Mahabubnagar District News
-
కోర్టు డ్యూటీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మహబూబ్నగర్ క్రైం: పోలీస్ వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలంటే ప్రతి అధికారి తన విధులను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం అంగీకరించడం సరికాదని, ప్రతి కేసు విచారణలో చార్జిషీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షులను హాజరుపరిచే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం మెరుగుపరుచుకోవాలని సూచించారు. కోర్టులలో కేసుల పరిష్కార వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానితులను కోర్టుకు హాజరుపరిచే సమయంలో వారిని సురక్షితంగా సమయానికి న్యాయస్థానాలకు తరలించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి భద్రత లోపాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కోర్టు డ్యూటీలలో నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు రమణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష కేంద్రాల దగ్గర 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల వద్ద 163సెక్షన్ ఉంటుందని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల దగ్గర ఎవరూ గుమ్మికూడరాదని పేర్కొన్నారు. -
భూములను కాపాడేందుకే భూభారతి చట్టం
గండేడ్/మహమ్మదాబాద్: పేద రైతుల భూములను కాపాడేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం గండేడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్, మహమ్మదాబాద్ మండలపరిధిలోని నంచర్ల పల్లవి ఆడిటోరియంలో రైతులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఎంతో మోసం చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు సూచించారు. ఇలాంటి చట్టంతో ఎంతో మంది రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి గండేడ్ మండలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యలో వెనుకబడిన మన ప్రాంతం విద్యలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదన్నారు. భూమికి సురక్షితమైన హక్కు భూభారతి పేద రైతుల భూములకు సురక్షితమైన హక్కులు కల్పించేది భూభారతి చట్టమని కలెక్టర్ విజయేందిర అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకుంటే సమస్య పరిష్కారం కాకుంటే ఆర్డీఓకు అప్పీలు చేయవచ్చని, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకోవచ్చన్నారు. భూసమస్యలతో రైతులు మహిళలు కోర్టుల చుట్టూ తిరుగకుండా భూబారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వెన్నాచేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రైతులకు తాగునీరు, నీడ కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఓ రైస్మిల్లుకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్కుమార్, తహసీల్దార్లు నాగలక్ష్మి, తిరుపతయ్య, ఎంపీడీఓలు దేవన్న, నరేందర్రెడ్డి, నాయకులు జితేందర్రెడ్డి, కేఎం నారాయణ, రాములు, విష్ణువర్ధన్రెడ్డి, పుల్లారెడ్డి, శాంతీబాయి, రాధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా శిబిరాలకు సన్నద్ధం
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక క్రీడాకారులకు ప్రతి ఏడాది నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు క్రీడా నైపుణ్యాన్ని చాటేందుకుగా వేదికగా ఉపయోగపడుతున్నాయి. జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నెలరోజుల పాటు వేలాది మంది ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణ తీసుకుంటారు. ఈ శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. ● ఈ ఏడాది జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడాశిఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 వరకు వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. అయితే జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల ఔత్సాహిక క్రీడాకారుల కోసం అర్బన్ కింద దాదాపు 15 వరకు వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆహ్వానించిన యువజన, క్రీడాశాఖ ఈఏడాది జిల్లాలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాచరణ రూపొందిస్తుంది. వివిధ క్రీడాంశాల్లో మే 1వ తేదీ 30 వరకు (నెల రోజుల పాటు) ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందజేస్తారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడాశాఖ జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఇటీవల వేసవి క్రీడా శిక్షణ శిబిరాల దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేశారు. జాతీయస్థాయి సీనియర్ క్రీడాకారులు లేదా వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీ, పీఈటీ) వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తుతో పాటు క్రీడల్లో తాము సాధించిన ధ్రువపత్రాలను జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలోని యువజన, క్రీడా కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏడాది వేసవి క్రీడాశిక్షణా శిబిరాల నిర్వహణపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గతేడాది వేసవి శిబిరాల్లో చాలా మంది విద్యార్థులు, ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు సంబంధించి సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తాం. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలోవేసవి శిబిరాలు మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ దరఖాస్తులు ఆహ్వానించిన యువజన, క్రీడాశాఖ -
పేదవాడి చుట్టంలా ’భూ భారతి’
నాగర్కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని.. ప్రజలు గుర్తించి పేద ల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీ వించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారా యణరెడ్డి, తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
న్యాయసేవలు పల్లెలకు విస్తరించాలి: జిల్లా జడ్జి
పాలమూరు: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న న్యాయసేవలను గ్రామీణస్థాయికి తీసుకువెళ్లి పేదలకు మేలు జరిగే విధంగా పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం పారా లీగల్ వలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయ సేవలను విస్తరించేందుకు పారా లీగల్ వలంటీర్లు కృషి ఎక్కువగా ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ క్లినిక్లు, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో అందిస్తున్న న్యాయసేవలను మరింత మెరుగైన స్థాయిలో అందించాలన్నారు. అనంతరం పారా లీగల్ వలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు. బాదేపల్లి యార్డుకుపోటెత్తిన మొక్కజొన్న జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు శనివారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. 4,579 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.1,521 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.4,816, పెబ్బర్లు గరిష్టంగా రూ.4,957, కనిష్టంగా రూ.4,617, రాగులు గరిష్టంగా రూ.2,611, కనిష్టంగా రూ.2,511, జొన్నలు రూ.3,907, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,969, కనిష్టంగా రూ.1,806, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,806, ఆముదాలు గరిష్టంగా రూ.6,278, కనిష్టంగా రూ.5,629, పత్తి రూ.5,389, శనగలు రూ.5,250 ధరలు లభించాయి. దేవరకద్ర లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,701, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,639గా, ఆముదాలు గరిష్టంగా రూ.5,981గా ఒకే ధర వచ్చింది. పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కువ సమయం కేటాయించా..
ముఖ్యమైన అంశాలను ఎక్కువ సార్లు రాయడం, నోట్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. ఇందుకు ఎక్కువ సమయం కేటాయించాను. అధ్యాపకుల సలహాలు, సూచనలతో మంచి మెటీరియల్ చదివాను. అనుకున్న ఫలితం వచ్చాయి. మా నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఆయన అనుకున్న విధంగా సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. – వర్షిత్గౌడ్, విద్యార్థి, ప్రతిభ కళాశాల (98.15 పర్సంటైల్) -
ట్రాక్టర్ బోల్తా : రైతు దుర్మరణం
ఇటిక్యాల: ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని షాబాద్ గ్రా మంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. షాబాద్కు చెందిన రైతు తెలుగు చిన్న రామకోటి (65) ట్రాక్టర్తో గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలాన్ని దున్ని వస్తుండగా.. శనగపల్లి రోడ్డు వ ద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో చిన్న రామకోటికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికు లు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బావిలో పడి వ్యక్తి మృతి అమరచింత: బావిలోని బోరుమోటారు బయటకు తీసే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన ఘటన అమరచింతలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమరచింతకు చెందిన హమాలీ గుడిసె శ్రీనివాసులు (34)తో పాటు హమాలీ రిక్షా రవి, మరో రవి ముగ్గురు కలిసి రిటైర్డ్ టీచర్ గోపాల్రెడ్డి పొలంలోని బావిలో ఉన్న బోరుమోటారు బయటకు తీసేందుకు వెళ్లారు. మోటారును బయటకు తీసు కుని వస్తున్న క్రమంలో బోరుపైపులు గుడిసె శ్రీనివాసులుపై పడటంతో అతడు బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల సహాయంతో బావిలో నుంచి అతడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం లభ్యం కేటీదొడ్డి: ఉపాధి హామీ పథకం పను లు చేస్తుండగా.. గుర్తుతెలియని యు వకుడి (30) మృతదేహం లభ్యమైన ఘటన కేటీదొడ్డి మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కేటీదొడ్డి గ్రామ శివారులో ఉన్న కొత్తకుంట ఆంజనే యస్వామి ఆలయం సమీపంలోని ప్రభుత్వ భూమిలో వర్షపునీటి నిల్వ కోసం ఉపాధి హామీ పథకం కూలీలు గుంతలు తవ్వుతుండగా.. యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచా రం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గొంతు కోసినట్లు ఆనవాళ్లను గుర్తించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర? దేవరకద్ర/దేవరకద్ర రూరల్: దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఒక బీజేపీ ముఖ్యనేతపై ప్రత్యర్థులు హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆయనకు తెలియడంతో తన వద్ద ఉన్న ఆధారాలతో ఎస్పీ జానకికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిసింది. -
లభించని ఆరుగురి ఆచూకీ
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి శనివారంతో 57 రోజులకు చేరింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ వంటి 12 విభాగాలకు చెందిన సిబ్బంది విడతల వారీగా 24గంటల పాటు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఐదు ఎస్కవేటర్ల సాయంతో మట్టి తొలగిస్తున్నప్పటికీ ఆరుగురి కార్మికుల ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. డీ–2 నుంచి డీ–1 ప్రదేశంలో మట్టి, బురద, రాళ్లు తొలగించినా కార్మికుల జాడ లభించక పోవడంతో.. కంచె ఏర్పాటు చేసిన నిషేధిత ప్రదేశం 40 మీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 20వ తేదీలోగా శిథిలాల తొలగింపు పూర్తి చేయాల్సి ఉండటంతో సహాయక సిబ్బంది రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. యంత్రాలతో ఎక్కువగా పనులు చేస్తుండటంతో సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్నారు. ప్రమాద ప్రదేశం పరిశీలన.. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టి తొలగింపు సాధ్యాసాధ్యాలను సహాయక బృందాల ఉన్నతాధికారులు మరోసారి పరిశీలించారు. అయితే ఇప్పట్లో డేంజర్ జోన్ ప్రదేశంలో తవ్వకాలు జరిపే వీలు కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బృందాలు సహాయక చర్యలను నిలిపివేసి వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉంది. కాగా, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు ఎస్కవేటర్ల సాయంతో మట్టి, బురదతీత పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. డేంజర్ జోన్ సమీపంలో మట్టి తరలింపునకు అడ్డుగా వస్తున్న బండ రాళ్లను విచ్చిన్నం చేసి లోకో ట్రేన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. సిబ్బందికి అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నామని.. తాగునీరు, ఆహార పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలకు పంపిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు. ఎస్ఎల్బీసీలో 57 రోజులకు చేరిన సహాయక చర్యలు -
సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి ఐఐటీ అకాడమీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విద్యార్థులు రోహిత్ 99.80 పర్సంటైల్, మనోహర్ 99.40, రేవంత్రెడ్డి 98 పర్సంటైల్ సాధించారు. వీరితో పాటు ఓంకార్, ఆర్తి, కౌశిక్, అశ్విని, మమత, నవనీత్గౌడ్, నవీన్, శివ, శరణ్య, గణేశ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినటు ్ల కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి తెలిపారు. ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ కార్యక్రమంలో భాగంగా అకాడమీలో మెరుగైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, యాజమాన్య సభ్యులు రాఘవేందర్రావు, శివకుమార్, నాగేందర్, సతీశ్రెడ్డి, షాకీర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
ఎర్రవల్లి: అతివేగం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటం.. అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్ఐ మురళి వివరాల మేరకు.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కాకునూరుకుచెందిన దేరెడ్డి పుల్లారెడ్డి (59), ఆయన భార్య లక్ష్మి పుల్లమ్మ (51), కుమారుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి అదే రోజు రాత్రి 8:30 గంటలకు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో దేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. అదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో భార్యాభర్తలు దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మి పుల్లమ్మతో పాటు వారి బంధువు స్రవంతికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తేలికపాటి రక్త గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మిపుల్లమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుల బంధువు మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్హెచ్–44పై బోల్తాపడిన కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు భార్యాభర్తల దుర్మరణం.. మరో నలుగురికి గాయాలు బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం మృతులు నంద్యాల జిల్లా వాసులు -
‘జేఈఈ’లో అత్యుత్తమ ‘ప్రతిభ’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుంధుబి మోగించారు. ఆలిండియా స్థాయిలో విద్యార్థులు విశాల్ 281వ ర్యాంకు, సాకేత్కుమార్రెడ్డి 98.75 పర్సంటైల్తో 2,587వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు భీంసింగ్ రాథోడ్ 2,683, తిరుపతి 4,952వ ర్యాంకు, కేదార్నాథ్ 98.28 పర్సంటైల్తో 6,988వ ర్యాంకు, వర్షిత్గౌడ్ 98.15 పర్సంటైల్తో 7,661వ ర్యాంకు, ప్రేమ్చంద్ 7,682వ ర్యాంకు సాధించగా.. కె.భరత్ 96.16, సి.జతిన్ 96.03, నాగకౌశిక 96.95, భానుప్రదీప్ 95.43, సాయి జశ్వంత్రెడ్డి 95.39, సాయి రేవంత్రెడ్డి, 95.04 పర్సంటైల్ సాధించారు. 90 పర్సంటైల్కు పైగా 48మంది, 80 నుంచి 90 పర్సంటైల్ మధ్య 62 మంది సాధించారని.. ఫలితాల్లో 198 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమంలో డైరెక్టర్స్ మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘రిషి’ విద్యార్థుల ప్రభంజనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. కళాశాల విద్యార్థులు 1000 లోపు ర్యాంకులతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. రోహిత్రెడ్డి 308, జంగం శ్రీతులసి 927వ ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ చంద్రకళా వెంకట్ తెలిపారు. వీరితో పాటు సాయి సుజన్రెడ్డి 98.40, ప్రణిత్కుమార్ 98.04, సాయి అక్షయ 97.08, తరుణ్సాయి 96.76 పర్సంటైల్ సాధించారన్నారు. 90శాతం పర్సంటైల్ను 36 మంది సాధించగా.. జేఈఈ అడ్వాన్స్కు 45 మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. తమ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన కళాశాలగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమీ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య, డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జూరాల కాల్వలకు నిలిచిన నీటి సరఫరా
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని శుక్రవారం సాయంత్రం నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని గత వారమే నిలిపివేయగా.. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి నీటిని వదలాలని రైతులు ఆందోళనలు చేయడంతో రెండు రోజులపాటు నీటిని విడుదల చేశారు. అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, మరో రెండు తడులు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నా.. ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం అడుగంటిపోతుండటంతో కేవలం ఒకే తడి ఇస్తున్నట్లు ప్రకటించి నీటిని విడుదల చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం శుక్రవారం కాల్వకు సాగునీటిని నిలిపివేశామని డీఈ నారాయణ, ఏఈ ఆంజనేయులు తెలిపారు. పురాతన విగ్రహాల సంరక్షణ ఏది? పెంట్లవెల్లి: మండలంలోని మల్లేశ్వరం గ్రామంలో పుష్కరఘాట్ దగ్గర బండపై పురాతన పద్మనాభుడు, వీరభద్రుడి విగ్రహాలు ఏళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. కృష్ణానదిలో మునిగిన సమయంలో వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారే తప్ప నేటికి ఆలయం నిర్మించి పూజలు చేయడం లేదు. ఈ విషయాన్ని పలుమార్లు దేవాదాయశాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికై నా స్పందించి సంరక్షించాలని కోరుతున్నారు. ఊర్కొండపేట అత్యాచార ఘటన సీన్ రీ కన్స్ట్రక్షన్ ఊర్కొండ: నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై దుండగులు అత్యాచారం చేసిన సంఘటన విదితమే. దీనికి సంబంధించి నిందితులను కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం సంఘటన స్థలానికి తీసుకువచ్చారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో మారుపాకుల ఆంజనేయులు, సాధిక్ బాబా ముందుగా ఆ తర్వాత మణికంఠ, కార్తీక్లను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. నేరం జరిగిన తీరుపై నిందితుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచార ఘటన తర్వాత ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంలో పోలీసులు గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలో మూడు బైకులు, సంఘటన రోజు నిందితులు ధరించిన దుస్తులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సంఘటన స్థలంతో పాటు నిందితుల గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
నిర్వాసితులను ఆదుకోవాలి
మక్తల్: నియోజకవర్గంలోని జూరాల, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో ఆర్అండ్ఆర్ నిర్వాసితుల సమస్యలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా కృష్ణానదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు ఎన్నో ఏళ్లగా పని చేయడం లేదని, కొన్నింటికి మాత్రమే మరమ్మతులు చేశామని తెలిపారు. మిగిలిన ఎత్తిపోతల పథకాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, బాగు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి కాల్వలు పూర్తి చేస్తే మరికొన్ని ఎకరాలకు సాగునీరు అంది రైతులు అభివృద్ధి బాటలో పయనిస్తారని చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, గడ్డం రమేష్, కుర్మయ్యగౌడ్, రాఘవేందర్రెడ్డి, రఘుపతిరెడ్డి, అశోక్గౌడ్ పాల్గొన్నారు. -
మట్టి తరలింపు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో మట్టి, బురద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి శుక్రవారం నాటికి 56 రోజులు గడిచినా మిగిలిన ఆరుగురి ఆచూకీ లభించలేదు. డీ2 ప్రదేశంలో ఐదు ఎస్కవేటర్లతో మట్టి, బురద తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను కత్తిరించి శకలాలను లోకో ట్రైన్లో బయటకు తరలిస్తున్నారు. పైకప్పు కూలిన ప్రదేశం నుంచి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 12 రకాల సహాయక బృందాల్లోని 560 మంది సిబ్బంది నిత్యం మూడు షిఫ్ట్లలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సహాయక చర్యలు పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో నిషేధిత ప్రదేశం వరకు మట్టి, శిథిలాల తొలగింపు పూర్వవుతుందని సహాయక సిబ్బంది వివరించారు. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురి జాడ కనుగొనేందుకు సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. శుక్రవారం దోమలపెంట ఎస్ఎల్బీసీ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహాయక బృందాల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన సామగ్రి, వసతులు, పౌష్టికాహారం సమకూర్చుతున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. 56 రోజులుగా సాగుతున్న సహాయక చర్యలు.. లభించని ఆరుగురి ఆచూకీ -
బీసీల వాటా తేల్చాకే ఉద్యోగ ప్రకటనలివ్వాలి
కందనూలు: బీసీల వాటా తేల్చాకే ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన బీసీ చైతన్య సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తానంటూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. బీసీల రిజర్వేషను తేల్చకుండా నోటిఫికేషన్లు ఇస్తానంటే చూస్తూ ఊరుకోమని.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏకమై భరతం పడతామని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని చెప్పారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం, కుట్ర, నయవంచన చేసి పాలన సాగిస్తోందని.. ఎన్ని రోజులు సాగదని తెలిపారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 62 మంది అగ్రవర్ణాల వారేనని.. అలాంటప్పుడు బీసీలకు కల్యాణలక్ష్మి ఎలా చేరుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మేధావులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. కల్వకుర్తి రూరల్: రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే బీసీల సత్తా ఏంటో అన్ని పార్టీలకు చూపిద్దామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్కర్నూల్కు వెళ్తూ పట్టణంలోని బీసీ ముఖ్యనాయకులతో కాసేపు మాట్లాడారు. బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. 2028ని లక్ష్యంగా చేసుకొని స్థానిక ఎన్నికల్లో బీసీల పార్టీ, బీసీ గుర్తుతోనే పోటీ చేద్దామన్నారు. నల్లమల నుంచి వచ్చిన క్రూర మృగాలను తరిమి వేయాల్సిన సమయం వచ్చిందని.. 2028లో బీసీ ముఖ్యమంత్రి పాలన చేస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటామని.. నియోజకవర్గానికి బలమైన బీసీ నాయకుడిని కన్వీనర్గా త్వరలోనే నియమిస్తామన్నారు. ఉపాధ్యాయ లోకం బీసీ ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బీసీ జేఏసీ నేత హరిశంకర్గౌడ్, జానయ్య యాదవ్, మేకల రాజేందర్, సదానందంగౌడ్, రమేష్చారి, రుక్కుల్గౌడ్, శ్రీనివాస్యాదవ్, కురిమిద్దె మాజీ ఉపసర్పంచ్ విజయభాస్కర్, జమ్ముల శ్రీకాంత్, నర్సింహ, దుర్గాప్రసాద్, కరెంటు రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
జడ్చర్లలో గాలివాన బీభత్సం
జడ్చర్ల టౌన్/రాజాపూర్/నవాబుపేట: జడ్చర్ల నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వనగండ్ల వర్షం కురిసింది. జడ్చర్ల మండలంలోని మాచారం, పోలేపల్లి, గంగాపురం, మల్లెబోయిన్పల్లి, జడ్చర్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్ సైతం ఒరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ కవర్లు గాలులకు ఎగిరి కరెంట్ తీగలపై పడ్డాయి. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, నందిగామలో వడగండ్ల పడ్డాయి. పలు చోట్ల వడ్లు, మామిడి కాయలు రాలిపోయాయి. ముదిరెడ్డిపల్లి నుంచి రాయపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు విరిగి అడ్డంగా పడటంతో గ్రామానికి వెళ్లే ప్రజలు ఇబ్బందుల పడ్డారు. నవాబుపేట మండలం కారూర్లో గాలివానకు పెంపుడు పందుల షెడ్డు ధ్వంసం కావడంతో నిర్వాహకుడు ఆంజనేయులుకు దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లింది. కాగా.. వీలైనంతంగా త్వరగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. ● కావేరమ్మపేట శివారులో వ్యవసాయ పొలంలో వెంకటయ్యకు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. గేదెల విలువ దాదాపు రూ.1.20 లక్షలు ఉంటుందని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి తడిసిపోయింది. -
ఎస్ఎల్బీసీకి చేరిన టీబీఎం బేరింగ్
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం వద్దకు శుక్రవారం టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)కు సంబంధించిన బేరింగ్ చేరుకుంది. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ నుంచి బేరింగ్ కొనుగోలు చేసి ప్రత్యేక నౌకలో చైన్నెకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వద్దకు భారీ వాహనంలో తరలించారు. 2023, జనవరి 29న టీబీఎం బేరింగ్, అడాప్టర్, రింగ్బేర్ మరమ్మతుకు గురై అవుట్లెట్ నుంచి పనులు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయం దోమలపెంట ఇన్లెట్ నుంచి మన్నెవారిపల్లి అవుట్లెట్ వరకు మొత్తం 43.93 కిలోమీటర్ల సొరంగం పనులకుగాను ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తికాగా, మరో 9.559 కి.మీ. తవ్వాల్సి ఉంది. దోమలపెంట ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 13.936 కిలోమీటరు వద్ద ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలి ఎనిమది మంది కార్మికులు చిక్కుకోగా.. ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికితీశారు. మరో ఆరుగురి జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇన్లెట్ వద్ద తవ్వకాలు జరిపే టీబీఎం పూర్తిగా ధ్వంసం కావడంతో ప్లాస్మా కట్టర్తో కత్తిరించి భాగాలను బయటకు తరలిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాన్ని డీ1 జోన్గా గుర్తించారు. జీఎస్ఐ ఇచ్చిన నివేదిక ప్రకారం సొరంగం, కార్మికుల భద్రత దృష్ట్యా ఇక్కడ తవ్వకాలు జరపడం మంచిది కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం అనుసరించాలని చూస్తోంది. కేంద్ర పర్యావరణశాఖ అనుతిస్తేనే ఈ విధానంలో పనులు చేపట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు మన్నెవారిపల్లి వైపు 20.43 కిలోమీటరు నుంచి సొరంగం తవ్వకం పనులు ప్రారంభించి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీబీఎం బేరింగ్, ఇతర పరికరాలు తెప్పించారు. మరో పదిరోజుల్లో బేరింగ్ బిగించి నెలాఖరులో తవ్వకాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్నెవారిపల్లి అవుట్లెట్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లావ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహబూబ్నగర్లోని కల్వరి ఎంబీ చర్చి, శాలెం, క్రిస్టియన్పల్లిలోని బెత్లహం, క్రిస్టియన్కాలనీలోని ఎంబీ ప్రేయర్, మోతీనగర్లోని చర్చితో పాటు ఇతర చర్చిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్లు క్రీస్తూ సందేశం ఇచ్చారు. బైబిల్ సూక్తులను చదివి వినిపించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాచాలని, పరస్పరం కష్ట, సుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు. క్రీస్తు ప్రభువు శిలువపై పలికిన ఏడు మాటల గురించి వివరించారు. కల్వరి ఎంబీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్ క్రీస్తూ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జేకబ్, కార్యదర్శి జేఐ డేవిడ్, సహ కోశాధికారి టైటస్ రాజేందర్, ఆర్ఎస్ డేవిడ్, పి.శామ్యుల్, జేఐ.యోహాన్, ఎంకే.పాల్ సుధాకర్, జీపీ ప్రసన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాప విముక్తి కోసమే యేసు శిలువ త్యాగం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళికి పాప విముక్తి కల్పించేందుకే శిలువ త్యాగం చేశారని రెమా వర్షిప్ సెంటర్ డైరెక్టర్, రెవరెండ్ పాస్టర్ బీఎస్ పరంజ్యోతి అన్నారు. రెమా వర్షిప్ సెంటర్లో ప్రార్థనలు నిర్వహించారు. పరంజ్యోతి ప్రసంగిస్తూ యేసు క్రీస్తూ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆయనకు సాక్షులుగా రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు దేవయ్య, డాక్టర్ ప్రేమ్చంద్, భరత్, లక్ష్మన్న, రాజు, ప్రసన్నకుమార్, చంద్రశేఖర్, బ్లాండీనా, మహిమ తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
ఆత్మకూర్: రైలుకు ఎదురుగా వెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల నడుమ చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి అశోక్, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గద్వాలలోని హౌజింగ్బోర్డుకాలనీకి చెందిన ఏకే బాలరాజు (30) కొంతకాలంగా తాగుడుకు బానిసకావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తండ్రి నాగేశ్వర్రెడ్డి, కుటుంబ సభ్యులు వైద్యం చేసుకోవాలని కోరగా బాలరాజు నిరాకరించి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లి అర్ధరాత్రి సమయంలో గద్వాల, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ల నడమ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతదేహాన్ని గద్వాల మార్చురికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకుడి దుర్మరణం పెద్దకొత్తపల్లి: కారు, బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని చంద్రకల్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని గన్యాగులకు చెందిన బాలరాజు (27), మల్లేష్ గ్రామం నుంచి మండల కేంద్రానికి వస్తుండగా కొల్లాపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలరాజు అక్కడికక్కడే మృతిచెండగా.. మల్లేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట అధ్యాపకుడి పని చేస్తున్నారు. కారు ఢీకొని వ్యక్తి.. కొత్తకోట: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పెబ్బేరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యుగంధర్రెడ్డి కథనం మేరకు.. పెబ్బేరుకు చెందిన చెటమోని ఎల్లస్వామి (37) పొలం పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై పెబ్బేరుకు బయలుదేరాడు. రంగాపూర్ జాతీయ రహదారిపై బైపాస్ వద్దకు చేరుకోగానే హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. ఎల్లస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బస్సు, బైక్ ఢీకొని మరొకరు .. కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్ గ్రామపంచాయతీ టైరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం, బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ ఎండీ నవీద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ప్రెగడబండకు చెందిన కుర్వ అంజప్ప (28) తన ద్విచక్ర వాహనంపై కర్ణాటకలోని కొర్తికొందకు బయలుదేరాడు. టైరోడ్డుకు చేరుకోగానే హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. వెంటనే చుట్టుపక్కల వారు అంబులెన్స్లో రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అంజప్పకు భార్య శంక్రమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
ముదిరాజ్ అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే యెన్నం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముదిరాజ్ల అభ్యున్నతి కోసం తన వంతు పాటుపడుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముదిరాజ్ భవనంలో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్న ముదిరాజ్ భవనాన్ని ఓ విజ్ఞాన కేంద్రంగా మారుద్దామని అందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. చదువుకుంటేనే సమాజంలో మంచి గుర్తింపు రావడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను బాగా చదివించాలని ముదిరాజ్లలో కూడా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లిన వారు ఉన్నారన్నారు. ముదిరాజ్ భవనాన్ని భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా తీర్చిదిద్దుదామన్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే స్వభావం ముదిరాజ్లకు ఉందని ప్రేమ గల మనుసులు ముదిరాజ్లు అని అన్నారు. పీసీసీ నాయకులు ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ డీలో ఉన్న ముదిరాజ్లను బీసీ ఏలోకి మార్చాలని అందుకు ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. ముదిరాజ్లు రాజకీయంగా ఎదిగిన నాడే అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మైత్రియాదయ్య, కృష్ణముదిరాజ్, పెద్ద విజయ్కుమార్, రశ్రీనివాసులు, విజయ్కుమార్, నారాయణ, వెంకన్న, ఏఓ శంకర్, రామకృష్ణ, కిషోర్, లక్ష్మన్, యాదయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు. -
11 నెలల్లో 4 మృత్యువాత..
చిరుత వలసలు పెరిగిన క్రమంలో నారాయణపేట జిల్లాలో 11 నెలల కాలంలో నాలుగు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది మే నాలుగో తేదీన మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధి మల్కిజాదరావుపల్లి శివారులోని పొలంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదే ఏడాది ఆగస్ట్ 17న అదే మండలం జాదరావుపల్లి శివారు తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద మరో చిరుత చనిపోయింది. ఈ ఏడాది జనవరి 28న దామరగిద్ద మండలం ఉడుమల్గిద్ద శివారులో ఉన్న గుట్టలో ఇంకొకటి, ఫిబ్రవరి 16న మద్దూరు మండలంల మోమినాపూర్ శివారులో మరొకటి మృత్యువాత పడింది. పోస్టుమార్టంలో ఇవి సహజ మరణాలేనని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంరక్షణకు చర్యలు చేపట్టారు. మోమిన్ పూర్ లో చనిపోయిన చిరుతను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది -
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్నాల్, ఎర్గోల, మినాస్పూర్ బ్లాక్లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
పంట పొలాల్లోకి కాలుష్య జలాలు
రాజాపూర్: చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. కాలుష్య జలాలు బయటకు వదిలేందుకు పరిశ్రమల యాజమాన్యానికి అవకాశం వచ్చినట్లే. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీనిని అదునుగా చేసుకొని పోలేపల్లి సెజ్లో ఉన్న ఓ పరిశ్రమ వర్షపు నీటి చాటున కాలుష్య జలాలను రైతుల పొలాల్లోకి వదిలింది. రైతులు వీటి ఫొటో తీసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి సమాచారం ఇచ్చారు. జల, వాయు కాలుష్యంతో పాటు శబ్ధ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని.. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ముదిరెడ్డిపల్లి, రాయపల్లి గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పెద్దర్పల్లి యువకుడు
దుబాయ్లో చిక్కుకున్న ● చేయని నేరానికి మూడు నెలల జైలుశిక్ష ● హోల్డ్లో పాస్పోర్ట్.. స్వదేశానికి రాకుండా ఇబ్బందులు ● ఆదుకోవాలంటూ వేడుకోలు హన్వాడ: బతుకుదేరువు కోసం మధ్య దళారి ద్వారా దుబాయ్కి వెళ్లిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. తన గుర్తింపు కార్డుతో వేరొక మిత్రునికి మొబైల్ సిమ్ ఇప్పించిన నేరానికి అక్కడి పోలీసులు ట్రావెల్ బాండ్ కేసులో రూ.9 వేలు (దుబాయ్ రూపాయలు) జరిమానా విధించారు. ఈ డబ్బులు కట్టని నేరానికి యువకుడిని మూడు నెలల పాటు జైలుకు పంపారు. అలాగే స్వదేశానికి రాకుండా పాస్పోర్ట్ను హోల్డ్లో పెట్టారు. దీంతో అక్కడ చేసేందుకు పనులు దొరకక, స్వదేశానికి రాలేక తోటి కార్మికుల సాయంతో ఫోన్లో సందేశాలు పంపుతూ తనను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పెద్దర్పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్ 2019లో బతుకుదెరువు కోసం మధ్య దళారీ ద్వారా దుబాయ్ వెళ్లాడు. నాలుగేళ్లకు ఇంటికి వచ్చి మళ్లీ దుబాయ్కు వెళ్లాడు. అయితే గోపాల్ను షార్జా విమానాశ్రయంలో తన ఐడీ కార్డు సాయంతో వేరొక మిత్రుడికి సిమ్ ఇప్పించినందుకు అక్కడి పోలీసులు దుబాయ్ రూపాయలలో రూ.9 వేల దినార్ కట్టాలని ఫైన్ వేళారు. అంత డబ్బు నేను చెల్లించలేనని చెప్పడంతో 3 నెలల జైలుశిక్ష అనుభవించాడు. తనపై ఉన్న ట్రావెల్ బాండ్ కేసును కొట్టివేయాలని అక్కడి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. పనులు దొరకక నరకం అనుభవిస్తున్న గోపాల్ స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేయడంతో పాస్పోర్ట్ను హోల్డ్లో పెట్టారు. దీంతో యువకుడు ఇటు స్వదేశానికి రాలేక.. అటు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నానని, తనను స్వదేశానికి రప్పించాలని స్నేహితులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఈ విషయమై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని యువకుడిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు, పెద్దర్పల్లి గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. మతిస్థిమితం లేని తల్లి.. బ్లడ్ క్యాన్సర్తో అన్న ఇదిలా ఉండగా.. మ్యాతరి గోపాల్ తల్లి మ్యాతరి వెంకటమ్మ మతిస్థిమితం లేక కొడుకు రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. దీనికి తోడు తన అన్న మ్యాతరి కృష్ణయ్య బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఉన్న మ్యాతరి గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. ఇది తెలిసిన బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న మతిస్థిమితం లేని వెంకటమ్మ -
సమస్యల పరిష్కారానికి డెడ్లైన్
సాక్షి, నాగర్కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు.. పూర్వంలో గ్రామాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా నిర్వహించినట్టుగా ఇకనుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించనున్నారు. మ్యుటేషన్, రికార్డుల మార్పులు జరిగినప్పుడు వాటిని గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను మారుస్తారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్కు, కలెక్టర్ నిర్ణయంపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీళ్లను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు ఉచిత న్యాయసాయాన్ని అందించనున్నారు. మండలస్థాయి, జిల్లా లీగల్ అథారిటీల ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించనున్నారు. మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భూభారతిపై విస్త్తృత అవగాహనకల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
ఫుట్బాల్ క్రీడాకారుల సైకిల్ యాత్ర
గద్వాలటౌన్: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు కోరుతూ మూడేళ్ల కిందట గద్వాల క్రీడాకారులు జిల్లాకేంద్రం నుంచి మంత్రాలయం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. గతేడాది జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు కావడంతో మంత్రాలయం రాఘవేంద్రస్వామికి మొక్కు చెల్లించడంలో భాగంగా శుక్రవారం సీనియర్ క్రీడాకారుడు, ఇంటిలిజెన్స్ సీఐ నర్సింహారాజు ఆధ్వర్యంలో 30 మంది క్రీడాకారులు ప్రత్యేక డ్రస్ కోడ్లో స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. శుక్రవారం స్వామివారికి మొక్క చెల్లించి శనివారం గద్వాలకు చేరుకుంటారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్కుమార్, విజిలెన్స్ సీఐ విజయసింహ, మాజీ కౌన్సిలర్ బండల పాండు, సీనియర్ క్రీడాకారులు జగన్, ఇండికా శివ, జయసింహ, ప్రశాంత్, స్వామి, హరిశంకర్గౌడ్, విజయ్, బండల నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐతోల్లో భవన నిర్మాణ కార్మికుడి మృతి
నాగర్కర్నూల్ క్రైం: భవన నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుడు మృతి చెందిన సంఘటన తాడూరు మండల పరిధిలోని ఐతోలులో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామానికి చెందిన సంపంగి రాములు (32) ఐతోల్లో నిర్మాణమవుతున్న ప్రైవేటు పాఠశాల భవనంలో కూలీ పనికోసం వెళ్లాడు. అస్వస్థతకు గురై కింద పడిపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. భవన యజమాని లక్ష్మారెడ్డి గురువారం రాత్రి వరకు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలోని ప్రధానరహదారిపై ధర్నాకు దిగారు. యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో.. అక్కడికి చేరకున్న పోలీసులు అక్కడి వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. న్యాయం చేయాలని జిల్లాకేంద్రంలో ధర్నా -
మెనూ పాటించడం లేదని హాస్టల్ విద్యార్థుల నిరసన
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే కామన్ మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసన తెలిపారు. గురువారం రాత్రి భోజన సమయంలో భోజనానికి ముందు మెనూ గురించి అడిగితే ఔట్సోర్సింగ్ కుక్ శ్రీశైలం పొంతలేని సమాధానాలు చెప్పారని ఆరోపించారు. భోజనాలు చేయకుండా హాస్టల్లో ఉండే విద్యార్థులు అంతా కలిసి పట్టణంలోని పాలమూరు రోడ్డుపైకి వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ వార్డెన్ ఖలీల్ విద్యార్థులకు నచ్చజెప్పి హాస్టల్కు తీసుకొచ్చారు. హాస్టల్ లోపలికి వచ్చిన విద్యార్థులు భోజనం చేయమని వారించి రాత్రి 10 గంటల దాకా హాస్టల్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. చివరికి హాస్టల్ వార్డెన్ వారికి నచ్చజెప్పి, కుక్ను తొలగిస్తామని, మెనూ ప్రకారం భోజనం ఉండేలా చూసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి అందేలా చూస్తానని చెప్పడంతో విద్యార్థులు నిరసన విరమించి.. భోజనాలు చేశారు. -
డెడ్ స్టోరేజీ
మే నెలాఖరుకు ఎడారిలా.. జూరాల ప్రాజెక్టు●అడుగంటిపోయిన జూరాల జలాశయం ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు.. ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా అయిన జూరాల జలాశయం గతంలో ఎన్నడూ లేనంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. వరుసగా రెండో ఏడాది కూడా జలాశయం అడుగంటిపోయింది. ఫలితంగా ఇప్పటికే సాగునీటి కష్టా లు తలెత్తగా.. రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అధికారులు ఇప్పటికే జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వల కింద రబీలో సాగుచేసిన ఆయకట్టుకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఈ నెలాఖరు నాటికే సరిపోతాయని, మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో తాగునీటి గండాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నా య చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్లను ఆయా కలెక్టర్లకు విడుదల చేశారు. అధిక సాగు నేపథ్యంలో.. జూరాల కింద.. జూరాల జలాశయం కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వలు ఉండగా.. దీని ద మొత్తం ఆయకట్టు 1.09 లక్షల ఎకరాలు. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్లో ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 72 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాల్వ కింద జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 37 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా కాల్వల కింద కేవలం 35 వేల ఎకరాలకు వారబందీ విధానంలో ఏప్రిల్ 15 వరకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు అధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట సాగుచేయడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మే నెలాఖరు నాటికే.. ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగరకర్నూల్ జిల్లాలు తాగునీటి అవసరాల కోసం జూరాల జలాశయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇందుకోసం ప్రస్తుతం రోజుకు 0.1 టీఎంసీల నీటిని వదులుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జలాశయంలో ఉన్న 0.208 టీఎంసీల నీరు మే నెలాఖరు నాటికే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. తొమ్మిదేళ్లుగా మే మొదటి వారంలో జూరాలలో అందుబాటులో నీటినిల్వలు ఇలా... ఏడాది అందుబాటులో నీటినిల్వ 2016 3.696 టీఎంసీలు 2017 4.829 టీఎంసీలు 2018 4.747 టీఎంసీలు 2019 2.689టీఎంసీలు 2020 7.627 టీఎంసీలు 2021 6.477 టీఎంసీలు 2022 7.836 టీఎంసీలు 2023 4.038 టీఎంసీలు 2024 4.004 టీఎంసీలు 2025 2.953 టీఎంసీలు (ఏప్రిల్17) అడుగంటిన జలాశయం.. ఆందోళనలో రైతన్నలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 2.871 టీఎంసీలు మాత్రమే తాగునీటి కోసం ప్రతి రోజు 0.1 టీఎంసీలు వినియోగం ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి నిలిపివేత రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు -
దేశంలోనే రోల్ మోడల్గా భూభారతి
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, మంద మకరంద్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ బేన్షాలం, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యాయానికి శ్రీకారం రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతూ భూ భారతి పోర్టల్ను ఈ నెల 14న ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసిందని, భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండానేభూ సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సు ప్రారంభం -
ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్.వెంకట్రాంను నాగర్కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న జి.కళార్చన వనపర్తి జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కమలాపురం కవితను వనపర్తిలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. మహబూబ్నగర్ కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న గుండ్ల రాధికను ఇక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. -
బీసీలంతా సంఘటితం కావాలి
నవాబుపేట: బీసీలంతా సంఘటితమై దోపిడీ వర్గాల రాజ్యాలను కూలదోసి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు అజయ్కుమార్ యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయ ఆవరణలో బీసీ జనచైతన్య సదస్సు వేదిక జిల్లా నాయకుడు మాధవులు అధ్యక్షతన జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దోపిడీ రాజ్యం నడుస్తోందన్నారు. ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్కు తాజాగా బీసీల గణన గుర్తుకురావటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అది నాయకత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని బీజేపీ సైతం అధిక జనాభా కలిగిన బీసీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీసీలంతా పార్టీలు వీడి సమష్టిగా ఉన్నప్పుడే బలం తెలిసి రాజ్యాధికారం వస్తుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బోయిని మహేష్, జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మాజీ సర్పంచ్లు యాదయ్య, ఆంజనేయులు, మాసయ్య, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్నాయీ, జిల్లా నాయకులు అంజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హార్వెస్టర్ మరమ్మతు చేస్తూ.. యువకుడు మృతి
ఆత్మకూర్: వరి కోత యంత్రం మరమ్మతు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతిచెందిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ కథనం మేరకు.. పట్టణంలోని భార్గవినగర్కు చెందిన కావలి వెంకటేష్ (30) సొంతంగా వరి కోత యంత్రం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం మధ్యాహ్నం మేడేపల్లి శివారులో వరికోత యంత్రం మరమ్మతుకు గురికావడంతో డ్రైవర్ మన్యంతో కలిసి బాగు చేస్తుండగా కట్టర్ బార్ మీద పడటంతో వెంకటేష్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి .. పాన్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 13వ తేదీన పాన్గల్ మండలంలోని అన్నారంతండా సమీపంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో వనపర్తి మండలం నాగవరం గ్రామానికి చెందిన దేవేందర్(47)కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుఢి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికపై వేధింపులు.. యువకుడిపై కేసు నమోదు మిడ్జిల్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లిలో మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ వేధిస్తున్నాడని, అమ్మాయి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు యువకుడిపై గురువారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. దొంగకు మూడేళ్ల జైలుశిక్ష ఖిల్లాఘనపురం: దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయమూర్తి మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు ఎస్ఐ సురేష్గౌడ్ తెలిపారు. వివరాలు.. ఖిల్లాఘనపురం మండలంలోని బజారు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న బంగారు వర్క్షాపులో 2024 డిసెంబర్ 24న 14 గ్రాముల బంగారు ఆభరణాలు, 615 గ్రాముల వెండి వస్తువులు కలిపి మొత్తం రూ.40,300 విలువ చేసే వస్తువులు దొంగిలించబడ్డాయి. ఈ విషయమై షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన పంతంగాణి మన్యంకొండ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు డిసెంబర్ 29 కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశంతో రిమాండ్ తరలించారు. ఎస్ఐ సురేష్గౌడ్ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించడంతో వనపర్తి జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు న్యాయమూర్తి నిందితుడికి మూడేళ్ల కఠిన జైలు శిక్ష ఖరారు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర అభియోగ అధికారి వై.రాజేష్, కోర్టు డ్యూటీ అధికారి టి.శ్రీనివాసులు సహకారం అందించారని పేర్కొన్నారు. -
‘సోనియాగాంధీపై ఆరోపణలు తట్టుకోలేకపోయా’
వనపర్తి టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాహుల్గాంధీ బ్రాండ్ ఇమేజ్ రాజకీయాలకు భయపడుతూ ఆక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తోందని, మోదీ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఈడీ చార్జిషీట్ వేయడాన్ని నిరసిస్తూ గురువారం వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో చిన్నారెడ్డి పాల్గొని మాట్లాడారు. విలువలు, నిజాయితీ కలిగిన రాజకీయాలకు సోనియాగాంధీ పెట్టింది పేరని, ఆమైపె చార్జీషీటు వేయడాన్ని తట్టుకోలేకపోయానని చిన్నారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సోనియాగాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారన్నారు. నేషనల్ హెరాల్డ్ను రుజువులు లేకుండా లాగుతున్నారని, పుష్కరకాలం నాటి హెరాల్డ్ కేసులో ఒక్క పైసా కూడా మార్పిడి జరగలేదని చెప్పారు. న్యాయస్థానంలో ఈడీకి, కేడీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వేణు, సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవరగుట్టలో సీసీ కెమెరాల నిఘా
నవాబుపేట: మండలంలోని యన్మన్గండ్ల దేవరగుట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఫారెస్టు అధికారి చంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన సిబ్బందితో కలిసి చిరుతలు నివాసం ఉంటున్న గుట్టను పరిశీలించారు. తమకు, పశువులకు ప్రాణహాని ఉందని చిరుతల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు. గ్రామానికి దగ్గరగా ఉన్న గుట్టలో చిరుతలు ఉండటంతో నిత్యం భయంతో జీవిస్తున్నామని రక్షణ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. దేవరగుట్టలో చిరుతలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయని, పరిసరాల్లోకి వెళ్లరాదని సూచించారు. చిరుతల కదలికలు గుర్తించేందుకు ముందుగా గుట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో వాటి కదలికల ఆధారంగా బోనుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ● బోన్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం -
ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలి
చిన్నచింతకుంట: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర సూచించారు. చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో చిన్నచింతకుంటలో మహిళా సంఘం సభ్యులు, కస్తూర్బ విద్యార్థినీలకు ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఒక నేరం జరిగినప్పుడు చూసినా, తెలిసినా కచ్చితంగా సాక్ష్యం చెప్పాలని.. అప్పుడే నేరస్తుడికి శిక్ష పడుతుందన్నారు. నేరాల అదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమన్నారు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణకు ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని వాటిని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్నేహ పూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం 2024 ప్రకారం బాలలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు లేదా 100 డయల్ చేయాలని, 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లయ్య, ఎంపీడీఓ సుధాకర్రెడ్డి, ఎస్ఐ రామ్లాల్నాయక్, ఏపీఎం విష్ణుచారి, మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు పద్మమ్మ, లీగల్ వలంటీర్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షాలు.. పంటలో జాగ్రత్తలు
అలంపూర్: అకాల వర్షాలతో పంటకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వివిధ దశలో ఉన్న మొక్కజొన్న, పత్తి, వరి, పసుపు వంటి పంటకు నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న ఆకాల వర్షాలతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఈ దశలో పంటను కాపాడుకోవడానికి రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటను రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు రైతులకు మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ పంటను కాపాడుకోవడానికి సూచనలు ఇలా.. వరి ● వరి పంట ప్రస్తుతం పొట్టు దశలో చివరి దశలో ఉంది. గింజ గట్టిపడి కోతకు సిద్ధంగా ఉంది. ● కోతకు సిద్ధంగా ఉన్నా..లేదా గింజ గట్టిపడి వెన్ను వంగి ఉన్న దశలో పైరు పడిపోతే పొలంలోకి చేరిన నీటిని తొలగించుకోవాలి. ● గింజకు శిలీంధ్రాలు ఆశించకుండా గింజ నల్లబడకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి 2 మి.లీ. హెక్సా కొన జోల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఖాళీగా ఉన్న పొలాల్లో ఈ తేమతో దుక్కి దున్నుకోవాలి. ● హైబ్రిడ్ వరిలో వర్షాల వలన సుంకు రాలిపోవడం జరుగుతుంది. ఈ మేరకు కొంత నష్టం జరుగుతుంది. ● వరి కోత దశలో ఉన్న సమయాల్లో తొందరపడి కోయకుండా వారం రోజుల పాటు ఆగి ఆ తర్వాత మొదలు పెట్టుకోవాలి. ● కోత కోసిన పైర్లను వాటిని పొలాల్లో కాకుండా పొలం గట్ల మీద వేసుకోవాలి. పొలాల్లోనే ఉంటే మొలకలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గట్లపై వేసిన పైరుపై లీటర్ నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి చల్లాలి. ఇలా చేస్తే మొలక రాదు. ● వర్షాలు తగ్గిన తర్వాత పంటను నూర్పిడి చేసి ఎండలో బాగ ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. పత్తి ● పత్తి సాగు చేసిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంట పైరు కాలన్నీ పొడగించరాదు. తేమను ఆసరాగా చేసుకోని లోతు దుక్కిలు చేసుకోవాలి. పసుపు ● తడిసిన దుంపలను భూమి నుంచి వేరు చేసి టార్పాలిన్ బరకలతో కప్పుకోవాలి. ● దుంపలు తడవడం వలన ఎండిన తర్వాత రంగు మారుతాయి. మార్కెట్కు తీసుకెళ్లే మంచి ధర లభించే అవకాశం ఉండకపోవచ్చు. ● ఆశించిన ధర లభించాలంటే దుంపలను పాలిషింగ్ చేయాలి. దీని వలన నాణ్యత పెరిగి మంచి ధర లభిస్తోంది. అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి సహాయ సహకరాలను తీసుకోవాలని సూచించారు. పాడి–పంట మొక్కజొన్న కోతకు వచ్చిన పంటను ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకోని కోత కోయరాదు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత కోతను ప్రారంభించుకోవడం మంచిది. కోసిన కంకులు తడిస్తే వెంటనే పొలం నుంచి బయటికి తెచ్చి ప్రత్యేక గాలి మరల ద్వారా 100 శాతం ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టకపోతే ధాన్యం రంగు మారుతుంది. బూజుపట్టే అవకాశం లేకపోలేదు. తినడానికి పనికిరాకుండా పోవడం, విక్రయానికి తీసుకెళ్లిన ఆశించిన మద్దతు ధర లభించకపోవడం జరుగుతుంది. గింజలు తడిస్తే నీడలో ఆరబెట్టి గాలి పంకాల ద్వార ఆరబెట్టుకోవాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. -
పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామ పంచాయితీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయితీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 60 ప్రకారం జీతాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, జీఓ 51ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు దేవదానం, సాంబశివుడు, కుర్మయ్య, వెంకట్రాములు, తిమ్మయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకర ప్రదేశం మినహాయించి..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో శిథిలాల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. సహాయక బృందాలు 55 రోజులుగా నిరంతరాయంగా తవ్వకాలు చేపడుతున్నా ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు. గురువారం మూడు షిఫ్ట్లలో సొరంగంలోకి వెళ్లి పేరుకుపోయిన మట్టి, బురద తవ్వకాలు చేపడుతున్నారు. డీ2 ప్రదేశంలో 5 ఎస్కవేటర్లతో పెద్ద పెద్ద బండరాళ్లు తొలగిస్తూ అత్యధికంగా ఉన్న మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. నిషేధిత ప్రదేశం 50 మీటర్లు మినహాయిస్తే.. డీ2–డీ1 మధ్య మరో 20 మీటర్ల పొడువు మూడు అడుగుల మేర ఉన్న మట్టి, బురద, శిథిలాల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. మరో రెండ్రోజుల్లో ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. సొరంగం పైకప్పు కూలిన 13.940 కిలోమీటరు డీ1 ప్రదేశంలో 40 మీటర్ల వరకు డేంజర్ జోన్గా గుర్తించి కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో బలహీనంగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లకు సపోర్టుగా సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది టైగర్ క్లాక్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ శిథిలాలు నిండుగా ఉన్నాయి. అత్యంత ప్రమాదకర ప్రదేశం మినహాయించి తవ్వకాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న 20 మీటర్ల తవ్వకాల్లో కార్మికుల ఆచూకీ లభించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీబీఎం కొంత భాగం నిషేధిత ప్రదేశంలో చిక్కుకుపోయి ఉండటంతో కార్మికులు అందులో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీఎస్ఐ తదితర జాతీయ సహాయక బృందాలతో పాటు ప్రభుత్వ విభాగాలతో ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధిత ప్రదేశంలో కార్మికులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగించాలా? సహాయక సిబ్బందికి ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ముందకెళ్లే అవకాశం కనిపిస్తోంది. డీ–2 ప్రదేశంలో మట్టి తవ్వకాలు.. సొరంగంలోని ప్రమాద డీ2 ప్రదేశంలో సహాయ సిబ్బంది మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద గురువారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల అచూకీ కనుక్కొనేందుకు డీ1, డీ2 ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుందన్నారు. డీ2 ప్రదేశంలో మట్టి తవ్వకాలు చేపడుతూ టీబీఎం కత్తిరింపు పనులు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరంగా వస్తున్న నీటి ఊటను బయటకు పంపిస్తున్నామని, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేశామన్నారు. సొరంగం నిపుణులు ప్రమాద ప్రదేశాన్ని నిరంతరం పరిశీలిస్తూ సహాయక సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తయ్యే అవకాశం నిషేధిత ప్రదేశంలో రెస్క్యూ కొనసాగేనా? -
ఆధార్లా ప్రతి రైతుకు భూధార్ కార్డులు
జడ్చర్ల: ప్రతి ఒక్కరికి భూమితో అనుబంధం ఉందని, ఆయా భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమలులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంపై జడ్చర్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టంలో భూ సమస్యలను సకాలంలో పరిష్కరించలేని స్థితి ఉండేదని, ప్రజావాణిలో తమకు అనేక సమస్యలపై ఫిర్యాదు లు వచ్చాయన్నారు. తాజాగా అమలులోకి వచ్చిన భూభారతి చట్టంలో ఆయా సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో తాము పరిష్కరించలేని సమస్యలకు సంబంధించి సివిల్ కోర్టులను ఆశ్రయించే పరిస్థితి ఉండేదన్నా రు. ఇక నుంచి భూభారతి చట్టంతో ఆ పరిస్థితి ఉండదన్నారు. తహసీల్దార్పై ఆర్డీఓకు, ఆర్డీఓ నుంచి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి భూపరిపాలన కమిషనర్కు, అక్కడి నుంచి ట్రిబ్యునల్కు అప్పీల్కు వెళ్లి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆధార్కార్డుల మాదిరిగా భూధార్ కార్డులు జారీ చేయడంతో పాటు పాసు పుస్తకంలో భూమికి సంబంధించి మ్యాపును పొందుపరుస్తామన్నారు. సమస్య సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలన అధికారులు ఉంటారని, లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఇక భూ తగాదాలు, వివాదాలు, భయాలు లేకుండా భూ క్రయవిక్రయాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. భూ హక్కులు భూ యజమానికే ఉంటూ సంపూర్ణంగా అనుభవించే హక్కులు కొత్తచట్టంలో ఉంటాయని పేర్కొన్నారు. ● భూ భారతి చట్టం ఓ విప్లవాత్మకమైన మార్పు అని చట్టం రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన భూమి సునీల్ పేర్కొన్నారు. ఇందులో కీలకమైన 4,5,7,8 సెక్షన్లను గుర్తుంచుకుంటే మంచిందన్నారు. 25 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే భూ భారతి చట్టాన్ని అధ్యయనం చేసి రూపొందించినట్లు చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే రెవెన్యూ సదస్సులలో దరఖాస్తును స్వీకరించనున్నట్లు చెప్పారు. దాదాపు 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం గుర్తించనుందన్నారు. సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించనుందని తెలిపారు. అవగాహన సదస్సు అనంతరం రైతులతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ నర్సింగరావు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. నేనూ ధరణి బాధితుడినే: ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తాను రాజకీయాల్లోకి రావడానికి భూ సమస్యలే కారణమని, తానూ ధరణి బాధితుడినేనని ఎమ్మెల్యే అనిరుధ్డ్డి తెలిపారు. రంగారెడ్డిగూడెంలో తమ తాతలు దేవాదాయశాఖకు ఇచ్చిన భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో తాము కొట్లాడి కోర్టుకు వెళ్లి దేవాదాయ శాఖ భూమిని కాపాడుకున్నామన్నారు. తాను రాజకీయాలలోకి రావడానికి ఇదే కారణమన్నారు. ప్రజాపాలనలో భాగంగానే భూ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చారని తెలిపారు. భూసమస్యల పరిష్కారం కోసమే భూభారతి పాసు పుస్తకంలో భూమికి సంబంధించి మ్యాపు: కలెక్టర్ విజయేందిర జడ్చర్లలో అవగాహన సదస్సు -
సంజనకుఎస్పీ అభినందన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇటీవల తోటి కళాకారులతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శనలో గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన నగరానికి చెందిన సంజనను ఎస్పీ డి.జానకి అభినందించారు. మహబూబ్నగర్లోని రైతుబజార్లో కూరగాయల వ్యాపారం చేసే భాగ్యలక్ష్మి, మాడమోని చందు దంపతుల ఏకై క కూతురైన ఈ బాలిక ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని చైతన్య సెంట్రల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. అలాగే స్థానిక వైష్ణవి ఆర్ట్స్ అకాడమిలో క్లాసికల్ డాన్స్ టీచర్ విజయలక్ష్మి వద్ద తొమ్మిదేళ్ల పాటు కూచిపూడి నాట్యం నేర్చుకుంది. గురువారం ఎస్పీని ఈ విద్యార్థిని తన తల్లిదండ్రులతో పాటు కలిశారు. కాగా, చదువులోనూ ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకునిరావాలని సూచించారు. బాదేపల్లి మార్కెట్కు పోటెత్తిన మొక్కజొన్న జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్ యార్డుకు గురువారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 2,474 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్గా గరిష్టంగా రూ.2,259, కనిష్టంగా రూ.1,681 ధరలు లభించాయి. అదేవిధంగా వేరుశనగ గరిష్టంగా రూ.6,639, కనిష్టంగా రూ.5,241, కందులు రూ.6,411, రాగులు రూ.2,711, చిందగింజలు రూ.3,427, జొన్నలు గరిష్టంగా రూ.4,177, కనిష్టంగా రూ.3,277, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,925, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,306, కనిష్టంగా రూ.1,809, ఆముదాలు రూ.గరిష్టంగా రూ.6,188, కనిష్టంగా రూ.6,058 ధరలు పలికాయి. ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రబంధ వాజ్మ యం సాహిత్యం శీలనముఅనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేటి కాలంలో కవులు అంతరించి పోతున్నారని, ఇలాంటి తరుణంలో కళాశాలలో ప్రబంధ వాజ్మయం పేరుతో సెమినార్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రబంధ వాజ్మయం హాస్యం, చతురత, వర్ణన, శృంగారం, కథ అనే అంశాల ఆధారంగా ఆనాటి జీవన స్థితిగతులను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరిస్తుందన్నారు. ఈ సందర్భంగా సెమినార్ సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కసిరెడ్డి వెంకట్రెడ్డి, పీయూ కంట్రోలర్ రాజ్కుమార్, లక్ష్మీనరసింహరావు, కేశర్దన్ తదితరులు పాల్గొన్నారు. 22న జిల్లా సదస్సు మహబూబ్నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే 20న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్గౌడ్, వేణుగోపాల్, అనురాధ, పద్మ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కానిస్టేబుల్, ఎస్సై, వీఆర్వో వంటి ఉద్యోగాలు పొందేందుకు యువతకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని అశోక్నగర్, దిల్సుఖ్నగర్లో ఉండే కోచింగ్ సెంటర్లకు ధీటుగా కోచింగ్ ఇస్తామని, అందుకోసం అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, త్వరలో ప్రభుత్వం వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న క్రమంలో యువత శిక్షణలో పాల్గొనాలని తెలిపారు. శిక్షణ వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని, వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషమం అన్నారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, గుండా మనోహర్, శ్రీనివాస్యాదవ్, ఆవేజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి ధర తగ్గుముఖం
● క్వింటా గరిష్టంగా రూ.1,500.. కనిష్టంగా రూ.వెయ్యి దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం జరిగిన ఉల్లి వేలంలో ధరలు మరింత పడిపోయాయి. మూడు వారాలుగా నిలకడగా ఉన్న ధరలు.. ఈ వారం మరింత తగ్గడంతో వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. మార్కెట్లో ఎక్కడ చూసినా కొనుగోలుదారులు కనిపించారు. మార్కెట్కు దాదాపు 5 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఉదయం పదికి వేలం ప్రారంభంకాగా.. మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే సమయం సరిపోకపోవడంతో చాలామంది వ్యాపారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి విక్రయాలు సాగించారు. ధరలు ఇలా.. ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.1,500 పలికింది. గత వారంతో పోలిస్తే దాదాపు రూ.500 తగ్గింది. కనిష్టంగా రూ.1000 వరకు వచ్చింది. గత వారంతో పోలిస్తే సుమారు రూ.600 వరకు తగ్గింది. నాణ్యమైన ఉల్లి 50 కిలోల బస్తా రూ.600 నుంచి రూ.750 వరకు విక్రయించారు. రెండో రకం ఉల్లిని రూ.500 నుంచి రూ.550 వరకు విక్రయించారు. పోటాపోటీగా.. మార్కెట్లో ఉల్లిని తూకం వేసి అమ్మే వరకు చాలా ఖర్చు వస్తుందని భావించిన పలువురు రైతులు పొలం వద్దే 50 కిలోల బస్తాలు తయారు చేసి ట్రాక్టర్లపై తెచ్చి రోడ్డుపైనే విక్రయించారు. రూ.600 నుంచి రూ.700 వరకు బస్తా విక్రయించడంతో చాలామంది కొనుగోలు చేశారు. ఉదయం మార్కెట్ తెరవక ముందే 7 గంటల నుంచే ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు పది ట్రాక్టర్ల ఉల్లిని రైతులు బయటనే విక్రయించారు. -
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
మానవపాడు: వడదెబ్బకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మానవపాడు మండలం చెన్నిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చెన్నిపాడు గ్రామానికి చెందిన తిరుపాలు (58) మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ విజయశంకర్, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య చిట్టెమ్మ, కుమారులు చిరంజీవి, రాజేశ్, కూతురు అనిత ఉన్నారు. తిరుపాలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం మానవపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని ఎన్హెచ్–44పై బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ వివరాల మేరకు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారూరు గ్రామానికి చెందిన కాశీనాథ్ నాయుడు (32) కర్నూలులోని ఆటో షారూంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. బుధవారం కర్నూలు నుంచి పెద్దమారూరుకు బైక్పై వెళ్తుండగా.. మానవపాడు స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు అతడిని హైవే అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య గాయత్రి, కొడుకు, కూతురు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహం లభ్యం రాజాపూర్(బాలానగర్): ప్రమాదవశాత్తు చెరువులో పడి రెండు రోజుల క్రితం గల్లంతైన యాదయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. మండలంలోని మోతిఘనాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో గంగధర్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్, యాదయ్యలు గల్లంతుకావడంతో మంగళవారం శివకుమార్ మృతదేహం లభ్యం కాగా, ఈరోజు యాదయ్య మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. తేనెటీగల దాడిలో గొర్రెల కాపరికి గాయాలు మన్ననూర్: తేనెటీగల దాడిలో గొర్రెల కాపరికి తీవ్రగాయాలైన ఘటన మన్ననూర్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమ్రాబాద్కు చెందిన గొర్రెలకాపరి నోముల ఎల్లయ్య రోజు మాదిరిగా తన గొర్రెల మందను మేత కోసం మన్ననూర్ సమీపంలోని నీరంజన్ షావలి దర్గా సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు ఉన్న తేనె తుట్టెలోని తేనెటీగలు ఒక్కసారిగా ఎల్లయ్యపై దాడి చేశాయి. గమనించిన తోటి గొర్రెల కాపరులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. -
చెరువు మట్టితో భూసారం
అలంపూర్: పంటల సాగులో ప్రధాన భూమిక భూసారానిదే. భూమిలో శక్తి ఉంటేనే దిగుబడులు ఆశించిన మేరకు వస్తాయి. భూసారం తగ్గితే తెగుళ్లు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. పెట్టుబడులు పెరగడంతో పాటు పంట నాణ్యత తగ్గుతుందని వివరించారు. వీటిని తట్టుకోవడానికి భూసారం అవసరమని వివరించారు. భూసారం పెంపు ఇలా.. చెరువు పూడిక మట్టితో భూమి నాణ్యత, తేమను నింపుకొనే శక్తిని పెరుగుతుంది. నీటి వినియోగ సామర్థ్యంతో పాటు భూమిలోని సారం పెరగడానికి దోహద పడుతుంది. మట్టి పీహెచ్ తగ్గి సేంద్రియ కర్బనం, నత్రజని, భూసారం, పొటాష్, సూక్ష్మ పోషకాలు పెరిగి అధిక దిగుబడి వస్తోంది. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉంటే మినరలైజేషన్ అధికంగా జరిగి మొక్కల పెరుగుదల ఉంటుంది. పండ్ల తోటల్లో.. మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి తదితర పంటలకు చెరువు మట్టి వాడకం వల్ల వేరు వ్యవస్థ బలంగా విస్తరించి ఏపుగా పెరుగుతుంది. దీంతో భూమిలో తేమ నిలుపుకొనే శక్తి పెరుగుతుంది. పాదుల్లో మల్చింగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 10 కిలోల చెరువు మట్టిని వేసుకోవచ్చు. కూరగాయల సాగులో.. టమాటా, బెండ, వంకాయ తదితర పంటల సాగులో అధిక దిగుబడుల కోసం ఎరువులు ఎక్కువగా వాడటం జరుగుతుంది. దీంతో పెట్టుబడి విపరీతంగా పెరుగుతుంది. కూరగాయల సాగుచేసే పొలాల్లో ఎకరాకు 8 నుంచి 10 ట్రాక్టర్ల చెరువుమట్టి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నితే మంచి నాణ్యతగల పంటలు వస్తాయి. పెట్టుబడి తగ్గుతుంది. అంతేగాక తేమ శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. వ్యవసాయ పొలంలో వేసిన చెరువు మట్టి (మిల్లీ గ్రాముల్లో).. నత్రజని 720 పొటాష్ 310భాస్వరం 35 బొరాన్ 0.8 మేలుచేసే సూక్ష్మజీవుల సాంద్రత : 308గంథకం 18 పాడి–పంట ఒక కిలో చెరువు మట్టిలో ఉండే పోషక విలువలు ఇలా కర్బనం 0.5 జింక్ 2.8 -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి సమష్టి కృషి
అలంపూర్: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆలయాల్లో ధర్మకర్తల మండలి సాధారణ సమావేశం జరగగా.. చైర్మన్తో పాటు ఈఓ పురేందర్కుమార్, ధర్మకర్తలు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆలయాల అభివృద్ధి ఉన్నత కమిటీ, కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. పునరుద్ధరణకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను నివేదించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు పొందాల్సిన అంశాలను చర్చించినట్లు వివరించారు. 2025–2027 సంవత్సరానికి సంబంధించి కౌలు వేలం నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఆలయ ధర్మకర్త మండలి తీర్మానించిందన్నారు. సమావేశంలో ధర్మకర్తలు జగదీశ్వర్గౌడ్, జగన్మోహన్నాయుడు, అడ్డాకుల వెంకటేశ్వర్లు, గోపాల్, విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
రైతన్నకు అకాల కష్టం
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమాగం అవుతుంది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఎండలతో అన్నదాతలు ఆగమాగం అవుతుంది. చేతికొచ్చిన పంటలు ఎండిపోయి ఒకవైపు.. వడగండ్లతో వరి పంట రాలిపోయింది. భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో జిల్లాలో సుమారు 12 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. అధికారులు మాత్రం 504 ఎకరాల వరి పంటనే ఎండిపోయిందని చెబుతున్నారు. కాగా.. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఐదువేల ఎకరాలకు పైగానే పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహబూబ్నగర్ రూరల్, దేవరకద్ర, మిడ్జిల్ మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట వడగండ్ల వానతో పూర్తిగా నేలమట్టమైంది. వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటలు సైతం అకాల వర్షం వల్ల నష్టపోయినట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ వర్షాలతో 2 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పొలాలను పరిశీలించి రైతు వారీగా వరి పంట నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు వారీగా వివరాలు సేకరిస్తాం అకాల వర్షాల కారణంగా జిల్లాలో 2 వేల ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశాం. రైతు వారీగా ఏఈఓలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగుతుంది. ఆ తర్వాత నష్టానికి సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తాం. అకాల వర్షాలకు వరి పంట 33 శాతానికి పైగా దెబ్బతింటే ఆ రైతు వందశాతం పంట నష్టపోయినట్లు గుర్తిస్తున్నాం. సర్వే పూర్తయిన తర్వాత కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి జిల్లాలో పంట నష్టపోయిన రైతుల వివరాలు పంపిస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు 2 వేల ఎకరాల్లో పంట నష్టం -
12.75 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత
మల్దకల్: మండలంలోని కుర్తిరావుల చెర్వులో 12.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీడ్ సబ్ ఆర్గనైజర్ శ్రీను అలియాస్ రాజు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర ఏర్పాటు చేసిన షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన 12.75క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షెడ్డులో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, సీడ్ సబ్ ఆర్గనైజర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడులలో వ్యవసాయాధికారి రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: జిల్లాలో నమోదవుతున్న ప్రతి నేరానికి సంబంధించిన కేసుల్లో పారదర్శకంగా సమగ్రమైన విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచే దిశగా కృషి చేయాలని ఎస్పీ జానకి పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసును ప్రాధాన్యతతో సమగ్రంగా విచారించాలని సూచించారు. పోలీస్స్టేషన్ వారీగా గ్రేవ్, నాన్–గ్రేవ్, యూఐ కేసుల వివరాలను సమీక్షించి.. యూఐ కేసులు విచారణ దశలోనే నిలిచిపోతున్నాయనే విషయంపై ఆరా తీశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసుల పురోగతిని సమీక్షిస్తూ ఈ కేసుల్లో నిందితులకు గరిష్టంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిందితులకు శిక్షల శాతం పెంచేలా పని చేయాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, ముఖ్యంగా పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. నిందితులను లోతుగా విచారించేందుకు తగిన కృషి జరగాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, అరెస్టులు వంటి అంశాలు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు వెంకటేశ్, అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, నాగార్జునగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ముస్లింల హక్కులను కాలరాయడం కోసం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ పిలుపులో భాగంగా బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేశంలోని మైనార్టీలపై కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశంలో భాగమైన ఓ వర్గం ప్రజలపై కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. ముస్లిం ఆత్మగౌరవానికి భంగం కలించే ఏ చర్యలను తాము సహించేది లేదని అన్నారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, నాయకులు పరమేశ్గౌడ్, రాముల, గోవర్థన్, సత్యనారాయణరెడ్డి, బాషా, రాజు, లక్ష్మన్, శ్రీను, సురేష్, ఖద్దుస్బేగ్, సుభానిపటేల్, నసీర్, తకీహుస్సెన్ తదితరులు పాల్గన్నారు. -
పైపులైన్ లీకేజీలువెంటనే సరిచేయండి
● నల్లా బిల్లుల వసూళ్ల శాతం పెరగాలి ● మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఎక్కడైనా పైపులైన్లో లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో తాగునీటిని సరఫరా చేసే లైన్మెన్లు, ఫిట్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యే సమయంలో మున్సిపల్ పవర్ బోర్లు వినియోగించవద్దన్నారు. దీనివల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. మొత్తం 49 డివిజన్ల పరిధిలో సుమారు 750 పవర్ బోర్లును ఏర్పాటు చేశామన్నారు. వీటిని అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. అలాగే నల్లా బిల్లులు కేవలం 13 శాతమే వసూలైందని, బకాయిలను ఎక్కువగా రాబట్టాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎంఈ సందీప్ వరల్డ్ తదితరులు పాల్గొన్నారు. -
భూభారతిపై అవగాహనతో ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి–2025 చట్టంపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్లోనీ సమావేశ మందిరంలో ‘భూభారతి’ భూమి హక్కుల రికార్డు–2025 చట్టంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు–2025 చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టంలోని అన్ని నియమాలను చదివి తెలుసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే అవగాహన కార్యక్రమంలోనే అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. న్యాయసేవ సంస్థలు, ఇతర సంస్థ లు, వ్యవస్థల ద్వారా పేదలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి, మహిళలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఈ చట్టం ద్వారా అందించాలన్నారు. ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కారమార్గం చూపించనుందని తెలిపారు. తహసీల్దారు చేసిన మ్యుటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ లేదా కలెక్టర్కు అప్పీలు చేసుకునేలా రెండు అంచెల అప్పీలు వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. వారసత్వంగా సంక్రమించే భూముల మ్యుటేషన్ల విష యంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. భూభారతి చట్టం–2025 ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడీ భూదార్ ఇవ్వడం గురించి వివరించారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీసీఓ శంకరాచారి, డీఆర్డీఓ నర్సింహులు పాల్గొన్నారు. నేటి నుంచిఅవగాహన సదస్సులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భూభారతి చట్టంపై గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు జిల్లాలో మండలాల రోజువారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17న జడ్చర్లలో, 19న గండేడ్లో మండలంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మహమ్మదాబాద్ మండలంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 21న అడ్డాకల్ మండలంలో ఉదయం, మూసాపేట మండలంలో మధ్యాహ్నం, 22న మిడ్జిల్, భూత్పూర్, 23న చిన్నచింతకుంట, కౌకుంట్ల, 24న కోయిలకొండ, హన్వాడ, 25న దేవరకద్ర, మహబూబ్నగర్ రూరల్, 26న మహబూబ్నగర్ అర్బన్, 28న నవాబుపేట, 29న బాలానగర్, రాజాపూర్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులో ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు. -
దేవరగుట్టలోనే చిరుతల మకాం
నవాబుపేట: మండలంలోని యన్మన్గండ్ల దేవరగుట్టలో రెండు చిరుతలు వారం రోజులుగా మకాం వేశాయి. గుట్టలోని గుహలను ఆవాసంగా మార్చుకున్నాయి. బుధవారం రెండు చిరుతలు ఒకదాని తర్వాత మరొకటి బయట తిరిగి.. మళ్లీ గుహలోకి వెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చాలా వరకు చిరుతలు తమ స్థావరాన్ని మారుస్తూ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం రెండు చిరుతలు దేవరగుట్టను వదలడం లేదు. ఇందుకు అనారోగ్యం కారణమై ఉండవచ్చని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్ అనుమానం వ్యక్తంచేశారు. గుట్ట పరిసరాల్లో పశువులను ఉంచరాదని.. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేవరగుట్ట పరిసరాల్లోని కుక్కలను చిరుతలు హతమార్చి ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. -
చివరి 40 మీటర్ల వరకు చేరితేనే ఆనవాళ్లు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)సొరంగం లోపల బుధవారం సైతం సహాయక చర్యలు కొనసాగాయి. 54 రోజులుగా ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది నిర్విరామంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇంత వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు నిషేధిత ప్రదేశం 40 మీటర్ల పరిధిలో ఉన్నారనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, ఈనెల 20 వరకు ప్రభుత్వం విధించిన గడువులోగా తవ్వకాలు పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. 50మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. సొరంగం లోపల ఐదు ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లు బండరాళ్లను తొలగిస్తుండగా.. డీ2 ప్రదేశంలో తొలగించిన శిథిలాలను కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నారు. అలాగే, ప్లాస్మా కట్టర్తో టీబీఎం బాగాలు కత్తిరించి స్టీల్, బండరాళ్లను లోకో ట్రైన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఇచ్చిన టాస్క్ ప్రకారం నిషేధిత ప్రదేశం వరకు ఉన్న శిథిలాలను తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమైయ్యారు. శిథిలాల కింద ఇప్పటి వరకు ఆరుగురి కార్మికుల అచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు చేపట్టి సుమారుగా రెండు నెలలు కావస్తుండటం, కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో సహాయక బృందాల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతుంది. చివరి వరకు తవ్వకాలు చేపడితే తప్పా అచూకీ లభ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బండరాళ్లు తొలగించే ప్రక్రియ వేగవంతం సొరంగం లోపల సహాయక సిబ్బంది బండరాళ్లు తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రత్యేక అధికారి శివశంకర్ అన్నారు. దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లేట్ వద్ద బుధవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సొంరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారని, విధిగా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్,విజయ్కుమార్,జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్కుమార్ సింగ్,సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య,ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి,హైడ్రా అధికారి,దక్షణ మద్య రైల్వే అధికారి రవింద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో కార్మికుల జాడ కోసం 54 రోజులుగా సహాయక చర్యలు -
విస్తృతం ప్రచారం చేయాలి
బాలల హక్కుల రక్షణ కోసం మహబూబ్నగర్ రూరల్: బాలల రక్షణ కోసం చట్టం నిర్దేశించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు వందనగౌడ్, వచన్కుమార్, మరిపల్లి చందన, ప్రేమ్లత అగర్వాల్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశుగృహ, స్టేట్ హోమ్, జువైనెల్ జస్టిస్ బోర్డులను సందర్శించారు. ముందుగా శిశుగృహను సందర్శించిన కమిషన్ సభ్యులు పిల్లల గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు పిల్లల గురించి శిశు గృహ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ శిశుగృహలో ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని చెప్పారు. స్టేట్హోంలో ఉన్న యువతులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం డీడబ్ల్యూఓ జరీనాబేగంతో కలిసి జిల్లాలోని పిల్లల వివరాలపై సమీక్షించారు. బాల్య వివాహాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు సూచించారు. బాల్య వివాహాల వివరాలపై ఎప్పటికప్పుడు కమిషన్కు నివేదించాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పిల్లల కోసం పని చేస్తున్న ఎన్జీఓలను సమన్వయం చేసుకొని చిన్నారులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని తెలిపారు. పిల్లల సంరక్షణ కేంద్రాలలో ఉన్న చిన్నారులకు అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పిల్లల హక్కుల రక్షణ కోసం స్టేట్ కమిషన్ ఉందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ నయిమొద్దీన్, సభ్యులు మాణిక్యప్ప, విజయకుమార్, జేజేబీ సభ్యులు గేస్ సీడీపీఓ శైలాశ్రీ, ఏసీడీపీఓ వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, శిశుగృహ మేనేజర్ గణేష్బాబు, సూపర్వైజర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది. – అరుణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి జిల్లాకు ఏడు బస్సులు.. నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్లో జమ అయ్యాయి. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ, నాగర్కర్నూల్ ● -
పునరావాస పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలలో పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి దాదాపు మూడు గంటల పాటు పోలేపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను పరిశీలించారు. దేవునిగుట్ట తండా వద్ద ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలు 1, 2లలో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ నిర్వాసిత గ్రామాలతో పాటు చిన్నగుట్టతండా, తుమ్మలకుంట తండా, ఒంటిగుడిసె తండా, రేగడిపట్టి తండావాసులకు సంబంధించి చేపట్టిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. పునరావాస కేంద్రం–1లో రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి 151 ప్లాట్లలో చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, డ్రెయినేజీ, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలు చేపట్టనున్న స్థలాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ పనులపై దృష్టి సారించి నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతివారం పునరావాస కేంద్రాల పనుల పురోగతిని తమ కార్యాలయంలో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇక నుంచి పనుల జాప్యాన్ని సహించబోమన్నారు. వేసవి కాలం పూర్తయ్యేలోగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ నవీన్, నీటిపారుదల శాఖ ఎస్ఈ చక్రధరం, ఈఈలు రమేశ్, ఉదయ్కుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, మౌలిక విద్య సదుపాయాల సంస్థ ఈఈ రాంచందర్, స్థానిక తహసీల్దార్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు రిజిస్ట్రార్ రమేష్బాబుకు మంగళవారం సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీ ల్లో ఒప్పంద అధ్యాపకులు ఏళ్లుగా యూనివర్సిటీలో పని చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని, బడ్జెట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల గొంతు నొక్కవద్దన్నారు. శ్రీధర్రెడ్డి, భూమయ్య, రవికుమర్, విజయ్భాస్కర్, ప్రభాకర్రెడ్డి, సోమేశ్వర్, సుదర్శన్రెడ్డి, రవికుమార్, మృదుల పాల్గొన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఎక్కడా జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై ధాన్యాన్ని పోసి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రోడ్ల అయినా ధాన్యం ఆరబెట్టొద్దని, రోడ్లపై ధాన్యం గుట్టలను గమనించలేక ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, ప్రధానంగా రాత్రి వేళ ధాన్యంపై నల్ల కవర్ కప్పడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయ ని గుర్తు చేశారు. రైతులు ధాన్యం అరబెట్టే సమయాల్లో రోడ్లను కాకుండా ఇతర అనువైన ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు. దేశాభివృద్ధిలో ఆర్థికశాస్త్రం కీలకం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికశాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎకానామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ ఎకానామిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎకానామిక్స్ పూర్తిస్థాయిలో ఎగుమతులు, దిగుమతులు వ్యాపార, వాణిజ్య విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీ రాఘవేందర్రావు, జిమ్మికార్టన్, శివలింగం, రాజునాయక్ పాల్గొన్నారు. పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు మంగళవారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 11 వేల బస్తాల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,261, కనిష్టంగా రూ.1,748 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,321, కనిష్టంగా రూ.4,821, కందులు రూ.5,806, పొద్దుతిరుగుడు రూ.3,114, పెబ్బర్లు రూ.4,500, జొన్నలు రూ.3, 577, ధాన్యం హంస రూ.1,892, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,450, ఆముదాలు రూ.గరిష్టంగా రూ.6,321, కనిష్టంగా రూ.6,000 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్కు దాదాపు 6వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,750, హంస గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,639, ఆముదాలు గరిష్టంగా రూ.6,030, కనిష్టంగా రూ.6,000 లుగా ధరలు నమోదు అయ్యావి. హుండీ లెక్కింపు దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హుండీని లెక్కించారు. అధికారులు, గ్రామస్తుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కించగా.. మొత్తం రూ.4,13,633 ఆదాయం వచ్చింది. కార్యక్రమరంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఈఓ కవిత, ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేంద్రచార్యులు పాల్గొన్నారు. -
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు రూ. 780.63 కోట్లు మంజూరు ● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ ● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది. -
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
అమరచింత: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు రహదారిపై సాగునీరు ఇవ్వాలంటూ మండుటెండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీటిని రామన్పాడు వరకే అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న అమరచింత, ఆత్మకూరు మండలాల రైతులు వరిపంట సాగుచేశారు. వారబందితో సాగునీటిని అందించిన అధికారులు పంటలు చేతికొచ్చే సమయంలో నీటిని నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, తూంపల్లి, గుంటిపల్లి, జూరాల గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకొని ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడే ఉన్న బారికేడ్లు, ముళ్లపొదలు అడ్డంగా పెట్టడంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఎస్ఐ, వనపర్తి జిల్లా అమరచింత ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తమకు సాగునీరు అందించాల్సిందేనని, అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతుల రాస్తారోకో విషయాన్ని సీఐ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వచ్చి ఉన్నతాధికారులతో చర్చించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మండుటెండలో జూరాల ప్రాజెక్టుపై బైఠాయింపు గంటన్నర వరకు కదలని రైతులు నిలిచిన వాహన రాకపోకలు -
మహిళల చేతికి ప్రగతి చక్రాలు
అచ్చంపేట: మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తోంది. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో మొత్తం ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేట 5, కల్వకుర్తి 4, నాగర్కర్నూల్ 2, కొల్లాపూర్ 2, గద్వాల 4, వనపర్తి 7, మహబూబ్నగర్ 5, నారాయణపేట 2, కోస్గి 1, షాద్నగర్ 17 చొప్పున 49 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసరమయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ– సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. రద్దీ నేపథ్యంలో 64 కొత్త బస్సుల కోసం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ల కిందటివి కావడంతో తరుచుగా మరమ్మతుకు గురవుతున్నాయి. పండుగలు, జాతర్లు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో బస్సుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డిపోల పరిధిలో అచ్చంపేటకు (2 ఎక్స్ప్రెస్లు), కల్వకుర్తికి (2 ఎక్స్ప్రెస్లు) నాగర్కర్నూల్కు (3 పల్లె వెలుగులు), గద్వాలకు (7 ఎక్స్ప్రెస్లు, 12 పల్లె వెలుగులు, 2 డీలక్స్లు), వనపర్తికి (4 ఎక్స్ప్రెస్లు, 4 పల్లె వెలుగులు), మహబూబ్నగర్కు (11 ఎక్స్ప్రెస్లు, 6 పల్లె వెలుగులు), నారాయణపేటకు (1 ఎక్స్ప్రెస్, 1 పల్లెవెలుగు), షాద్నగర్కు (6 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు) చొప్పున మొత్తం 64 బస్సుల కోసం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ కొత్త బస్సులు ఆయా డిపోలకు చేరనున్నాయి. అద్దె ప్రాతిపదికన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకై నా సమస్య తీరనుంది. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.77,220 అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్య సొంతం కానుంది. మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో 49 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రతినెలా ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.77,220 చెల్లింపు మహిళలూ ఆర్థిక పరిపుష్టి సాధించే సదావకాశం ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చేయూత -
అంబేడ్కర్ను మోసం చేసిన ఘనత కాంగ్రెస్దే
పాలమూరు: కాంగ్రెస్ పార్టీ అడుగడున అంబేడ్కర్ను మోసం చేసిందని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రచయిత, ఆర్థికవేత్త అయిన అలాంటి వ్యక్తిని అవమానించిన ఘనత ఆ ఒక్క పార్టీకే దక్కుతుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మేధావుల సదస్సులో ఎంపీ మాట్లాడారు. అంబేడ్కర్ చరిత్ర తెలియని వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంబేడ్కర్ను ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 74 సార్లు రాజ్యాంగ సవరణ చేసిందని, మరో 88 సార్లు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. 1952లో లోక్సభ ఎన్నికల్లో అంబేడ్కర్ను పనిగట్టుకుని ఓడించిందన్నారు. ఆయన అంత్యక్రియలకు ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వలేదని, మృతదేహన్ని పంపిన విమాన చార్జీలు కూడా చెల్లించాలని బిల్లు పంపిందన్నారు. బీజేపీ అంబేడ్కర్ను గౌరవించుకోవడానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాజేష్, కిరణ్,రమేష్, సునీల్, అనంతరెడ్డి, శ్రీకాంత్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతన్న క‘న్నీటి’ వ్యథ
అమరచింత: జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో యాసంగి వరిపంట సాగుచేసిన రైతులకు క‘న్నీటి’ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లు వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించిన అధికారులు.. ఇటీవల జూరాల కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంట రైతుల కళ్లెదుటే ఎండిపోతోంది. కనీసం ఒక తడి అయినా సాగునీరు అందిస్తే కొంత మేరకై నా వరిపంట చేతికి అందుతుందని రైతన్నలు ఆందోళన బాట పట్టారు. తమకు సాగునీరు కావాలంటూ వారంరోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు జూరాల ప్రాజెక్టు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చివరి దశలో ఉన్న పంటకు సాగునీరందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ● యాసంగి సీజన్లో జూరాల ఎడమ కాల్వ పరిధిలో రామన్పాడు వరకు 20వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ప్రాజెక్టు అదికారుల ప్రకటనతో ఉమ్మడి అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులు వరిపంట సాగుచేసుకున్నారు. ఆత్మకూర్ మండలంలోని డీ–6 కెనాల్ పరిధిలోని కాల్వ పూర్తిగా దెబ్బతినడంతో సాగునీరు దిగువన ఉన్న గ్రామాల రైతులకు సకాలంలో అందక పంటసాగు ఆలస్యమైంది. ప్రాజెక్టులో నీరు ఉండటం, వారబందీ పద్ధతిలో సాగునీరు వదులుతున్నారని గ్రహించిన రైతులు.. ఈసారి గట్టెక్కుతామని ఆశపడి వరిసాగు సాగుచేసుకున్నారు. ఎకరానికి రూ. 25వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులకు చివరి దశలో సాగునీరు అందక పోవడంతో వారి ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోయాయి. ఇప్పటికే జూరాల, గుంటిపల్లి, తూంపల్లి, ఆరేపల్లి, కత్తేపల్లె తదితర గ్రామాల్లో 3వేలకు పైగా ఎకరాల్లో వరిపైరు ఎండింది. తమకు కనీసం ఒక తడి అయినా సాగునీరు ఇవ్వాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులను విన్నవిస్తున్నారు. పంట ఎండిపోతుంది.. యాసంగి పంట పూర్తి వరకు సాగునీరు వస్తుందని అప్పుచేసి పన్నెండు ఎకరాల్లో వరిసాగు చేశాను. వారబందీతో కాల్వకు సాగునీరు వదలడంతో పంట ఎండిపోయే స్థితికి చేరింది. ఇప్పుడు సాగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో పంట చేతికివచ్చే పరిస్థితి లేకుండాపోయింది. కనీసం ఒక్క తడైనా సాగునీరు ఇస్తే మూడెకరాల్లో అయినా పంట చేతికి వస్తుందనే ఆశ ఉంది. – వెంకటేశ్, రైతు, మోట్లంపల్లి, ఆత్మకూర్ మండలం ఎమ్మెల్యే చొరవ చూపాలి.. యాసంగిలో 12 ఎకరాల్లో వరిసాగు చేసుకున్నా. చివరి తడి వరకు సాగునీరు ఇస్తామని అధికారులు అన్నారు. ఇప్పుడేమో తాగటానికి నీరు లేదని రైతులకు ఇచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో 12 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింటుంది. సాగునీటి విడుదలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవ చూపాలి. – వినోద్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల ఎడమ కాల్వకు సాగునీటిని నిలిపివేసిన అధికారులు రైతుల కళ్లెదుటే ఎండిపోతున్న పంట చివరి తడికై నా సాగునీరు ఇవ్వాలంటూ వేడుకోలు -
కొనసాగుతున్న వెంటిలేషన్ పునరుద్ధరణ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల ఆచూకీ మంగళవారం కూడా లభ్యం కాలేదు. సొరంగం లోపల డీ–2, డీ–1 ప్రదేశాల మధ్యన మట్టి తవ్వకాలు కొనసాగుతుండగా.. పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిషేధిత ప్రదేశం వరకు శిథిలాల తొలగింపు కొనసాగుతుండగా.. అక్కడి వరకు ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. టీబీఎం శకలాలు, బండరాళ్లను లోకో ట్రైన్లో, మట్టి, బురదను కన్వేయర్ బెల్టుపై బయటకు తరలిస్తున్నారు. నీటి ఊటను 150 హెచ్పీ మోటార్ల సాయంతో కృష్ణానదిలోకి వదులుతున్నారు. చిక్కుకున్న ఆరుగురి కార్మికుల జాడ రెండు, మూడు రోజుల్లో లభించే అవకాశం ఉందని సహాయక సిబ్బంది తెలిపారు. డీ–2 ప్రదేశంలో తవ్వకాలు.. సొరంగంలో ప్రమాద ప్రదేశం డీ–2 సమీపంలో మట్టి తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రత్యేక అఽధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. మంగళవారం జేపీ కార్యాలయంలో ప్రత్యేక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్లు నిర్విరామంగా మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు పంపుతున్నట్లు తెలిపారు. టీబీఎం మిషన్పై పేరుకుపోయిన బురదను వాటర్ జెట్ల సాయంతో తొలగించే ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతుందని చెప్పారు. సహాయక సిబ్బంది రాత్రింబవళ్లు విరామం లేకుండా పనిచేస్తున్నారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో కార్మికల జాడ కోసం 53 రోజులుగా అన్వేషణ -
కొడుకు చేసిన పనికి తండ్రి బలి
అచ్చంపేట రూరల్: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్పై వస్తున్న విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్పై దాడికి యత్నించగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రధాన రహదారిపై ఆందోళన.. వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నించారు. గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్ తెలిపారు. ● భర్త, ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ● నెల రోజుల క్రితం ఏపీకి వెళ్లి సహజీవనం ● కుమారుడిపై కోపంతో... తండ్రిని వెంటాడి వేటాడి హతమార్చిన ప్రత్యర్థులు -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
జడ్చర్ల: 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుర్తుతెలియన వ్యక్తి (సుమారు 58 ఏళ్లు) రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. జమ్జమ్ హోటల్ ఎదుట రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని, మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రైలు నుంచి పడి యువకుడు.. ● ఫోన్ లొకేషన్ ఆధారంగా మృతదేహం గుర్తింపు అమరచింత/దేవరకద్ర రూరల్: రైలు డోర్ తగిలి కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం దేవరకద్ర సమీపంలో చోటు చేసుకుంది. అమరచింత పట్టణానికి చెందిన మరెడి సురేందర్ రెడ్డి రెండో కుమారుడు భరత్కుమార్రెడ్డి సిద్దిపేటలోని మెరిడియాన ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వరుస సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చాడు. మంగళవారం సిద్దిపేటకు వెళ్లడానికి తెల్లవారు జామున తండ్రి సురేందర్ రెడ్డితో కలిసి మదనాపురం రైల్వే స్టేషన్లో వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్కు బయలు దేరాడు. హైదరాబాద్లో రైలును క్లీన్ చేస్తున్న సిబ్బందికి బ్యాగ్ దొరకడంతో రైల్వే పోలీసులు ఐడెంటిటీ కార్డును పరిశీలించి కాలేజీ సిబ్బందికి, భరత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భరత్కుమార్రెడ్డి ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేయగా దేవరకద్ర రైల్వే ట్రాక్ సమీపంలోని పంట పొలాల్లో భరత్కుమార్రెడ్డి విగతజీవిగా పడి ఉండటాన్ని కనుగొన్నారు. చేతికందొచ్చిన కొడుకు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈదురు గాలులకు డబ్బా పడి మహిళా రైతు.. అడ్డాకుల: డబ్బా మీదపడి ఓ మహిళా రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన మూసాపేట మండలం వేములలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అల్లమాయపల్లి మల్లయ్య, అయ్యమ్మ (59) భార్యాభర్తలు. వీరు గ్రామ సమీపంలోని హన్మంత్రెడ్డి వ్యవసాయ పొలంలో వరి ధాన్యం ఆరబోశారు. మంగళవారం సాయంత్రం వర్షం కురవడంతో అయ్యమ్మ ధాన్యంపై టార్పాలిన్లు కప్పి సమీపంలో ఉన్న డబ్బా చాటున నిలబడగా గాలుల ధాటికి ఆమైపె పడింది. కాసేపటి తర్వాత తోటి రైతులు ఆమె కోసం వెదకగా డబ్బా కింద కనిపించింది. అందరూ కలిసి డబ్బాను పైకెత్తి చూడగా అప్పటికే మృతిచెందింది. -
75 ట్రాక్టర్ల ఇసుక డంప్లు సీజ్
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారులోని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డపింగ్ చేయడంతో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ యుగేందర్రెడ్డి, ఆర్ఐ రాఘవేందర్రావులు దాదాపు 75 ట్రాక్టర్ల ఇసుకను డంపింగ్ సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక డపింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. భార్య హత్య కేసులో భర్త రిమాండ్ ఎర్రవల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తను రిమాండ్కు తరలించినట్లు ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. మండలంలోని సాతర్ల గ్రామానికి చెందిన షాలు తన భార్య సంసీన్ అలియాస్ నషియాబాను (32)తో మార్చి 30న గొడవ పెట్టుకొని ఆగ్రహంతో రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె కోమాలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 4న పరిస్థితి విషమించి మృతి చెందింది. ఆమె తల్లి మాసుంబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలంపూర్ సీఐ రవిబాబు కేసు విచారణలో భాగంగా మంగళవారం షాలును అరెస్ట్ చేసి అలంపూర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. యువకుల మృతదేహాలు లభ్యం మహబూబ్నగర్ క్రైం: దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన మహిమూద్ (24), అయ్యప్ప అలియాస్ సుశాంత్ (17) మృతదేహాలను క్వారీ గుంత నుంచి మంగళవారం సాయంత్రం అధికారులు వెలికితీశారు. విజయ్కుమార్ మృతదేహం సోమవారమే లభ్యం కాగా.. అయ్యప్ప, మహిమూద్ కోసం రాత్రి వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం 5.40 ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోతీఘనపూర్లో.. రాజాపూర్ (బాలానగర్): బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతిచెందిన విషయం విధితమే. కాగా మంగళవారం ఉదయం శివకుమార్ మృతదేహం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. యాదయ్య మృతదేహం కోసం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది. -
బావాజీని దర్శించుకున్న ప్రముఖులు
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గురులోకమాసంద్ ప్రభు బావాజీ బ్రహ్మోత్సవాలకు సోమవారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హాజరయ్యారు. లోకమాసంద్ ప్రభు బావాజీ, కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు వారికి పుష్పగుచ్ఛాలు అందేజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర లోకమాసంద్ ప్రభు బావాజీని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల భక్తులు తరలివస్తారని.. రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయాన్ని విస్మరించారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు శాసం రామకృష్ణ, సలీం, గోపాల్, మధుసూదన్రెడ్డి, వీరారెడ్డి, రాజురెడ్డి, నెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బావాజీ ఉత్సవాలు కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న బావాజీ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. సోమవారం చివరిరోజు ఉదయం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అలాగే అమ్మవారైన కాళికాదేవికి కొందరు భక్తులు మేకపోతులు, గొర్రె పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు చందర్నాయక్, భీమ్లాయాక్, దేవ్లానాయక్, ధన్సింగ్ కాళికామాతకు మహా హోమం జరిపారు. గురులోకా మసంద్ బావాజీ, కాళికామాతను సోమవారం సాయంత్రం ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి వచ్చిన ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆమె వెంట నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు ప్రతాప్రెడ్డి, మదన్, సుధాకర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి తదితరులున్నారు. -
పాలమూరులో ముస్లింల భారీ ర్యాలీ
● రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టం: టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ స్టేషన్ మహబూబ్నగర్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిల్లాకేంద్రంలో ముస్లింలు సోమవా రం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన ముస్లింలు సమూహంగా ఏర్పడి క్లాక్ టవర్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. వేలాది ముస్లింలతో ఈ నిరసన ర్యాలీ అశోక్టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించారు. ర్యాలీలో ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చినందుకు నిరసనగా సీఎంలు చంద్రబాబునాయుడు, నితీష్కుమార్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు అల్లా పేరిట ఉంటాయని, దీంట్లో కేంద్రం ప్రభుత్వం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు ముస్లిం పెద్ద లు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీల్లో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కురుమూర్తి, కిల్లె గోపాల్, చంద్రకాంత్, రాజ్కుమార్, మోహ న్, వామన్కుమార్తో పాటు ముస్లిం సంఘాల ప్రతినిధులు మోసీన్ఖాన్, తఖీ హుస్సేన్, ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు ఫారుఖ్ హుస్సేన్, ఖుద్దూస్బేగ్, సిరాజ్ఖాద్రీ, మహ్మద్ తఖీ, అజ్మత్అలీ, అబ్దుల్ రహెమాన్, షబ్బీర్ అహ్మద్, హాఫిజ్ ఇద్రీస్, ఎండీ ఫయాజ్, ఎండి.అయూబ్, షేక్ ఫరీద్, సిరా జ్ఖాన్, నిజాముద్దీన్, అవేజ్ పాల్గొన్నారు. -
నిర్వహణ అస్తవ్యస్తం
మహబూబ్నగర్ (వ్యవసాయం): సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన రైతువేదికలు సమస్యలతో సతమమవుతున్నాయి. 31 నెలలుగా ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేయక వేదికలు నిస్తేజంగా మారాయి. కరెంట్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, స్టేషనరీ, తాగునీటి సౌకర్యాల కల్పనకు డబ్బులు లేక ఏఓలు, ఏఈఓలు ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం అధికారులు సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా రైతు వేదికల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రైతు వేదికల నిర్వహణపై పట్టింపు లేకుండాపోయింది. ● గత ప్రభుత్వం జిల్లాలో 86 రైతు వేదికలను నిర్మించేందుకు రూ.18.92 కోట్లు మంజూరు చేసింది. ఒక్కొక్క నిర్మాణానికి రూ.22 లక్షల వరకు ఖర్చు చేశారు. 150 నుంచి 200 మంది కూర్చునే సామర్థ్యంతో వేదికలను నిర్మించారు. టేబుళ్లు, కుర్చీలు, మైక్ సిస్టంతో పాటు ఇతర సామగ్రిని సమకూర్చింది. ఏఈఓ, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్హాల్తో కూడిన రైతు వేదికలను నిర్మించారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఏఈఓ ను నియమించి వారి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైతు వేదికలను నిర్మించింది. ఒక్కో రైతువేదిక నిర్వహణ కోసం మొదట నెలకు రూ.3 వేలు ఇచ్చింది. ఈ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయశాఖ ప్రతిపాదనల మేరకు రైతు వేదికల నిర్వహణకు రూ.9 వేల చొప్పున అందజేస్తామని గత ప్రభత్వం ప్రకటించింది. అయితే 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల కాలే దు. 86 రైతు వేదికలకు సంబంధించి 31 నెలలకు నిర్వహణ నిధులు రూ.2,31,57,000 మేర పేరుకుపోయాయి. నిధులు విడుదల చేయకపోవడంతో విద్యుత్ చార్జీలు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతు లు, స్టేషనరీ, రైతు శిక్షణ, తాగునీటి సౌకర్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయ అధికారులు (ఏఓ), మండల వ్యవసాయ విస్తరణ అధి కారులు (ఏఈఓలు) వాపోతున్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.2.79 లక్షలు రావాల్సి ఉందని, తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఒక్కో వేదికకు రూ.10 వేల నుంచి రూ. 12 వేల చొప్పున విద్యుత్ చార్జీలు బకాయిలు పేరుకుపోయినట్లు చెబుతున్నారు. ఒక్కో కేంద్రానికి మినీ భూసార పరీక్ష ల్యాబ్ కిట్లను అందజేసి వీటి ద్వారా వేదికల్లో పరీక్షలు చేయాల్సి ఉన్నా నిధులు లేకపోవడంతో ఈ ప్రక్రియ కూడా అటకెక్కింది. ● శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు సమావేశమై సాగు సమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఒక రైతు వేదికను వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ కోసం ఎంపిక చేశారు. ప్రతి మంగళవారం రైతునేస్తం నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా నెలల తరబడి నిధులు విడుదల చేయకపోతే ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తామని ఏఈఓలు ప్రశ్నిస్తున్నారు. ఊరికి దూరంగా... ఒక్కో రైతు వేదిక పరిధిలో 5 వేల ఎకరాలు ఉండేలా 5–6 గ్రామాలను చేర్చారు. కానీ వీటిని ఊరికి దూరంగా నిర్మించడంతో రైతులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతి రైతు వేదికకు ఒక విస్తరణ అధికారి బాధ్యులుగా ఉండగా, వీరిలో 37 మంది మహిళలే ఉన్నారు. ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికల్లో వీరు ఒక్కరే విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారు. కనీసం అటెండర్ కూడా లేకపోవడంతో ఏఈఓనే తాళం తీసుకుని శుభ్రం చేసుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఈఓలు తప్పనిసరిగా వారి క్లస్టర్ పరిధిలోని రైతువేదిక నుంచి జియో ట్యాగింగ్ ద్వారా తమ హాజరు నమోదు చేసుకోవాలి. ప్రతిరోజు విధిగా రైతు వేదికకు వెళ్లి హాజరునమోదు చేసుకున్న తర్వాతే క్షేత్ర స్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రైతు వేదికల నిధుల విడుదలలో జాప్యం భారంగా విద్యుత్ చార్జీలు, పారిశుద్ధ్య పనులు వీడియో కాన్ఫరెన్స్ల నిర్వహణతోఅదనపు భారం సొంత డబ్బు ఖర్చు చేస్తున్న ఏఓ, ఏఈఓలు -
తాగునీటి అవసరాలకే..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ -
అగ్నిప్రమాదాలపైఅవగాహన తప్పనిసరి
మహబూబ్నగర్ క్రైం: అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అన్నారు. సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సిబ్బంది స్మారక కవాతు నిర్వహించగా.. అగ్నిమాపక జెండాను ఎగురవేశారు. 1944లో ముంబాయిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 66మంది అగ్నిమాపక సిబ్బందికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్ను విశ్రాంత అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు డీఎఫ్ఓ కిషోర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ అధికారి మల్లిఖార్జున్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు విద్యుత్ అంతరాయం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలోని 11 కేవీ వెంకటేశ్వరకాలనీ ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ టౌన్–3 ఏఈ అరుణ్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. డిగ్రీ కళాశాలలోనే ఎన్నికల సామగ్రి ● గదుల కొరతతో అవస్థలు జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్నికల సామగ్రిని తరలించకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కళాశాలలో ఏర్పాటుచేశారు. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా.. ఇతర సామగ్రి మొత్తాన్ని కళాశాలలోనే నిల్వ చేశారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్ గదులు రెండింటిని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిజికల్ డైరెక్టర్ గదిని మరోచోట ఏర్పాటు చేసుకోవా ల్సివచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల సామగ్రిని తరలించి తమకు గదులు అప్పగించాలని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయితే ఆ సామగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం కళాశాల గదులను ఇస్తే.. వాటిని 16 నెలలుగా తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని అధ్యాపక బృందం వాపోతోంది. ఇప్పటికై నా ఎన్నికల సామగ్రిని తరలించాలని ప్రిన్సిపాల్ డా. సుకన్య కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ నర్సింగ్రావును వివరణ కోరగా.. ఎన్నికల సామగ్రి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తరలిస్తామన్నారు. తమ పాత కార్యాలయంలో వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. -
7 కిలోమీటర్ల దూరంలో...
