనే వ్యక్తి మృతిచెందాడు. రాళ్లు కొడుతుండగా పక్కనే ఉన్న మరో పెద్ద బండ అకస్మాత్తుగా మీద పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.