madabhusi Sridhar Article
-
ప్రాణాలు తీస్తున్న ‘ప్రయోగాలు’
ప్రభుత్వాలు, నియంత్రణ అధికారుల నిర్లక్ష్యం, అవి నీతి వల్ల విదేశీ కంపెనీలు పరిశీలన పేరుతో జనం మీద ప్రాణాంతక ప్రయో గాలు చేయడానికి అనుమ తులు సాధిస్తున్నారు. ఈ పరీక్షల వల్ల ఏపీ, గుజ రాత్లో కొందరు పిల్లలు చనిపోతున్నా దిక్కు లేదు. పార్లమెంటరీ స్థాయీ సంఘం 2011లో ఈ మరణాలపై దర్యాప్తు జరి పింది. ఓ అమెరికన్ కంపెనీ ఏవిధంగా అవినీతిప రులైన అధికారుల అండదండలతో మన అమాయక ప్రజలను ఎలా తన అవసరాలకు వాడుకుందో వివ రించింది. కాని ఎంతమంది మరణించారు, వారికి పరిహారం ఎవరిస్తారో మాత్రం ఎవరూ తేల్చలేదు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వాక్సిన్ లను ఖమ్మం జిల్లాలోని పిల్లల మీద ప్రయోగించడం వల్ల 2010 మార్చిలో కొందరు మరణించారు. ఈ ప్రయోగాల పేరు ‘ప్రోగ్రాం ఫర్ అప్రాప్రియేట్ టెక్నా లజీ ఫర్ హెల్త్’ (పీఏటీహెచ్–పాత్). అంటే ‘ఆరో గ్యానికి తగిన సాంకేతికతా కార్యక్రమం’. ప్రయోగాలు చేసినవారికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ విరా ళాలు ఇచ్చిందట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీ ఎంఆర్), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు వారికి సహకరించారు. నియమాలకు నీళ్లొదిలి, అంతర్జాతీయ నైతిక సూత్రాలను వీరు అటకెక్కించారు. ప్రభుత్వ నిధు లను, మన మానవ వనరులను, మన జాతీయ గ్రామీణ ఆరోగ్యపథకం (ఎన్ఆర్హెచ్ఎం) చిహ్నా లను వారు దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అనే పేరుతో ఈ ప్రయోగాలను సాగని చ్చారు. ఖమ్మం, వడోదరాలో పిల్లల మరణాలకు కారణమైన కంపెనీ అమెరికాలో, ఇక్కడా అనేక నియమాలు, నియంత్రణలను పట్టించుకోలేదని 2011లో బ్రజేష్ పాఠక్ నాయకత్వంలోని పార్లమెం టరీ కమిటీ కనిపెట్టింది. మహిళల్లో సర్వికల్ కేన్సర్ నిరోధించే వాక్సిన్ను మన డ్రగ్స్ కంట్రోలర్ అను మతించారు. మార్కెట్లో ఈ మందులు వాడేందుకు ఒప్పుకున్నారు. మార్కెటింగ్ తరువాత పరిశీలనా ప్రయోగాలు అని దీన్ని పిలిచారు. కానీ ఇవి మార్కెటింగ్ కన్నా రెండేళ్ల ముందు జరిపించిన ప్రయోగాలని తరువాత తేలింది. ఈ మందు ఏవి ధంగా ఇముడుతుందో తెలుసుకోవడానికి భారతీ యులను ప్రయోగ వస్తువులుగా వాడుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నైతిక సంఘాలు (ఎథికల్ కమి టీలు) కూడా ఈ క్లినికల్ ప్రయోగాలను అనుమ తించాయి. డ్రగ్స్ కంట్రోల్ నియమాల ప్రకారం పెద్దలపై ఇలాంటి క్లినికల్ ప్రయోగాలు జరిపి విజయవంతం అయినాయనుకుంటేనే పిల్లలపైన ప్రయోగించాలి. ఈ మందుల విషయంలో ఆ నియమాలు పాటించ లేదు. లైంగిక కార్యక్రమాలు జరగకముందే ఈ వాక్సి న్ను వాడాలంటూ 10–14 ఏళ్ల వయసు పిల్లల మీద ఈ ప్రయోగాలు జరిపారు. కమిటీ విచారణ జరుపు తున్న సందర్భంలో ఈ విషయం తెలియగానే, ఇంకా ప్రయోగాలు జరుగుతూంటే వెంటనే ఆపాలని ఆదే శించారు. పీఎస్సీ 41వ నివేదికలో ఈ దుర్మార్గంపై తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. సరైన పరిశోధనా సంస్థతో దర్యాప్తు జరిపించాలని, ఈ దుర్మార్గం వెనుక ఉన్న వ్యక్తులెవరో తేల్చి తగిన చర్యలు తీసు కోవాలని కూడా ఆదేశించింది. ఆ నివేదికను తమ కమిటీ విచారణ ముగిసేలోగా ఇవ్వాలని కూడా కోరింది. మున్ముందు ఇటువంటి ప్రయోగాలను అనుమతించే ముందు అన్ని నియమాలు, నియం త్రణలను విధిగా పాటించాలని కూడా ఆదేశించింది. ఖమ్మం పట్టణంలో మెర్క్ కంపెనీ గర్డాసిల్ అనే మందును, వడోదరలో జీఎస్కే కంపెనీ సెర్వారిక్స్ అనే మందును పిల్లల మీద ప్రయోగించాయి. వాటి దుష్పరిణామాలమీద ఫిర్యాదులు అనేకం వచ్చాయి. వెంటనే వాక్సిన్ వాడకం ఆపేయాలని ఆదేశించారు. కానీ ఇదివరకు ఇచ్చిన సూచనలు, ఆదేశాలను పాటించలేదని కమిటీ గమనించింది. 2006 జూన్1న అమెరికన్ డ్రగ్ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) గర్డసిల్ పేరుతో మెర్క్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్కు అనుమతించింది. అదే సంవత్సరంలో పాథ్ అనే మరొక అమెరికన్ సంస్థ ఈ మందులను పెద్ద ఎత్తున అయిదేళ్ల పాటు ప్రజల్లో ప్రవేశ పెట్టాలని అయిదేళ్ల పథకం వేసింది. అందుకు వారు ఎంచుకున్న అమా యక జనం–భారతదేశంలో ఇండోఆర్యన్లు, ద్రావి డులు, గిరిజనులు, ఉగాండాలో నీగ్రాయిడ్లు, పెరూలో హిస్పానిక్స్, వియత్నాంలో మంగోలో యిడ్లు. వాక్సిన్లను విభిన్న ఆదిమజాతుల మీద ప్రయోగించడం వీరి లక్ష్యమట. ఒక పెద్ద అమెరికన్ కంపెనీ గుత్తాధిపత్యం కోసం, దాని వాణిజ్య ప్రయో జనాల కోసం మన దేశ ప్రజలను బక్రాలుగా ఎంచు కున్న తీరును ఎవ్వరూ ఏమాత్రం పరిశీలించలేదు. నేరుగా క్లినికల్ ట్రయల్స్ జరపకుండా కావాలని పరి శీలన, అధ్యయనాలపేరు మీద పరీక్షలకు అనుమతిం చారని కమిటీ విమర్శించింది. మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
లాయర్లను నిలదీసిన చట్టం
- విశ్లేషణ న్యాయార్థులను మోసం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్కు ఇచ్చిన ఫిర్యాదులు ఏమయ్యాయో తెలుసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. లాయర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చిన ఘనత ఆర్టీఐదే. న్యాయవాదులు లేకపోతే న్యాయమూర్తులు లేరు. అసలు న్యాయవ్యవస్థే లేదు. న్యాయవాదులను ఎవరూ నియమించనవసరం లేదు. పూర్తి స్వాతంత్య్రం ఉన్న వృత్తి ఏదైనా ఉన్నదీ అంటే, అది న్యాయవాద వృత్తి ఒక్కటే. ప్రతి తగాదాను దశాబ్దాల తరబడి కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలనే సంస్కృతి మన సొంతం కాదు. పంచాయతీలలో కులపెద్దల సమావేశాలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం తెలుసు. పరస్పర వ్యతిరేకవాదాల వ్యాజ్యం ఆంగ్లేయుల విధానం. చట్టాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి. ఆంగ్లేయులు వందల ఏళ్ల కిందట పాటించినవీ, పాలించినవీ ప్రస్తుతం మనం పాటిస్తున్నాం. వారు మార్చుకున్నా, మారని పాత బ్రిటిష్ చట్టాలనే పట్టుకుని మనం వేలాడుతున్నాం. మనదేశంలో నిజం చెప్పినవాడు జైల్లో ఉంటాడు. ఒక నటుడు వేగంగా కారు నడిపి మనుషుల్ని కుక్కల్ని చంపినట్టు చంపేశాడని ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ పోలీసు ఉద్యోగం కోల్పోయాడు. డబ్బు జబ్బుతో వెలిగిపోతున్న అబద్ధాలకోరులకు విజయాలు కోకొల్లలు. బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరవీరుల మీద ఇష్టం వచ్చినట్టు వాడిపారేసిన రాజద్రోహ చట్టాన్ని వాళ్లు వదిలేసినా మనం ప్రత్యర్థుల మీద వాడుకుంటూనే ఉన్నాం. పరువు నష్టం నేరం సెక్షన్ కూడా మనదేశంలో 1860లో ప్రవేశపెట్టినవారు వదిలేసుకున్నారు. మనం వాడుకుంటున్నాం. కాలం తీరిన బ్రిటిష్ చట్టాలు అని మనం వారిని తిట్టాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. మనల్ని మనమే తిట్టుకోవాలి. మన న్యాయశాస్త్రం ఇది. న్యాయ విద్యాలయాలలో లాయర్లు తయార వుతారు. ఆ కాలేజీలలో విద్యా ప్రమాణాలను కాపాడే బాధ్యత భారత న్యాయవాదుల మండలికి (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బీసీఐ)కి అప్పగిం చారు. బీసీఐ కమిటీ కాలేజీలను తనిఖీ చేసి అనుమతిస్తేనే మనుగడ. కొనసాగే అర్హత. విద్యా బోధన విషయాలు వీరే నిర్ణయిస్తారు. మన న్యాయ విద్య ఘోరంగా పతనమైతే ప్రత్యామ్నాయంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలను ఎన్ఆర్ మాధవమీనన్ సృష్టించారు. అయితే రాష్ట్రానికొకటి ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు ఈ దేశానికి ఏమాత్రం చాలవు. పాత న్యాయ కళాశాలలను కూడా బాగు చేసుకోవలసిందే. అవినీతికి పాల్పడి ప్రమాణాలు లేని సంస్థలకు అనుమతులిస్తే న్యాయవిద్య పతనమై, న్యాయవాదులు, వారిలోంచి వచ్చిన న్యాయమూర్తుల సమర్థత క్షీణించి, స్వతంత్రతను కోల్పోతుంది. 2010లో న్యాయ కళాశాలలను తనిఖీ చేసిన వివరాలు కావాలని ఆర్టీఐ కింద కేఆర్ చిత్ర అనే న్యాయవాది బీసీఐని అడిగారు. తనిఖీ చేసిన వారి పేర్లు, కళాశాలల పేర్లు, నివేదికల సారాంశం ఇవ్వాలని కోరారు. వేలాది కళాశాలల తనిఖీ సమాచారం చాలా ఎక్కువ కనుక ఇవ్వలేమన్నారు. సీడీ రూపంలో మొత్తం వివరాలు కావాలని చిత్ర పట్టుపట్టారు. కనీసం కొన్ని కళాశాలలకో లేదా కొంత ప్రాంతానికో డిమాండ్ను పరిమితం చేయాలన్న సూచనను చిత్ర అంగీకరించలేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ఇటువంటి సమాచారం ఎవరో అడగవలసిన పని లేకుండా తమంత తామే బీసీఐ ఇవ్వవలసి ఉంటుంది. ఎన్ఐసీ వారు తమకు సమగ్ర వెబ్సైట్ తయారు చేస్తున్నారనీ, అందులో ఈ సమాచారం ఉంచుతామనీ జవాబిచ్చారు. సమాచార హక్కు చట్టం వచ్చి పదేళ్లయినా, ఇంకా సొంతంగా సమగ్ర సమాచారం ఇచ్చేందుకు న్యాయవాదుల మండలే ఏర్పాట్లు చేసుకోకపోవడం ఏమాత్రం న్యాయం కాదని కమిషన్ విమర్శించింది. న్యాయార్థులను మోసం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్కు ఇచ్చిన ఫిర్యాదులు ఏమ య్యాయో తెలుసుకునే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం కల్పించింది. న్యాయవాదుల సేవాలోపాన్ని ప్రశ్నించి పరిహారం కోరుకునే అవకాశం వినియోగదారుల చట్టం కింద ఉంది. చెడు ప్రవర్తన ఆరోపణ అందిన తరువాత న్యాయవాదిపైన విచారణ జరిపి అతను వృత్తి కొనసాగించకుండా నిలిపివేసే అధికారం బార్ కౌన్సిల్కు ఉంది. దాని గురించి అనేక మంది న్యాయార్థులు ఆర్టీఐ కింద అడగడం ఈ మధ్య తలెత్తిన కొత్త పరిణామం. విచారణ వివరాలు, పత్రాలు, నిర్ణయంలో ఆలస్యాలు, మోసపోయిన వ్యక్తి చెప్పుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. బీసీఐ న్యాయవాదులలో ప్రమాణాలను, న్యాయ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉందని ఆర్టీఐ ద్వారా న్యాయార్థులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా లాయర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చిన ఘనత ఆర్టీఐదే. (కేఆర్ చిత్ర వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఐసీ/ఎస్ఏ/ ఏ/ 2016/000023 కేసులో 7.4. 2016న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com