మాకు వ్యవసాయమే జీవనాధారం. మా గ్రామంలో రైతువేదిక లేదు. మా ఊరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచింతకుంటలో రైతువేదిక ఉంది. అక్కడికి గ్రామం నుంచి వెళ్లేందుకు రైతులెవరూ శ్రద్ధ చూపడం లేదు. అక్కడికి వెళ్లిన సరైన సూచనలు, సలహాలు అందడం లేదు. – విష్ణుచారి, అల్లీపూర్, చిన్నచింతకుంట మండలం నిర్వహణ ఖర్చులు భరిస్తున్నాం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతువేదికల నిర్వహణ ఖర్చులను మేమే భరిస్తున్నాం. 2022 సంవత్సరం మొదట్లో కొంత నిర్వహణ ఖర్చులు మంజూరు చేసినప్పటికీ తర్వాత ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రైతు వేదికలకు వచ్చే విద్యుత్ చార్జీలు మాత్రం ఏడీఎ కార్యాలయం నుంచి చెల్లిస్తున్నారు. – రాజేందర్ అగర్వాల్, మండల వ్యవసాయాధికారి, దేవరకద్ర ప్రభుత్వానికి నివేదించాం రైతులకు సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసింది. కరెంట్ బిల్లు, స్టేషనరీ, తాగునీటి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం మొదట్లో నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 86 రైతు వేదికల నిర్వహణ నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి నివేదించాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి సోమవారం నాటికి 52 రోజులు గడుస్తోంది. డి–1 ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా నిపుణుల సూచనలు, సలహాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు వినియోగించి మట్టి తవ్వకాలు, టీబీఎం శకలాల తొలగింపు చేపడుతున్నారు. ఐదు ఎస్కవేటర్లు నిరంతరాయంగా మట్టి తవ్వతుండగా.. కన్వేయర్ బెల్టుపై సొరంగం నుంచి బయటకు తరలిస్తున్నారు. సిబ్బందికి ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ కొనసాగుతోంది. సొరంగంలో నిరంతరాయంగా ఉబికివస్తున్న నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు తరలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సంస్థల 560 మంది సిబ్బంది రాత్రింబవళ్లు గల్లంతైన ఆరుగురి ఆచూకీ గుర్తించేందుకు శ్రమిస్తున్నా.. ఇంతవరకు దొరకలేదు. షిఫ్ట్లలో 560 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ.. సొరంగం ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్నామని, సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ జేపీ కార్యాలయం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నట్లు తెలిపారు. సహాయక బృందాల భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది నిర్విరామంగా పని చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీలో 52 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిపుణుల సూచన మేరకు డి–1 ప్రదేశంలో తవ్వకాలు -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారు వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడి ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్ఐ యుగేందర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి గ్రామానికి సంబంధించిన ఓ వాట్సప్ గ్రూప్లో పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో అతని మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీస్ సిబ్బంది వెంకట్రాములు, రామణ్గౌడ్తో కలిసి రంగాపురం శివారులోని వ్యవసాయ పొలంలో గుర్తించి అడ్డుకొని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. సరైన సమయంలో స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు. చాలని పేర్కొన్నారు. -
రైతుల కష్టం నీటిపాలు
●ఎడెకరాల్లో పంట దెబ్బతింది.. ఎడెకరాల్లో సాగుచేసిన వరిపంట మొత్తం దెబ్బతింది. వడగండ్ల వానకు వడ్లు నేలరాలడంతో 70శాతం వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – నర్సింహారెడ్డి, రైతు, అయ్యవారిపల్లి, మిడ్జిల్ మండలం 400 బస్తాల ధాన్యం తడిసింది.. మద్దతు ధరకు అమ్ముకోవాలని 400 బస్తాల ధాన్యాన్ని మార్కెట్లోని సీసీరోడ్డుపై ఆరబోశాను. అకాల వర్షాంతో ధాన్యం అంతా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రంలో అయితే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుందని ఆశ పడగా.. ధాన్యం అంతా నీటిపాలు అయింది. – వర్కుటి లక్ష్మారెడ్డి, రైతు, దేవరకద్ర కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.. కొనుగోలు కేంద్రం ప్రారంభం అవుతుందని చెప్పడంతో రెండు రోజుల నుంచి మార్కెట్ ఆవరణలో ఽ300 బస్తాల ధాన్యాన్ని అరబెట్టుకుంటున్న. మార్కెట్లో అమ్మితే రూ. వెయ్యి వరకు తక్కువ ధర వస్తుంది. అదే కొనుగోలు కేంద్రంలో అయితే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుందని ఎదురుచూస్తున్నా. అకాల వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. – బండ కొండారెడ్డి, రైతు, దేవరకద్ర కుప్పగా పోసేందుకు కూడా సమయం లేదు.. ఆరబెట్టుకున్న ధాన్యం కళ్లెదుటే తడిసిపోయింది. కనీసం కుప్పగా పోసుకోడానికి కూడా సమయం దొరకలేదు. భారీ వర్షానికి 600 బస్తాల ధాన్యం తడిసిపోగా.. మరికొంత నీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా నీటిపాలు అవుతుంటే చూస్తున్న తప్ప రక్షించుకునే పరిస్థితి కనిపించలేదు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలి. – డోకూర్ హన్మిరెడ్డి, రైతు, దేవరకద్ర మహబూబ్నగర్ (వ్యవసాయం)/దేవరకద్ర/మిడ్జిల్/కల్వకుర్తి రూరల్/వెల్దండ: ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట వరుణుడి దెబ్బకు తడిసి ముద్దయింది. ఇది చూసిన రైతు అయ్యో వరుణదేవా ఏందీ పరిస్థితి అని గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల గాలి దుమారానికి చెట్లు నేలకొరిగాయి. దేవరకద్ర, మహబూబ్నగర్ రూరల్, కల్వకుర్తి, మిడ్జిల్, వెల్దండ మండలాల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. నాటు వేసినప్పటి నుంచి కోత కోసే దాక తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటున్న పంట.. చేతికి వచ్చే సరికి అకాల వర్షాలతో దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ● మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా పోసిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వర్షం పడే సమయానికి రైతులు అక్కడి చేరుకొని ధాన్యాన్ని కుప్పగా పోసినప్పటికీ.. కప్పడానికి సరైనా టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పాయిపల్లి, మాచన్పల్లి, ఓబ్లాయిపల్లి, తండా, రామచంద్రాపూర్, కోడూర్, తెలుగుగూడెం తదితర గ్రామాల్లో వడగండ్లు పడటంతో వరిపంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● మిడ్జిల్ మండలం మిడ్జిల్, వాడ్యాల్, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, చిల్వేర్ గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది. 50 నుంచి 65శాతం మేర వడ్లు నేలరాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ● కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరిపంట దెబ్బతింది. అకాల వర్షానికి వరిపంట దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యంతో పాటు దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కోడూర్, తెలుగుగూడెం, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, తండా, కోటకదిర, మాచన్పల్లి గ్రామాల్లో అకాల వర్షంతో రైతులకు అపారనష్టం చేకూరిందని.. ఎకరాకు రూ. 30వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ పి.రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్రెడ్డి, నాయకులు రాఘవేందర్గౌడ్, లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, మస్తాన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవరకద్ర మార్కెట్లో వర్షంలో తడుస్తున్న ఆరబెట్టిన ధాన్యం ఎకరాకు రూ. 30వేల పరిహారం ఇవ్వాలి ఓబ్లాయిపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు అకాల వర్షంతో తడిసిన వడ్లు దేవరకద్ర మార్కెట్లో తడిసి ముద్దయిన 2వేల బస్తాల ధాన్యం ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి, కుందారంతండా, బండోనిపల్లి తదితర గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలుల దుమారంతో కుందారంతండాలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగి ఇళ్లపై పడ్డాయి. పలువురి ఇళ్ల సిమెంట్ రేకులు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. బండోనిపల్లిలో పిడుగుపాటుకు గురై రైతు వావిళ్ల పర్వతాలు అస్వస్తతకు గురయ్యారు. దేవరకద్ర మార్కెట్యార్డులో రెండు రోజుల క్రితం ఆరబోసిన 2వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్కు రెండు రోజులపాటు సెలవు కారణంగా లావాదేవీలు జరగడం లేదు. మంగళవారం మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించవచ్చని కొందరు, కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే మద్దతు ధరకు అమ్ముకోవచ్చని మరికొందరు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోగా.. అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అదే విధంగా దేవరకద్ర సమీపంలోని అమ్మాపూర్ రోడ్డులో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కల్లాలు లేక పోవడం వల్ల పలువురు రైతులు దేవస్థానం పొలంలో ఆరబెట్టుకుంటుండగా.. అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. -
రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాజ్యాంగ ఫలాలు ప్రజలు అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కలెక్టర్ విజయేందిర అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులకు ఎవరు భంగం కల్పించవద్దని అన్నారు. ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాలను పరిశీలించి అత్యంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని మన దేశ ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. ప్రపంచ మేధావి: ఎంపీ డీకే అరుణ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అణగారిన వర్గాల ఆశా జ్యోతి అంబేడ్కర్ అని పేర్కొన్నారు. -
అంబేడ్కర్ అందరివాడు
మహబూబ్నగర్ రూరల్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల ప్రజలు సమాన స్థాయికి వచ్చేంతవరకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించారని చెప్పారు. అగ్రవర్ణాలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఈ రోజు సుఖసంతోషాలతో భారతదేశంలో ఉండగలుగుతున్నారంటే దానికి కారణం అంబేడ్కర్ చూపిన విధానం అని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని, ఏ వర్గానికి కేటాయించిన బడ్జెట్ను ఆ వర్గానికే కేటాయించి వారి అభివృద్ధికి కార్యాచరణ ఉండాలని 100 శాతం ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే కేవలం ఒక్క హన్వాడ మండలంలోనే రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రతి తండాకు కూడా రోడ్డు వేస్తున్నామని అన్నారు. వచ్చే సంవత్సరంలోగా కచ్చితంగా మిగిలిన రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం తనకు కావాలన్నారు. మీ పిల్లలను మంచిగా చదివించాలని, చదువుకుంటే భవిష్యత్ బంగారు మాయమవుతుందన్నారు. జనవరి నెలలో విద్యానిధి ఏర్పాటు చేశానని, వివిధ రంగాల వ్యక్తుల నుంచి దీనికి ఇప్పటికి రూ.50 లక్షల విరాళాలు వచ్చాయన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కళాభవన్లో నిరుద్యోగులకు ఈ నెల 16 నుంచి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ సుదర్శన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, వకీల్ భీమయ్య, మల్లెపోగు శ్రీనివాస్, వెంకటేష్, సామెల్, యాదయ్య, రవికుమార్, చెన్నకేశవులు, శ్రీరాములు, బండారి రాములు, బాలపీరు, రఘునాథ్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద అభివృద్ధి పనులు మహబూబ్నగర్ విద్యా నిధికి విశేషంగా ఆదరణ: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
మహిళపై మత్తు మందు చల్లి.. నంచర్లలో భారీ చోరీ
మహమ్మదాబాద్: మహిళపై మత్తు మందు చల్లి పట్టపగలే చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నంచర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివగోపాల్ ఇంట్లోనే కిరాణం దుకా ణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన కోడలిని దుకాణంలో కూర్చోబెట్టి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే రెక్కీ నిర్వహించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మధ్యాహ్నం దుకాణానికి వచ్చి సదరు మహిళను వాటర్ బాటిల్ అడిగారు. ఆమె వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇవ్వబోగా ఆమె ముఖంపై మత్తుమందు చల్లారు. దీంతో స్పృహతప్పి పడిపోయిన మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు నగలు, బీరువాలో దాచిన రూ.6 లక్షల నగ దు, 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మొత్తం దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చిన యజమాని శివగోపాల్ జరిగిందంతా చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నంచర్లలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగిన విష యాన్ని తెలుసుకున్న మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో కుటుంబీకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్టీంతో వేలిముద్రలు, దొంగలు ఉపయోగించిన పరికరాలు ఏమైనా ఉన్నాయా.. మత్తు ఎలా చల్లారు.. దుకాణంలో ఏమైనా ఆధారాలు ఉ న్నాయా అన్న కోణంలో పరిశీలించారు. దొంగలు ముందే రెక్కీ నిర్వహించి ఇలాంటి ఘటనకు పాల్ప డి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తెలిసి న వారెవరైనా ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. బాధితుడు శివగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెరువులో పడి ఇద్దరి గల్లంతు
రాజాపూర్ (బాలానగర్): చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన సోమవారం బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ మండలం గంగాధర్పల్లికి చెందిన శివరాములు (45) గ్రామ శివారులోని పెద్ద చెరువులో పడిపోయాడు. గుర్తించిన యాదయ్య (25) శివరాములు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంలో వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీసుకొస్తానంటూ యాదయ్య కూడా చెరువులోకి దిగగా.. ఈత రాకపోవడంతో ఆయన కూడా చెరువులో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు ప్రారంభించినా.. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. క్రికెట్ బెట్టింగ్ మాయ జడ్చర్ల: బెట్టింగ్ యాప్లో పందాలు కాసిన ఓ విద్యార్థి చివరకు రూ. 1.05కోట్ల అప్పులపాలైన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు (ఇంజినీరింగ్ విద్యార్థి) ఓ యాప్లో క్రికెట్కు సంబంధించి బెట్టింగ్ కాశాడు. అయితే బెట్టింగ్ యాప్లో వచ్చిన లోన్ అప్లికేషన్ను పూర్తిచేసి.. ఆధార్, పాన్కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పొందుపరిచి, వారిచ్చిన నిబంధనలకు అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థి అనుకున్నంత లోన్ మంజూరు కావడం.. మంజూరైన డబ్బులతో బెట్టింగ్ కాయడం జరిగింది. తీరా బెట్టింగ్ పూర్తయ్యే సరికి సదరు విద్యార్థికి రూ. 1.05కోట్ల అప్పులు మిగిలాయి. ