Mahabubnagar District News
-
హోంగార్డు ఆత్మహత్య
అచ్చంపేట రూరల్: పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధ వారం అచ్చంపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ సద్దాంహుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం... కోడేరు పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న బయ్యన్న (46) సలేశ్వరం జాతర డ్యూటీ కో సం బుధవారం అచ్చంపేటకు వచ్చాడు. కాగా మంగళవారం డ్యూటీలో చేరాల్సి ఉండగా బుధవారం రావడంతో అధికారులు గైర్హాజరు వేశారు. దీంతో మనస్థాపానికి గురైన బయ్యన్న అచ్చంపేట పశువుల సంత సమీపంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత విషయా న్ని ఓ కానిస్టేబుల్కు ఫోన్ చేసి చెప్పగా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందా డు.మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్ల లు ఉన్నారు. అల్లుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు అడ్డాకుల: మండలంలోని కందూర్ స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికు ల వివరాల ప్రకారం.. మూసాపేట మండలం నందిపేటకు చెందిన రాములు మరి కొందరితో కలిసి దుస్తుల కొనుగోలు కోసం వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం వెళ్లారు. దుస్తుల కొనుగోలు తర్వాత అదే ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా కందూర్ స్టేజీ వద్ద ఆటోను కర్నూ ల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న రాములు, నాగన్నతో పాటు మరో ఇద్దరు మ హిళలకు గాయాలు కాగా మిగిలిన వారికి స్వ ల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎల్అండ్ టీ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య ఉండవెల్లి: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండ లంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపిన వివరాలు.. మానవపాడు మండలం కొర్విపాడుకు చెందిన తెలుగు యుగంధర్(22) తుంగభద్ర రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించగా, మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడి: 10 మంది అరెస్ట్ వనపర్తి రూరల్: పట్టణంలోని సాయినగర్ కాలనీలో బుధవారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పట్టణ పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పోలీసులకు అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్ చేసి రూ.24వేల నగదు, 9 సెల్ఫోన్లు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆర్టీసీ కంట్రోలర్పై దాడి ఉండవెల్లి: మండలంలోని అలంపూర్ చౌరస్తా లోని టీఎస్ ఆర్టీసీ గద్వాల జిల్లాకు చెందిన కంట్రోలర్పై నరసింహులుపై ఆంధ్ర రాష్ట్రం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూ రు గ్రామానికి చెందిన షేక్ ఖలీల్, మంగలి పవన్కుమార్ దాడి చేశారు. బుధవారం అయి జ బస్సులో ఫుట్బోర్టుపై ప్రయాణిస్తుండగా లోపలికి వెళ్లండని కంట్రోలర్ చెప్పడంతో నువ్వెవరని దురుసుగా ప్రవర్తించి దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దాడి చేసిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
బావాజీ ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లిలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకా మసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం బంజాన భజనలతో స్వామి వారికి ప్రభోత్సవం నిర్వహించారు. అనంతరం వంశపార పర్య పూజారులు చందర్ నాయక్, దేవ్లానాయక్, బీంమ్లానాయక్, దన్సింగ్ ఆధ్వర్యంలో గురులోకా మసంద్ ప్రభు బావాజి, కాళికాదేవి ఆలయాల్లో ధ్వజా రోహణం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రాష్ట్ర పండుగ గుర్తింపుపై గిరిజనుల హర్షం గురు లోకామసంద్ ప్రభు బావాజీ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీఓ విడుదల చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర బావాజి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సీఎం రేవంత్రెడ్డి చిత్ర పటానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు జాతరకు హాజరైన భక్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ గిరిజన జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిగా వచ్చే గిరిజనులను గుర్తించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కొడంగల్ నియోజకవర్గ కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, నారాయణపేట జిల్లా ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్ జయరాములు ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రత్యేక జీఓను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. -
సలేశ్వరం.. జనసంద్రం
వైభవంగా లింగమయ్య ఉత్సవాలు ప్రారంభం ● మొదటి రోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● తెలంగాణ అమర్నాథ్ దర్శనానికి క్యూ కట్టిన జనం ● ఏటీఆర్ కోర్ ఏరియాలో మార్మోగిన లింగమయ్య నామస్మరణ ● దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిన పలువురు భక్తులు జాతర మొదటిరోజు బుధవారం అచ్చంపేట డిపో నుంచి 28, నాగర్కర్నూల్ నుంచి 25 ట్రిప్పులు బస్సులు నడిచాయి. పుల్లాయిపల్లి పెంట వరకు బస్సు సౌకర్యం ఉండగా.. అక్కడి నుంచి అటోల్లో మోకాళ్ల కురువ వరకు వెళ్లి కాలినడకన దర్శనం చేసుకుంటున్నారు. ఆటోలు సరిపడా లేక భక్తులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రివేళలో కూడా బస్సులను అనుమతించడంతో నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. గురువారం పౌర్ణమి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా బస్సులు నడుపుతామని డీఎం మురళి ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట/అచ్చంపేటరూరల్: తెలంగాణ అమర్నాథ్గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభయ్యాయి. పౌర్ణమి ముందురోజు వేలాది మంది భక్తులు మది నిండుగా లింగమయ్యను స్మరించుకుంటూ నల్లమల బాట పట్టారు. అటవీశాఖ బుధవారం నుంచి అనుమతిస్తామని చెప్పినప్పటికీ భక్తులు మంగళవారం సాయంత్రమే ఫర్హాబాద్ గేట్ వద్దకు చేరుకున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయక పగటివేళ లింగమయ్య దర్శనానికి బారులు తీరారు. మొదటిరోజు సుమారు లక్ష మంది దర్శనం చేసుకున్నారు. మెట్లమార్గం, క్షేత్రంలో జనం కిక్కిరిసి ఉండటంతో చెప్పుల కుర్వ వద్ద పోలీసుశాఖ, వలంటీర్లు భక్తుల రాకపోకలను నియంత్రించారు. దీంతో చాలామంది పరిస్థితిని గమనించి లింగమయ్య దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా’ అంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, లోయలు, గుట్టలు, సేలయేర్లను దాటుకుంటూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఐదురోజుల జాతరను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో పగలు, రాత్రి తేడాలేకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుకుగా ఉన్న కొండ దారుల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు ఆచరించారు. బైపాస్ రహదారులతో.. మన్ననూర్–ఫర్హాబాద్ నుంచి రాంపూర్పెంట వరకు వాహనాలు బారులు తీరాయి. ముందుస్తుగా పోలీసు, అటవీశాఖ వాహనాల రాకపోకల నియంత్రణకు వేర్వేరు దారులు ఏర్పాటు చేశాయి. వాహనాల పార్కింగ్కు మైదానం, అవసరమైన చోట చిన్న చిన్న బైపాస్ రహదారులు ఏర్పాటు చేశారు. మరో మార్గమైన అప్పాయిపల్లి–గిరిజన గుండాల కూడా భక్తజన సందోహంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అలసిన భక్తులు పొంచి ఉన్న ప్రమాదాలను లెక్క చేయకుండా చెట్లు, పుట్టలు, గుట్టల నడుమ సేద తీరుతున్నారు. ఆలయం, జలపాతం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా వలంటీర్లు సహకరిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అప్పాయిపల్లి, రాంపూర్ పెంట, సల్వేశ్వరం లోయ, ఫర్హాబాద్ వద్ద ప్రత్యేక వైద్యకేంద్రాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు సైతం అందుబాటులో ఉంచారు. -
మీసేవ చార్జీలు రెట్టింపు
● బుధవారం నుంచి అమల్లోకి.. ● జీఓ విడుదల చేసిన ప్రభుత్వం ● వినియోగదారులకు అదనపు భారం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మీ సేవ రుసుం రెట్టింపయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. మీసేవ దరఖాస్తులకు గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతుంది. మీసేవలో దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు రెండురకాలు ఉండగా రెండింటిలోనూ చార్జీల పెంపు జరిగింది. ఏ, బీ కేటగిరీలుగా విభజన మీ సేవలో దరఖాస్తులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ–ఏ కింద వచ్చే దరఖాస్తులకు ఇది వరకు రూ.35 యూజర్ చార్జీ కాగా.. పెంచిన రేటు ప్రకారం రూ.62 కానుంది. కేటగిరీ–బీ కింద వచ్చే దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 చెల్లిస్తుండగా.. రేపటి నుంచి రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.58గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18. రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడం.. దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం భారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులు అంతరాయం సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 3 సాయంత్రం 5గంటల నుంచి 5 ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణకు ఈ పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్లో వేగవంతమైన, అంతరాయంలేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. -
అపార్ట్మెంట్లో హైటెక్ దందా
● ప్లాట్లో సాగుతున్న వ్యభిచారం పోలీసుల దాడులతో వెలుగులోకి.. మహబూబ్నగర్ క్రైం: నగరంలో హైటెక్ వ్యభిచార దందా విస్తృతంగా సాగుతుంది. వాట్సాప్లో అమ్మాయిల ఫొటోలను ఎరవేసి విటులను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. నమ్మదగిన విటులకు వాట్సాప్లో అమ్మాయిలు, మహిళల ఫొటోలు పంపించి బేరం కుదుర్చుకుంటున్నారు. నగరంలో క్లాస్ ఏరియాలో సైతం ఇళ్లు, ఫ్లాట్లను అద్దెకు తీసుకొని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బుధవారం పట్టణంలోని అశోక్ టాకీస్ ప్రాంతంలో ఉన్న శ్రీసాయి బాలాజీ టవర్స్ అపార్ట్మెంట్లోని ప్లాట్నంబర్ 309పై పోలీసులు దాడి చేయగా ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులు పట్టుబడినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండో పట్టణ సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాట్పై దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులతో పాటు వ్యభిచార గృహంలో ఉద్యోగిగా పనిచేసే అజయ్ని అరెస్టు చేశారు. దందా నిర్వాహకుడు సంతోష్రెడ్డి పరారీలో ఉన్నారు. దందా నడుపుతున్న వారితో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
దాడులు చేస్తే తగిన బుద్ధి చెబుతాం
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మర్రి జనార్దన్రెడ్డి హెచ్చరిక బల్మూర్: కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, వారికి తగిన బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని జిన్కుంట సర్పంచ్ రంగినేని పుష్పలతతో పాటు ఆమె భర్త ప్రేమ్కుమార్ను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు జిన్కుంటలో సర్పంచ్పై దాడి చేయడమే కాకుండా ఆమైపె అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సర్పంచ్లను వేధిస్తున్న విషయాలను ప్రజలు గమనిస్తేనే ఉన్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేతకాని పాలనతో గ్రామాల అభివృద్ధిని మరిచి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడులకు దిగడంతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారని, అధికారులు వారికే వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోకల మనోహర్, బండపల్లి వెంకటయ్య, నర్సయ్యయాదవ్, సురేష్రావు, తులసీరాం, అంతటి శివ, రమేష్రావు, నాగయ్య, శివశంకర్, శిరీష, తిపరుపతి, సుల్తాన్, గోపాల్రావు, సుదర్శన్, మహేష్, పాల్గొన్నారు. -
మహబూబ్నగర్
● ఎట్టకేలకు ఫైనల్లొకేషన్ సర్వే పూర్తి ● వనపర్తి, నాగర్కర్నూల్,కల్వకుర్తి, దేవరకొండ మీదుగా మార్గం ● ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,330 కోట్లు ● రైలు మార్గం పొడవు 296 కిలోమీటర్లు ● కీలక అభివృద్ధికి మరో ముందడుగు గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పదో తరగతిమూల్యాంకనం ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. బుధవారం హిందీ జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. మొత్తం 1,100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనున్నారు. డీఈఓ ప్రవీణ్కుమార్, పరీక్షల అడిషనల్ కమిషనర్ కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే వారు సెల్ఫోన్లు ఉపయోగించవద్దని, వ్యాలువేషన్ కోసం డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. అయితే పలు పాఠశాలలో సిబ్బందికి అనారోగ్యం, చిన్నపిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం విధులు కేటాయించడంతో.. వారికి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలు సంఘాల నాయకులు డీఈఓను కోరారు. అలాంటి వారికి మినహాయింపు ఇచ్చి, కొత్త వారికి విధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, తపస్ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్, సురేందర్నాథ్, తదితరులు పాల్గొన్నారు. నిర్దేశించిన మార్గంలోనే శోభాయాత్ర సాగాలి మహబూబ్నగర్ క్రైం: నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం హనుమాన్ శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీసులు నిర్దేశించిన మార్గంలోనే యాత్ర కొనసాగాలని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పూర్తి సహకారం అందించాలన్నారు. డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడానికి అనుమతి లేదన్నారు. యువత, నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ● హనుమాన్ జయంతిలో డీజేలు పెట్టరాదని డీజే నిర్వహకులకు వన్టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. వన్టౌన్ పరిధిలో ఉన్న డీజే సిస్టమ్ నిర్వహకులతో బుధవారం స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం డీజే నిర్వహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నేడు విద్యుత్ ఆర్టిజన్లవంటావార్పు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ భవన్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, జడ్చర్ల డివిజన్ చైర్మన్ జహంగీర్, మహబూబ్నగర్ డివిజన్ చైర్మన్ పెంటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ప్రతి విద్యుత్ కార్మికుడు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ శ్రీనివాస్ పీయూలో బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, మిషన్ లర్నింగ్లో మొత్తం 62మంది ఉండగా ఇందులో 34 మంది ఉత్తీర్ణులై, 28మంది ప్రమోట్ అయ్యారు. డేటాసైన్స్లో 32 మంది ఉత్తీర్ణులై, 29 మంది ప్రమోట్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్లో 24 మంది ఉత్తీర్ణులై, 40 మంది ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు కనెక్టివిటీబలోపేతం కనెక్టివిటీల ప్రకారం అలైన్మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 200 కిలోమీటర్ల దూరంఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది. జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు రాకపోకలకు దగ్గర అవుతుంది. 1981లో బీజం.. మార్పులతో ఆమోదం గతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమలు, ఉపాధి మెరుగు.. దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ కొత్త లైన్ ద్వారా రాష్ట్రంలోని ఆయా జిల్లాకేంద్రాలతోపాటు హైదరాబాద్, దేశ రాజధానికి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఊతం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ ●బావాజీ ఉత్సవాలు ప్రారంభం గిరిజనుల ఆరాధ్య దైవం గురు లోకమాసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో ప్రారంభమయ్యాయి. –8లో u -
వాహనదారులకు ఇబ్బందులు రావొద్దు: ఎస్పీ
రాజాపూర్: జాతీయ రహదారిపై వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో డైవర్షన్లను ఏర్పాటు చేయాలని ఎస్పీ జానకి సూచించారు. రాజాపూర్లో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను బుధవారం ఎస్పీ పరిశీలించారు. రోడ్డు డైవర్షన్ ఏర్పాటుపై కాంట్రాక్ట్ ప్రతినిధులకు ఆమె పలు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ అవసరమైన హెచ్చరిక బోర్డులను, రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లు, సిగ్నల్ లైట్లు, ఇతర సూచికలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా, డైవర్షన్ మార్గాలను, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైఓవర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వారికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ రాజాపూర్ రాజశేఖర్ ఉన్నారు. -
పాలమూరు న్యాయవాదుల పోరాటంతోనే రక్షణ చట్టం
● సీఎం చొరవతోనే న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదం : అనంతరెడ్డి పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ వల్లే న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు అమోదం పొందిందని, ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పోరాటం ఫలించిందని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును శాసనసభలో అన్ని పక్షాలు ఆమోదించేలా సీఎం చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంగా సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్ న్యాయవాదుల సంఘం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పాదయాత్ర చేపట్టారని, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పూర్తి సహకారంతో ముందుకు సాగిందన్నారు. భూత్పూర్ వరకు పాదయాత్రకు చేరుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వంశీకృష్ణ అక్కడికి వచ్చి.. సీఎం దృష్టికి తీసుకువెళ్లి రక్షణచట్టం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల వల్ల సీఎంను కలవడానికి సాధ్యం కాలేదని.. రెండో విడత మహా పాదయాత్ర కొనసాగించి.. ఫిబ్రవరి 27న సచివాలయానికి చేరుకుని సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ఆమోదించినట్లు తెలిపారు. ఇకపై న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా.. అలాంటి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. న్యాయవాదులు ఎవరైనా రక్షణ కావాలని పోలీసులను కోరితే రక్షణ కల్పించేలా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో రూపొందించినట్లు చెప్పారు. న్యాయవాదులపై దాడులు జరిగితే డీఎస్పీ స్థాయి అధికారి విచారించేలా చట్టం రూపకల్పన చేశారని గవర్నర్ ఆమోదముద్ర తర్వాత అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీధర్రావు, వెంకటయ్య, నాగోజీ, తగిలి కృష్ణ, రాఘవేందర్, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. -
ప్రజలకు పారదర్శక పాలన అందాలి
అడ్డాకుల: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారికి పారదర్శక పాలన అందేవిధంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్లతో కలిసి మూసాపేట మండలంలో పర్యటించారు. మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండల అధికారులతో సమావేశమయ్యారు. మన ఇసుక విధానం ద్వారా ఇసుక బుకింగ్పై ఆరా తీశారు. జిల్లాలో ఇసుక బుకింగ్ వందశాతం ఆన్లైన్లోనే జరగాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు మ్యానువల్ కూపన్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం మూసాపేటలో ఓ రేషన్షాపును తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఈనెల 30 వరకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్.. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. పోల్కంపల్లి ఇసుక రీచ్ పరిశీలన పోల్కంపల్లి శివారులోని పెద్దవాగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను కలెక్టర్ పరిశీలించారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా జరిగే ఇసుక సరఫరాను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇసుక రవాణా జరిగేలా చూడాలని చెప్పారు. అనంతరం గ్రామంలో ఉన్న పీఏసీఎస్ను సందర్శించారు. అందులో కొనసాగుతున్న ఎరువుల దుకాణాన్ని పరిశీలించి ఎరువుల లభ్యత గురించి ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి విక్రయాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, డీఎం రవినాయక్, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, మైనింగ్ ఏడీ గోవిందరాజులు, తహసీల్దార్ రాజునాయక్, ఏఓ అనిల్కుమార్, తదితరులు ఉన్నారు. -
దేవరకద్ర మార్కెట్కు పోటెత్తిన ఉల్లి
● క్వింటా గరిష్టంగా రూ.1400.. కనిష్టంగా రూ.800 దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు బుధవారం ఉల్లి కుప్పలతో కళకళలాడింది. వివిధ గ్రామాల రైతులు 10 వేల బస్తాల ఉల్లిని మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ ఆవరణ, సీసీ రహదారులపై ఎక్కడ చూసిన ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం పది గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి తరలించారు. గత వారం ధరలే ఈసారి కొనసాగాయి. వేలంలో క్వింటా ఽఉల్లి ధర గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.800 పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోలు తూకం చేసి బస్తాలుగా విక్రయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400గా విక్రయించారు. ● మార్కెట్లో మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,358, కనిష్టంగా రూ.2,202, హంస ధాన్యం రూ.1,751, ఆముదాలు గరిష్టంగా రూ.6,202, కనిష్టంగా రూ.6,189 నమోదయ్యాయి. -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా రాంపూర్పెంట పుల్లాయిపల్లికురియాల జంక్షన్ మోకాల కుర్వ -
నేటి నుంచి టోల్ప్లాజాల వద్ద ‘నో క్యాష్’..!
అడ్డాకుల: జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లింపులకు జాతీయ రహదారుల సంస్థ స్వస్తి పలికింది. టోల్ప్లాజాల వద్ద వాహనదారులు ఎక్కువ సేపు వేచి ఉండే సమయాన్ని తగ్గించి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడానికి ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఫాస్టాగ్ లేని వాహనదారుడి నుంచి రెండింతల నగదును వసూలు చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాహనదారుల నుంచి డిజిటల్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతించనున్నారు. ఇందుకోసం 25 శాతం ఫీజును అధికంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాయికల్, శాఖాపూర్, అలంపూర్ టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఎన్హెచ్ఏఐ స్వస్తి పలికింది. ఇక నుంచి టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లించి వెళ్లాలనుకుంటే కుదరదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హన్వాడ: భార్య మానసిక పరిస్థితి, తనపై కేసుల కా రణంగా జీవితం విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని నాగినోనిపల్లికి చెందిన బొమ్మరాసి నర్సిములు(51) భార్య లక్ష్మమ్మ మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. అలాగే తనపై కేసులు ఉండడంతో ఈనెల 29న ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తల్లి రాములమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
చలో.. సలేశ్వరం
లింగమయ్య దర్శనానికి వేళాయె సలేశ్వరం రూట్మ్యాప్వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ – అచ్చంపేట – శ్రీశైలం -
కౌకుంట్ల ఎఫ్సీఐ గిడ్డంగుల తనిఖీ
దేవరకద్ర: కౌకుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఎఫ్సీఐ బియ్యం గిడ్డంగులను రాష్ట్ర ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ నరసింహారాజు మంగళవారం తనికీ చేశారు. గిడ్డంగిలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యత, తూకం యంత్రాల ఖచ్చితత్వాన్ని తనికీ చేశారు. అలాగే బియ్యానికి ఉపయోగించిన గోనే సంచుల బరువును క్షుణ్ణంగా పరిశీలించారు. బియ్యం సంచులను తూకం వేయడంతో వాటి ప్రమాణాలను సరిచూసుకున్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపరిధిలోని కౌకుంట్లలో ఉన్న ఎఫ్సీఐ గిడ్డంగికి లక్షా11వేల టన్నుల నిల్వ సామర్థం ఉందని తెలిపారు. ఆయన వెంట ఎఫ్సీఐ రాష్ట్ర బోర్డు సభ్యులు కిరణ్సాగర్, నాణ్యత నియంత్రణ మేనేజర్ జగ్రునాయక్, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. పెద్దపులి దాడిలో పాడిఆవు మృతి మన్ననూర్: అటవీ సరిహద్దు ప్రాంతం లింగమయ్యస్వామి ఆలయ సమీపంలో పాడి ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా.. మన్ననూర్ గ్రామానికి చెందిన పెర్ముల చెన్నకిష్టయ్య పాడి ఆవు మేత కోసం అటవీ పరిసర ప్రాంతానికి వెళ్లింది. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో లింగమయ్యస్వామి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. బాధితులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పెద్దపులి సంచారం గురించి తెలుసుకోవడానికి సీసీ కెమెరాను బిగించామని వెల్లడించారు. -
బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కృష్ణా: భీమానదిౖెవ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం కుసుమర్తి, సూకూర్లింగంపల్లిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. దాంతోపాటు కర్ణాటకలోని గూడూర్ బ్రిడ్జి కం బ్యారేజీని కూడా పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు భీమానదిపై బ్యారేజీ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంత నీటి నిల్వకు అవకాశం ఉండవచ్చు, ఏ ప్రాంతంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయంపై పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్ఈ శ్రీధర్, కేతన్కుమార్, డీఈ శేఖర్, ఏపీపీఈ ప్రదీప్, ఖాజతోపాటూ ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
నీటి కేటాయింపులో రాజీపడే ప్రసక్తే లేదు
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తికి దక్కాల్సిన నీటి కేటాయింపులో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని, శ్రీశైలం జలాశయంలో కనిష్ఠ నీటిమట్టం 20 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఇక్కడి వారి సాగు తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం అన్యాయంగా నీటిని వినియోగిస్తుందని విమర్శించారు. ఈ విషయంపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు శ్రీశైలం వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందన్నారు. కల్వకుర్తి ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని నీటి కేటాయింపుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కల్వకుర్తికి నష్టం జరిగితే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని భవిష్యత్లో ఇలాంటి చర్యలు పునరావృత్తమైతే కఠినంగా ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షాన్వాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు రాజేష్ కుమార్, కరుణాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆరోగ్య సంజీవని.. సిరి ధాన్యాలు
● చిరు ధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం ● కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత మదనాపురం: నేటి ఆధునిక జీవనశైలిలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి ఆయుప్రమాణం రోజురోజుకూ తగ్గిపోతుంది. పాశ్చాత్య ఆహార సంస్కృతికి అలవాటు పడి, పాలిష్ బియ్యం, మైదాలను ఆహారంలో ఎక్కువగా చేర్చడంతో చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నామని మదనాపురం కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత హెచ్చరించారు. సిరిధాన్యాలు మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటి ప్రాముఖ్యతను తెలిపారు. చిరుధాన్యాలు షుగర్, బీపీ ఉన్నవారికి అ త్యుత్తమ ఆహారంగా నిలుస్తాయి. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్ చాలా తక్కువగా ఉండడంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అమృత ఆహారం. కణజాల రక్షణకు.. మన శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడే ఆంటీ ఆక్సిడెంట్లు చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉన్నా యి. ఫలితంగా ఇవి ఒబేసిటి (అతి బరువు), గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా, నిరంతరం శక్తివంతంగా ఉంటుంది. వీటిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థ పదా ర్థాలను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది. క్యాల్షియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు, వృద్ధులకు ఎముకల బలానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి చిరుధాన్యాలు ఎంతగానో తోడ్పడతాయి. చిరుధాన్యాలు నాడీ వ్యవస్థను బలపర్చడం ద్వారా మేథోశక్తి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన దైనందిన ఆహారంలో వరి, గోధుమల స్థానంలో కొంతవరకై నా రాగులు, జొన్నలు, సజ్జలు, కొరల్రు వంటి సిరిధాన్యాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డా.అనిత సూచించారు. రాగి అంబలి రాగి ధాన్యాలతో చేసిన బిస్కెట్ వేసవి కాలంలో ముఖ్యంగా రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో అవసరమని, రాగులతో చేసిన అంబలి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) కాకుండా కాపాడుకోవచ్చని, ఇది చలవ చేయడమే కాకుండా శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుందని డా.అనిత వివరించారు. -
నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా
గట్టు: నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన చెనుగోనిపల్లెకు చెందిన డ్రైవర్ సాయికుమార్కు మంగళవారం గద్వాల 1వ అదనపు జ్యూడిషయల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఉదయ్నాయక్ నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు గట్టు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. 2018లో గట్టు పోలీస్స్టేషన్ పరిధిలోని బల్గెర సమీపంలో నిర్లక్ష్యంగా వాహనం నడుపగా చెనుగోనిపల్లెకు చెందిన పెద్ద బుచ్చన్న (70) గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అప్పటి ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలను కోర్టులో ప్రవేశ పెట్టి, నేరం రుజువయ్యేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేచల్ సంజన జాషువ, కోర్టు కానిస్టేబుల్ రాందాస్ కృషి చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితుడు చెనుగోనిపల్లెకు చెందిన డ్రైవర్ సాయికుమార్కు రెండేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు ఎస్ఐ తెలిపారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు ఉండవెల్లి: మండలంలోని ఉండవెల్లి శివారులో వరసిద్ది వినాయక పత్తి మిల్లు సమీపంలో మంగళవారం ఓ కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్తున్న కారు బోల్తా అదుపుతప్పి బోల్తా పడగా కారులో ప్రయాణిస్తున్న ఇమ్రాన్, భాను, మహమ్మద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి అంబులెన్స్కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి 108లోనే చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పెబ్బేరు పట్టణ కేంద్రానికి చెందిన బత్తుల కృష్ణయ్య, భార్య వరలక్ష్మితో కలసి ఈ నెల 29న వీపన్గండ్ల మండలం ,కల్వరాల గ్రామంలో శుభకార్యం ఉండడంతో బైక్పై బయలుదేరారు. చెలిమిల్లకు రాగానే వెనుక నుంచి వస్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణయ్య తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లగా కర్నూల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. యువకులపై కేసు నమోదు మహబూబ్నగర్ క్రైం: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై అభ్యంతకరంగా ఇన్స్ట్రాగామ్లో పోస్టు షేర్ చేసిన ఒక యువకుడిపై కేసు నమోదు చేయడంతోపాటు టూటౌన్ పోలీసులు బైండోవర్ చేశారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇటీవల గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోపై ఇన్స్ట్రాగామ్లో అభ్యంతకరంగా ఒక పోస్టు ఏర్పాటు చేసి షేర్ చేశారు. దీంతో కొంతమంది యువకులు సదరు యువకుడి ఇంటికి వెళ్లి అతనితో ఆ పోస్టు తొలగించే విధంగా చేశారు. ఆ తర్వాత అతనితోనే రాజాసింగ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయించి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఆరుగురు యువకులకు నోటీసులు జారీ చేయడంతోపాటు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా రాజాసింగ్పై అభ్యంతకరంగా పోస్టుపెట్టిన యువకుడిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలి తప్పా సొంతంగా చేయరాదని సూచించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి జడ్చర్ల: ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ మల్లేశ్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఏపీలోని అనంతపూర్ జిల్లా యాడికి మండలం రాయంచెరువు గ్రామానికి చెందిన తుమ్మల రమేశ్(54) ఉదండాపూర్ శివారులోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సమీప దేవుడిగుట్టతండా సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు కల్వర్టు మీద పడుకున్నాడు. నిద్ర మత్తులో ఉన్న సమయంలో ప్రమావశాత్తు కల్వర్టు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బావాజీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
● రేపటి నుంచి గురులోక మాసంద్ జాతర ప్రారంభం ● డీఎస్సీతో పాటు 10 మంది సీఐలు,15 మంది ఎస్ఐలతో బందోబస్తు కొత్తపల్లి: గిరిజనుల జీవన విధానంలో తన బోధనల ద్వారా మార్పు తీసుకొచ్చి, ఆపద సమయంలో వారిని ఆదుకున్న గురులోకామాసంద్ ప్రభు (బావాజీ)ని గిరుజనులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ క్రమంలోనే అయన పుట్టిన రోజు (చైత్ర శుద్ధ పౌర్ణమి)ను పురస్కరించుకొని గిరిజనులు ప్రతి ఏటా కనులపండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకామాసంద్ ప్రభు ఆలయంలో మార్చి 1 నుంచి 4 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చైత్ర శుద్ధ చతుర్ధశి బుధవారం నుంచి చైత్ర బహుళ విదియ మొదటి రోజు 1న ధ్వజారోహణం (అర్థాస్) రాత్రి ప్రభోత్సవం, బంజారాల సంస్కృతి కార్యక్రమాలు, 2న గురులోకామాసంద్ ప్రభుకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, రాత్రి 2గంటలకు రఽథోత్సవం (తేరు), 3న మహాభోగ్, ప్రభువారి పల్లకీసేవ, కాళికాదేవి వద్ద భక్తుల మొక్కుల చెల్లింపులు, 4న కాళికాదేవి పల్లకీ సేవ, హోమం, పూర్ణాహుతి, మంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఉత్సవాలకు తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు హాజరై ప్రభును ఆరాధిస్తారు. ఏర్పాట్లు పూర్తి ఉత్సవాల ఏర్పాటు కోసం గత నెల 17న కలెక్టర్ సిక్తా పట్నాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి వివిధ శాఖల అధికారులతో ఆలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ నెల 28న కలెక్టర్ ప్రతీక్ జైన్ మరోసారి అధికారులతో సమీక్షతో పాటు, ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. జాతర జరిగే నాలుగు రోజులు జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్ల కోసం 500 మంది సిబ్బంది ఉపయోగిస్తున్నట్లు డీపీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. జాతరను 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ ఇన్చార్జ్గా ఎంపీఓ వ్యవహరిస్తారన్నారు.ఉత్సవాల్లో సమస్యలపై ఫి ర్యాదుల చేయడానికి 2 కంట్రోల్ రూంలను ప్రారంభించామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. అలాగే షీటీంలు, మఫ్టీలో పోలీసులు, పోలీస్ పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇతర బందోబస్తుకు పోలీసులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నారాయణపేట డీఎస్సీ లింగయ్య పర్యవేక్షణలో 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 36 మంది హెడ్కానిస్టేబుళ్లు, 200 మంది పోలీసులు, 53 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. గ్రామంలోని ఇళ్లలో ఎవరైనా మద్యం అమ్మకాలు సాగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
భారీ బందోబస్తు ఏర్పాటు
రథోత్సవ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ వీరబాబు అధ్వర్యంలో దాదాపుగా 3 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టపైకి వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రథోత్సవ వేడుక అనంతరం భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బారులుతీరారు. స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారు, శివదత్తాత్రేయ ఆలయాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్శర్మ, అనంత శర్మ, కోదండ రామశర్మ, ప్రవీణ్శర్మ, మురళీధర్ శర్మ, సర్పంచ్లు, నాయకులు ఉన్నారు. -
రాములోరి రథోత్సవం
రమణీయం.. చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతు న్న సిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద రథోత్సవం (పెద్దతేరు) తెల్లవారుజామున అత్యంత రమణీయంగా జరిగింది. వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తుల జయజయ ధ్వానా ల మధ్య రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై సీతారామలక్ష్మణ ఉత్స వ విగ్రహాలను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ అంజనేయులు రథాన్ని లాగి, ముందుకు కదిలించారు. ప్రధాన అలయం నుంచి ముక్కిడి పొచమ్మ, దత్తాత్రేయ ఆలయం వరకు రథాన్ని తీసుకొచ్చారు. వేడుక సోమవారం అర్ధరా త్రి నుంచి తెల్లవారుజాము న 6 గంటల వరకు సాగగా.. ఆలయ ప్రాంగణం శ్రీరామనామస్మ రణతో మార్మోగింది. భక్తులు సోమవారం రాత్రి ఆలయ గుట్టపై చేరుకొని జాగరణ చేశారు. రథోత్సవంలో కళాకారులు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. రాత్రికి స్వామివారికి నాగబలి, పూర్ణాహుతి, గజవాహన సేవ, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవం ప్రారంభిస్తున్న ఆలయ చైర్మన్, ఈఓ తదితరులు అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం జనసంద్రమెన సిర్సనగండ్ల -
‘మహాలక్ష్మి’తో మహిళా సాధికారిత
స్టేషన్ మహబూబ్నగర్: మహిళల ఆర్థిక, సామాజిక భద్రతతోపాటు సాధికారితకు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదపడుతోందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. 2026 మార్చి 29 నాటికి సుమారు 290 కోట్ల మహిళల ప్రయాణాలు నమోదు కావడంతో రూ.10 వేల కోట్లు బస్సు చార్జీల ఆదా రూపంలో ప్రయోజనం చేకూరిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలు, పట్టణాలు, నగరాలకు చేరుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యావకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఈ సౌకర్యం ద్వారా వారు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయం పెంచుకుంటున్నారని, దీని వలన ఆర్థికంగా బలపడటమే కాకుండా సామాజికంగా, విద్యాపరంగా కూడా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. మేయర్ మమత మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తాను మేయర్గా ఎన్నికవడం కూడా మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 10 డిపోల్లో 960 ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందుతున్నారన్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.1,064 కోట్ల బస్సు చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 100 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్న కొంతమంది మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నర్సింహులు, డిప్యూటీ ఆర్ఎంలు లక్ష్మీధర్మ, కవిత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వాతి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేడిమి.. ఉక్కపోత
● జిల్లాలో తీవ్రమైన ఎండలు ● 11 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు ● మధ్యాహ్నం వేళలో తల్లడిల్లుతున్న ప్రజలు ● పండ్ల రసాలు, శీతలపానియాలతో ఉపశమనం పాలమూరు: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండు వేసవికి ముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ అధికం అవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లుతున్నారు. వేడిమి నుంచి ఉపశమనం కోసం మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు, పండ్ల రసాలను తాగుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతున్నాయి. పనులమీద బయటకు వస్తున్న ప్రజలు.. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరేలా ప్రయత్నిస్తున్నారు. ఆరు బయటకు వచ్చిన జనాలు ఉపశమనం పొందేందుకు నానా ఇక్కట్లు పడ్డారు. మహబూబ్నగర్ టు రాయచూర్, హైదరాబాద్ టు మహబూబ్నగర్, భూత్పూర్ ప్రధాన రహదారులతోపాటు పట్టణాలు, గ్రామాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనదారులు తలకు టోపీలు ధరిస్తూ, ముఖాలకు గుడ్డలు కట్టుకుని జాగ్రత్త పడుతున్నారు. పాదచారులు గొడుగు నీడన అడుగులు వేస్తూ భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
శ్రీశైలంలో తగ్గుతున్న నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 824.1 అడుగుల వద్ద 44.0874 టీఎంసీల నీటి నిల్వ ఉంది. టీజీ జెన్కో పరిధిలోని భూగర్భ కేంద్రంలో శ్రీశైలంలో నీటిమట్టం 800.0 తగ్గకుండా ఉన్నంత వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అలాగే ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో శ్రీశైలంలో నీటిమట్టం 798.0 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో వేసవిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉండటంతో మంగళవారం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి శ్రీశైలం డ్యాం వద్ద ధర్నా చేయనున్నట్లు దోమలపెంటకు చెందిన కాంగ్రెస్ నాయకులు మోయిజ్, మల్లిఖార్జున, గురువయ్య, సిరాజ్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఏపీ పరిధిలోని శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుందని, దీంతో ఎంజీకేఎల్ఐపై ప్రభావం చూపి ఉమ్మడి జిల్లాకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని చెప్పారు. ఇసుక డంప్ సీజ్ అయిజ: అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక డంపులను అధికారులు సోమవారం సీజ్ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తుంగభద్రానది ఒడ్డున పులికల్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 40 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇసుక డంప్ను పరిశీలించి పంచనామా చేశారు. అదేవిధంగా ఇసుక డంప్ను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ రవినాయక్, జీపీఓ రవి పాల్గొన్నారు. -
పెయింట్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్
గద్వాల క్రైం: పట్టణంలోని ఓ పెయింట్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది, బాధితుడు రఘురాం కథనం మేరకు.. తుల్జారాం దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి పెయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ సంభవించి దుకాణంలోని రూ.30 లక్షల విలువగల పెయింట్ డబ్బాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అశోక్, రాకేష్, గౌస్, రాజశేఖర్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో సాధ్యం కాలేదు. మరో ఫైర్ ఇంజిన్ సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
మంచి స్నేహితులతో ఆరోగ్యకర జీవనశైలి
మహబూబ్నగర్ క్రైం: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్ను అంధకారంలోకి నెట్టే ప్రమాదకర వ్యసనమని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్లో 2వేల మంది విద్యార్థులతో పాటు జేపీఎన్సీఈ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటూ.. ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ బృందాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడం.. మంచి స్నేహితులతో కలిసి క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ వ్యసనానికి లోనైతే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం రెండూ దెబ్బతింటాయన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ అలవాటుకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించి బయటపడాలన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టిపెట్టి మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఈగల్ ఫోర్స్ అదనపు ఎస్పీ పి.కృష్ణమూర్తి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయ విధానాలు, వాటి వెనుక ఉండే నెట్వర్క్పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి.. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఈఎస్ సుధాకర్, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎంహెచ్ఓ డా.కృష్ణ, డీఈఓ ప్రవీణ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రత్యేక నంబర్లు ఏర్పాటు.. జిల్లాలో డ్రగ్స్ కట్టడి కోసం పోలీస్ శాఖ ప్రత్యేక నెంబర్లు ఏర్పాటు చేసింది. టోల్ఫ్రీ నంబర్ 1908, వాట్సప్ నంబర్ 8712671111, కంట్రోల్ రూం నంబర్ 8712659360తో పాటు tsnabho-hyd@tspoice.gov.in ఏర్పాటు చేయడం జరిగింది. -
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు కష్టాలు
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రూ.9వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండులో పోరుదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజినీరింగ్, వైద్య, ఇతర కాలేజీలు మూసివేయడానికి సిద్ధమవుతున్నారన్నారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టింపు లేకుండా పోయిందన్నారు. ఫలితంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు నిరుద్యోగులు మేలుకొని పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు బాసు హనుమంతునాయుడు, నాగర్దొడ్డి వెంకట్రాములు, పద్మ, చక్రధర్రావు, రాఘవేంద్రరెడ్డి, ప్రేమలత, పల్లయ్య, సూర్యగౌడ్, కోటేశ్, మోనేష్, పులిపాటి వెంకటేశ్, చిత్తారి కిరణ్, కమ్మరి రాము, నర్సింహులు, గంజిపేట రాజు తదితరులు పాల్గొన్నారు. -
మానసిక వేదనతో.. ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం
గోపాల్పేట: మానసిక వేదనతో ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గోపాల్పేట మండలం బుద్ధారంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ జగన్మోహన్ వివరాల మేరకు.. బుద్ధారం గ్రామానికి చెందిన ఆవుల రామస్వామి (52) కొంతకాలంగా జిల్లా నీటిపారుదలశాఖలో పనిచేస్తున్నారు. గతంలో గ్రామ వీఆర్ఏగా పనిచేశారు. అయితే తనకు కంటిచూపు సమస్య ఉండటంతో పాటు ఇటీవల తన ఇంటి పక్కనున్న స్థలంపై వివాదం నెలకొనడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు.. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పంటలకు నీరందించాలని రైతుల ఆందోళన
చిన్నచింతకుంట: మండలంలోని పర్దీపూర్ జలాశయం అడుగంటిపోవడంతో పంటలకు నీరులేక ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూరాల బ్యాక్ వాటర్ను విడుదలచేసి, పంటలను కాపాడాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండిన పంట పొలాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు కోట రాము మాట్లాడుతూ.. పర్దీపూర్ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు కష్టించి సాగుచేసిన వరిపైరు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. జూరాల నుంచి రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బసిరెడ్డి సంతోష్రెడ్డి, స్వామి, నర్సింహ, రఘు, బైని బాలరాజు, బరనప్ప, మల్లేష్, గోవిందు, వెంకటేశ్, ఆంజనేయులు, బుచ్చప్ప పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో మహిళా రైతు మృతి
వంగూరు: మండలంలోని నిజాంబాద గ్రామానికి చెందిన మహిళా రైతు ఇడమోని లక్ష్మమ్మ (34) సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. లక్ష్మమ్మ తన వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటను తూర్పార పడుతుండగా వర్షం రావడంతో ఆమె కూలీలతో పాటు కొంతదూరం వెళ్లి నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత వేరుశనగ కుప్పపై కప్పిన కవర్ గాలికి లేచిపోవడంతో దానిని సరిచేసేందుకు వెళ్తుండగా లక్ష్మమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త వెంకటయ్యకు కళ్లు కనబడకపోవడంతో ఆమెనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణ ం రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాజాపూర్ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం బుక్సర్ జిల్లా నవాన్నగర్కు చెందిన మంజి పాశ్వన్ (31) పోలేపల్లిసెజ్లో గల ధర్మోకేబుల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సోమవారం రోజు మాదిరిగా పనికి వెళ్తూ జాతీయ రహదారి పక్క నుంచి వెళ్తుండగా జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య చంపకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మహబూబ్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ 2 శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన గోపిరెడ్డి శాంతమ్మ (70) జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న తన కుమార్తె మల్రెడ్డి సుమలత ఇంటి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి వెళ్లడానికి రామాలయం బస్స్టాప్ వద్ద రోడ్డు దాటుతుండగా బస్టాండ్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శాంతమ్మను కుమార్తె వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందింది. ఘటనపై మృతురాలి కుమార్తె మల్రెడ్డి సుమలత ఫిర్యాదు మేరకు సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య కృష్ణా: అప్పులబాధ తాళలేక ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని చెక్పోస్టు ప్రాంతంలో నివసిస్తున్న నాగరాజు (50) వ్యవసాయ పొలాలను లీజ్కు తీసుకొని పంటలు సాగుచేసేవాడు. కొంతకాలంగా వ్యసాయంలో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులబాధ భరించలేక సమీపంలోని బ్రిడ్జిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్ (57) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్ఐ కురుమయ్య వివరాల మేరకు.. వ్యవసాయ కూలీ పనులు చేసుకొని జీవించే ముడావత్ లక్ష్మణ్ కుమారుడు ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. నాటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంట్లోనే పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పాన్గల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, మృతుడి కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ ఉషా లింగానాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో గరుడవాహన సేవ
సిర్సనగండ్లలో స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు చారకొండ: సిర్సరనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. అంతకుముందు ఆలయంలో సీతారామచంద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా శివదత్తాత్రేయ, పరశరామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయు లు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీధర్ శర్మ, సీతారామశర్మ, కోదండ రామ శర్మ, ప్రవీణ్ శర్మ, అనంత శర్మ, భాస్కర్ శర్మ పాల్గొన్నారు. -
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఎంపికల్లో పాల్గొనాలి. సంబంధిత ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలి. –ఎస్.శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి, మహబూబ్నగర్ క్రీడా పాఠశాలతో ఉజ్వల భవిష్యత్ స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికై న వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. విద్యార్థులను ఇటు చదువుతోపాటు అటు క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతారు. ఈ అవకాశాన్ని క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉపయోగించి భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. –వేణుగోపాల్, సీనియర్ పీడీ, జెడ్పీహెచ్ఎస్ చిన్నదర్పల్లి, మహబూబ్నగర్ ● -
స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు షురూ
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు జిల్లా స్థాయిలో సెలక్షన్స్ మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్ఎస్ హకీంపేటతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో 2026–27 సంవత్సరానికి 4వ తరగ తిలో ప్రవేశాలు జరగనున్నాయి. ప్రతి స్కూల్లో 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలను, హన్మకొండ స్కూల్లో 40మంది బా లురు, 40మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో సందడి.. ఉమ్మడి జిల్లాలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ సందడి నెలకొంది. సోమవారం నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిలాల్లో జిల్లాస్థాయి సెలక్షన్స్ జరగగా నేడు (మంగళవారం) మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా వనపర్తి జిల్లాలో నేడు బాలుర, బుధవారం బాలికల జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు రాష్ట్రస్థాయి సెలక్షన్స్కు వెళ్తారు. ఏఫ్రిల్ 27వ తేదీ నుంచి మే 1 వరకు రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మే 13, 14 తేదీల్లో కౌన్సెలింగ్, జూన్ 12న ఎంపికై న విద్యార్థులు ఆయా స్పోర్ట్స్ పాఠశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన ధ్రువపత్రాలు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలకు విద్యార్థులు ధ్రువ పత్రాలతో రావాలి. ఒరిజినల్ ఆధార్కార్డు, 4వ తరగతి సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, విద్యార్థులు 8 నుంచి 9 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, 01–09–2017 నుంచి 31–08–2018 మధ్య పుట్టిన వారు అర్హులు. నేడు మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లా కేంద్రాల్లో సెలక్షన్స్ ఇప్పటికే నాగర్కర్నూల్, గద్వాల జిల్లాల్లో పూర్తి ఏప్రిల్లో రాష్ట్రస్థాయి సెలక్షన్స్ -
ప్రజావాణికి 167 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్ నగర్): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 167 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తుదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను విని సంబంధిత అధికారులతో చర్చించి అర్జీలను పరిశీలించి సమస్యను పరిష్కారం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అర్జీలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రత్యేక వైద్య శిబిరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఒక రోజు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలు, ఎముకల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, ప్రసూతి–గైనకాలజీ, కంటి వైద్యం, మహిళల ఆరోగ్య నిపుణులు కలెక్టరేట్ సిబ్బంది, సాధారణ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్యసేవలు అందించారు. శిబిరంలో భాగంగా కలెక్టరేట్ ఉద్యోగులకు, కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమంకు వచ్చిన అర్జీ దారులు, ప్రజలకు రక్తపోటు, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక వైద్య క్యాంపును సద్వినియోగం చేసుకుని ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించుకుని డాక్టర్ల సలహాలు, మందులు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జేఎల్బీ హరిప్రియ, మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్ పాల్గొన్నారు. -
ఆశాల రాస్తారోకో ఉద్రిక్తం
ఎస్సీలకు స్వయం ఉపాధి రుణాలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా సబ్సిడీపై ఎలక్ట్రికల్ వాహనాలు (బైక్, ఆటో), పాడి పశువులు, సోలార్ యూనిట్ అందించేందుకు ఏప్రిల్ 8 లోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 క్రింద రూ. లక్ష వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు (90% సబ్సిడీ)తో, రూ.3లక్షల విలువ గల మూడు చక్రాల ఎలక్ట్రికల్ ఆటో (ప్యాసింజర్/ గూడ్స్) వాహనాలు (70% సబ్సిడీ)తో రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల ( 60% సబ్సిడీ)తో విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ, పశు సంవర్ధక యూనిట్ల కోసం ఆన్లైన్ పోర్టల్ https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9849905996 నంబర్ను సంప్రదించాల్సిందిగా సూచించారు. జడ్చర్ల టౌన్: సమస్యల పరిష్కారం కోసం జడ్చర్లలో సోమవారం 44వ నంబర్ జాతీయరహదారిపై ఆశ కార్యకర్తలు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కనీస వేతనం రూ.19 వేలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలనే పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త జాతీయ రహదారుల ధర్నాలో భాగంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఆశా కార్యకర్తలు జడ్చర్ల ఎంబీ మెడికల్ సెంటర్ వద్దకు తరలివచ్చారు. జడ్చర్ల యంబీ మెడికల్ సెంటర్ వద్ద మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఆశ కార్యకర్తలు తరలివచ్చారు. జాతీయ రహదారిపై ధర్నాలకు అనుమతి లేదని, ఒకవేళ రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ గిరిజాబు, సీఐ నాగరాజుగౌడ్ ఆశావర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్ జాతీయరహదారిపైకి వెళ్లి.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా వందలాది మంది ఆశా కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు తీసి రోడ్డుపైకి వచ్చి.. రాస్తారోకోకు దిగారు. జాతీయరహదారిపై రాస్తారోకో ధర్నాలకు అనుమతి లేదని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేసిన పోలీసులకు వారికి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సీఐటీయూ నాయకులు తెలుగు సత్తయ్య, దీప్లానాయక్లను అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈక్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, ఆశా కార్యకర్తలకు తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వందలాది మంది ఆశాలు వారిని అడ్డుకున్నారు. మహిళా పోలీసులు రాకుండా సీఐటీయూ నాయకులు అడ్డుగా ఉండడంతో పాటు తోపులాటలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ క్రమంలో విజయలక్ష్మి సొమ్మసిల్లిపడిపోయారు. కాసేపటికి తేరుకున్న తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఎట్టకేలకు పోలీసులు ముఖ్యనాయకులను అరెస్టు చేయడంతో.. ఆశా కార్యకర్తలు రాస్తారోకో విరమించారు. ● సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసుకుంటామని విన్నవించినా నిరాకరించటం వల్లే హైవే ఎక్కాలి వచ్చిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధుల సమయంలో నిరంతరంగా సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాధన, సావిత్రి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు. రాస్తారోకోలో అమృత, సరోజ, శివలీల, జయలక్ష్మి, పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 44వ నంబర్ జాతీయరహదారిపైఆశా కార్యకర్తల రాస్తారోకో గంటకు పైగా కొనసాగిన నిరసన పోలీసులతో తీవ్ర వాగ్వాదం, పలువురు నాయకుల అరెస్టు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు -
కమిషన్ పేరుతో ప్రభుత్వం కుట్ర
అలంపూర్: కమిషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి కుట్ర చేస్తోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి ఆరోపించారు. అలంపూర్ పట్టణంలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సదస్సుకు హాజరైన ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు అలంపూర్ పురవీధుల్లో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ర్యాలీ చేపట్టారు. యుద్ధం నివారించి మానవ హక్కులను కాపాడాలని నినదించారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా రాష్ట్రంలో విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం విద్యకు సరైన బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పరోక్షంగా ప్రైవేటు విద్యను బలోపేతం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న బిల్లులు, డీఏలు ఇవ్వకుండా పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ను కావాలని తొక్కిపెట్టడం తగదన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పాఠశాలల ప్రభుత్వ నిర్ణయం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీవీబీ వంటి పాఠశాలల మూతపడే అవకాశం ఉంటుందన్నారు. మండలాన్ని రెండు లేదా మూడు క్లస్టర్గా విభజిస్తూ పబ్లిక్ పాఠశాలల ఏర్పాటుతో గ్రామాల నుంచి విద్యార్థులను తరలించడానికి రవాణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంటుందన్నారు. పూర్వ ప్రాథమిక తరగతుల నిర్ణయాన్ని స్వాగతిస్తూనే పూర్వ ప్రాథమిక విద్య కోసం నూతన ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని తొలగించి రెగ్యులరైజేషన్ చేస్తామంటూనే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆక్షేపనీయమన్నారు. సర్వశిక్ష అభియాన్లో భాగంగా పనిచేస్తున్న సీఆర్పీలను, ఎంఐఎస్ కోఆర్డినేట్లకు రెగ్యులర్ వేతనాన్ని ఇవ్వాలన్నారు. కేజీబీవీలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ చేయాలని వారికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ప్రస్తుత యుద్ధ వాతవరణ పరిస్థితుల్లో భారత్ ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. అమెరికా ఆధిపత్య ధోరణి ఇరాన్ దేశంలో తీవ్రంగా మానవ హక్కులు హరించబడినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ఫ్యామిటీ వెల్ఫేర్ ఫండ్ జిల్లా కన్వీనర్ బీసన్న, యూటీఎఫ్ జిల్లా నాయకులు గోపాల్, రవిప్రకాష్గౌడ్, కుమార్నాయుడు, వెంకటరమణ, రాజశేఖర్, తిమ్మప్ప, తిలక్, చంద్రకాంత్, లక్ష్మన్న, రాముడు, చిరంజీవినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా హక్కుల సాధనకు కృషి
అలంపూర్: సమాజంలో మహిళల హక్కుల సాధనకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) కృషి చేస్తుందని ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అన్నారు. పట్టణంలో ఆదివారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లడుతూ.. సమాజంలో మహిళలపై దాడులు, వివక్ష కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద రాజకీయాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా సమాజంలో మహిళను రెండో పోరురాలిగానే చూస్తున్నారన్నారు. సమాజంలో మహిళాకు సమానహక్కులు లేవన్నారు. ప్రేమ, కులం పేరుతో మహిళలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. పోర్న్ సైట్లని నిషేధించడంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. జిల్లా అధ్యక్షరాలు ఏమేలమ్మ, కార్యదర్శి నర్మద మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల సమస్యలపై నిరంతరం పోరాడేది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంమన్నారు. ఐద్వాకు పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విసృతంగా సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు రూ.2500, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాధమ్మ, సమీరా, సుజాత, మాధవి పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి రిమాండ్
పాన్గల్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ కుర్మయ్య ఆదివారం తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని రేమద్దుల గ్రామానికి చెందిన మీదిండ్ల నవీన్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ముఖం చాటేశాడు. దీంతో సదరు యువకుడిపై యువతి ఈనెల 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం శనివారం రాత్రి యువకుడిని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశానుసారం యువకుడిని మహబూబ్నగర్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. కారు ఢీ.. వ్యక్తి దుర్మరణం మిడ్జిల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలొని బోయిన్పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం బాల్యలోక్య తండాకు చెందిన దేవ్యా (40) పనిమీద బోయిన్పల్లి గ్రామానికి వచ్చారు. పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కల్వకుర్తి నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దేవ్యా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య సిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి ఽభూత్పూర్: రెండేళ్ల చిన్నా రి నీటి బకెట్లో పడి మర ణించిన ఘటన పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన మహమూద్, అస్మల కుమార్తె జూవేరియా ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడిపోయింది. తల్లిదండ్రులు గమనించి వెంటనే బయటికి తీసి ద్విచక్రవాహనంపై జిల్లా ఆస్పతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషయమై ఎస్ఐ చంద్రశేఖర్ను సంప్రదించగా చిన్నారి మృతిపై తమకు ఏలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. దైవక్షేత్రంలో వరుసగా కోడెదూడల మృతి దేవరకద్ర రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన చిన్నరాజమూర్ గ్రామంలోని చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో వరుసగా కోడెదూడలు మృతి చెందడం కలకలం రేపుతుంది. భక్తులు మొక్కులు తీర్చుకునే క్రమంలో ఆలయానికి సమర్పించిన ఆవులు, కోడెదూడల బాగోగులు పట్టించకోకపోవడంతో ఇప్పటి వరకు పదికి పైగా కోడెదూడలు మరణించాయి. ఆదివారం కూడా ఓ కోడెదూడ మరణించగా అధికారులు కళేబరాన్ని బయటికి పొక్కకుండా తరలించారు. రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆలయంలో పశువులకు కనీసం పశుగ్రాసం, తాగునీరు కూడ అందకపోవడంతోనే మరణించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను రక్షించాలి
స్టేషన్ మహబూబ్నగర్: శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం మర్లులోని శ్రీశాంతినగర్ కాలనీలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల నుంచి యువతను రక్షించాలని వాటికి బానిసలు కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. మత్తు వల్ల కలిగే అనర్థాలు వారికి వివరించాలని స్కూల్ దశ నుంచే వాటిపై అవగాహన కల్పించాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు యువత నడుం బిగించాలన్నారు. శ్రీకరి ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, కాటికాపరులు, మున్సిపల్ సిబ్బంది, రంగస్థల నటులకు, ప్రవచనకర్తలకు, పోలీస్ ఉద్యోగులకు ఇలా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న దాదాపు 70 మందికి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాని శ్రీనివాస్, ఫౌండేషన్ ప్రతినిధి మెట్టుకాడి శ్యాంసుందర్, కృష్ణవర్మ, భానుప్రకాశ్, మెట్టుకాడి ప్రణీత, సిద్దిరామప్ప, మెట్టుకాడి ప్రభాకర్, లక్ష్మణ్సింగ్, కార్పొరేటర్ లక్ష్మినరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో మోసం
గద్వాల క్రైం: ఉద్యోగం పేరుతో యువకులను మోసం చేసిన ఘటనపై ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు పట్టణ రెండో ఎస్ఐ సతీష్కుమార్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీకి చెందిన గుణవర్ధన్రెడ్డి ఇటీవల ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలిసిన వ్యక్తులు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 2 లక్షలు వసూలు చేశారు. తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మి తనతో పాటు మరి కొంత మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని డబ్బులు అందజేసినట్లు బాధితులు తెలిపారు. అయితే సదరు వ్యక్తులు కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు నకిలీ ప్రవేశపత్రం అందజేశారు. వాటిని తీసుకుని కంపెనీకి వెళ్లాగా అక్కడి సిబ్బంది నకిలీ ఉద్యోగ నియామక పత్రాలుగా నిర్వహకులు చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ‘పల్లెనిద్ర’లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధరూరు: భీం దీక్షలో భాగంగా స్వేరోస్ ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామం చేరుకున్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలతో మమేకమయ్యేందుకు చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చదువకోవాలని, జ్ఞానంతోనే అన్నింటిని జయించవచ్చన్నారు. మహనీయుల చరిత్రను వివరించారు. స్వేరోతో ఎంతో మంది చిన్నారుల జీవితాలను మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. అంతకు ముందు ధరూరులోని స్వేరో నాయకులు శ్రీనివాస్ మహరాజ్ ఇంటికి చేరుకుని తేనీటి విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కర్రెన్న, జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకటన్న, దేవన్న, గోవిందు, లాజర్, సత్యం, శ్రీనివాసులు, అశోక్, స్వేరో జిల్లా ఉపాధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. దేశభక్తికి మారు పేరు శివాజీ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తికి మారుపేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక బోయపల్లిలో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ స్వాభిమానానికి ఆరాధ్యుడన్నారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిస కాకుండా, శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. -
అట్టహాసంగా బండలాగుడు పోటీలు
● ముగిసిన శ్రీరామ నవమి ఉత్సవాలు ఉప్పునుంతల: మండల కేంద్రమైన ఉప్పునుంతలలో స్థానిక కేదారేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని నాలుగు రోజులపాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంతరాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. సీనియర్ విభాగంలో ఆయా ప్రాంతాల నుంచి ఏడు జతల ఎద్దులు పాల్గొన్నాయి. వాటిలో ప్రాధాన్యత క్రమంలో ఐదు జతలను విజేతలుగా ఎంపికచేసి నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ. 80 వేలు నగదు (దాత కట్టా సరిత అనంతరెడ్డి)ను నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కోప్పోల్కు చెందిన హనుమాన్ ఎద్దులు గెలుచుకున్నాయి. రెండో బహుమతి రూ.60 వేలు (దాత మదనాగుల మహేందర్), మూడో బహుమతి రూ.40 వేలు (దాత బొల్లె బాలయ్య), నాలుగో బహుమతి రూ.30వేలు ( కట్టా జనార్ధన్రెడ్డి), ఐదో బహుమతి రూ.20 వేలు (తాండ్ర మల్లేష్) అందజేశారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా నిర్వ హించిన కోలాటాం, ట్రాక్టర్ రివర్స్, భజన, చిరుతల భజన పోటీల్లో గెలుపొందిన విజేతలకు దాత ల సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు చింతగాళ్ల శ్రీనివాసులు, ఎస్ఐ వెంకట్రెడ్డి, నిర్వాహకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహ్మారెడ్డి, కొత్త పెద్ద జంగిరెడ్డి, ప్రశాంత్రెడ్డి, నారాయణ్రెడ్డి, వెంకట్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బాలయ్య, రామచంద్రయ్య, లక్ష్మ య్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కనులపండువగా పూల రథోత్సవం
సిర్సనగండ్లలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ చారకొండ: సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున పూల రథోత్సవం (చిన్నతేరు) కనులపండువగా సాగింది .ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈఓ అంజనేయులు మేనేజర్ నిరంజన్ అర్చకులు, ప్రజా ప్రతినిథులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని గుట్టపై దత్తాత్రేయగుడి, ముక్కిడి పోచమ్మ, మైసమ్మ దేవాలయాలను దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, భజనలు, భక్తుల శ్రీరామనామ స్మరణతో రథం ముందుగు సాగింది. రఽథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఆలయంలో స్వామివారిని దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు లక్ష్మణ్శర్మ, మురళీధర్శర్మ, వేణుశర్మ, ఆనంద్శర్మ, అనంతశర్మ, గోపీశర్మ, భాస్కర్శర్మ పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వత పెద్ద రథోత్సవం ప్రారంభమవుతుంది భక్తులు అధిక సంఖ్యలో హజరై స్వామివారిని దర్శించుకొని, ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్, ఈఓ కోరారు. -
హిందుత్వంపై అందరూ ఏకం కావాలి
ఉండవెల్లి: దేశంలో హిందూ సమాజం అంతరించకుండా అదుపు చేయాలంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు హిందుత్వంపై పట్టు, ఐక్యత ఉండాలని పురాణపీఠం, అనంత సాహితి ఆశ్రమానికి చెందిన అనంతానంద భారతి స్వామిజీ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతానంద భారతి స్వామిజీ మాట్లాడుతూ.. ప్రజల్లో హిందు సంస్కృతి, సమాజం అంతంకాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చిన్నారులకు హిందుత్వంపై అవగాహన కల్పించాలని, రాష్ట్రంలో హిందూ సమాజంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. నుదుటిన బొట్టు, సాంప్రదాయ దుస్తులను ధరించి కులమతాలకు అతీతంగా హిందూమతంపై ప్రచారం కొనసాగించాలి. దేశంలో హిందుత్వంపై ఐక్యత రావాలంటే మొదట పల్లె నుంచే ప్రారంభించాలని ప్రజలకు ఉపసందేశం అందించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ప్రధాన వక్త మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హిందువులందరూ ఒక్క మాటపై ఉంటే ఎవరొచ్చినా ఏమి చేయలేరన్నారు. దేశంపై గౌరవం ఉన్న వాడికి హిందుత్వంపై మక్కువ ఉంటుంది. రాష్ట్రీయ స్వంయం సేవక్ సంఘ్ 1952లో ప్రారంభిచి వందేళ్ల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో హిందు సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు చల్లా దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల పనుల్లో వేగం పెంచాలి
మహమ్మదాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం మహమ్మదాబాద్, చిన్నాయపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామ పంచాయతీల్లోని నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్లు, లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంకా ప్రారంభంకాని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
3,416 పోలీసు కేసులు పరిష్కారం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పోలీస్ శాఖ నుంచి మొత్తం 3,416 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ బాధితులకు రూ.42,97,445 నగదు తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. ఐపీసీ కేసులు 524, డ్రంకన్డ్రైవ్ 794, ఈ–పెట్టీ కేసులు 1,979, సైబర్ క్రైం కేసులు 119 పరిష్కరించినట్లు వివరించారు. ఈ కేసుల రాజీతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలను వేగవంతంగా పరిష్కరించుకోవడం వల్ల ఆర్థికంగా ఆదా కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఉత్సాహంగా ‘హ్యాపీ డే’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎన్హెచ్–167పై జిల్లా స్టేడియం కమాన్ వద్ద మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మూడు గంటల పాటు ‘హ్యాపీ డే’ నిర్వహించారు. చిన్నారుల నృత్య, కరాటే ప్రదర్శనలు, మ్యాజిక్షో, యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఎస్హెచ్జీలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వారు తయారుచేసిన పౌష్టికాహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించగా ప్రజలు ఆసక్తిగా వీక్షించి కొనుగోలు చేశారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్రెడ్డి, ఈదురు వెంకన్న కోరారు. మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివారం నిర్వహించిన గేట్మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మె అనివార్యమన్నారు. ఎన్నికలకు ముందు కార్మికుల జీతభత్యాలు సవరిస్తామని, ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్సీలు, ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, యూనియన్లను పునరుద్ధరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి.లక్ష్మణ్గౌడ్, విజయబాబు, యాదయ్య, యాదగిరి, బసప్ప, అరవింద్, నర్సింలు, సత్యశీలారెడ్డి, డి.శ్రీనివాసులు, నారాయణ, చంద్రమోహన్, జీకేరావు, వెంకటయ్య పాల్గొన్నారు. -
నగర రోడ్ల దుస్థితి చూడతరమా!
అధ్వాన స్థితిలో ప్రధాన, అంతర్గత రహదారులు ● ఎక్కడబడితే అక్కడ అడుగు లోతు గుంతలు పడిన వైనం ● పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ● వాహనదారులు, పాదచారులకు తప్పని ఇబ్బందులు –8లో uఎక్కడెక్కడ అంటే..? మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ప్రధాన, అంతర్గత రోడ్లు చాలా చోట్ల అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఎక్కడబడితే అక్కడ అడుగు లోతు గుంతలు పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆయా గల్లీలలో మిషన్ భగీరథ పథకం పైపులైన్ల కోసం రోడ్లను అడ్డంగా తవ్వి సరిగా పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని ఇంటింటికీ నల్లా కనెక్షన్ తీసుకున్న యజమానులు గాని మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. మనకెందుకులే అని ఎవరికి వారు వదిలేయడంతో పాదచారులు నడవడానికి, అలాగే వాహనదారుల రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతోంది. బైక్లు మొదలుకుని భారీ వాహనాలు ఆయా గుంతల వద్దకు చేరుకోగానే ఆగి నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. క్లాక్టవర్ చుట్టూ నలుదిక్కులా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్నాయి. క్లాక్ టవర్ నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా వరకు పలుచోట్ల బీటీ, సీసీ పగిలిపోయింది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట, సమీపంలోని పెద్ద బ్రిడ్జి వద్ద కంకర లేచిపోయింది. ఎన్హెచ్–167పై షాషాబ్గుట్టకు వెళ్లే మలుపు వద్ద, అశోక్ టాకీస్ చౌరస్తాలోని బాలగంగాధర్ తిలక్ విగ్రహం ఎదుట, మోడ్రన్ రైతుబజార్కు ఎదురుగా సుమారు ఏడాది క్రితం మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్కు భారీ లీకేజీలు ఏర్పడటంతో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు బాగు చేశారు. అయితే ఈ మూడు చోట్ల బీటీ రోడ్డు లెవలింగ్నుమరిచిపోయారు. ఎక్కడికక్కడ కంకర తేలి నడవడానికి సైతం వీలు లేని పరిస్థితి నెలకొంది. క్లాక్టవర్ నుంచి రాంమందిర్చౌరస్తా వరకు పదుల సంఖ్యలో బీటీ దెబ్బతింది. ఈ మార్గంలో ఇరువైపులా వివిధ వ్యాపార దుకాణాలు ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటాయి. గతుకుల రోడ్డు కారణంగా వాహనాలు వెళ్లడానికి, పాదచారులు నడవడానికి నరకయాతన పడుతున్నారు. క్లాక్టవర్ నుంచి మార్కెట్ రోడ్డు, పాత బస్టాండు మొదలుకుని కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు చాలా చోట్ల గుంతలు పడ్డాయి. పాత బస్టాండు నుంచి తెలంగాణచౌరస్తా వరకు మూడు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. తెలంగాణ చౌరస్తా నుంచి బోయపల్లిగేట్ వరకు, సుభాష్నగర్ నుంచి ఎర్రసత్యం చౌరస్తా వరకు, రెడ్క్రాస్ బిల్డింగ్కు ఎదురుగా, న్యూటౌన్ చౌరస్తా నుంచి స్టేషన్ రోడ్డు వరకు, జీజీహెచ్కు ఎదురుగా ఉన్న రెండు గల్లీలలో పలుచోట్ల సీసీ, బీటీ దెబ్బతిని గుంతలు పడ్డాయి. మెట్టుగడ్డ నుంచి టీచర్స్కాలనీ, మర్లు మీదుగా ఎస్ఆర్నగర్ వరకు అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఇక 60 డివిజన్ల పరిధిలోని వీధి రోడ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తప్పక బాగు చేయిస్తాం నగరంలోని ప్రధాన, అంతర్గత రహదారులపై వివిధ చోట్ల బీటీ, సీసీ దెబ్బతిని గుంతలు ఏర్పడిన విషయం వాస్తవమే. త్వరలోనే వీటన్నింటిని ఒకసారి పరిశీలించి ఎక్కడ అవసరమైతే అక్కడ తప్పక బాగు చేయిస్తాం. – పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మహబూబ్నగర్ కార్పొరేషన్ -
బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్
● మాజీ మంత్రి రాజకీయ డ్రామాలు ఆపాలి ● మేయర్ మమత మెట్టుగడ్డ: కాంగ్రెస్ పార్టీయే బీసీలకు పెద్దపీట వేసిందన్న విషయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తించాలని మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశంలో చోటు చేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్లో తన భర్తను నమ్మించి నడిరోడ్డుపై వదిలేసిన ఘనత మాజీ మంత్రిదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళను మేయర్గా ఉన్నత స్థానంలో కూర్చొబెట్టిందన్నారు. బీసీ మహిళకు దక్కిన పదవిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు రమ్మని.. కౌన్సిల్ను బహిష్కరించాలని చెప్పింది మీరు కాదా అని మాజీ మంత్రిని ఆమె ప్రశ్నించారు. బీసీ మహిళ మేయర్ అయితే సంతోషి ంచాల్సింది పోయి అవమానించేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రొటోకాల్ ధిక్కరణ అనే అంశమే లేదని.. ఇది కేవల ం రాజకీయంగా సృష్టించిన వివాదం మాత్రమేనని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో రాజకీయ డ్రామాలు చేయడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు రమేశ్గౌడ్, నర్సింహులు యాదవ్, రామస్వామి, పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఉన్నారు. -
ధరల భారం ప్రజలపై మోపలేదు
● తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూడండి ● పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పాలమూరు: ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు 7 నుంచి 18 శాతం పెరిగినా.. దేశంలో ధరలు పెరగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించే చర్యలు తీసుకుంటుందని, ఇది ప్రజలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. నగరంలోని శిశుమందిర్ పాఠశాలలో శనివారం మహబూబ్నగర్ రూరల్, హన్వాడ మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. గతంలో ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పటికీ దేశంలో తగ్గించని పరిస్థితి ఉండేదని, ఆ సమయంలో ఆయిల్ బాండ్స్ అనే విధానాన్ని ఉపయోగించారని విమర్శించారు. పెట్రోల్ ధరలను కృత్రిమంగా తగ్గించి, మిగిలిన భారం భవిష్యత్లో చెల్లించడానికి బాండ్ల రూపంలో భారం మోపారని, ఆ బాండ్ల విలువ రూ.లక్షల కోట్లకు చేరిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నా సామాన్యులపై ఆ భారం పడకూడదనే గొప్ప సంకల్పంతో పెట్రోల్, డీజిల్ ఎకై ్సజ్ సుంకాన్ని ఏకంగా రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత, గ్యాస్ అందుబాటులో లేదనే తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసర భయాన్ని సృష్టిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఆశించిన ఫలితాలు రాలేదని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. బీజేపీ కోట్లాది సభ్యులతో మందుకు సాగుతుందని తెలంగాణలో కూడా పార్టీ బలంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, బాలరాజు, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా అక్రమ తరలింపుపై విచారణ
లింగాల: మండలంలోని అప్పాయపల్లి నుంచి గురువారం రాత్రి యూరియా అక్రమ తరలింపుపై వచ్చిన ఆరోపణలపై శనివారం ఏఓ అనిల్ క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. గ్రామం నుంచి యూరియాను ఎందుకు తరలించారు, ఎన్ని బస్తాలు తదితర అంశాలను సర్పంచ్ విజయకృష్ణ, రైతుల సమక్షంలో విచారించారు. గ్రామానికి చెందిన రైతు వేముల రాంచందర్ ఇతర ప్రాంతాలకు యూరియాను తరలించడంలో ఆంతర్యం ఏమిటనేది విచారించినట్లు ఏఓ తెలిపారు. రైతు తన సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుండగా.. యూరియా అవసరం ఎక్కువైనట్లు విచారణలో తెలిసిందని, సకాలంలో యూరియా లభ్యం కాకపోవడంతో వేరే గ్రామం రైతు నుంచి 20బస్తాల యూరియా బదులుగా తెచ్చుకున్నట్లు, దానిని తిరిగి రైతుకు పంపుతుండగా తెలియనివారు పట్టుకొని సమస్య సృష్టించినట్లు ఏఓ తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏఓ తెలిపారు. యూరియా తరలింపు అవాస్తవం అప్పాయపల్లిలో యూరియాను అక్రమంగా తరలించినట్లు వచ్చిన అరోపణలు అవాస్తవమని కాంగ్రెస్స్ పార్టీ నాయకులు నాగేశ్వర్రావు, మల్లయ్య ఖండించారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో ఆరోపణలు చేశారని వారన్నారు. అధికారులు విచారణలో నిజాలు వెల్లడైనట్లు వారు తెలిపారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు అడ్డాకుల: మండల కేంద్రానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. యువకుడు అదే గ్రామంలో నివాసముంటున్న బాలికపై కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఇటీవల బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి ఆమెను నిలదీయగా జరిగిన విషయం తెలిపింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికను సఖీ కేంద్రానికి పంపంచినట్లు చెప్పారు. -
ప్రోటోకాల్పై రగడ
వాడీవేడిగా నగర పాలక తొలి సమావేశం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. వేదికపై మేయర్ మాత్రమే కూర్చోవాలని.. ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ సైతం పక్కనే ఉండటంపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్ జి.మమత అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఆ వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఒక్కొక్కరు లేచి వేదికపై మేయర్ మాత్రమే ఉండాలని వాదించారు. ఆ పక్కనే ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ తదితరులు కూర్చోవడం వల్ల మేయర్ పదవిని తక్కువ చేసినట్లేనని పేర్కొన్నారు. అయితే మేయర్ అనుమతితో మిగతా వారు వేదికపై ఉండవచ్చని కమిషనర్ పి.రామాంజులరెడ్డి బదులిచ్చినా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశపు అజెండా ప్రతులను ఉర్దూలోనూ ప్రచురించాలని ఎంఐఎం సభ్యులు అడిగారు. దీనికి ప్రతిగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు లేచి ఇతర మాతృభాష (హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం)లోనూ ఉంటే బాగుంటుందని గట్టిగా వాదించారు. దీంతో సభ కొద్దిసేపు గందరగోళంగా మారగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి జోక్యం చేసుకుని 60 మంది కార్పొరేటర్లలో ఎవరు ఏ భాషలో కావాలన్నది ముందుగా కమిషనర్కు తెలియజేస్తే ఆ మేరకు అవసరమైనన్ని కాపీలు తర్జుమా చేయిస్తారని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్యం మెరుగుదలకు సిబ్బందిని పెంచాలని, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతున్న సమయంలో పలుచోట్ల వృథా అవుతోందని, దీనిని అరికట్టాలన్నారు. అలాగే సీసీరోడ్లు, డ్రెయినేజీలు దెబ్బతిన్నాయని, కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆదాయ వనరులు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, మున్సిపల్ షాపుల అద్దె బకాయిలను ఎప్పటికప్పుడు వసూలు చేయించాలన్నారు. ఈ సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని, సభ్యులందరి సహకారంతో ఆదాయ వనరుల పెంపునకు అన్ని చర్యలు చేపడతామని కమిషనర్ బదులిచ్చారు. సమావేశంలో ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఎంఈ మురళీమోహన్రెడ్డి, డీఈఈలు నర్సింహ, విజయ్కుమార్, ఏసీపీలు కరుణాకర్గౌడ్, జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు. వేదికపై మేయర్తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ ఉండటంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసన వార్షిక బడ్జెట్ ప్రారంభం కాగానే వాకౌట్ చేసిన వైనం సమావేశపు అజెండాను ఇతర భాషల్లోనూ ముద్రించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే యెన్నం జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి అనంతరం సజావుగా సాగిన కౌన్సిల్ సమావేశం -
జాతీయ స్థాయి షూటింగ్ క్రీడలకు ఎంపిక
మక్తల్: మండలకేంద్రంలోని గురుకులంతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం తెలిపారు. ఈ మేరకు సదరు విద్యార్థులను స్థానిక ఎంజేసీ పాఠశాలలో ఎస్ఐ–2 ఆచారి అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈనెల 1 నుంచి 3 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన 24 మంది విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సల్లారెడ్డి, పీఈటీ స్వప్న, వార్టెన్ రాఘవచారి, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్బంక్ బ్యారల్స్లో డీజిల్ నిల్వ
జడ్చర్ల: పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఓ పెట్రోల్బంక్ వద్ద బ్యారల్స్, ట్యాంక్ల్లో డీజిల్ నిల్వ ఉండటంతో స్థానికులు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ శివారులోని కిష్టంపల్లి సమీపంలో ఉన్న ప్రకాశ్ ఫిల్లింగ్ స్టేషన్ ఆవరణలో ఒక సింటెక్స్ ట్యాంకులో 2వేల లీటర్ల డీజిల్, మరో ఐదు బ్యారల్స్లో మరో వెయ్యి లీటర్ల డీజిల్ నిల్వ ఉంచి.. పైన కవర్లు కప్పి ఉంచారు. అటుగా వెళుతున్న వినియోగదారులు ఆరుబయట డీజిల్ నిల్వ ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్కు తరలించాలనే ఉద్దేశంతోనే ఇలా నిల్వ చేశారన్న అనుమానంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీజీఎస్ఓ శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్రెడ్డి, ఏఎస్ఓ అశ్వక్, సేల్స్ ఆఫీసర్ హృదయ్, స్థానిక ఎస్ఐలు జయప్రసాద్, మల్లేశ్ తదితరులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారించారు. నిబంధనలకు విరుద్దంగా ఆరుబయట బ్యారల్స్లో డీజిల్ నిల్వ ఉంచడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే శనివారం ఉదయం డీజిల్ ట్యాంకర్ వచ్చిందని.. బంక్ ట్యాంకుల్లో డీజిల్ పూర్తిస్థాయిలో నింపిన తర్వాత మిగిలి ఉన్న డీజిల్ను వెనక్కి పంపలేక ఇలా ట్యాంకు, బ్యారల్స్లో నిల్వ ఉంచాల్సి వచ్చిందని బంక్ నిర్వాహకులు అధికారులకు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని డీసీఎస్ఓ తెలిపారు. డీసీఎస్ఓ విచారణ -
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య లక్ష్మీవిలాసం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి.. పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్వామి దంపతులను నూతన వస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరించి.. స్వామివారికి స్వర్ణకిరీట ధారణ నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. పట్టాభిషేకం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకొచ్చి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, అళహరి రామకృష్ణ, రాయల్ కుమార్తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పాలమూరు లోక్ అదాలత్లో 17,737 కేసుల పరిష్కారం
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 17,737 కేసులు పరిష్కరించారు. జిల్లా ప్రధాన కోర్టులలో ఐదు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీల ద్వారా లోక్ అదాలత్లో మొత్తం ఈ మేరకు కేసులను పరిష్కరించి.. ఓ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.26 లక్షలకు రాజీ కుదరడంతో సదరు చెక్కును బాధితులకు అందించారు. మరో కేసులో రూ.3 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత మాట్లాడుతూ లోక్ అదాలత్ కోసం జిల్లాలో 2,033 కేసులు గుర్తించి సదరు కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.శ్యాంకోశీ, ఎన్వీ శ్రావణ్కుమార్లకు ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవం వందనం సమర్పించారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఓ కేసులో నష్టపరిహారం చెక్కును హైకోర్టు న్యాయమూర్తులు అందజేశారు. అదేవిధంగా విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వచ్చిన జంటకు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ జంట లోక్ అదాలత్లో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట పూలదండలు మార్చుకొని మళ్లీ ఒక్కటయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేత అరెస్ట్.. కేసు నమోదు
రాజాపూర్: బీహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ మండలంలోని మోతిఘనాపూర్ శివారులో నవదుర్గ స్టీల్ కంపెనీ పరిసర ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఏఈఎస్ నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో శనివారం చర్యలు చేపట్టారు. బాలానగర్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు తనిఖీలు చేపట్టి బీహార్కు చెందిన రాజేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 424 గ్రాముల ఎండు గంజాయి 10 గ్రాముల గంజాయి చాక్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి కిలో రూ.5వేల చొప్పున తీసుకొచ్చి 5 గ్రాములకు రూ.400 చొప్పున ఎండు గంజాయి, రూ.50 ఒక గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైన మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 90300 19943 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఎకై ్సజ్ ఎస్ఐ మురళీమోహన్, హెడ్ కానిస్టేబుల్ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద మృతి.. పోలీసులకు ఫిర్యాదు
భూత్పూర్: మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (57) అనుమానాస్పద మృతి చెందాడని మృతుడి సోదరుడు లక్ష్మయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలోని ఎల్కిచర్లకు చెందిన అరుణ అలియాస్ మొగులమ్మతో ఆంజనేయులుకు 30 ఏళ్ల క్రింద వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో పెళ్లి అయిన ఐదేళ్ల నుంచే ఆంజనేయులు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఈ నెల 23న సాయంత్రం ఆంజనేయులు పాము కాటు వేయడంతో చనిపోయాడని అతడి సోదరుడైన లక్ష్మయ్యకు అరుణ ఫోన్లో సమాచారం ఇచ్చా రు. మరుసటి రోజే అంత్యక్రియలు నిర్వహించగా ఆంజనేయులు శరీరంపై గాయాలు ఉన్న ట్లు గమనించారు. దీంతో మృతుడి తమ్ముడు తన అన్నను చిత్రహింసలు చేసి చంపారని అనుమానం వ్యక్తం చేసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిర్వహించి కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి ఖిల్లాఘనపురుం: మిద్దె పైకి ఎక్కుతూ ప్రమావశాత్తు జారిపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం ఖిల్లాఘనపురానికి చెందిన గంగారపు వెంకటమ్మ (63) శనివారం తెల్లవారు జామున వర్షం పడుతుండగా మిద్దైపెన ఆరబోసిన ఉల్లి విత్తనాలు నానిపోతాయని తీసేందుకు మిద్దె పైకి వెళ్లే క్రమంలో జారి కింద పడిపోయింది. కుటుంబసభ్యులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై మృతురాలి భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
జడ్చర్ల ‘పుర’ బడ్జెట్ రూ.65.82కోట్లు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.49కోట్లు ● పన్నుల ద్వారా పురపాలిక ఆదాయం రూ.16.82కోట్లు ● వివరాలు వెల్లడించిన కమిషనర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల టౌన్: 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించి రూ.65కోట్ల82లక్షల వార్షిక బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది. ఇందులో రూ.49కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లు కాగా.. మున్సిపాలిటీ పరిధిలో వివిధ పన్నుల ద్వారా రూ.16కోట్ల82లక్షలుగా లెక్కించారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కోనేటి పుష్పలత అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశం వివరాలు, 2025–26 ఏడాదికి సంబంధించిన సవరించిన బడ్జెట్ వివరాలను కమిషనర్ లక్ష్మారెడ్డి తెలియజేశారు. ● పన్ను రాబడిగా రూ.7కోట్ల64లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. స్టాంప్ డ్యూటీగా రూ.కోటి90లక్షలు, భవన నిర్మాణ అనుమతులతో రూ.5కోట్లు, పారిశుద్ధ్యం రూ.కోటి25లక్షలు, అద్దె ఆదాయం రూ.22లక్షలు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.23లక్షలు, వివిధ డిపాజిట్ల ద్వారా రూ.50లక్షలుగా అంచనాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక వ్యయాల అంచనాకు వస్తే వేతనాలు, జీనతాలు రూ.5కోట్లు, పారిశుద్ధ్య ఖర్చులు రూ.కోటి70లక్షలు, విద్యుత్ చార్జీలు రూ.కోటి22లక్షలు, హరితబడ్జెట్ రూ.2కోట్ల2.40లక్షలు, ఇతర నిర్వహణ ఖర్చులు రూ.31కోట్ల7లక్షలు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు వన్థర్డ్ బడ్జెట్ కేటాయింపులు రూ.63లక్షలు, ప్రజాసౌకర్యార్థం రూ.32లక్షలు, వార్డుల వారీగా వ్యయం రూ.1.76.40కోట్లుగా ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. పై మొత్తాలు మున్సిపల్ గ్రాంట్ ద్వారా రాబడుట రూ.16కోట్ల24లక్షలు, మూలధనగ్రాంటు రూ.49కోట్లు, మూలధన గ్రాంట్ వ్యయం రూ.49కోట్లుగా తెలిపారు. బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిందని వివరించారు. బడ్జెట్ సమావేశంలో వైస్చైర్పర్సన్ పాలాది సారిక, వార్డు కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, చైతన్యహరికృష్ణగౌడ్, లత, జ్యోతికృష్ణారెడ్డి, నందకిశోర్గౌడ్, ప్రశాంత్రెడ్డి, బుక్క మహేష్, కుమ్మరిరాజు, శశికిరణ్, శ్రావణి, నవనీత, విజయ్, చైతన్యచౌహాన్, హరిత పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ తొలగింపుపై అభ్యంతరం మున్సిపాలిటీ పరిధిలో సీనియర్ ఎలక్ట్రీషియన్ వెంకటేశ్ను విధుల నుంచి తొలగించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం సమావేశంలో కౌన్సిలర్ కుమ్మరిరాజు ప్రతిపాదించగా.. తోటి కౌన్సిలర్లు ప్రశాాంత్రెడ్డి, నందకిశోర్ బలపర్చారు. అయితే కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, చైతన్యగౌడ్, అలూరి శశికిరణ్, శ్రావణి వ్యతిరేకించారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించటం సబబుకాదని, తప్పుచేసి ఉంటే మాట్లాడి ఒప్పిద్దామని సూచించారు. ఏదైనా వివాదం ఉంటే సద్దుమణిగేలా ప్రయత్నించాలని చైర్పర్సన్, కమిషనర్కు సూచించారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కౌన్సిల్ సమావేశం ముగించారు. -
అట్టహాసంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
ధన్వాడ: మండల కేంద్రంలో శనివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజ్వార్ పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ.. ధన్వాడలో శివాజీ విగ్రహ ఏర్పాటు చేయకుండా కొందరు 15 ఏళ్లుగా అడ్డుకుంటున్నారన్నారు. తనతో పాటు స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సంపూర్ణ సహకారం అందించడంతోనే విగ్రహ ఏర్పాటు పూర్తయిందన్నారు. తన స్వగ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ధర్మస్థాపన కోసం ఎంతో కృషి చేశారని.. ప్రజలను పీడిస్తున్న వారిని వేటాడి వెంటాడి మట్టుపెట్టారని కొనియాడారు. నేటితరం పిల్లలకు సనాతన ధర్మాన్ని వివరించాలని సూచించారు. 2047లోగా దేశాన్ని వికసిత్ భరత్గా మార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించిన ఘనత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికే దక్కిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిత్య పరాశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ అడుగుజాడలో నడిచి ధర్మాన్ని పాటించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి రాంచంద్రయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమేష్, మాజీ ఉపాధ్యక్షుడు మల్లయ్య, నాయకులు ఉదయభాను, మల్లయ్య, గోవర్ధన్గౌడ్, మండల అధ్యక్షుడు శివరాజ్, మాజీ అధ్యక్షుడు మాకం సురేందర్, సర్పంచులు కొండయ్య, రవికుమార్, బీజేవైఎం నాయకుడు ప్రవీణ్కుమార్, ఉపసర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులు పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ ఆర్థిక సంవ్సరం పూర్తి కావస్తోందని, ఉపాధి హామీ పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. తన చాంబర్ నుంచి శనివారం అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. మంజురైన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తెలంగాణ ఎస్టీ సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14 ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్, ఐఐటీ, నీట్, ఏఐఐఎంఎస్ వంటి వాటికి శిక్షణ ఇస్తారని, వచ్చేనెల 7వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వాడీవేడిగా నగర పాలక తొలి సమావేశం ప్రోటోకాల్పై రగడ వేదికపై మేయర్తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ఉండటంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసన వార్షిక బడ్జెట్ ప్రారంభం కాగానే వాకౌట్ చేసిన వైనం సమావేశపు అజెండాను ఇతర భాషల్లోనూ ముద్రించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు – వివరాలు IIలో.. -
రూ.326 కోట్లతో వార్షిక బడ్జెట్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్షిక (2026–27) బడ్జెట్ మొత్తం రూ.326,60,78,000గా అంచనా వేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల కింద రూ.229.80 కోట్లు రావచ్చని, నికరంగా వివిధ పద్దుల కింద రూ.91,80,78,000 ఆదాయం వస్తుందని లెక్కలుగట్టారు. ఇందులో పన్నుల రాబడి నుంచి రూ.40.85 కోట్లు పన్నేతర రాబడిగా రూ.44.9578 కోట్లు, అసైన్డ్ ఆదాయం నుంచి రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలాగే 2025–26 సంవత్సరానికి మిగులు రూ.3,58,13,000 గా చూపించారు. ఇక వ్యయాలకు సంబంధించి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులకు రూ.7.85 కోట్లు విద్యుత్ బిల్లులకు రూ.6,45,70,000, రుణ వాయిదాల చెల్లింపులకు రూ.1 కోటి, హరితహారం పనులకు రూ.9,18,08,000 వెచ్చించనున్నారు. అలాగే చార్జ్డ్ వ్యయాలకు రూ.39,48,78,000, ఇతర నిర్వహణ ఖర్చులకు రూ.25.22 కోట్లు కేటాయించారు. మురికివాడలలో మౌలిక వసతులకు రూ.9,03,33,000, పార్కులు, జిమ్లకు, వైకుంఠధామాల అభివృద్ధికి రూ. 1,50,00,000, వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు, ఇతర మూలధన వ్యయాలకు రూ.16,56,67,000 కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా 2025–26 సంవత్సరాంతానికి మిగులు రూ.3,58,13,000గా చూపించారు. ఈ పద్దులను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వివరించారు. అనంతరం వీటికి పాలకవర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్ రూ.229.80 కోట్లు 2026–27కు నికరంగా రూ.91.80 కోట్లతో అంచనా ఆమోదించిన మహబూబ్నగర్ కార్పొరేషన్ పాలకవర్గం 2025–26 నాటికి మిగులు రూ.3.58 కోట్లు -
మన్సూర్పల్లిలో మళ్లీ కనిపించిన చిరుతలు
● అడవి పందిని తింటూ ఒకటి.. మరొకటి గుండుపై పడుకొని ● భయాందోళనకు గురవుతున్న పరిసర ప్రాంతాల రైతులు గండేడ్: మండలంలోని మన్సూర్పల్లి బొందగట్టు ప్రాంతంలో శుక్రవారం చిరుతలు మళ్లీ రైతులకు కనిపించాయి. అందులో ఒకటి అడవి పందిని చంపుకొని తింటూ కనిపిస్తే మరొకటి గుండుపై పడుకుని కనిపించినట్టు స్థానికులు బాలయ్య, సాయికుమార్ తెలిపారు. మొన్న కొండాపూర్కు చెందిన మల్లయ్య మేకలపై దాడిచేసి ఒకదాన్ని చంపి మరోదాన్ని గాయాలపాలు చేసిన ఘటనను రైతులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం కూడా ఇదే ప్రాంతంలో కనిపించడం రైతులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. చిరుతల సంచారంతో రైతులు పొలాలకే వెళ్లడంలేదు. పశువులను పొలాల దగ్గరి నుంచి ఇళ్లకు తీసుకొస్తున్నారు. దీంతో పొలానికి వెళ్లి పశువులకు మేత తీసుకురావాలన్నా.. వాటిని మేపాలన్నా చాలా ఇబ్బందికరంగా మారిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చిరుతలకు బోనులు ఏర్పాటు చేసి పట్టుకోవాలని కోరుతున్నారు. పశు ప్రాణనష్టం జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చంద్రవంచలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు చంద్రవంచ గ్రామానికి చెందిన పటేల్ కృష్ణయ్య ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఈ క్రమంలో కృష్ణయ్య మొదటి కుమారుడు పటేల్ రమేష్ (16) ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర కాలుజారి పక్కనే ఉన్న కరెంట్ బుడ్డి ఎర్తింగ్ వైర్పై పడిపోయాడు. దీంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. మనస్తాపంతోయువకుడి ఆత్మహత్య వనపర్తి రూరల్: మండలంలోని రాజనగరం చెందిన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హృశికేష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నక్క రాకేష్(20) మూడు రోజుల క్రితం పాన్గల్ గ్రామంలో అతని తాత మృతి చెందాడు. అప్పటి నుంచి మనస్తాపంతో అన్నం తినకుండా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం చారకొండ: మండల కేంద్రానికి చెందిన మునగాల లోకేశ్(45) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి లోకేశ్ నూనె తయారీ చేసే దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం దుకాణంలో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేఎల్ఐ కాల్వలోపడి వ్యక్తి మృతి తిమ్మాజిపేట: మండల పరిధిలోని ఆవంచ గ్రామ సమీపంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడి గొల్కోండ వసంత్ (50) అనే వ్యక్తి మృతి చెందినట్లు గ్రామ స్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు కేఎల్ఐ కాలువ నుంచి పంటలకు నీరు పారించేందుకు కొందరు రైతులు కాలువలో మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కాలువలో ఎక్కువగా నాచు ఉండడంతో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో వసంత్తో మరమ్మతు చేయించేవారు. ఈక్రమంలో శుక్రవారం ఓ రైతుకు చెందిన మోటార్ పనిచేయకపోవడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. రైతులందరూ కలిసి గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా
మిడ్జిల్: ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా చేసిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువకుడు అమ్మాయిని పదేళ్ల నుంచి ప్రేమించాడు, చివరకు మాయమాటలు చేసి గర్భవతిని కూడా చేశాడు. ఆ విషయం అమ్మాయి ఇంట్లో తెలువడంతో పెండ్లి చేసుకోవాలని కోరగా, నిరాకరించడంతో శుక్రవారం అమ్మాయి సదరు యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు కూర్చుంది. అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. కాగా ప్రేమించిన యు వకుడికి గతంలో పెళ్లి అయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయినా అమ్మాయిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. కేఎల్ఐ కాల్వకు గండి తిమ్మాజిపేట: మండలంలోని ఆవంచ సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వకు గండి పడడంతో అప్రమత్తమైన రైతులు శుక్రవారం గండి పూడ్చి వేశారు. రైతు గడ్డమోని కృష్ణయ్య పొలం వద్ద కేఎల్ఐ కాల్వకు గండి పడి నీరు వృథాగా పోతున్న విషయం గుర్తించిన చుట్టు పక్కల రైతులు జేసీబీ, ట్రాక్టర్లతో కాల్వకు మరమ్మతు చేశారు. కాల్వకు గండి పడితే తక్షణమే స్పందించాల్సి ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నా.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత ఖర్చులతో సాగునీరు వృథా కాకుండా కృషి చేశారని వారిని అభినందించారు. ● గర్భవతిని చేసిన యువకుడు ● పెళ్లికి నిరాకరించిన వైనం -
హత్య కేసు ఛేదన
● వివాహేతర సంబంధమే కారణంగా గుర్తించిన పోలీసులు ● ఇద్దరు నిందితులకు రిమాండ్ ఖిల్లాఘనపురం: మండలంలోని రోడ్డుమీదితండా సమీపంలో మొల్గర శేషమ్మను హత్యచేసి కాల్వలో వేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను శుక్రవారం రిమాండ్కు తరలించిన కొత్తకోట ఇన్చార్జి సీఐ రత్నం, ఖిల్లాఘనపురం ఎస్ఐ వెంకటేష్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన మొల్గర నిరంజన్ భార్య మొల్గర శేషమ్మ(55)కు అదే గ్రామానికి చెందిన మొల్గర కృష్ణయ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయి మహబూబ్నగర్లోని కుమ్మరివాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా మొల్గర శేషమ్మ అక్కడ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు కృష్ణయ్యకు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కృష్ణయ్య ఈ నెల 22న అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని చేతులతో గొంతునులిమి చీరలతో గొంతుకు బిగించి చంపాడు. అనంతరం మరుసటి రోజు ఉదయం తనకు తెలిసిన మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని టీడీగుట్టలో ఉంటున్న ముచ్చింతల కురుమూర్తిని ఆటో తీసుకుని రావాలని పిలిచాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఆటోలో వేసుకుని మహబూబ్నగర్ నుంచి భూత్పూర్, వెల్కిచెర్ల, మామిడిమాడ, పర్వతాపురం మీదుగా ఖిల్లాఘనపురం చేరుకున్నారు. అక్కడి నుంచి తిర్మలాయపల్లి రెవెన్యూ శివారులో రోడ్డుమీదితండా సమీపంలో హనుమాన్కత్వ కుంట దగ్గర నీళ్లు లేని కాల్వలో మృతదేహాన్ని పడేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు చెప్పారు. తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన మొల్గర శేషమ్మగా గుర్తించగా.. ఆమె కుమారుడు మొల్గర కుర్మయ్య అనమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య చేసి చంపిన మొల్గర కృష్ణయ్య, సహకరించిన ముచ్చింతల కురుమూర్తిలను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో వారిని వనపర్తి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులను గుర్తించి పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుళ్లు లింగం, రాజు, చైతన్యకుమార్, మునావర్లను సీఐ అభినందించారు. -
నకిలీ డ్రగ్స్ కట్టడికి బల్క్ ఎస్ఎంఎస్ విధానం
పాలమూరు: మెడికల్ దుకాణాల్లో నకిలీ డ్రగ్స్ కట్టడి కోసం బల్క్ ఎస్ఎంఎస్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ వెల్లడించారు. మార్కెట్లో డ్రగ్స్ శాంపిళ్లను సేకరించిన తర్వాత వాటిలో నకిలీలు, ప్రమాణాలు పాటించని మందులు ఉంటే దీనితో గుర్తించవచ్చునని తెలిపారు. డ్రగ్ డీలర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారుల సెల్ఫోన్లకు ఈ సమాచారం బల్క్ ఎస్ఎంఎస్ల్లో పంపిస్తుందని తెలిపారు. అప్పటికే డీలర్ నుంచి హోల్సెల్, రిటైల్కు చేరి ఉంటూ వెంటనే ఆ బ్యాచ్ మందులను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, దీంతో నకిలీ డ్రగ్స్ రోగులకు చేరకముందే అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. నకిలీ మందుల పట్ల రోగులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సందేహం వస్తే, మందుల పాకెట్లపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మందుల తయారీ ప్రాంతం, తేదీ, ఇతర వివరాలు కన్పిస్తాయని తెలిపారు. -
ఉత్సాహంగా ఎడ్లబండ్ల గిరక పోటీలు
ఆత్మకూర్: మండలంలోని మూలమల్ల గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన ఎడ్లబండ్ల గిరక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఉమ్మడి మహాబూబ్నగర్లోని 18 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. నారాయణపేట జిల్లాకు చెందిన రంగన్న ఎద్దులు మొదటి బహుమతి సాధించగా దేశాయిపద్మాజారెడ్డి రూ.20 వేలు నగదు అందజేశారు. గద్వాల జిల్లాకు చెందిన ధర్మరెడ్డి ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలువగా సర్పంచ్ రంగారెడ్డి రూ.15 వేలు బహుమతి అందజేశారు. మూడో విజేత గంగన్నపల్లికి చెందిన ధరెప్పకు ఉపసర్పంచ్ అశోక్ రూ.10 వేలు నాలుగో విజేత వనపర్తి రైతు లోకపతిరాజుకు మునిస్వామి రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వహకులు ఆనంద్గౌడ్, ఆనంద్రెడ్డి, మల్లికార్జున్, రవికుమార్, రాజు, గ్రామస్తులు, రైతులు పాల్గోన్నారు. -
వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
● పవిత్ర ఘట్టాన్ని తిలకించి తరించిన భక్తులు ● ఘనంగా శ్రీరామనవమి వేడుకలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిఏడాది శ్రీరామనవమికి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ పవిత్ర ఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళల మంగళహారతులు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తజనావళి తిలకిస్తుండగా.. పురోహితుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం గావించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. దీంతో మన్యంకొండ భక్తులతో కిటకిటలాడింది. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామిదంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
వీరుల ప్రాణత్యాగాలు వెలకట్టలేనివి
మక్తల్: జాతీయోద్యమ వీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని పీపవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా నారాయణపేట క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనలో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఉద్దమ్ సింగ్, భట్ కేశ్వర్, ఆస్సదుల్లకాన్, అజాద్, చంద్రశేకర్ తదితరులు చిత్రపటాలను పీవైఎల్, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతూ దేశ సంపదను స్వదేశ విదేశి కార్పొరేట్ పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నాదని ఆగ్రహించారు. దేశంలో పేదలకు ఉచిత విద్యను అందించడంతో పూర్తిగా విఫలమైందన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర నాయకులు రామృకష్ణ, చంద్రశేఖర్, ఎం, కృష్ణ, బి.రాము, కాళేశ్వర్, ఎండీ భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్ధూ, కాళేశ్శర్, భాస్కర్, భుట్టో, సాయి తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు అవసరం
అలంపూర్: గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తేనే అధిక లాభాలు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పలు సూచనలు, సలహాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గొర్రెలలో వచ్చే రోగాల నివారణకు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని పశుసంవర్థక శాఖ అధికారి శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను వివరించారు. ● అనేక మంది సన్నకారు చిన్నకారు, రైతులు, వ్యవసాయ కూలీలు గొర్రెలను అధిక సంఖ్యలో పెంచడం జరుగుతుంది. అయితే వీటి పోషణలో తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రతి ఏడాది 20 శాతం వరకు గొర్రెలను కోల్పోతున్నారు. దీంతో అనేక మంది గొర్రెల పెంపకందార్లు లాభాలకు బదులుగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ●గొర్రెల పోషణలో ఆధునిక యాజమాన పద్ధతులు, ఆరోగ్య రక్షణ మీద సరైన అవగాహన పెంచుకుంటే లాభాలు ఆర్జించవచ్చని ఆయన పేర్కొంటున్నారు. పెంపకంలో సలహాలు ప్రధానంగా గొర్రెల పాకలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాకలను గాలి, వెలుతురు వచ్చే విధంగా ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పాకలో తడి లేకుండా చూసుకోవాలి. ● గొర్రెలకు సరైన కాలంలో టీకాలు ఇప్పించాలి. అమ్మతల్లి, పీపీఆర్ వంటి రోగాల నివారణకు టీకాలు చేయించాలి. ● గొర్రెలకు క్రమం తప్పకుండా 60 నుంచి 90 రోజులకు ఒక సారి నట్టల నివారణ మందులు త్రాగించాలి. ఈ మందులను పశు వైద్యుల సలహా మేరకు అందించాల్సి ఉంటుంది. ● గొర్రెల పోషణలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెల పిల్లలు నూటికి 20 వరకు మృతి చెందడం జరుగుతుంది. గొర్రె పిల్లల మరణాలు అరికట్టాలి. గొర్రె పిల్లలకు పుట్టిన మూడోరోజు జున్నపాలు తాపాలి. పశు వైద్యుల సలహా మేరకు రోగ నిరోధక మందులను నోటి ద్వార అందించాలి. పాడి–పంట నీటి ప్రవాహాల వద్దనే నీటిని తాపాలి గొర్రెల మందలో విత్తనపు పొటెళ్లను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. మందలో వచ్చే వ్యాధులను అప్రమత్తంగా ఉంటు గమనించుకోవాలి. అలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న గొర్రెలను మంద నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి. దోమలు, ఈగల వలన కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నివారణకు వర్షాకాలం, శీతాకాలల్లో గొర్రెల మందలో వేపాకు పొగను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా గొర్రెల పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే గొర్రెల మరణాలు తగ్గించి అధిక లాభాలు పొంద వచ్చని సూచించారు. -
రాజీతో శాశ్వత పరిష్కారం
● నేడు జాతీయ లోక్ అదాలత్ ● జిల్లాలో ఆరు బెంచీల ఏర్పాటు ● హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు పాలమూరు: రాజీపడదగిన కేసుల పరిష్కారం కోసం శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కోర్టులో నాలుగు బెంచీలతో పాటు జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించనున్నారు. జిల్లాలో ఇప్పటికే కోర్టు ద్వారా 1,400, పోలీస్ శాఖ ద్వారా 2,600 కేసులకు సంబంధించి ఆయా కక్షిదారులకు నోటీసులు పంపించారు. మహబూబ్నగర్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్కు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ హాజరుకానున్నారు. ● ప్రజలకు ఎవరికై నా సమస్య ఏర్పడితే మండల, జిల్లాస్థాయిలో ఉన్న న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించి వారి సమస్యను చెప్పుకోవచ్చు. ఏదైనా తగాదా ఏర్పడితే న్యాయస్థానంలో దావావేసే కంటే ముందు నేరుగా న్యాయసేవా అధికార సంస్థను ఆశ్రయిస్తే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల సమస్యను పరిష్కరించి వెంటనే తీర్చు చెబుతారు. ఇవే కాకుండా న్యాయస్థానాల్లో దాఖలైన కేసులను కూడా లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చు. ఎవరైనా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలంటే సంబంధిత న్యాయమూర్తికి విషయాన్ని తెలిపిన ఇలాంటి కేసులను న్యాయసేవా సంస్థకు పంపిస్తారు. దీంతో ఇరువర్గాల సమక్షంలో రాజీ పద్ధతిలో సత్వరం పరిష్కరిస్తారు. కుటుంబకలహాలు, మనోవర్తి, గృహహింస, అన్ని రకాల సివిల్ దావాలు, నష్టపరిహారం కోరుతూ మోటారు వాహనాల చట్టం కింద నమోదయ్యే కేసులు, బ్యాంకు రుణాలు, భూ తగదాలు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. ఇలాంటి కేసుల్లో రాజీ లేదు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, బాలికపై లైంగిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, ప్రత్యేక చట్టాలపై నమోదైన కేసులను, క్రూరమైన కేసును లోక్ అదాలత్లో రాజీకి వీల్లేదు. -
జగమంతా రామమయం
చారకొండ: భక్తుల రామనామస్మరణ.. సన్నాయి వాయిద్యాలు.. పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య.. పచ్చని పందిళ్లలో ముత్యాల తలంబ్రాలతో శ్రీరాముడు, సీతాదేవిల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంతో శుక్రవారం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని జరిపించిన జానకి రాముల కల్యాణ వైభోగాన్ని భక్తజనం కనులారా వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు సామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. పండితులు మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని జరిపించారు. రాముడి దోసిట తలంబ్రాలు నిలువు రాసులుగా.. జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలైన వేళ సిర్సనగండ్ల క్షేత్రం భక్తిపారవశ్యంతో ఉప్పొంగింది. అలాగే ముగ్గురు ట్రాన్స్జెండర్ల జంటలు కల్యాణ వేడుక మండపంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు కల్యాణం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి మరో రూ.కోటి నిధులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి సిర్సనగండ్ల క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, టాస్క్ సీఓఓ సుకింరెడ్డి రాఘవేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కనులపండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఒక్కటైన సీతారాములు అపర భద్రాద్రి సిర్సనగండ్లలో ఉప్పొంగిన భక్తిపారవశ్యం -
అనుమతి కోసం ఉన్నతాధికారులకు రాశాం
బోను ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు రాసి పంపాం. చిరుతులు ఉన్న ట్లు మన్సూర్పల్లి సర్పంచ్ నుంచి ఫిర్యాదు రావడంతో మేము వెళ్లి పరీక్షించాం. చిరుతలు ఉన్న విషయాన్ని గుర్తించాం. పైనుంచి అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేస్తాం. అప్పటి వరకు మా సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. మృతిచెందిన పశువులకు వెటర్నరీ వైద్యుల నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తాం. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – అబ్దుల్హై, ఫారెస్టు రేంజర్, మహమ్మదాబాద్. ● -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
● అధికారులు సమన్వయంతోపనిచేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్ధం కావాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025– 26 యాసంగిలో 2.01 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. 5.10లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా.. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ద్వారా 190 కొ నుగోలు కేంద్రాలను వచ్చే నెల రెండో వారంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. వరి పూర్తి పక్వానికి వచ్చిన తర్వాతే కోసేలా రైతులు, హార్వెస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిల్లులకు ధాన్యం కేటాయింపు, రవాణా ఏర్పాట్లు నిబంధనల ప్రకారమే జరగాలన్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు చేయాలని పోలీసులను ఆదేశించారు. మిల్లర్లు సహకరించాలి.. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. కలెక్టరేట్లో జిల్లా రైస్మిల్లర్ల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు అశోక్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. యాసంగి ధాన్యంలో 75 శాతం బ్రోకెన్ పాడీగా ఉండటం వల్ల తాము నష్టపోతామని.. ప్రభుత్వం నిర్దేశించిన సివిల్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవడం కష్టసాధ్యమన్నారు. దీనిపై తమకు కొంత సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అందరికీ సమాన ప్రాధాన్యతతో ఫైన్, దొడ్డు రకం ధాన్యం కేటాయించాలని, పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జీలను చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం అన్లోడింగ్ కోసం వాహనాలను 3–4 రోజులు నిలిపివేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కాగా, జిల్లాలో 112 రైస్ మిల్లులు ఉండగా.. 84 మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయిస్తున్నట్లు జిల్లా మేనేజర్ రవినాయక్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జెఎల్బి హరిప్రియ, ఏఎస్పీ ఎన్బి రత్నం, డీసీఎస్ఓ గంప శ్రీనివా స్, డీఆర్డీఓ నర్సింహు లు, డీసీఓ కృష్ణ, జిల్లా సహకార ఆడిట్ అధికా రి టైటస్ పాల్, డీఏఓ బి.వెంకటేశ్, జిల్లా లీగ ల్ మెట్రాలజీ అధికారి రవీందర్, ఎల్డీఎం చంద్రశేఖర్ ఉన్నారు. -
భయం.. భయంగా!
గండేడ్: మండలంలోని ఆశిరెడ్డిపల్లికి చెందిన ఉప్ప రి బాలయ్య మంగళవారం రాత్రి పొలం దగ్గర పడుకున్నాడు. అర్ధరాత్రి ప్రాంతంలో కుక్కలు విపరీతంగా మొరిగాయి. దీంతో ఆయన లేచి టార్చిలైట్ వేసి చూడడంతో కొద్ది దూరంలో చిరుత కూర్చుని కనిపించింది. దీంతో ఆయన గట్టిగా చప్పుడు చేసుకుంటూ భయంతో ఇంటికి వెళ్లిపోయాడు. కొండాపూర్కు చెందిన గొల్ల మైబయ్య బుధవారం మేకలను మేపుకొని సాయంత్రం ఆరుగంటలకు ఆశిరెడ్డిపల్లి వైపు నుంచి కొండాపూర్కు తిరిగి వస్తుండగా బొందెగట్టు సమీపంలోకి రాగానే రెండు చిరుతలు మేకలపై దాడికి దిగాయి. వెంటనే అప్రమత్తమైన మైబయ్య, ఆయన కుమారుడు మల్లేష్ గట్టిగా ఆరుస్తూ కట్టెలు విసిరారు. దీంతో రెండు మేకలను చిరుతలు వదిలేసి వెళ్లిపోయాయి. అప్పటికే ఒక్క మేక చనిపోగా మరో మేక తీవ్రంగా గాయపడింది. దీంతో వారు భయంతో మిగతా మేకలను తోలుకొని ఇంటికి పరుగులు పెట్టారు. ఇలా ఒక్కటికాదు రెండుకాదు తరుచుగా ఏడాది నుంచి ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతోపాటు రైతులు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా బొందెగట్టు ప్రాంతంలో ఒకేసారి మూడు చిరుతలు కంటపడడంతోపాటు మేకల మీద దాడిచేయడంతో ఈప్రాంతం వారు అనుక్షణం భయాందోళన చెందుతున్నారు. పెరిగిన చిరుతల సంచారం పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్న రైతులు పశువులకు కొరవడిన రక్షణ బోను ఏర్పాటుపై వీడని సందిగ్ధం ఆందోళనలో గ్రామీణ ప్రజలు -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి.. విచారణ త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని వీసీ హాల్లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులతో పాటు అదృశ్య కేసులు, ఎన్బీడబ్ల్యూ, ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసు పారదర్శకంగా విచారణ చేసి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రధానంగా సున్నితమైన ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. నేరాల నియంత్రణ కోసం నిత్యం వాహనాల తనిఖీలు చేపట్టాలని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి కట్టడి కోసం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ ఎన్.బిరత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ ఉన్నారు. ● విద్యార్థులు, యువకులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ప్రాణాలకు ముప్పు అనే విషయాన్ని గ్రహించాలని ఎస్పీ జానకి అన్నారు. అరైవ్–అలైవ్లో భాగంగా స్థానిక రిషి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయరాదన్నారు. రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్కుమార్, ఐటీ కోర్ టీం ఎస్ఐ రవి, రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య, చంద్రకళ పాల్గొన్నారు. -
జనరల్ ఆస్పత్రిలోని కుక్కల తరలింపు
పాలమూరు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏడుగురు బాధితులపై కుక్క దాడి ఘటనపై ఈనెల 24న సాక్షిలో ‘పిచ్చి కుక్కలు దొంగలు స్వైరవిహారం’ కథనం ప్రచురితమైంది. దీనిపై జనరల్ ఆస్పత్రి అధికారులతోపాటు కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని 24గంటలపాటు శ్రమించి గురువారం ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మూడు వీధికుక్కలను తరలించారు. రోగులతో పాటు వారివెంట వచ్చే అటెండర్ల భద్రతకు ప్రాధన్యత ఇస్తూ ఇలాంటి ఘటనలు మళ్లీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా వెల్లడించారు. -
వైభవంగా సీతారామచంద్రస్వామి మాస కల్యాణం
సిర్సనగండ్లలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపై నున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాములు మాస కల్యాణ ఘట్టం కనులపండువగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలి వచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు, తహసీల్దార్ ఉమదంప తులు, ఎస్ఐ వీరబాబు దంపతులు, ఎంపీడీఓ శంకర్నాయక్, ఆలయ మాజీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సర్పంచ్ రామస్వా మి దంపతులు, ఉప సర్పంచ్ కల్లు సురేందర్రెడ్డి దంపతులు కల్యా ణంలో కూర్చున్నారు. అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్రెడ్డి అన్నదానం చేశారు.కార్యక్రమంలో మే నేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, వేణుశర్మ, కోదండ రామశర్మ, మురళీధర్శర్మ, గోపిశర్మ, ప్రవీణ్ శర్మ, అనంత రామశర్మ, , నాయకులు వెంకట్గౌడ్, బాల్రాంగౌడ్, సందీప్రెడ్డి, నర్సింహారెడ్డి,ప్రశాంత్ నాయక్, సాంబయ్యగౌడ్ ఉన్నారు. పటిష్ట నిఘా.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు, సీసీ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ప్రత్యేక బస్సులు బ్రహ్మోత్సవాలకు మహబుబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వం తరుఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. వేడుకలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేడుకకు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరం అయిన చోట టెంట్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. కల్యాణం మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది కూర్చునేలా, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్కు గట్టపై చదును చేశారు. వృద్ధులకు, మెట్ల నుంచి ఎక్కలేని వారి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్ డేరం రామశర్మ చెప్పారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం
కేటీదొడ్డి: మండలంలోని గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక క్కడే మృతిచెందగా, మ రో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల స మాచారం మేరకు.. కుచినెర్లకు చెందిన మల్లేష్ (24) అదే గ్రామానికి చెందిన శేషప్ప, కుర్వ మల్లేష్తో కలిసి బైక్పై నందిన్నె నుంచి కుచినెర్ల వైపు బయలుదేరారు. వీరి బైక్ కుచినెర్ల వాగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మల్లేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న శేషప్ప, కుర్వ మల్లేష్ సమీపంలోని పొలంలో పడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో విషాదం మృతుడు మల్లేష్ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లల రోధనలు విన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. గంజాయి సరఫరా చేసే ఇద్దరి అరెస్టు మహబూబ్నగర్ క్రైం: హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎండు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరూ యువకులను ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏఈఎస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం డీటీఎఫ్ బృందం మన్యంకొండ స్టేజీ దగ్గర చేసిన వాహనాల తనిఖీల్లో భానుప్రసాద్గౌడ్, సోమ్లానాయక్ బైక్లో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకొచ్చి జిల్లాలో విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరినుంచి 200గ్రాముల గంజాయి, ఒక బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే 8712658872కు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో సీఐ కవిత, ఎస్ఐ రాజేందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలు శిక్ష మహబూబ్నగర్ క్రైం: హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నవాబ్పేట పోలీస్స్టేషన్ పరిధిలో 2023 జనవరి 31న చెన్నారెడ్డిపల్లిలో భూవివాదం నేపథ్యంలో ఎరుకలి వెంకటయ్య, ఎరుకలి శ్రీను, ఎరుకలి మల్లేష్ ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఎరుకలి చెన్నయ్యను కర్రలు, కత్తులతో పొడిచి హత్య చేయడానికి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు ఎరుకలి చెన్నయ్యకు తల, శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై 2023 ఫిబ్రవరి 1న కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నవాబ్పేట పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా గురువారం ఈ కేసు కోర్టుకు వచ్చింది. ఈ కేసుపై వాదనలు పూర్తయిన తర్వాత నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ఈశ్వరయ్య ముగ్గురు నేరస్థుల్లో ఒక్కొక్కరికి నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6వేల జరిమానా విధించడంతోపాటు బాధితుడికి పరిహారంగా రూ.30వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులతోపాటు కోర్టు సిబ్బందిని ఎస్పీ జానకి అభినందించారు. సంస్థల పేరుతో బలవంతపు వసూళ్లు జడ్చర్ల: వృద్ధాశ్రమం తదితర సంక్షేమ సంస్థల పేరుతో బలవంతంగా చందాలు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. కోడింగటి నర్సింహ, మూడ నర్సమ్మ, సిరిగిరి శివశంకర్, రమేశ్, బన్ని తదితరులు గురువారం ఓ కారులో జడ్చర్లలో పలువురు వ్యాపారులు తదితరుల దగ్గరకు వెళ్లి తాము ఆదర్శ హోం ఫర్ చిల్డ్రన్, ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని తమకు సహాయం అందించాలని పట్టణంలోని పలువురు వ్యాపారులను డిమాండ్ చేశారు. అయితే తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పగా.. తాము బహుజన సామాజికవర్గానికి చెందిన వారమని, మిమ్మల్ని ఇబ్బందుల పెట్టే పనులు చేయాల్సి వస్తుందని, అంతు చూడాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. దీంతో భయబ్రాంతులకు గురైన పతంజలి దుకాణం నిర్వాహకులు బండారు అచ్చుతారెడ్డి రూ.5వేలు, మరో వ్యాపారి మంచని పాండయ్య రూ.21,000, మనోహర్ రూ.5,116, బక్క రామ్మోహన్ రూ.5116, నర్సింహులు రూ.21,000, గోవర్ధన్రెడ్డి రూ.5000, బండారు కృష్ణారెడ్డి రూ.15,000 తదితరులతో డబ్బులు వసూలు చేశారు. బాధితుడు అచ్చుతారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
లెదర్పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో లెదర్పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో గురువారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ లెదర్పార్కు కోసం 25ఎకరాల భూమిని కేటాయించారని, అప్పట్లో చర్మ ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఇక్కడి యువతకు శిక్షణ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగాక మలుపు పథకంలో భాగంగా ఇక్కడ ఓ భవనాన్ని కూడా నిర్మించారని తదుపరి పట్టించుకోక పోవడంతో పథకం లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. వృథాగా మారిన ఈ భూమిలో సమీప ఫార్మ పరిశ్రమల చెత్తను డంప్ చేసి కాలుష్యానికి కారణమవుతున్నారని అన్నారు. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ను సోమశిల మాదిరిగా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని. ఇక్కడ టూరిజం హోటల్ నిర్మాణంతోపాటు పర్యాటకులకు అందుబాటులో బోట్లను ఏర్పాటు చేయాలన్నారు. బస్డిపో ఏర్పాటు చేయండి జడ్చర్లలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హైదరాబాద్లో కలిసి విన్నవించారు. కొత్త బస్రూట్లను ఏర్పాటు చేయాలని, బస్టాండ్ను ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుచాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. -
కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాల్సిందే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈనెలాఖరు వరకు నగర పరిధిలో ఇంకా 227 కొత్త ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయాలని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా సీఓలు, ఆర్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) లో కొత్తగా 377 మహిళా గ్రూపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయిస్తే.. కేవలం 150 మాత్రమే చేయడమేమిటని మండిపడ్డారు. అలాగే కొత్తగా వీధి వ్యాపారులు 1,236కి గాను 743 మందినే చేర్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద 130 యూనిట్లకు గాను 104 ఏర్పాటు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మిగిలిన 24 యూనిట్లు సైతం మహిళలతో ఏర్పాటు చేయించాల్సిందేనన్నారు. సమావేశంలో మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్, సీ్త్రనిధి ఆర్ఎం వేణుగోపాల్రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు యాదయ్య, వరలక్ష్మి, దేవమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. గురుకులాల్లో గ్రూప్–1 అధికారుల పర్యటన స్టేషన్ మహబూబ్నగర్: గ్రూప్–1 అధికారులు శిక్షణలో భాగంగా శుక్రవారం స్థానిక టీజీఎంఆర్ఎస్జేసీ బాలుర–1, బాలుర–2, బాలికల–1 గురుకులాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. 24 మంది అధికారులు ఈ మూడు గురుకులాల్లో పర్యటించారు. ఆర్ఎల్సీ ఖాజా బాహుద్దీన్ వారిని ఆహ్వానించారు. -
వనపర్తిలో తీవ్ర ‘ఉద్రిక్తం’
● లైంగిక దాడి ఘటనలో బాలిక తరఫున పోరాడిన నేతలపై కేసులు ● పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట రాజకీయ పార్టీల నేతల బైఠాయింపు.. నిరసన వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న చిన్నారిపై వార్డెన్ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఘటన జరగగా.. బుధవారం వెలుగులోకి రావడం, విషయం బయటకు రాకుండా యాజమాన్యం, లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్పై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం, పాఠశాలలో సామగ్రి ధ్వంసం చేసిన విషయం విధితమే. బాలిక తరుఫున పోరాడిన పలువురు రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి అరెస్ట్చేసి పట్టణ పోలీస్స్టేషన్కు తరలించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆయా పార్టీల నాయకులు, ముస్లిం మతపెద్దలు, యువకులు పోలీస్స్టేషన్కు భారీగా చేరుకున్నారు. అప్పటికే పోలీస్స్టేషన్ గేటు ఎదుట సుమారు పదిమంది కానిస్టేబుళ్లను గస్తీ ఉంచి మీడియా, బాధితుల తరుఫు వారిని, అరెస్ట్ చేసిన నాయకుల తరుఫు వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలకు మాత్రం లోనికి వెళ్లే వెసులుబాటు కల్పించడంతో అక్కడున్న ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున తొమ్మిది మందిని అరెస్టు చేయగా.. ఇటీవల కాంగ్రెస్ను వీడిన నేతకు స్టేషన్ బెయిల్ ఇస్తూ, మిగతా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎనిమిది మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. పోలీస్స్టేషన్ ఎదుట నిరసన.. అధికార పార్టీ అండదండలతో పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి తమను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని నాయకులు నందిమళ్ల అశోక్, మెకానిక్ శ్రీను తదితరులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, ఆయా కులసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసుల చర్యలను తప్పుపడుతూ నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అఽధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ హెచ్చరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అక్కడికి చేరుకొని పోలీసుల తీరును తప్పుబట్టారు. అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులకు గురికావద్దని పోలీసులను హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్గౌడ్, పెద్దిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, కౌన్సిలర్లు మురళీసాగర్, శ్రీకర్గౌడ్, నాయకులు సమద్, స్టార్ రహీం, జోహర్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్రెడ్డి, చిట్యాల రాము, సీపీఎం నాయకుడు పరమేశ్వరాచారి, సీపీఐ నాయకుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా బార్ అసోసియేషన్ ఎన్నికలు
పాలమూరు: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బార్ అసోసియేషన్ భవన్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 505 ఓటర్లు ఉండగా దీంట్లో 454ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం చేయగా.. రాత్రి 10:30గంటలకు ముగిసింది. నూతన అధ్యక్షుడిగా ఆనందరావు తన సమీప ప్రత్యేర్థి ఉమామహేశ్వరిపై 181 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా వెంకటయ్య తన ప్రత్యర్థి రాజశేఖర్పై 27ఓట్ల తేడాతో విజయం సాధించాడు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నర్సింహారెడ్డి తన సమీప ప్రత్యేర్థి శ్రీధర్రావుపై 61ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోశాధికారిగా బి.రాజుగౌడ్ ప్రత్యర్థి వెంకట్రావుపై 31ఓట్ల అధిక్యతతో విజయం సాధించాడు. కార్యవర్గ సభ్యులుగా కృష్ణవంశీ, మహేశ్కుమార్, విష్ణు వేద, శ్రీకర్, చంద్రశర్మ, మురళీమోహన్, మధ్వరాజ్ గెలుపొందారు. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా సబితా, గ్రంథాలయ కార్యదర్శిగా ప్రభావతి, మహిళా కార్యవర్గ సభ్యులుగా మమత, ఝాన్సీ, జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కొండయ్య ప్రకటించారు. గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులకు ఎన్నికల అధికారి నియామక పత్రాలు అందజేశారు. పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఆనందరావు -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు
● పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు ● పోక్సో కేసు నమోదు ఊట్కూర్: ప్రేమ పేరుతో యువతిని(19) మోసం చేసిన పులిమామిడికి చెందిన యువకుడు బి.శ్రీకాంత్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్ఐ రమేశ్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువతి, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకుందామని యువకుడిని కోరగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెబుతూ వచ్చాడు. యువతి పక్షం రోజుల క్రితం యువకుని ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో యువతి మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి యువతిని నారాయణపేట ఏరియా ఆప్పత్రికి తరలించారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి మిడ్జిల్: మండలంలోని బోయిన్పల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతిచెదిన ఘటన చోటుచేసుకంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయు డు కథనం ప్రకారం.. మండలంలోని బోయిన్పల్లికి చెందిన బోయశేఖర్(38) మంగళవా రం సాయంత్రం బైక్పై మిడ్జిల్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. గ్రామ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా.. పరి స్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ని మ్స్కు రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతు డి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నవాబుపేట: మండలంలోని కొల్లూర్కు చెందిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందాడు. కొల్లూర్కు చెందిన శ్రీనివాస్(49)ఈనెల 21న తన పొలానికి బైక్పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. అక్కడున్నవారు కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొంది ఈనెల 23వ తేదీన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. షాద్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. జాతీయ బాక్సింగ్ పోటీలకు సరస్వతి మహబూబ్నగర్ క్రీడలు: నాగ్పూర్లో వచ్చేనెల 4 నుంచి 11 వరకు జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని మానవపాడుకు చెందిన సరస్వతి ఎంపికై ంది. హైదరాబాద్లోని షేక్పేట్లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సరస్వతి అండర్–19 విభాగంలో ప్రతిభకనబరిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. సరస్వతిని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నర్సింహులు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, అథ్లెటిక్స్ కోచ్ సునీల్కుమార్, శంకర్, శశికిరణ్ పాల్గొన్నారు. -
క్రికెట్లో సాయిరాం ప్రతిభ
● రెండుసార్లు హెచ్సీఏ అండర్–14కు ఎంపిక ● చైన్నెలో జరిగిన లీగ్లో టాప్స్కోరర్ ● సెంచరీలతో రాణింపు మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ రూరల్ మండలం అల్లీపూర్కు చెందిన పిట్ల యాదయ్య, శైలజ దంపతుల కుమారుడు సాయిరాం క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. తల్లిదండ్రులతోపాటు తాతయ్య పిట్ల ఊషన్న కూడా సాయిరాంను క్రికెట్లో ప్రోత్సహిస్తున్నారు. సాయిరాం జిల్లాకేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.. గత ఐదేళ్ల నుంచి క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న సాయిరాం అనతికాలంలోనే బ్యాటింగ్లో సత్తాచాటి అందరి మన్ననలు పొందుతున్నాడు. మొదట్లో ఇంటివద్ద నుంచే సాయిరాం తన క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. కోచ్ భరత్గౌడ్ ఇంటి వద్దే ప్రత్యేక క్రికెట్ శిక్షణ ఇచాడు. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని పెవిలియన్ క్రికెట్ క్లబ్లో కోచ్ భరత్గౌడ్ వద్ద క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ గతేడాది హైదరాబాద్లోని నటరాజ్ క్రికెట్ క్లబ్ తరపున బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ఈ సీజన్లోనూ సాయి రాం బ్యాటింగ్లో మెరుగైనప్రదర్శన కనబరిచా డు. హైదరాబాద్లోని ఎంఎల్ జయసింహ క్రికెట్ క్లబ్ తరపున ఈ సీజన్ లో తొమ్మిది లీగ్ మ్యా చుల్లో 280 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్లో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అండర్–14 ప్రాబ బుల్స్ నాలుగు మ్యాచుల్లో 232 పరుగులు చేసి రాణించాడు. ఒక మ్యాచ్లో 121 పరుగులు నాటౌట్, మరో మ్యాచ్లో 82 పరుగులు చేసి మరోసారి హెచ్సీఎం అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. చైన్నెలో ఫిబ్రవరి 13 నుంచి 23 వరకు జరిగిన అండర్–14 క్రికెట్ టోర్నీలో పాల్గొని 150 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబాయి జట్టుపై 88 పరుగులు, తమిళనాడు జట్టుపై 56 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. -
ఇండియా జట్టులో ఆడాలన్నదే లక్ష్యం
భారత జట్టులో విరాట్కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ ఆడడం ప్రారంభించా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ భరత్గౌడ్ శిక్షణలో క్రికెట్లో రాణిస్తున్నా. పెవిలియన్ క్లబ్లో ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 10.30 గంటల వరకు ప్రాక్టిస్ చేస్తున్నా. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభ కనబరిచి ఆల్రౌండర్గా ఎదుగుతా. భవిష్యత్లో హైదరాబాద్ రంజీ జట్టుకు, ఇండియా జట్టుకు ఎంపికకావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం నిరంతరం శ్రమిస్తా. – సాయిరాం, క్రికెటర్, మహబూబ్నగర్ ● -
గిరిజనుల అభ్యున్నతికే పునరావాసం
అచ్చంపేట/ మన్ననూర్: అటవీ సరిహద్దు ప్రాంతా ల్లో నివాసముంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దూరమవుతున్న గిరిజన గ్రామాల కుటుంబాల వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్నట్లు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. బుదవారం హైదరాబాద్లోని సచివాలయం/అసెంబ్లీ హాల్లో అటవీ లోతట్టు కోర్ ఏరియా, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలోని సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాలు, కొల్లంపెంటకు చెందిన 160 కుటుంబాలకుగానూ ఆప్షన్–1లో భాగంగా రూ: 24కోట్లు నగదు రూపంలోని చెక్కులు అందజేశారు. అదేవిధంగా 257 కుటుంబాలకు ఆఫ్షన్–2 వర్తింపజేస్తూ పెద్దకొత్తపల్లి మండలం బాకారం సమీపంలో 5 ఎకరాల సాగుకు అనుకూలమైన భూమి, పక్కా ఇళ్లు, జీపీ భవనం, పాఠశాల, ఆస్పత్రితోపాటు గ్రామంలో అన్నిరకాల వసతుల ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ సంతోష్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, సార్లపల్లి సర్పంచ్ చిర్ర వీరమ్మరాములు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల పునరావాస లబ్ధిదారులు పాల్గొన్నారు. -
బెదిరింపులతోనే బలవన్మరణం
● యువతి ప్రేమ వ్యవహారంలో పాల్పడినట్లుగా భార్య ఫిర్యాదు కల్వకుర్తి టౌన్: బంధువులకు సంబంధించిన యువతి ప్రేమ వ్యవహారంలో వారి కుటుంబ సభ్యులు బెదిరించటంతోనే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని, మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని పంజుగులకు చెందిన బాలస్వామి(30)తో తాడూరు మండల కేంద్రానికి చెందిన శ్రీవాణితో నాలుగేళ్ల కిందట వివాహామైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. తాడూరుకు చెందిన శ్రీవాణి అన్న మల్లేశ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని, యువతితో పాటుగా శ్రీవాణి ఇంటిలోనే అతను తలదాచుకున్నాడని యువతి తరఫు బంధువులు పంజుగులలోని శ్రీవాణి ఇంటికి ఈ నెల 22వ తేదీన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం బుధవారం తాడూరు పోలీస్స్టేషన్కు వచ్చి సదరు విషయమై మాట్లాడేందుకు 11 గంటల ప్రాంతంలో వెళ్లగా, పంజుగులకు చెందిన కొండల్రెడ్డి ఫోన్చేసి నీ భర్త మా పొలంలో పశువుల దొడ్డిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపినట్లు బాధితురాలు తెలిపారు. కఠిన చర్యలు తీసుకోవాలి ప్రేమ వ్యవహారంలో నా భర్త బాలస్వామిని తీవ్ర బెదిరింపులకు గురిచేసిన కారణంగానే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని భార్య శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు గురిచేయటమే కాకుండా, వారిద్దరిని కొట్టడంతో అవమానాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతికి కారణమైన మల్లేష్, సాయిబాబు, బాలులపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కల్వకుర్తి పోలీస్స్టేషన్లో శ్రీవాణి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని సీహెచ్సీకి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య భూత్పూర్: మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందన మహమూద్ పాష(19) మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు మహమూద్పాష ప్రైవేటుగా కరెంట్ పనులు చేస్తుండేవాడు. మంగళవారం పనుల్లో భాగంగా భూత్పూర్ వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి 9: 30 గంటలకు గదిలోకి వెళ్లి తనను క్షమించాలని, మిస్యూ అమ్మ, అక్క, అన్న అని ఇన్స్ట్రాగాంలో పోస్టు పెట్టాడు. బయటకు వెళ్లిన పాష అన్న ఇన్స్ట్రాగాంలో తమ్ముడు పెట్టిన పోస్టును గమనించి ఇంటికి వచ్చి చూడగా గదిలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని విగతజీవిగా ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. బుధవారం మృతుడి తల్లి హసీనా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఆర్బీఐ నిబంధనల మేరకే కార్యకలాపాలు
● డీసీసీబీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ● చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులకు రుణాలు అందించాలి మహబూబ్నగర్ (వ్యవసాయం): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులను కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. బుధవారం డీసీసీబీ సర్వసభ్య సమావేశాన్ని మహబూబ్నగర్లోని ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఇన్చార్జీ సీఈఓ రవికాంత్రెడ్డి గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లావాదేవీలు, రుణాల పంపిణీ, డిపాజిట్లు, రికవరీలు, డిఫాల్టర్ల వివరాలను సభ్యులకు వివరించారు. అనంతరం కలెక్టర్, బ్యాంక్ పర్సన్ ఇన్చార్జీ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ.. మార్చి 25 నాటికి బ్యాంకు యొక్క డిపాజిట్లు దాదాపుగా రూ.489 కోట్లకు చేరుకున్నాయని, నేటి వరకు బ్యాంకు ద్వారా రూ.753 కోట్ల స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,393 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ, వ్యవసాయేతర రుణాల అందించామన్నారు. అదేవిధంగా రుణ వసూళ్లలోనూ ప్రగతిని కనబరుస్తూ నిరర్థక ఆస్తులను 2.86 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆర్బీఐ అనుమతితో త్వరలోనే బ్యాంకు వినియోగదారులందరికీ యూపీఐ సేవలు, 14 నూతన బ్రాంచ్ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. 31 మార్చి, 2026 నాటికి రూ.2,500 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా 23 మార్చి, 2026 నాటికి రూ.2,400 కోట్ల టర్నోవర్ సాధించినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు.. మహిళా స్వయం సహాయక సంఘాలు, పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న వారికి కూడా రుణాలు విస్తరించాలని, వీరు మంచి రీపేమెంట్ సామర్థ్యం కలిగిన వర్గమని పేర్కొన్నారు. అలాగే డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని వర్గాలకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల రికవరీ, వడ్డీ చెల్లింపుల సమస్యలు ఉన్నచోట అధికారులు స్వయంగా గ్రామాలకు వెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. డీసీసీబీకి ఎన్నికై న పాలక మండలి లేకపోవడంతో నియమించబడ్డ సభ్యులు, అధికారులు ఆర్బీఐ, నాబార్డ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో బ్యాంకు సీఈఓ రవికాంత్రెడ్డి, డీజీఎం బాలు, నాబార్డ్ డీడీఎం షణ్ముఖచారి, డీసీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు సేవ చేసేందుకే ఆస్పత్రి ఏర్పాటు
● 25 ఏళ్ల అనుభవంలో ఎన్నో వైద్య సేవలు ● సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్రెడ్డి పాలమూరు: పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యత వైద్యం అందించాలనే లక్ష్యంతోనే సుశ్రుత ప్రజా వైద్యశాల 2001 ఏప్రిల్ 5న 20 పడకలతో ప్రారంభించారు. మొదట్లో కేవలం సర్జరీ, గైనిక్ విభాగాలతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్న దశాలవారిగా 12 విభాగాలకు విస్తరించారు. ఏప్రిల్ 5తో ఆస్పత్రి ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తవుతాయి. 20 నుంచి 50 పడకలకు ఆ తర్వాత 120 పడకలకు పెంచామని, ఆస్పత్రిలో ఇప్పటి వరకు 40 వేల అన్ని రకాల సర్జరీలు చేయగా 10 వేల ప్రసవాలు చేశారు. లక్ష వరకు అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తే.. ఆరు లక్షల వరకు ఓపీ సేవలు అందించారు. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా 50 పడకలకు 2010లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మొదటిసారి 2013లో టెస్టు ట్యూబ్ బేబీకి చికిత్స శ్రీకారం చుట్టగా.. ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీలో గుండె సర్జరీలు ఉచితంగా నిర్వహించారు. ప్రస్తుతం 12 విభాగాలలో 150 మంది వైద్య సిబ్బందితో వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు సుశృత ఆస్పత్రి నిర్వహణలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ గుర్తింపు వచ్చింది. దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం సందర్శించి అన్ని రకాల తనిఖీలు చేసిన తర్వాతే ఈ గుర్తింపు ఇచ్చింది. దీంతోపాటు ఐ ఇౖ అవార్డు సైతం వచ్చింది. నాకు చిన్ననాటి నుంచి పేదలకు ఏదో రకమైన సేవ చేయాలనే ఆసక్తి ఉండేది. దీంతో వైద్య రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత యూకేలో ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత మహబూబ్నగర్ పట్టణంలో 2001లో ఆస్పత్రి ప్రారంభించాం. నా ప్రాక్టీస్ కొత్తలో 2003లో సరైన వైద్య సేవలు అందుబాటులో లేని సమయంలో వనపర్తికి చెందిన గర్భిణికి ప్రసవం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఆమె ఊపిరితిత్తుల్లో చీము ఉండటం వల్ల ప్రసవం కష్టంగా మారింది. దీంతో మా ఆస్పత్రిలో ఆమెకు ప్రత్యేక వైద్యంతో చీము తొలగించి ప్రసవం చేస్తే బాబు జన్మించాడు. ఆ బాబుకు నా పేరు పెట్టుకోవడం నేను మరిచిపోలేని విషయం. – డా. మధుసూదన్రెడ్డి, జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ -
బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రవలి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆలయంలో గరుడ పటంతో గ్రామ ప్రదక్షణ, ధ్వజస్తంభ స్నపనం, ధ్వజారోహణం, అష్టదిగ్భందనం, యాగశాలలో ప్రధాన కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి మంత్ర హోమం, లఘుపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజరు సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు ఉన్నారు. -
అపర భద్రాది ‘సిర్సనగండ్ల’
చారకొండ: రాష్ట్రంలోనే రెండో అపర భద్రాద్రిగా భ క్తులు చేత పూజలందుకుంటున్న సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహోత్సవాలకు ము స్తాబైంది. గురువారం నుంచి మార్చి 7 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని వేడుకల ను నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యక్షేత్రం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిర్సనగండ్ల పంచాయతీలో పరిధిలో అయోధ్యనగర్ (గుట్ట)పైన సుమారు 60 ఎకరాల్లో 300 అడుగుల ఎతైన ఏకశిలపై వెలసింది. ఉమ్మడి మ హబుబ్నగర్ నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తు లు బ్రహోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా లాంఛనాలతో సీతారాముల కల్యాణం జరిపిస్తారు. పక్షం రోజుల పాటు కొనసాగే బ్రహోత్సవాల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శు క్రవారం జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తు లు అధిక సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఆల య ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం,విద్యుత్ సరాఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. ఆలయ రాజగోపురం బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారామచంద్రస్వామి మాసకల్యాణం, శుక్రవా రం మధ్యాహ్నం 12 గంటలకు మహా కల్యా ణోత్సవం, హనుమత్ సేవ, శనివారం చిన్న రఽథం (చిన్నతేరు), ఆదివారం గరుడ సేవ, సోమవారం రాత్రి బ్రహోత్సవం (పెద్దరథం), మంగళవారం జగసేవ, దోపోత్సవం, బుధవారం చక్రతీర్థం, ఏకాంత సేవ, ద్వాదశ ఆరాధన తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు తెలిపారు. ఏకశిలపై కొలువైన సీతారామచంద్రులు నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం వైభవంగా కల్యాణోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి -
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి వందశాతం మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లోనే సరఫరా చేయాలని ఆదేశించారు. గతంలో తనిఖీ కమిటీ గుర్తించిన 16 రీచ్లలో రెండు మాత్ర మే ఇసుక బుకింగ్కు కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇందులో అడ్డాకుల మండలం కన్మనూర్, మూసా పేట మండలం పోల్కంపల్లి రీచ్ల నుంచి మన ఇసుక వాహనం ద్వారా బుకింగ్ సరఫరా చేస్తున్నామన్నారు. తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా స్వాధీనం, ఇసుక డంప్ల వివరాలు, పట్టుబడిన లారీలు, ట్రాక్టర్లు, అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాలపై సమగ్ర సమాచారం ఇసుక వాట్సప్ గ్రూప్లో వివరాలు పోస్ట్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వచ్చేసారి నిర్వహించే జిల్లాస్థాయి ఇసుక సమీక్ష సమావేశానికి ప్రతి తహసీల్దార్ తమ మండలాల్లో జరిగిన ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ల వివరాలు, అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలు, స్వాధీనం చేసిన వాహనాల వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన ఇసుకపై సరైన సమాచారం తీసుకొని.. దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వాలన్నారు. ఇసుక బుకింగ్, సరఫరాపై ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలని, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఏఎస్పీ రత్నం, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, జిల్లా మైన్స్ శాఖ ఏడీ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సోలార్పై దృష్టిపెట్టాలి ప్రజలు సోలార్ విద్యుత్పై దృష్టిపెట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని, హరిత ఇంధన వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీజీ రెడ్కో మనోహర్రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డు తొలగేనా..?
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూ ములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ ప్రా జెక్టు పనులు దశాబ్దాలుగా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రాజెక్టుల పూర్తికి నిధుల లేమికి తోడు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ము ఖ్యంగా రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన నెట్టెంపాడు ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతోపాటు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగ డం లేదు. అదేవిధంగా ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 461 ఎకరాల భూసేకరణలో జరుగుతున్న జాప్యం పనులకు అడ్డంకిగా మారింది. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్మించాల్సిన మల్లమ్మకుంట రిజర్వాయ ర్ కోసం 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల లక్ష్యంతో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల ద్వారా కేవలం 6– 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి నిర్మాణాలనకు భూ సేకరణ ప్రక్రియ అడ్డంకిగా మారడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం.. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు ఇటీవల గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి.. పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. ఇదీ పరిస్థితి.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు.. కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం. భూసేకరణ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. 87,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. భూములు ఇచ్చేందుకు స్థానిక రైతులు అభ్యంతరం చెబుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో సివిల్, మెకానికల్ పనులతోపాటు భూసేకరణ సమస్య నెలకొంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకుభూసేకరణ సమస్య ముందుకు సాగని పెండింగ్ పనులు భూసేకరణ పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ సమీక్ష త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని ఆదేశం వేగవంతంగా భూసేకరణ.. నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవలి ఆర్అండ్ఆర్ కమిషనర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూమిని సేకరించాలని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. పెండింగ్లో ఉన్న భూేమిని వేగవంతంగా సేకరించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ -
పోటెత్తిన ఉల్లి
● గరిష్టంగా రూ.1,400,కనిష్టంగా రూ.800 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి మార్కెట్కు రావడంతో ఎక్కడ చూసినా ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే వచ్చిన ఉల్లిలో అటు ఇటుగా ఉన్న ఉల్లి కుప్పలకు ధరలు నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉల్లి వేలంలో క్వింటాల్ గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,00 వరకు ధరలు పలికాయి. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాలుగా ఉల్లిని తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్దమొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసి తరలించారు. ఇక స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో మార్కె ట్ అంతా సందడిగా కనిపించింది. -
2న యూనివర్సిటీస్థాయి కామర్స్ ఫెస్ట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 2న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల కామర్స్ ఫెస్ట్ ప్రేరణ–2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమ బ్రోచర్ను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫెస్ట్ మాత్రమే కాదని, కామర్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఈ నెల 30లోగా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు సికింద్రాబాద్లోని అవినాష్ కళాశాలలో వచ్చేనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ అనురాధరెడ్డి, బీఓఎస్ చైర్మన్ ఆఫ్ కామర్స్ రాజ్కుమార్, రంగప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ పీయూలో అధ్యాపకులు మధు మోటమారి, భారతి సంయుక్తంగా రచించిన నానోఫ్లూయిడ్స్ రంగంలో విశేష పరిశోధన, నూతన గ్రంథం పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన విద్యార్థులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. -
సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
కందనూలు: సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాలన్నారు. ఈ జాతరకు మూడు రోజులపాటు పరహాబాద్ నుంచి లోపలికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీస్శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాత్రి వేళల్లో నడిచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మధ్యమధ్యలో సోలార్ లైట్లును ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం విరివిగా బస్సులను ఏర్పాట్లు చేయాలని నాగర్కర్నూల్ డీఎంను ఆదేశించారు. వైద్యశాఖ తరఫున పలుచోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యసిబ్బంది, అంబులెన్స్లను 24గంటలు పర్యవేక్షణ జరిపేలా ఏర్పాటు చేయాలని, కింద గుండం వద్ద వైద్యసిబ్బంది అన్నిరకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా, వాహనాల అనుమతి తదితర అంశాలను పోలీస్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సలేశ్వరం జాతరకు గర్భిణులు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు రాకుంటే మంచిదని తెలిపారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అధికారులు కమిటీ సభ్యులు చెంచు సంఘాల నాయకులు పోలీస్శాఖకు సహకారాలు అందించాలని, సలేశ్వరం జాతరను అత్యంత పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు పోలీస్శాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పవర్ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కృష్ణా: మండలంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సూపర్ థర్మల్ పవర్ప్లాంట్ ఏర్పాటుకు జెన్కో అధికారులు మంగళవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో మక్తల్ నియోజకవర్గంలో పవర్ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించి, సాధ్యాసాధ్యలపై నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారన్నారు. దీంతో జెన్కో అధికారులు కృష్ణా మండల కేంద్రంతో పాటూ హిందుపూర్ శివారులో గతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సేకరించిన భూమిని పరిశీలించారు. వపర్ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉండడంతో అధికారులు సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెన్కో అధికారులు ఎస్ఈ రామకృష్ణారెడ్డి, ఈఈ నవీన్, ఏడీ గంగారామ్, మంత్రి వాకిటి శ్రీహరి వ్యక్తిగత కార్యదర్శి వినోద్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ సోలాపూర్ నాగప్ప, రాజప్పగౌడ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు తరలిన ఖోఖో జట్టు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ పురుషుల ఖోఖో జట్టు మంగళవారం తరలివెళ్లింది. కర్ణాటకలోని దేవాగిరి యూనివర్సిటీలో జరిగే పోటీల్లో విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు వీసీ శ్రీనివాస్ ట్రాక్షూట్లను అందజేశారు. యూనివర్సిటీలో ఉన్న అన్ని క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభకనబరిచి.. పీయూకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, పీడీ శ్రీనివాస్, కోచ్ వెంకటప్ప, మేనేజర్ కథలప్ప తదితరులు పాల్గొన్నారు. -
బొందెగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు
● బోను ఏర్పాటుకు చర్యలు గండేడ్: చిరుతల అవాసానికి బొందెగట్టు అనువైన ప్రదేశమని ఫారెస్టు డివిజనల్ అధికారి గణేష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మన్సూర్పల్లి గ్రామ శివారులో చిరుతలు సంచరిస్తున్న బొందెగట్టును మహమ్మాదాబాద్ ఫారెస్టు రేంజర్ అబ్దుల్హైతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొందెగట్టు ప్రాంతం చిరుత పులుల నివాసానికి అనువుగా ఉందన్నారు. దీనికి తోడు సమీపంలో రెడ్డి చెరువు కూడ ఉండడంతో వేసవికాలంలో దాహార్తి తీర్చుకోవడానికి కూడా ఏలాంటి లేకపోవడంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు వివరించారు. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకుంటామన్నారు. అప్పటి వరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులు మేకలు, గొర్రెలు వంటివి పొలాల దగ్గర కట్టెయకుండా ఇంటి దగ్గర ఉంచుకోవాలన్నారు. ఎప్పటికపుడు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని డిప్యూటి రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్కు సూచించారు. డిప్యూటీ రేంజర్ రాఘవేందర్ , బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్లు సాయంత్రం వరకు ఉండి చుట్టూ పక్కల ప్రాంతాల రైతులతో మాట్లాడి పలు సూచనలు. సలహాలు ఇచ్చారు. చిరుత పులులు బయటికి వచ్చినపుడు తమకు సమాచారం ఇవ్వాలని చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలని రైతులకు సూచించారు. -
ఆస్పత్రిలో దొంగతనంపై విచారణ
● అంతర్మథనంలో సిబ్బంది ● అనుమానిత వ్యక్తులపై నిఘా గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డ్రెస్సింగ్ గదిలో వృద్ధురాలి బ్యాగులోని నగదు, బంగారు ఆభరణాల మాయంపై జిల్లా పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. 16 రోజుల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన ఓ వృద్ధురాలు రూ.14 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు మాయం అయిన సంఘటన విదితమే. ఈ వ్యవహారంలో ఎంతమంది పాత్ర ఉందనే విషయంపై విచారణ బృందం ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు వచ్చిన సమయంలో ఒంటరిగా వచ్చారా లేక మరొకరి సహాయంతో అక్కడికి వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు అపహరణకు గురయ్యాయని వృద్ధురాలు, కుమారుడి ఫిర్యాదుపై పోలీసులు కూపీలాగుతున్నారు. మక్తల్ నుంచి గద్వాలకు రావడం గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఓ సిబ్బంది వ్యవహరించిన తీరును సీసీ ఫుటేజీలో పరిశీలించగా అటువైపు ఆ సిబ్బంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. వృద్ధురాలు నిద్రలోకి జారుకున్న క్రమంలో ఓ మహిళ సిబ్బందితో బ్యాగును తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సదరు మహిళను విచారణ బృందం ఆస్పత్రి అధికారుల సమక్షంలో వాకబు చేశారని, సోమవారం సైతం ఇద్దరు వ్యక్తులను విచారించినట్లు సమాచారం. అయితే పోలీసు విచారణలో ఉన్న సిబ్బంది గతంలోను మృతి చెందిన మహిళ ముక్కుపుడక, కమ్మలను అపహరించినట్లు ఆస్పతి సిబ్బంది తెలుపుతున్నారు. ఈ రెండు ఆరోపణలపై సదరు సిబ్బంది సైతం పెదవిరుస్తున్నారు. అంతర్మథనంలో.. ఆస్పత్రిలోనే నగదు, ఆభరణాలు మాయం అయినట్లు తెలియడం, పోలీసులు విచారణ చేపడ్తున్న క్రమంలో సిబ్బంది అంతర్మథనంలో పడ్డారు. ఆస్పత్రిలో విలువైన మందులు, శస్త్ర చికిత్స పరికరాలు తదితర వాటికి రక్షణ ఉంటుందనే విషయంపై మల్లగులాలు పడుతున్నారు. -
దశాబ్దాల కల సాకారం!
● అజిలాపూర్ లిఫ్టు పనులకు శ్రీకారం ● ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన ● హాజరుకానున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం అజిలాపూర్లో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకంతో ఆరు గ్రామాల రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ.32కోట్లతో కోయిల్సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఈ లిప్టు ఏర్పాటుకు పరిపాలన అనుమతులు గతంలో మంజూరైన పనులకు సబంధించి టెండర్ ప్రక్రియ పూర్తికావడంతోపాటు ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన పనులుకు ఏర్పాట్లు జరుగుతుండంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాగునీరు అందక ఇబ్బందులు ప్రాజెక్ట్ కూతవేటు దూరంలో ఉన్న పోలాలు ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో దశాబ్ధలుగా సాగునీరు అందక ఆరు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. గెలిచిన వెంటనే లిఫ్టు పనులు ప్రారంభిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లి రూ.32కోట్ల పరిపాలన అనుమతులు తీసుకొచ్చారు. ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం అజిలాపూర్ స్టేజ్ వద్ద శంకుస్థాపన పనులను అధికారులు పరిశీలించారు. కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ పూర్తయితే సూమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. స్థల పరిశీలన చేసినవారిలో ఏఈ హరీందర్, నాయకులు భాస్కర్రెడ్డి, అంజిల్రెడ్డి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈత.. మిగల్చొద్దు కడుపు కోత!
మహబూబ్నగర్ క్రైం/వనపర్తి: వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, క్వారీలు, కాల్వలు, డ్యాంల్లో ఈత పడేందుకు వెళ్తున్న చిన్నారులు, యువకులు, విద్యార్థులు అజాగ్రత్తగా ఉంటూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ముగియడంతో పాటు పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు కొనసాగుతున్న తరుణంలో విద్యార్థులు ఈత పడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈత రాకుండా నీటి కుంటల్లోకి దిగడం, ఇతరత్రా కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. చిన్నారులతో అప్రమత్తం చిన్నారులకు ఈత నేర్పేందుకు బావుల వద్దకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం వారు నిర్లక్ష్యంగా ఉండి, చిన్నారులను గమనించకుండా ఉన్నా.. బావుల్లో ఈత పడే వారిని చూస్తూ అమాయకంగా పిల్లలు అందులో దూకే ప్రమాదం ఉంటుందన్నారు. చిన్నారులకు ఈత నేర్పించే సమయంలో మొదట వాళ్లు అలవాటు పడే వరకు తల్లిదండ్రులు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్నిసార్లు పిల్లలకు ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను కట్టి ఈత పడేందుకు పంపిస్తారని, అలా చేయకూడదన్నారు. అనుకోని పరిస్థితుల్లో వాటిలోకి నీరు వెళితే చిన్నారులు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బావుల్లో కంప చెట్లు, రాళ్లు ఉండడంతో వాటిలో చిక్కుకొని మరికొందురు మృత్యువాత పడుతున్నారని, ఈతకు వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తించాలి. ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లాలో అధికమవుతున్న ప్రమాదాలు క్వారీలు, గుంతల్లో ఈతకు వెళ్లి పలువురు మృత్యువాత అవగాహన కల్పిస్తున్న అధికారులు,పోలీసులు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి జాగ్రత్తలు పిల్లలు సాహసం చేస్తున్నామనే భ్రమలో లోతు తెలుసుకోకుండా నీటిలో దూకుతుంటారు. ఇలాంటివి చేయకుండా ఉండాలనే విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఫిట్స్, గుండె జబ్బులున్న పిల్లలను ఈతకు వెళ్లనీయకూడదు. ప్రమాదకరమైన నదులు, చెరువులు, కాల్వల్లో పిల్లలు దిగకుండా అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు అమర్చాలి. పిల్లలు సెలవుల్లో ఎక్కడికెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అనేది తల్లిదండ్రులు తప్పక గమనించాలి. చెరువులు, కాల్వలు, బావుల వైపు ఒంటరిగా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నీటి ప్రవాహాలు, గతంలో జరిగిన ప్రమాదాల గురించి పిల్లలకు వివరించాలి. నీళ్లు అంటే పిల్లలు భయపడేలా కాకుండా బాధ్యతాయుతంగా మెలిగేలా చేయాలి. నీటిలో ఆడుకోవడానికి, ఈత కొట్టడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రదేశాల్లో ఈతకొట్టే సాహసం చేయరాదు. ఈత నేర్చుకునేటప్పుడు లైఫ్ జాకెట్లు, ఫ్లోటింగ్ ట్యూబ్ల వంటి సురక్షిత సామగ్రిని వినియోగించాలి. దరికి దూరంగా ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో అలసిపోవడం, అక్కడి నుంచి వెనుకకు వద్దామన్న రాలేక.. ఊపిరాడక నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. నీటిలో అడుగుభాగాలకు వెళ్లి మట్టిని తేవడం, ఎవరు ఎంత సేపు నీటిలో మునిగి ఉంటారనే పోటీలు ఇతర ఆటలు ఆడరాదు. నీటిలో మునిగిన వ్యక్తిని, కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసేవారు సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి. -
ఎర్రగుట్టలో వివాదాస్పదం..
బాదేపల్లి శివారు ఎర్రగుట్ట ప్రాంతంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వచ్చి.. ఆరుగురికి ఇళ్ల పట్టాలను సైతం అందజేశారు. తర్వాత అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అర్హులను ఎంపిక చేసేందుకు పట్టణంలో పర్యటించి క్షేత్రస్థాయిలో కసరత్తు చేశారు. కానీ, అర్హుల జాబితాను రూపొందించేలోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇళ్ల కేటాయింపు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఎవరికి వారు ఆయా ఇళ్లలో చేరి ఆక్రమణలకు పాల్పడ్డారు. -
అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బా ధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ జానకితో కలిసి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. 2019 నుంచి 2026 వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదైన కేసులు, బాధితులకు పరిహారం చెల్లింపు, పెండింగ్ కేసులపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు 380 కేసుల్లో 224 కేసులకు గాను రూ.38,33,07,500 బాధితులకు పరిహారం అందించామని, 156 కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వరం స్పందించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. -
పెట్రోల్ బాంబ్
● బంకుల్లో నోస్టాక్ బోర్డులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ● రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లలో వాహనదారుల బారులు పాలమూరు: నగరంలో పెట్రోల్ కొరత ఉందని.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారనే ప్రచారంతో వాహనదారులు బంకుల దగ్గర బారులుదీరారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా జిల్లా జైలు పెట్రోల్ బంకు దగ్గర ద్విచక్రవాహనాలతోపాటు కార్లు సైతం క్యూ కట్టాయి. ముఖ్యంగా జైలు దగ్గర ఉన్న బంకులో రాత్రి 11 గంటల వరకు వాహనదారులు భారీగా క్యూ కట్టడంతో జైలు సిబ్బంది, వన్టౌన్ కానిస్టేబుళ్లు వాహనదారులను క్యూలైన్లలో ఏర్పాటు చేయించి సమస్య రాకుండా పెట్రోల్ వేసుకునేలా చర్యలు చేపట్టారు. అలాగే హాజ్గఫర్ పెట్రోల్ బంకు దగ్గర వాహనదారులు అధికంగా కనిపించారు. శ్రీనివాసకాలనీ, పద్మావతి కాలనీలోనూ పరిస్థితి ఉండటం విశేషం. స్థానికంగా పెట్రోల్ కొరత లేదని, సోషల్ మీడియాలో ప్రచారం నమ్మరాదని నిర్వాహకులు సూచిస్తున్నారు. -
గుడిసెల్లో ఉంటున్నాం..
స్థలం, ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేదు. ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటూ పనులు చేపడితే సంతోషించాం. సొంతిల్లు దక్కుతుందని సంబరపడ్డాం. కానీ, పనులు నిలిచిపోవడంతో ఏళ్లుగా గుడిసెలల్లోనే నివాసం ఉంటున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేసి తమకు ఇవ్వాలి. – గోరిబీ, ఫకీర్నగర్, బాదేపల్లి ఎర్రగుట్టలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీచేశాం. వీరిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. మా దగ్గర ఉన్న దరఖాస్తులను విచారించి అర్హులైన వారిని త్వరలోనే గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల -
రాజకీయ పార్టీలు ‘సర్’కు సహకరించాలి
జడ్చర్ల టౌన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్)కు ఈ నెల 31 వరకు బూత్లెవల్ ఏజెంట్లను నియమించి రాజకీయ పార్టీలు సహకరించాలని ఈఆర్ఓ, అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. మంగళవారం జడ్చర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా రివిజన్ కొనసాగుతుందని, అందుకు ఇప్పటికే మ్యాపింగ్ జరుగుతుందని వివరించారు. మ్యాపింగ్ ప్రకారం బీఎల్ఓలు ఇంటింటికి తిరుగుతారన్నారు. సర్ ద్వారా డబుల్ ఓట్లు ఉంటే తొలగిస్తామని, ఓటరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉంచుతామన్నారు. మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలి సర్ మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలని బీఎల్ఓలకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచించారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఎల్ఓ శిక్షణలో ఆమె పాల్గొని సూచనలు చేశారు. సర్లో భాగంగా ఇంటింటికి తిరిగి పరిశీలించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా శిక్షణ దోహదపడుతుందని, రాజకీయ పార్టీల ఏజెంట్లు సైతం సహకరిస్తారని చెప్పారు. నగరంలో లోతట్టు ప్రాంతాల పరిశీలన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌలి, గణేష్నగర్, ఎర్రకుంట పరిసరాలు, రాయచూర్ రోడ్ తదితర ఏరియాలను మంగళవారం ఇన్చార్జి అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ పరిశీలించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డిని ఆదేశించారు. అలాగే ఆయాచోట్ల కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు. అప్పన్నపల్లిలో మేయర్ పరిశీలన డివిజన్ నం.3 పరిధిలోని అప్పన్నపల్లిలో నగర మేయర్ మమత పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వీధుల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీటిని వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, లక్ష్మయ్య, టీపీబీఓ అభిలాష్, ఏఈ రాగవి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ ప్రధాన పథకాల అమలుపై వెబెక్స్ ద్వారా ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. -
నెరవేరని డబుల్ కల
●అసంపూర్తి దశలో వందలాది డబుల్ బెడ్రూం ఇళ్లు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంటలో బహుళ అంతస్థుల విధానంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే కొన్నాళ్ల తర్వాత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. ఇప్పటి వరకు మళ్లీ మొదలు పెట్టలేదు. ఈ కోవలోనే బోయలకుంటకు చెందిన మోటం అంజమ్మ తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఎప్పుడు దక్కుతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తుంది. కవర్లతో కప్పిన గుడిసె లాంటి ఇంట్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కాలం వెళ్లదీస్తుంది. జడ్చర్ల: జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడికక్కడ వృథాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. రూ. కోట్లు వెచ్చించి.. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కొన్నిచోట్ల అసంపూర్తిగా, మరికొన్నిచోట్ల నిర్మా ణాలు పూర్తయినా కేటాయించకపోవడంతో అటు ప్రభుత్వ లక్ష్యం.. ఇటు నిరుపేదల సొంతింటి కల నెరవేరడం లేదు. కనీస మౌలిక సదుపాయాల కల్పనతో అర్హులందరికీ డబుల్బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు తమకు సొంతిళ్లు దక్కుతాయనుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, రాజకీయ విభే దాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారం. నిలిచిన నిర్మాణాలు బహుళ అంతస్థుల విధానంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లడ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా ఇళ్లను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. బాదేపల్లి రంగనాయకస్వామి గుట్ట ప్రాంతంలో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇళ్లు అసంపూర్తి దశలోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే ఆలూరు రోడ్డులోని ఫకీర్నగర్లో నిర్మించిన 24 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. బోయలకుంటలో నిర్మించిన 96 ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. నోటీసులు జారీ.. ఎర్రగుట్ట ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాల్సిన ఇళ్లను అక్రమంగా ఆక్రమించారని, ఒకవేళ ఆయా ఇళ్లను ప్రభుత్వం కేటాయించి ఉంటే అందుకు ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలు తమకు మూడు రోజుల గడువులో సమర్పించాలని నోటీసులలో పేర్కొన్నారు. అలా చేయకపోతే అక్రమంగా నివాసం ఉంటున్నట్లు భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మాణాలు పూర్తయిన చోటా కేటాయించని వైనం ఎర్రగుట్టలో యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకొంటున్న అధికారులు లబ్ధిదారుల ఎంపికలో తాత్సారం.. ఆందోళనలో నిరుపేదలు జడ్చర్ల నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో దశల వారిగా 2,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఎక్కువగా జడ్చర్ల మండలంలోనే 2,132 ఇళ్లు నిర్మించారు. అయితే కావేరమ్మపేట, బాదేపల్లి, బండమీదిపల్లి, కోడ్గల్ వంటి గ్రామాలు మినహాయిస్తే ఎక్కడా డబుల్బెడ్ రూం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదు. మిడ్జిల్, బాలానగర్, నవాబుపేట, రాజాపూర్ మండలాల్లో సైతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరుకు సంబంధించి ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 3 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. -
హుండీ చోరీకి వచ్చిన వ్యక్తి అరెస్టు
కొత్తపల్లి(మద్దూరు): నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపల్ పట్టణంలో హుండీ దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి హుండీని పగలగొట్టి చోరీకి యత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతని అనుమానాస్పద కదలికలను గమనించి వెంటనే పట్టుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు దామరగిద్ద మండలం మొగలమడ్కకు చెందిన అవుసుల రమేశ్ తండ్రి వేణుగోపాలచారిగా గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు కొనసాగిస్తునట్లు తెలిపారు. గ్రామాల్లో చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో డయల్ 100కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
బోను ఏర్పాటు చేస్తాం
మన్సూర్పల్లి బొందెగుట్ట వద్ద చిరుతలు ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాం. చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్తో అనుమతి తీసుకొని వీలైనంత వరకు మంగళవారం బోను ఏర్పాటు చేస్తాం. చిరుతలు మనుషులపై దాడులు చేయవని ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే పశువులను పొలాల వద్ద కట్టేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకై నా మంచిది ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. – రాఘవేందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్ వారం రోజులుగా గమనిస్తున్నా.. చిరుతలు కనిపిస్తున్న బొందెగట్టు నా పొలాన్ని ఆనుకొని ఉంది. వారం రోజులుగా ఉదయం వేళల్లో మూడు చిరుతలు కనిపించాయి. పలుమార్లు రాత్రివేళల్లో కూడా కనిపించేవి. దూరం నుంచి గమనించి టార్చిలైట్ వేస్తే వెళ్లిపోయేవి. సోమవారం కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చా. సాయంత్రం వచ్చి చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా నా పొలం వద్దే బోనుకు చిక్కింది. మళ్లీ ఇప్పుడు మూడు చిరుతలు కనిపించడంతో భయంగా ఉంది. – ఏదుల బాలయ్య, రైతు మన్సూర్పల్లి -
దుఃఖాన్ని దిగమింగుకొని.. ‘పది’ పరీక్షకు హాజరు
మానవపాడు: అనారోగ్యంతో తండ్రి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. మానవపాడుకు చెందిన సమీర్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన తండ్రి కరీం(40) అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే సోమవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ఉండటంతో బాధలోనూ రాశాడు. మధ్యాహ్నం పరీక్ష ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియలకు హాజరవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరో ఘటనలోనూ.. అమరచింత: మండలంలోని నందిమళ్ల ఎక్స్రోడ్కు చెందిన జలేందర్ ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కాగా ఈయన కుమారుడు సాగర్ పుట్టెడు దుఃఖంలోనూ సోమవారం ఉదయం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాశాడు. అనంతరం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఉల్పరలో మరొకరు.. వంగూరు: మండలంలోని ఉల్పర జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష రాస్తున్న శివకృష్ణ తండ్రి ఆదివారం అనారోగ్యంతో మరణించాడు. అయితే తండ్రికి కర్మకాండ నిర్వహించాల్సిన శివకృష్ణ పరీక్ష రాసేందుకు రాకపోవడంతో ఉపాధ్యాయులు కొండల్రెడ్డి, గణేష్ వెంట తీసుకెళ్లి పరీక్ష రాయించారు. అనంతరం ఇంటికి వచ్చి తండ్రి కర్మకాండ శివకృష్ణ నిర్వహించాడు. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేసింది. -
సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం
● మినీ సరస్ మేళా ప్రారంభించినకలెక్టర్ ఖుష్బూగుప్తా ● శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్తో పాటు వారికి ప్రోత్సాహం కల్పించడమే సరస్ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గ్రామాభివృద్ధి సంస్థలు, నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘మినీ సరస్ మేళా‘ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ నెల 29 వరకు నిర్వహించనున్న మేళాను ప్రజలు పెద్దఎత్తున సందర్శించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎగ్జిబిషన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘాల ద్వారా సుమారు 50 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, డీఆర్డీఏ, నగరపాలక సంస్థ, ఇతర శాఖల అధికారులను కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎగ్జిబిషన్లో స్టాళ్లతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘భరోసా’, వైద్యారోగ్య శాఖ హెల్త్ క్యాంప్, బీసీ సంక్షేమ శాఖ, ఎస్బీఐ బ్యాంక్ స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీఆర్డీవోలు నరసింహులు, మొగులప్ప, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, నాబార్డు ఏజీఎండీఈ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మన్సూర్పల్లిలో మూడు చిరుతలు
గండేడ్: మండలంలో మరోమారు చిరుతలు కలకలం రేగింది. గతంలో ఒక చిరుత మాత్రమే పలుమార్లు దర్శనం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా మూడు చిరుతలు కంటపడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏవైపు నుంచి చిరుతలు దాడి చేస్తాయోనని తెలియక ప్రాణాలు అరచేత పట్టుకుని పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. సోమవారం చిరుతలు ఉన్నట్లు స్పంష్టంగా ఫారెస్టు అధికారుల ధ్రువీకరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. వివరాలిలా.. గండేడ్ మండలంలోని మన్సూర్పల్లి సమీపంలో రెడ్డిపల్లి రెడ్డిచెరువుకు చేరువలో బొందెగట్టు వద్ద మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. వారం రోజులు తరచుగా చిరుతలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మన్సూర్పల్లికి చెందిన రైతు ఏదుల బాలయ్య గమనించి సోమవారం ఉదయం ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంరోజులుగా చిరుతలు తిరగాడుతున్నాయని ఉదయం బయటికి వచ్చి గుట్టకిందికి వెళ్తాయని చెప్పాడు. అయితే తాము వాటిని చూస్తేగాని ధ్రువీకరించలేమని.. అవి బయటకు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ రైతు బాలయ్యకు సూచించాడు. దీంతో సోమవారం సాయంత్రం అవి గుట్టమీద గుండుపై బయట కూర్చోవడంతో వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్ మన్సూర్పల్లి బొందెగట్టుకు చేరుకొని ఏదుల బాలయ్య పొలం వద్ద నిలబడి గుట్టపై తిరుగాడుతున్న చిరుతలను గుర్తించారు. మూడు పెద్ద చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని రేంజర్ అబ్దుల్హైకి తెలుపడంతోపాటు జిల్లా ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. కనిపించిన చిరుతలు పెద్దవేనని వారు పేర్కొన్నారు. 2011లో ఇక్కడే చిక్కిన చిరుత 2011 మే11న మనూర్పల్లి ఏదుల బాలయ్య పొలం సమీపంలో చిరుత బోనుకు చిక్కింది. ఇదే రైతు అప్పట్లో చిరుత సంచారాన్ని గుర్తించి అప్పటి రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి బోను ఏర్పాటు చేస్తే వారంలోపే చిరుత బోనుకు చిక్కింది. దానిని తీసుకెళ్లి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టులో అప్పట్లో వదిలిపెట్టారు. తిరిగి చిరుతలు అదేప్రాంతంలో తిరుగాడుతుండడంతో అదే రైతు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఏదీఏమైనా ఫారెస్టు అధికారులు వీలైనంత త్వరగా చిరుతలు పట్టుకుని తరలించాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు కోరుతున్నారు. స్థానికుల సమాచారంతోగుర్తించిన ఫారెస్టు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం,నేడు బోను ఏర్పాటుకు సన్నాహాలు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అయిజ: ఈతకు వెళ్లి ఆరో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆదివారం ఉత్తనూరుకు చెందిన దర్శన్(11) గ్రామం పక్కనున్న బావిలో ఈతకొట్టడానికి వెళ్లి కనపడకుండా పోయాడు. రాత్రి వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు బావిదగ్గరకు వెళ్లి చూశారు. పోలీసులు, ఎండీఆర్ఎఫ్ బృందం రాత్రి 12గంటలకు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బావిలో పడి రైతు మృతి గోపాల్పేట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని తాడిపర్తిలో సోమవారం వెలుగు చూసింది. గోపాల్పేట ఎస్ఐ జగన్మోహన్ కథనం ప్రకారం.. తాడిపర్తికి చెందిన లక్ష్మి, శేషయ్య(50) భార్యాభర్తలు. గ్రామశివారులోని కిషన్రావుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం భార్య లక్ష్మి, ఆమె చిన్నకుమారుడు, మరొక యువకుడు కలిసి బావిలో వెతకగా శేషయ్య మృతిచెంది కనిపించాడు. కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతిచెంది ఉంటాడని, శేషయ్య మృతిపై ఎటువంటి అనుమానం లేదని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం మహమ్మదాబాద్: మండలంలోని నంచర్ల గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. గాధిర్యాల్కు చెందిన ఆముదాల హన్మయ్య(55) వార్డు మెంబరు మేసీ్త్రగా కూలీనాలి చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం ఆయన బైక్పై మహమ్మదాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా.. నంచర్ల గేటు సమీపంలో వెనక అతివేగంగా వస్తున్న యువకుల బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో హన్మయ్య తీవ్రగాయాలతో కిందపడిపోయాడు. కాలువిరగడంతోపాటు తలకు తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే అక్కడున్న వారు 108లో మహబూబ్నగర్కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. హన్మయ్య మృతితో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. శ్రీశైలం రహదారిపై.. వెల్దండ: మండల కేంద్రంలో హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. మండలంలోని చెరుకూరు చెందిన దొడ్ల రమేష్(36) కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో సమీప బంధువు అంత్యక్రియలకు బైకుపై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో వెల్దండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కిందపడ్డాడు. అనంతరం మరో వాహనం అతనిపై వెళ్లడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఉరేసుకుని యువకుడి బలవన్మరణం గట్టు: పొలంలో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కుర్వ మల్లేశ్ అలియస్ ఉలిగెప్ప(21) ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా ఉన్న విషయాన్ని చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సరోజమ్మ, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివాహిత ఆత్మహత్య అచ్చంపేట రూరల్: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. రెండో ఎస్ఐ ఇందిర తెలిపిన వివరాలు.. గోకుల్నగర్కు చెందిన శారద(38) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలో శనివారం తీవ్రంగా నొప్పి రావడంతో భరించలేక పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
జడ్చర్ల: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ కళాభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినా రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి, సంక్షేమం కన్పించడం లేదని విమర్శించారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి భారీ నీటిపారుదల ప్రాజెక్ట్లతో పాటు విద్య, వైద్య, వ్యవసాయ, తదితర రంగాల అభివృద్ధితో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, తదితర అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో రూ.3.50 లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి ఏంచేశారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆరు గ్యారంటీ హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు విస్మరించారని పేర్కొన్నారు. యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11 వేల ఉద్యోగాలు ఇచ్చి మోసగించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, మహేశ్, సతీష్, నాయకులు రాంమ్మోహన్, నాగిరెడ్డి, ఇమ్ము, తదితరులు పాల్గొన్నారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
● షెడ్డులో మహిళపై ఊడి పడిన ఫ్యాన్ మెట్టుగడ్డ: మహబూబ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన మహిళపై ఫ్యాన్ ఊడి పడటంతో గాయాలపాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రోజు వందలాది మంది వచ్చే కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంతో అంతా షాక్కు గురయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన కిందిగేరి స్వాతి అనే మహిళ కార్యాలయ ఆవరణలో గల షెడ్డులో కూర్చొని ఉండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి మహిళపై పడటంతో భుజం, కాలికి బలమైన గాయాలయ్యాయి. గాయాలైన మహిళను కనీసం కార్యాలయ సబ్రిజిస్ట్రార్, సిబ్బంది యోగక్షేమాలు అడగకపోవడం వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో అందించిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యంగా భూ సర్వే, రెవెన్యూ సంబంధిత సమస్యలు, గృహ నిర్మాణ పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, మున్సిపాలిటీ, పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై మొత్తం 90 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, జెడ్పీసీఈఓ డీపీఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని మోడల్ బేసిక్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్ తీసుకువెళ్లకూడదని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ కూలిపోవడాన్ని గమనించిన ఆమె వెంటనే దానిని తిరిగి నిర్మించాలని సూచించారు. అలాగే అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ పాఠశాలను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా మొత్తం 13,218 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 13,176 మంది హాజరవగా.. 18 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్తోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. -
ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలో ఆస్తిపన్ను, నల్లా బిల్లు లు, ట్రేడ్ లైసెన్స్ వ సూళ్లలో లక్ష్యం చేరుకో వాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. సోమవారం రాత్రి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉందని వీటి వసూలుకు అయిదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాత బకాయిలతో కలుపుకొని ఆస్తిపన్ను మొత్తం రూ.51.61 కోట్లకు గాను కేవలం రూ.19 కోట్లే వసూలు కావడమేమిటని మండిపడ్డారు. ఇంకా రూ.7 కోట్లు రాబట్టగలిగితేనే 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.27 కోట్ల గ్రాంట్ మంజూరవుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ పి.రామాంజులరెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, డీఈఈలు విజయ్కుమార్, నర్సింహ, హేమలత తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,889 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,889, కనిష్టంగా రూ.4,505 ధరలు లభించాయి. అలాగే కందులు గరిష్టంగా రూ.6,511, కనిష్టంగా రూ.5,569, జొన్నలు గరిష్టంగా రూ.5,777, కనిష్టంగా రూ.4,127, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,050, కనిష్టంగా రూ.4,777 చొప్పున వచ్చాయి. -
పిచ్చికుక్కలు దొంగలు..
చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా వెల్లడించారు. దీనిపై మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం కుక్కలకు హాని చేయడం, చంపడం వంటి చర్యలకు పాల్పడటం దానికి అనుమతి లేదన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ అధికారులతో కలిసి సమస్యకు పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. 31న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 31న స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఎఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చేవా రు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పది పాస్ట్పోర్ట్ ఫొటోలు, తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాలల నుంచి 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సునీల్కుమార్ అథ్లెటిక్స్ కోచ్ (94406 56162)ను సంప్రదించాలని సూచించారు. 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 20వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై, 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో విద్యార్హత, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కేంద్రం ఇన్చార్జి రవీందర్రెడ్డి (94407 88502)ను సంప్రదించాలని కోరారు. 31న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 31న స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఎఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చేవా రు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పది పాస్ట్పోర్ట్ ఫొటోలు, తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాలల నుంచి 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సునీల్కుమార్ అథ్లెటిక్స్ కోచ్ (94406 56162)ను సంప్రదించాలని సూచించారు. 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 20వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై, 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో విద్యార్హత, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కేంద్రం ఇన్చార్జి రవీందర్రెడ్డి (94407 88502)ను సంప్రదించాలని కోరారు. -
రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం
● 24 నుంచి 29వ తేదీ వరకు ఉత్సవాలు ● 27న సీతారాముల కల్యాణోత్సవంఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 24 నుంచి 29వ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆదివారం తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 24న కోయిల్ఆళ్వార్ తిరుమంజనం, అంకురార్పణ, 25న ధ్వజారోహణం, శ్రీలక్ష్మీహయగ్రీవ హోమం, 26న శ్రీ ధన్వంతరీహోమం, శ్రీసుదర్శన హోమం, 27న సీతారాముల కల్యాణోత్సవం, రథోత్సవం, 28న శ్రీ రాముడి సామ్రాజ్య పట్టాభిషేకం, ఐశ్వర్యప్రాప్తి, మహాలక్ష్మీ హోమం, 29న చక్రస్నానం, మహా పూర్ణాహుతి, పుష్పయాగం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు హాజరై ఉత్సవాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. -
గొర్రెల దొంగ బీభత్సం
● పట్టుకునే ప్రయత్నంలో హెడ్కానిస్టేబుల్కు గాయాలు ● కారు వదిలి పారిపోయిన నిందితుడు ● కారులో కత్తి, సెల్ఫోన్ స్వాధీనం మాగనూర్: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్కు అతిసమీపంలో గొర్రెల దొంగలు బీభత్సం సృష్టించారు. వారి పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ను తోసివేయడంతో గాయాలైన ఘటన శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పి.అశోక్బాబు వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తపల్లి క్రాస్రోడ్డు వద్ద మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన కొందరు తమ గొర్రెల మంద ఆపి పడుకున్నారు. ఈ క్రమంలో డయల్ 100 సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా గొర్రెల అలజడి కనిపించి అనుమానం వచ్చి అటు వెళ్లగా.. ఓ వ్యక్తి గొర్రెలను అపహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారు దొంగను పట్టుకునేందుకు వెళ్లగా అతడు సమీపంలో నిలిపి ఉంచిన కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. డయల్ 100 సిబ్బంది ఎస్ఐతో కలిసి కారును వెంబడిస్తూ కర్ణాటక రాష్ట్రం దేవసూగురుకు వెళ్లగా.. నిందితుడు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ప్రతిదాడికి దిగడంతో దొంగ మళ్లీ మాగనూర్ వైపు రావడంతో ఎస్ఐ మాగనూర్ పోలీస్స్టేషన్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి జాతీయ రహదారిపై లారీ, బస్సును అడ్డుగా ఉంచారు. దీంతో దొంగ తప్పించుకునే ప్రయత్నంలో బస్సును కారుతో వేగంగా ఢీకొట్టాడు. అనంతరం కారు దిగి పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్కానిస్టేబుల్ ఉమేష్గౌడ్ను దొంగ బలంగా రోడ్డుపై తోసివేయడంతో ఆయనకు తల, చేతికి గాయాలయ్యాయి. దొంగ పక్కనే ఉన్న చెరువులోకి దూకి పారిపోయాడు. చాలా సేపు చెరువు పరిసరాల్లో వెతికినా దొంగ జాడ దొరకలేదని ఎస్ఐ తెలిపారు. దొంగ వినియోగించిన కారును స్వాధీనం చేసుకోని నంబర్ ప్లేట్పై వేసిన బ్లాక్ స్టికర్ను తొలగించారు. కారులో ఓ సెల్ఫోన్తో పాటు కత్తి లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. హెడ్కానిస్టేబుల్ను గాయపర్చడంతో పాటు దొంగతనానికి యత్నించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సేంద్రియ సేద్యమే లాభసాటి
సిద్దమైన వర్మీకంపోస్టు ఎరువు జనుము సాగు పాడి–పంట అలంపూర్: వ్యవసాయం పూర్వం సేంద్రియ ఎరువుల ద్వారానే జరిగేది. పూర్వికులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించకుండానే సేంద్రియ ఎరువులపై ఆధారపడేవారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతోపాటుగా రసాయనాల వినియోగించుకోవాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడుతూ.. దిగుబడులు పెంచుకోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సేంద్రియం ద్వారా పంటల సాగు ఎంతో నయంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ సూచిస్తున్నారు. వీటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. రసాయనాల వాడకంతో..! సాగులో బస్తాల కొద్ది రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకోనే స్థాయి పంటలను ఆశించే పురుగుకు పెరుగుతుంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అన్నీ పంటకు అధికంగా వాడకంతో వాటిని తట్టుకోనే స్థాయి పురుగులు, తేగుళ్లు కాలక్రమేన అధికమైపోతాయి. వీటి వినియోగం అధికంగా ఉంటే సాగు ఖర్చు విపరితంగా పెరుగుతుంది. ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి. సరైన అవగాహన లేకుండా రసాయనాల వాడకం వల్ల వాటి అవశేషాలు నీటిలో, సాగు నేలలో కలిసి కలుషితమవుతాయి. నష్టాలు–సూచనలు : మితిమీరిన రసాయనాల వాడకంతో మిత్ర కీటకాలు నశించి పర్యావరణంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి. వ్యవసాయంలో పురుగుల మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్లో పోటీకి మన ప్రాంత రైతులు నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. పంట ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించేలా సాగు చేసుకోవాలి. సేంద్రియ విధానం: సాగులో లింగాకర్షక బుట్టలు వాడాలి. పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి. గంధకం, రాగి ఉత్పత్తులు వాడవచ్చు. వృక్ష సంబంధం నూనెల్ని కొన్ని జాగ్రత్తలతో వాడాలి. వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీకంపోస్టు ఎరువులను వాడాలి. పంట వ్యర్థాలు, కొబ్బరి వ్యర్థాలు, షజొల్లా ఉపయోగపడేవే. పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులతోనే సాధ్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయ చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులైన వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు, కోళ్ల ఎరువు, పచ్చి ఆకులు, పిండి చెక్కలు వాడాలి. నాణ్యమైన రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండే వర్మీ కంపోస్టు బెడ్స్నూ రూ.5వేల సబ్సీడిపై రైతులు పొందవచ్చు. వ్యవసాయ శాఖ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలను రూ.5శాతం సబ్సీడీపై అందిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి...! అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రియ ఎరువులు నిలవాలంటే నిబంధనలు పాటించాల్సిందే. మన ప్రాంతంలోని నేలల్లో సేంద్రియ కర్భణం చాలావరకు తగ్గిపోయి దిగుబడుల్లో రైతులు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల ఒకశాతం కార్బనం ఉన్నట్లు తెలుస్తోంది. సేంద్రియ కర్బనం పెంచడానికి కృషి చేయాలి. సేంద్రియ సాగు ద్వారా ఆహార ఉత్పత్తులు సాధించాలంటే ప్రపంచ దేశాలతోపాటు మన ప్రాంతంలో కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల కమతాల్ని పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి కొన్ని ప్రమాణాలను ప్రభుత్వం నిర్ధేశించడం జరిగింది. ఆ జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఏదైనా ఆహార ధాన్యాలు సేంద్రియ ఉత్పత్తిగా గుర్తించాలంటే సాగులో అనేక ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయ ఉద్యమాల అతర్జాతీయ సమాఖ్య కొన్ని సాగు ప్రమాణాలను సూచించింది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు మృతి
● ట్రాక్టర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం గట్టు: రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను చీకటిలో బైకు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక యువకులు మృతి చెందిన ఘటన బల్గెర సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. కర్నూలు– రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి బల్గెర సమీపం(అయిజ వైపు)లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు తిమ్మప్ప(35), ఓగులప్ప(40)లు మృత్యువాత పడ్డారు. మాచర్లకు చెందిన ట్రాక్టర్ యజమాని ముక్కెరయ్య చిన్నోనిపల్లెలో కంకర అన్లోడ్ చేసి మాచర్లకు బయలు దేరాడు. బల్గెర సమీపంలో కాల్వకు కొద్ది దూరంలో చీకట్లో ఓ కారు ఆగి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న క్రమంలో ట్రాక్టర్ను రోడ్డు పక్కనే ఆపి, కారులో ఉన్న వారికి సహాయం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కర్ణాటకలో దేవనపల్లెకు చెందిన తిమ్మప్ప, ఓగులప్ప వరి కోతలకు సంబంధించి అయిజ మండలం తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రైతులను కలసి వరికోత మిషన్ను తీసుకొచ్చేందుకు స్వగ్రామం దేవనపల్లెకు బైకుపై బయలు దేరగా బల్గెర వద్ద కాల్వకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన నిలిచిన ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరు అక్కడకక్కడే మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను గద్వాల ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. -
కంటైనర్ ఢీకొని డీసీఎం హెల్పర్ మృతి
రాజాపూర్(బాలానగర్): కోళ్లలోడ్తో ముందు వెళ్తున్న డీసీఎంను వెనక నుంచి ఓ కంటైనర్ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలైన హెల్పర్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున బాలానగర్ మండల శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా.. వరంగల్ టౌన్కు చెందిన డీసీఎం డ్రైవర్ మహేశ్, హన్మకొండకు చెందిన అరవింద్(24) హెల్పర్ స్నేహ కోళ్లఫాంలో పనిచేస్తూ శనివారం అనంతపురంలో కోళ్లఫాంలో కోళ్లను లోడ్ చేసుకుని హైదరాబాద్కు వస్తుండగా.. ఆదివారం వీరు వెళ్తున్న ఢీసీఎంను వెనక నుంచి ఓ కంటేనర్ ఢీకొనడంతో డ్రైవర్ మహేశ్ గాయాలు కాగా.. హెల్పర్ అరవింద్ తీవ్ర గాయాలతో డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయాడు గమనించిన స్థానికులు అరవింద్ను క్యాబిన్లో నుంచి బయటికి తీసి షాద్నగర్లోని బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతిచెందినట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. డీసీఎం డ్రైవర్ మహేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం గద్వాల క్రైం: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని నదిగ్రహారం కాలనీకి చెందిన తెలుగు మునిస్వామి (48) మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపం చెంది ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలోని పిల్లిగుండ్ల కాలనీ శివారులో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కోడేరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ని వాసముంటున్న ఎరుకలి వెంకటయ్య(40) తన ఇంటి వద్ద ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నీళ్లు పట్టేందుకు మోటార్ స్విచ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతు డికి భార్య బాలీశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. మహిళ ఆత్మహత్య మక్తల్: ఉరివేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మండలం బోందల్కుంటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామా నికి చెందిన దాసరి లావణ్య (32)కూలీ చేసుకొని జీవనం గడుపుతుండేది. ఎప్పటిలాగానే కూలీ పని ముగించుకొని సాయంత్రం శనివారం ఇంటికి చేరుకుంది. ఆదివారం లావణ్య ఇంకా ఇంటి తలుపులు తెరువకపోవడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని తలుపులను విరగొట్టారు. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు పిల్లలున్నారు. మృత్యురాలి తల్లి దాసరి రేవతమ్మ ఫిర్యాదు మేర కు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. ఉరేసుకొని యువకుడి బలవన్మరణం వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల తూర్పుతండాకు చెందిన నానావత్ యాదగిరి (సిద్ధార్థ్) హైదరాబాద్లోని శివరాంపల్లిలో శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుతండాకు చెందిన నేనావత్ గోపాల్నాయక్, మణెమ్మ దంపతులు కుమారుడు యాదగిరి (25)తో కలిసి హైదరాబాద్లోని శివరాంపల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదగిరి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్లగా యాదగిరి ఉరేసుకున్నట్లు గుర్తించారు. కిందకు దింపి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ముహూర్తాన్ని అడ్డుకున్న అధికారులు లింగాల: మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం చేసేందుకు ముహూర్తం పెట్టుకుంటున్నట్లు చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందడంతో అధికారులు వచ్చి ముహూర్తాన్ని అడ్డుకున్నారు. నాగర్కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు యశ్వంత్, ప్రమీల గ్రామానికి చేరుకొని 18 ఏళ్లు నిండని బాలికకు పెళ్లి ముహూర్తం పెట్టడాన్ని చూశారు. అధికారులు పూజారి, తల్లిదండ్రులను హెచ్చరించారు. మైనర్లకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని, 2006 బాల్య వివాహాల నిషేధ చట్ట ప్రకారం రెండేళ్ల శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బాలికతోపాటు కుటుంబ సభ్యులతో అంగీకార పత్రం తీసుకోవడంతో ముహూర్తానికి అడ్డుకట్ట పడింది. -
డిండి.. ఆశల గండి
ప్రాజెక్టు అలుగు పారుతున్నా కాల్వలో పారని నీరు ● గువ్వలోనిపల్లి సమీపంలో పూడుకుపోయిన మట్టి కాల్వ ● సాగునీరు వృథా అవుతున్నా పట్టించుకోని వైనం ● ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు కుడి కాల్వ పనులు నాసిరకంగా చేపట్టారు. తీగలకుంట కింద సిమెంట్ కాల్వ ఎత్తు తక్కువగా ఉండడంతో నీరు పై నుంచి పారుతోంది. గువ్వలోనిపల్లి సమీపంలో కాల్వ సరిగా లేకపోవడంతో నీరు ముందుకెళ్లడం లేదు. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం తీసిన కుడి కాల్వ కింద ఇప్పటివరకు ఒక్క పంట సరిగా పండించుకోలేదు. కాల్వలో మొత్తం చెట్లు పెరిగాయి. మరమ్మతు చేసే వారే కరువయ్యారు. ఒక పక్క డిండి ప్రాజెక్టు అలుగు పారుతున్నా మాకు మాత్రం సాగునీరు అందడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రైతుల కష్టాలు తీర్చాలి. – వడ్డె బాల్రాం, ఆయకట్టు రైతు, వడ్డెర గుడిసెలు ●ఉప్పునుంతల: జిల్లా సరిహద్దులోని డిండి ప్రాజెక్టు ఆరు నెలల నుంచి అలుగుపారుతున్నా.. అధికారుల అలసత్వంతో కుడి కాల్వ వెంట సాగునీరు అందక మండలంలోని లత్తీపూర్, వడ్డెర గుడిసెలు, గువ్వలోనిపల్లికి చెందిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం కుడి కాల్వ తవ్వినా ఇప్పటివరకు ఆయకట్టు కింద ఒక్క పంట కూడా పండలేదు. సాగునీటి కాల్వను నల్గొండకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తుండడంతో వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించినా ఫలితం లేకపోవడంతో సాగునీటిపై రైతులు పెట్టుకున్న ఆశలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కృష్ణా: మండలంలోని కృష్ణానది నుంచి ట్రాక్టర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తుండడంతో ఆదివారం టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై ఏఎస్ఐ యాదయ్య మాట్లాడుతూ గుడెబల్లూర్ శివారులోని కృష్ణానది నుంచి అనుమతులు లేకుండా తిమ్మప్ప, సాయికిరణ్, నరసింహా, వెంకటేష్ ఇసుకను తరలిస్తుండడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అదే విధంగా మండలంలోని ముడుమాల్ గ్రామంలోని యాదవేంద్ర మఠం సమీప ప్రాంతం నుంచి సెలవు రోజు వచ్చిందంటే చాలు గ్రామంలో ట్రాక్టర్లు అన్ని కూడ కృష్ణానదిలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మాగనూర్: మండల పరిధిలోని నేరడగం గ్రామ పెద్దవాగు దగ్గర అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం దుప్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ నేరడగం పెద్దవాగు నుంచి ఇసుకను మక్తల్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో ముందస్తు సమాచారం మేరకు పట్టుకొని ట్రాక్టర్ను స్టేషన్కు తరలించామన్నారు. ఇసుక రవాణాలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. ఇసుక డంపులు సీజ్ ఊట్కూర్: మండలంలోని సమస్తాపూర్ వాగు శివారులో నిల్వ చేసిన ఇసుక డంపులను ఆదివారం ఆర్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్ఐ సంజీవయ్య, చెన్నకేశవులు తదితరులు ఉన్నారు. -
వేగంగా.. తగ్గుముఖం
కృష్ణానదిలో భారీగా పడిపోతున్న బ్యాక్ వాటర్ లెవల్స్ ● శ్రీశైలం డ్యాంలో 837 అడుగుల ఎత్తులో నీటిమట్టం ● గతేడాది కంటే నెలరోజులు ముందుగానే తగ్గుముఖం ● వచ్చేనెలలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశం ● ఇప్పటి వరకు 33 టీఎంసీలు పంపింగ్ నీటి ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 60 టీఎంసీల నీటినిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగితే కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో కేఎల్ఐలోని మూడు మోటార్ల ద్వారా 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రతిరోజు రెండు మోటార్లను నడిపిస్తున్నారు. 805 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తే మోటార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే 810 అడుగుల వరకు మాత్రమే కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. మోటార్లపై భారం పడకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి తాగునీటిని అందించడంతో పాటు సాగు అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్: కృష్ణానదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపడుతుండటంతో కొ న్ని రోజులుగా బ్యాక్ వాటర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు కేఎల్ఐ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు విరామం లేకుండా సాగుతున్నాయి. ఇ దే తరహాలో నీటిమట్టం తగ్గితే.. వచ్చే నెలలో ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 837 అడుగుల దిగువకు.. గతేడాది మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్ 850 అడుగులకు పైగానే ఉంది. ఏప్రిల్లో బ్యాక్ వాటర్ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే బ్యాక్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో రోజుకు 1 నుంచి 1.5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్ లెవెల్స్ 837 అడుగులకు చేరుకుంది. నెలాఖరు వరకు ఇంకా తగ్గనుంది. మోటార్లకు మరమ్మతు.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్లోనే ఎత్తిపోతలు ఆగితే ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు మరమ్మతులు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే పంపుహౌజ్లోని రెండు మోటార్లు పాడయ్యాయి. మిషన్ భగీరథ కోసం విరామం లేకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండటంతో.. వాటికి మరమ్మతు చేయడం వీలు కా వడం లేదు. అయితే ఈ ఏడాది నార్లాపూర్ రిజర్వాయర్లో ఉన్న నీటిని మిషన్ భగీరథకు మళ్లించి.. కేఎల్ఐ మోటార్లకు మరమ్మతు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. కేఎల్ఐ అప్రోచ్ కెనాల్లో పారుతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్ -
మిగిలింది 9 రోజులే..
● గడువు దగ్గర పడుతుండటంతో వేగం పెంచిన అధికారులు ● ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్ ● పుర ఎన్నికలు, సిబ్బంది కొరతతోనే జాప్యం ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానే పన్నుల వసూళ్లు ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు. -
రైతుభరోసా నిధులు సద్వినియోగం చేసుకోండి
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు రైతుభరోసా నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి, అనంతరం రైతు భరోసా నిధుల విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 48 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,15,923 మంది రైతులకు రూ.104,77,74,728 విడతల వారీగా 45 రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలోని 2,15,923 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున తొలి విడత నిధులు సోమవారం వారి ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. రైతులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని యాసంగి పంటలను లాభదాయకంగా సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మినీ ట్యాంక్బండ్గా ఊరచెరువు
● రూ.కోటి11లక్షలతో అభివృద్ధి పనులు ● శంకుస్థాపన చేసిన ఎంపీ అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ● హర్షం వ్యక్తం చేస్తున్న పాతబజార్ వాసులు జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని పాతబజార్ పోచమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న ఊరచెరువుకు మహార్దశ పట్టనుంది. అమృత్ 2.0, రాష్ట్ర ప్రభుత్వం, యూఎల్బీ సంయుక్త నిధుల ద్వారా చెరువును మినిట్యాంక్బండ్గా మార్చేందుకు రూ.కోటి11లక్షలు కేటాయించారు. ఈ నిధులకు సంబంధించి శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మ ఆలయం వద్ద ఉన్న ఊరచెరువును పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా పోరాటాలు జరిగాయి. దశాబ్దం కిందట చెరువులో ప్లాట్లు వెలియడంతో పాతబజార్వాసులు ప్రస్తుత కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్, జీనురాల సత్యంతోపాటు మరికొందరు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు చేశారు. చెరువులో ప్లాట్లు చేయడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతాయని ఆందోళనలు చేశారు. వీరికి స్థానికుల నుంచి మద్దతు లభించింది. ఆ నేపథ్యంలోనే అప్పటి కలెక్టర్ ప్రియదర్శిని చెరువును సందర్శించి ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కట్టను పునఃరుద్ధరింపజేశారు. అప్పటినుంచి ఏదో సందర్భంలో చెరువు సమస్య వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల వరదనీటి కాల్వల నిర్మాణం చేస్తున్న సమయంలో అలుగునీరు వెళ్లే ప్రాంతంలో కాలువ నిర్మాణం చేయకుండా కొందరు తమ ప్లాట్లు ఉన్నాయని అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కాల్వ నిర్మాణం వైపు మొగ్గుచూపటంతో సమస్య సద్దుమణిగింది. పాతబజార్ వాసుల హర్షం ఊరచెరువును మినీట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తుండటంపై పాతబజార్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోచమ్మ ఆలయం వద్ద చెరువు మురుగు లేకుండా శుభ్రం అవుతుందని, నిధులు కేటాయించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అభివృద్దే లక్ష్యంగా.. అభివృద్ధే లక్ష్యంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి అమృత్ ద్వారా కేంద్రం నిధులు కేటాయిస్తుందని, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు కేటాయించింది. అందులో భాగంగానే ఊరచెరువు మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. రూ.45కోట్లతో జడ్చర్ల మున్సిపల్లో నీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాం. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. – డీకే అరుణ, పార్లమెంట్సభ్యురాలు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.14కోట్లతో వరద కాలువలు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర సహకారంతో ఊరచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీని ముందుకు తీసుకువెళ్తా. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల మినీట్యాంక్బండ్ ఊర చెరువు మినీట్యాంక్ బండ్గా మార్చాలని అనేక ఏళ్లుగా ప్రతిపాదనలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మినీట్యాంక్ బండ్ ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయి. అమృత్ 2.0లో రూ.45లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.45లక్షలు, యూఎల్బీ నిధులు 21లక్షలు కేటాయించారు. శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం, ఆయాపార్టీల నాయకులు పాల్గొన్నారు. -
‘సిర్సనగండ్ల’ ఆలయ అభివృద్ధికి కృషి
● రూ.2 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు చారకొండ: రాష్ట్రంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేసి మరిన్ని నిధులతో అన్నిరకాలుగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే మరో రూ.కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజాపాలనలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తామని చెప్పారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను మంత్రి, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమ, ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు, సర్పంచ్ రామస్వామి, ఉపసర్పంచ్ సురేందర్రెడ్డి, నాయకులు బాల్రాంగౌడ్, వెంకట్గౌడ్, వెంకటయ్యయాదవ్, జైపాల్, గణేష్గౌడ్, వెంకటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వటువర్లపల్లి రీలొకేషన్కు అనుమతి
మన్ననూర్/అమ్రాబాద్: అటవీ సరిహద్దు ప్రాంత గ్రామాల పునరావాసంలో భాగంగా రెండవ ఫేజ్లో ఉన్న వటువర్లపల్లి గ్రామాన్ని తరలించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి (పీసీసీఎఫ్) సువర్ణ తెలిపారు. శనివారం అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి నుంచి పునరావాసం కోరుకునే లబ్ధిదారులను అటవీశాఖ అధికారులతో కలిసి ఆమె కలిశారు. గ్రామంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం రీలొకేషన్పై గ్రామస్తులతో చర్చించారు. మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల గ్రామాల్లోని కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసం పనులు ఇదివరకే ప్రారంభమైన విషయాన్ని తెలియజేశారు. రెండవ విడతలో వటువర్లపల్లిలోని సుమారు 670 కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కేటాయించనున్నట్లు వివరించారు. పులు ల రక్షిత అభయారణ్యంలో జన సంచారం ఉండకూడదనే నిబంధనలను అనుసరిస్తూ.. పునరావాసం అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవంలో భాగంగా మద్దిమడుగు రేంజ్ పరిధిలోని చింతలమట్ట, సోమచెల్క, ఇసుక రేగడి, గద్దలసరి, మన్ననూర్ రేంజ్ పరిధిలోని గుండం, పర్హాబాద్ వ్యూ పాయింట్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ నుంచి విడిచిన 60 మచ్చలజింకలను పరిశీలించారు. రివర్ పెట్రోలింగ్, అటవీ సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను సిబ్బందితో తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్డీ సునీల్, డీఎఫ్ఓ రోహిత్ చంద్ర, ఎఫ్డీఓ రామ్మూర్తి, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డీఓ రామ్మోహన్, ఎఫ్ఆర్ఓ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణ ం
మిడ్జిల్: కారు బైకును ఢీకొట్టిన ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాణిపేట్ గ్రామానికి చెందిన బోయ మల్లేశ్(31) బైకుపై జడ్చర్ల వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో కొత్తపల్లి గ్రామ శివారులో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని మల్లేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రేణుక, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేణుక రాణిపేట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి కోస్గి రూరల్: అత్తగారింటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలంలోని కుదురుమళ్ల గ్రామానికి చెందిన దేవరకొండ భీమానందం (35)కు ఇద్దరు భార్యలు. పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకోగా ఆమెకు కుమార్తె ఉన్నారు. అనంతరం ఈర్లపల్లి గ్రామానికి చెందిన సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగను పురస్కరించుకొని రెండో భార్య సంగీత గ్రామమైన ఈర్లపల్లికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి కోస్గి బయలుదేరగా.. మార్గమధ్యలో సర్జఖాన్పేట్ గ్రామ శివారులోని బ్రిడ్జి సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకోని క్షతగాత్రుడిని కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రెండో భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. శనివారం పోస్టుమార్టం ఆనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించగా.. సొంత గ్రామమైన కుదురుమళ్లలో అంతక్రియలు చేపట్టారు. నీరు తాగేందుకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి కొత్తకోట రూరల్: నీరు తాగేందుకు బావి దగ్గరకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని నాటవెళ్లి పెద్దతండాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, తండావాసులు తెలిపిన వివరాల మేరకు నాటవెళ్లిపెద్దతండాకు చెందిన ముడావత్ బుజ్జినాయక్ (58) తన మేకలను మేత కోసం శుక్రవారం ఉదయం తండా శివారులోని పొలాల్లోకి వెళ్లాడు. సాయంత్రమే మేకలు ఇంటికి వచ్చినా.. బుజ్జినాయక్ మాత్రం రాత్రయిన ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వెతకగా.. గ్రామ శివారులోని ఓ బావి వద్ద నీళ్ల బిందె, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులతో కలిసి బావికి రెండు మోటార్లను బిగించి నీటికి బయటకు తోడారు. దీంతో బావిలో బుజ్జినాయక్ మృతదేహం లభ్యమైంది. నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుజ్జినాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డుప్రమాదంలో బాలుడి దుర్మరణ ం ● మరో బాలుడికి తీవ్ర గాయాలు మరికల్: కారు ఢీకొని ఓ బాలుడు మృతిచెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం మరికల్ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరికల్కు చెందిన సాయినాథ్రెడ్డి, మరో బాలుడు రిషివర్ధన్రెడ్డి బైక్పై పొలానికి వెళ్తుండగా.. ఆత్మకూర్–కన్మనూర్ క్రాసింగ్ వద్దకు రాగానే మరికల్ నుంచి ఆత్మకూర్ వైపు వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. కారు మూడు పల్టీలు కొట్టి నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడి నుంచి వస్తున్న ఎస్ఐ రాము ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలను అంబులైన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రిషివర్ధన్రెడ్డి పరి స్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు కన్నీళ్లు తెప్పిస్తున్నా యి. కారులో బెలున్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సాయికిరణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. -
18 క్వింటాళ్ల పత్తి దగ్ధం
మానవపాడు: మండల కేంద్రంలో బింగిదొడ్డి గ్రామానికి చెందిన సునీల్రెడ్డి పత్తి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు దట్టంగా వ్యాప్తి చెందడంతో దాదాపు 6 ఎకరాల్లో 18 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. దీంతో బాధిత రైతుల లబోదిబోమని వేడుకుంటున్నాడు. కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తుండగా పంట మొత్తం కాలి బూడిదైందని, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విద్యార్థి బలవన్మరణం తెలకపల్లి: మండల కేంద్రానికి చెందిన డీఎంఎల్టీ విద్యార్థి సామ శివ (22) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నరేశ్ వివరాల మేరకు.. మృతుడు సామ శివ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డీఎంఎల్టీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన అతడు.. తన మనసు బాగోలేదని ముభావంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి రాంచంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. -
తాడిపర్తి చెరువులో మొసలి కలకలం
గోపాల్పేట: మండలంలోని తాడిపర్తి చెరువు నుంచి శనివారం మొసలి ఒడ్డుకు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొసలిని చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఆరు నెలల క్రితం మొసలి తాడిపర్తి చెరువు ఒడ్డుకు రాగా.. ప్రజలు స్నేక్ సొసైటీ ఫౌండర్ క్రిష్ణసాగర్కు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి వచ్చేలోపు చెరువులోకి వెళ్లిపోయింది. శనివారం ఉదయం మరోసారి మొసలి బయటికి రావడంతో స్థానికులు కేకలు వేయడంతో మళ్లీ చెరువులోకి వెళ్లిపోయింది. మొసలి పెద్దగా ఉందని చిన్నపిల్లలు, పెద్దలు ఎవరూ ఈతకు వెళ్లడం, పశువులను నీళ్లకు తీసుకువెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని మొసలిని పట్టుకుని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. కల్వరాలలో.. వీపనగండ్ల: మండలంలోని కల్వరాల అమ్మ చెరువులో మొసలి సంచరిస్తుండడంతో సమీప పంట పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువులో సంచరిస్తున్న మొసలి రాత్రి వేళలో సమీప పంట పొలాల్లోకి వచ్చి నివాసం ఉటుండంతో ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందోనని పలువురు రైతులు పొలా లకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మొసలిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని, చెరువు సమీపంలో హెచ్చరిక బో ర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
లాభసాటిగా అల్లం పంట సాగు
అలంపూర్: వ్యవసాయంలోను నూతన పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల సాగులో వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కడానికి అన్నదాతలు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రికరిస్తున్నారు. ఆ కోణంలోనే అల్లం పంట సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. వరి కంటే తక్కువ నీటి వినియోగంతో అల్లం పంట సాగు చేసే అవకాశం ఉండటంతో అనేక మంది రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు అల్లం పంట సాగుకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనువైన నేలలు అల్లం సాగుకు ఎర్ర నేలలు అనువుగా ఉంటాయి. నీరు నిల్వ ఉండని నేలలు అయితే సాగుకు అనుకూలం. వరి సాగుతో పోల్చితే నీటి వినియోగం చాలా తక్కువ. ఒక ఎకరా పొలంలో వరి సాగు చేయడానికి కావాల్సిన నీటితో ఒక్కటిన్నర ఎకరంలో అల్లం సాగు చేసుకొనే వెసలుబాటు ఉంటుంది. పంట కాలం అల్లం పంట ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో చేతికి అందుతుంది. దుక్కి ఇలా... అల్లం సాగులో దుక్కి చాలా ముఖ్యమైనది. దుక్కిని 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 ట్రక్కుల బాగా చిలికిన పశువుల ఎరువు, 150 కిలోల సూపర్, 30 కిలోల పొటాష్ వేసుకోవాలి. కనీసం 30 సెంటీమీటర్ల ఎత్తు, బొదె పైభాగం, 90 సెంటీమీటర్లు ఉండేలా 4 అడుగుల వెడల్పుతో బొదెలు తయారు చేసుకోవాలి. నీటి తడుల కోసం బొదెల మధ్య ఇన్లైన్ డ్రిప్ అమర్చుకోవాలి. విత్తన మోతాదు ఎకరానికి 1000 కిలో విత్తనం అవసరం అవుతుంది. 20 రోజుల పాటు కుప్పగా వేసి మండె కట్టాలి. మండె కట్టిన 20 రోజుల తర్వాత విత్తిన దుంపలు చిన్న చిన్న మొలకలు రాగానే వాటిని 30 గ్రామాల బరువు ఉండేలా కత్తిరించాలి. వీటిని లీటర్ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల క్లోరోఫైరిపాస్ కలిపి 30 నిమిషాలు నానబెట్టి భూమిలో విత్తాలి. విత్తిన 3–5 వారాల్లో పూర్తిగా మొలక వస్తోంది. ప్రతి రోజు 6 గంటల పాటు డ్రిప్తో నీటిని అందించాలి. విత్తే సమయం సాధారణంగా రైతులు జూన్ మాసంలోనే అల్లం పంట సాగు చేసుకోవచ్చు. నీటి పారుదల ఉంటే ఫిబ్రవరిలో లేదా మార్చి నెలలో నాటుకున్న ఉత్తమమైనదే. తెగుళ్ల యాజమాన్యం : అల్లం సాగులో ప్రధానంగా దుంప కుళ్లు తెగులే, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. వీటి వలన 30 నుంచి 50 శాతం వరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దుంప కుళ్లును గుర్తించినట్లయితే మెటలాక్సిల్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి వేరు ప్రాంతం తడిచేలా పోయాలి. ఈ విధంగా పది రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. వేడి గాలుల నుంచి రక్షణ : అల్లం మొలకెత్తిన తర్వాత బొదెలకు రెండు వైపులకు కింది భాగంలో 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కజొన్న నాటుకోవాలి. దీని వలన పిలక దశలో అల్లం పంటను వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చ. దిగుబడి : ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.30 వేల వరకు పలుకుతోంది. పాడి–పంట అల్లంలో మారన్ విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీనిని కేరళ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. మహావ రకం మహరాష్ట్రలో లభి స్తోంది.ఇవేకాక కేరళలో ఎర్నాడ్, వేనాడ్, కరు ప్పం పాడి, నడియా రకాలు ప్రసిద్ధిగాంచినవి. పిలక దశలో మొదటి నాలుగు నెలలు యూరియా, 20:20 ఎరువులు రోజు మార్చి రోజు డ్రిప్ ద్వారా అందించాలి. దుంప ఎదుగుదల దశలో 13:0:45 ఎరువులను 3 నుంచి 5 నెలల వరకు ప్రతి నెల ఒకసారి ఇవ్వాలి. వీటితోపాటు మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్ ఇవ్వాలి. -
దేవరగుట్టలో మరోసారి చిరుత హల్చల్
నవాబుపేట: గతేడాది దాదాపుగా నెలరోజులపాటు దేవర గుట్టలో తిష్ట వేసిన చిరుత అప్పట్లో అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసిన వాటికి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. కాగా నెలరోజులు ఇక్కడే మకాం వేసిన చిరుత రోజూ సాయంత్రం జాగింగ్కు వచ్చినట్లు వచ్చి గుట్టలోని గుండ్లపై సేదతీరుతూ అందరికీ కనపడేలా కూర్చునేది. కాగా అప్పట్లో కనిపంచకుండా పోయిన చిరుత మరోసారి దర్శనం ఇచ్చింది. అదే దేవరగుట్టలో గుండ్లపై తీరుగుతూ శనివారం యన్మన్గండ్ల గ్రామస్తులను ఆందోళనకు గురి చేసింది. దర్జాగా గుండ్లపై గంతులు వేస్తూ చిరుత హల్చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. కాగా ఇప్పటికే ఒక లేగదూడ మృతి చెందితే చిరుత తీన్నదన్న అనుమానంతో అక్కడివారు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయిన అధికారు లు పట్టించుకోలేదు. తాజాగా చిరుతనే గుట్టపై కనిపించడంతో మరోసారి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చిరుతను బంధించి గ్రామస్తుల భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది. పిల్లిగుండు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం హన్వాడ: మండలంలోని పెద్దర్పల్లి, పల్లెమోనికాలనీ, పిల్లిగుండుతండా, కొత్తచెరువు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దర్పల్లికి చెందిన వెంకటయ్యకు చెందిన ఆవుదూడపై దాడిచేసి చంపినట్లు పేర్కొంటున్నారు. అదే గ్రామానికి చెందిన రామయ్య పొలం వద్ద శనివారం ఉదయం ఆవుదూడ కళేబరం లభిచడం, పరిసర ప్రాంతాల్లో చిరుత జాడలు లభ్యమవడంపై పరిస ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆవుదూడపై శనివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో చిరుత దాడి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల శివార్లలోని గిద్దెగట్టు, చీకర్లబండ, బండకుంట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. మేకలు, గొర్రెలు, పశువుల కాప ర్లు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు సూచిస్తున్నారు. -
ఆదాయం అంతంతే..
తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు 7జీడీడీపీ.. (ప్రస్తుత ధరల వద్ద.. రూపాయల్లో)మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి జో.గద్వాల నారాయణపేట17,27828,47137,456ఉత్పత్తి కేంద్రాలు.. యూనిట్లు 8,165 2,298 4,4764,142 4,070 ఉపాధి ‘హామీ’ అంతంతే.. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించి వారి ఆదాయం పెంచాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కూలీలకు లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. ఉపాధి హామీలో లక్ష్య సాధన విషయంలోనూ మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు వెనుకే ఉన్నాయి. మహబూబ్నగర్లో 88.60 శాతం లక్ష్యం చేరుకోగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 73.10 శాతం, గద్వాల జిల్లాలో 74.60 శాతం, నారాయణపేట జిల్లాలో 77.40 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో 81.60 శాతం లక్ష్యం నెరవేరింది. వ్యవసాయ రంగంలో మిశ్రమ పంటల విధానం, పంటల సాంద్రతలో ఉమ్మడి జిల్లా చివరన ఉంది. వనపర్తి జిల్లాలో పంటల సాంద్రత 169 కాగా, మహబూబ్నగర్లో 146, నాగర్కర్నూల్ 143, నారాయణపేట 133, గద్వాలలో 132 పాయింట్లుగా పంటల సాంద్రత నమోదైంది. సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది. వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్నగర్ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా 19వ స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి -
గంప జాతర
బయలెల్లుతున్న గ్రామాలు మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు. ఇళ్లకు తాళాలు..రోజంతా వనవాసాలు పిల్లాపాపలు, బంధుమిత్రులతో కలిసి విందులు ప్రతి సంవత్సరం ఆచారంగా జాతర నిర్వహణ అంటురోగాలు, దారిద్య్రం పోతుందనే నమ్మకం ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కొనసాగింపు -
క్రమంగా ఆచారంలో మార్పులు
గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. ● జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. -
ప్రతి ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: రంజాన్ సందర్భంగా శనివారం నగరంలోని ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వచ్చే మైనార్టీలకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ దగ్గర, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈద్గాల దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. పండగ సందర్భంగా నిరంతరం పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, శ్రీనివాస్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. అన్ని వర్గాలను నిరాశపరిచిన బడ్జెట్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేసిందని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన విలేకరలుతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడో బడ్జెట్లోనైనా ప్రభుత్వం సంక్షేమం పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతుందనుకున్నారని.. కానీ అందుకు భిన్నంగా ఉందన్నారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లకు ఊసే లేదన్నారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్లు ఐదేళ్లకు లక్ష కోట్లు ఇస్తామని ఇప్పుడు 3.85 శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. బీసీ గురుకులాల్లో అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతులు లేక ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని, పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. పదవీ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని, రైతుబంధు, విద్యుత్ సరఫరా, యూరియా సరిగా ఇవ్వడం లేదని, పండించిన తరువాత కనీసం గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేని, దళితులకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. సమావేశంలో మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్ కార్పొరేటర్లు కిషోర్, సిద్దిఖి, శరత్, మధు, నవకాంత్, నాయకులు నరేందర్, అన్వర్, నరేష్, శ్రీశైలం పాల్గొన్నారు. బకాయిలు చెల్లించేదెన్నడో? మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు మొండిచేయి చూపించడం తగదని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. శనివారం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. బకాయిలు రాక, పింఛను లేక ఎలా బతకాలని ప్రశ్నించారు. 2024 జూలై నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ ఇంతవరకు చెల్లించలేదన్నారు. 2017 పేస్కేల్, డిఫరెన్స్ ఎరియర్స్, డీఏ బకాయిలు చెల్లించడానికి ఆర్టీసీకి నిధులు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం నాయకులు డి.భగవంతు, బీహెచ్ కుమార్, అంజన్న, మోహన్రెడ్డి, ఉమేష్కుమార్, రాంరెడ్డి, మనోహర్, ఇజ్రాయెల్, చక్రధర్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి క్రమం తప్పకుండా ఇంజినీర్లు వెళ్లి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. ఎక్కడైనా ఈ పనులు ఆగిపోతే వెంటనే లబ్ధిదారులను కలిసి చైతన్యపరచాలన్నారు. స్లాబ్ స్థాయికి చేరుకున్న చోట పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ఏఈలతో అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 10,555 ‘ఇందిరమ్మ’ ఇళ్లు మంజూరు కాగా 7,898 కి మార్కింగ్ వేశారని వారు వివరించారు. మిగిలినవి ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులు త్వరగా పనులు ఆరంభించేలా చూడాలని ఆయన సూచించారు. ఇసుకతో పాటు ఇతర సామగ్రి కొరత ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ఇసుక సరఫరా సులభతరం చేస్తామన్నారు. వచ్చే నెలలో 1,300 ఇళ్లు పూర్తి కావాలి ఇక ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు కనీసం 1,300 గృహ ప్రవేశాలు అయ్యేలా చూడాలన్నారు. వచ్చే జూన్ 2 నాటికి మిగిలిన ఇళ్లు సైతం పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా 21వ స్థానంలో ఉందని, వచ్చే జూన్ 2 నాటికి టాప్ 5లోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతిరోజూ ఏఈలు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్షించి ఇళ్ల పురోగతిని పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకట ఉపేందర్ రెడ్డితో పాటు డీఈఈలు పాల్గొన్నారు. -
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దేవరకద్ర: మున్సిపాలీటీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం మున్సిపాలీటీలోని 7వార్డులో ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేస్తున్నా నాల్గవ విడత డబ్బులు రాలేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు సాంకేతిక సమస్య కారణంగా అప్లోడ్ చేయలేదని మున్సిపల్ కమిషనర్ను తప్పదోవ పట్టించినట్లు, అలాగే సాంకేతిక సమస్య లేనట్లు కలెక్టర్ స్వయంగా గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన మున్సిపల్ మేనేజర్, వార్డు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దశల వారీగా ఫోటోటు యాప్లో క్యాప్చర్ చేయడంలో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ.. దేవరకద్రలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల, డీగ్రీ కళాశాలలో మౌలిక వసతులు మెరుగు పర్చాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించి మధ్యాహ్నా భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేక పోవడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దీపిక, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారంజక బడ్జెట్..
ఇది ప్రజారంజక బడ్జెట్. ముఖ్యంగా చేయూత పథకం కింద కొత్తగా 2లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అభినందనీయం. అలాగే విద్యారంగానికి పెద్దపీట వేయడం మా ప్రజాపాలనకు అద్దం పడుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు తమ పిల్లలను బడికి పంపేందుకు ముందుకు వస్తారు. రైతుభరోసాకు నిధులు కేటాయించడం రైతులపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. వైద్యరంగానికి సైతం పెద్దఎత్తున నిధులు కేటాయించడంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించినట్లయ్యింది. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల అంకెలగారడీ కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడవసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీగా ఉంది. ప్రజలను బడ్జెట్ రూపంలో మరోమారు మోసం చేసింది. ఎన్నికల సమయంలో పింఛన్లు రూ.2వేల నుంచి రూ. 4వేలకు పెంచుతామని చెప్పి.. దాన్ని ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కొత్త ఉద్యోగాల ఊసేలేదు. మహాలక్ష్మి పథకం అంటూ ఆర్టీసీని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేశారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకే బడ్జెట్లో అంకెలు చూయించారు. – సి.లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ● -
ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: నగరంలో శనివారం రంజాన్ సందర్భంగా శుక్రవారం అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలించారు. ఉదయం 9.30గంటలకు నిర్వహించనున్న ఈద్ ఉల్ ఫితర్ నమాజ్కు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంపై అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నమాజ్ కోసం వారి వాహనాల పార్కింగ్ నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ కూడలి, బోయపల్లి గేట్ దగ్గర రద్దీ క్రమంలో ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని, ఆ తర్వాత ఈద్గా దగ్గర పార్కింగ్ సక్రమంగా చేసే విధంగా చూడాలన్నారు. వీఐపీఐ వచ్చిన సమయంలో ఎలాంటి సమస్య లేకుండా ముదస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐలు భాస్కర్రెడ్డి, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ● మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్లో హైడ్రాలిక్ లిప్ట్ నిర్మాణం కోసం శుక్రవారం జిల్లా ఎస్పీ డి.జానకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా వాహనాలకు మరమ్మతులు సులువుగా చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తనను ప్రభుత్వ విప్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని.. అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశం, శాసనమండలి ప్రభు త్వ విప్లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ తది తరులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఎమ్మెల్యే యెన్నం కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
క్రీడాకారులకు ‘వర్కటం’ ప్రోత్సాహ ం
మక్తల్: క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తన వంతు సహకారం అందిస్తానని వీజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ వర్కటం జగన్నాథ్రెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు శ్రీనివాస్గౌడ్, శివాణి, అక్షిత, జాహ్నవి, జయకాత్యాయని, తన్మయ ఇటీవల హైదరాబాద్లో జరిగిన అండర్–19 క్రికెట్, ఇతర క్రీడల్లో సత్తా చాటడంతో వారిని తన కార్యాలయానికి పిలిపించి సన్మానించి అభినందించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో వీజేఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొ న్నారు. వీజేఆర్ నిర్వాహకులు అంజనారెడ్డి, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పాన్గల్: చింతచెట్టుపై నుంచి కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాన్గల్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గెంటీల తెలుగు నర్సింహ(54) ఈ నెల 4న గ్రామ శివారులో చింతచెట్టు పైన చింతపండు తెంపుతుండగా ప్రమాదవశాత్తుతో కాలు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అనంతరం మహబూబ్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని మత్స్యకార సంఘం నాయకులు పరామర్శించి సానుభూతిని తెలిపారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. కారు, బైక్ ఢీ: ఒకరు దుర్మరణం ● ఇద్దరికి తీవ్రగాయాలు అమ్రాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి అమ్రాబాద్ సమీపంలో మద్దిమడుగు రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబావి గ్రామానికి చెందిన చాంద్పాషా(21), పర్వతాలు, వెంకటేష్లు బైక్పై రాత్రి తమ గ్రామం వెంకటేశ్వర్లబావి వెళ్తుండగా మన్ననూర్ నుంచి అమ్రాబాద్ వైపు వస్తున్న కారు మార్గమధ్యలో అమ్రాబాద్ సమీపంలో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాంద్పాషా మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేష్, పర్వతాలుకు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు.


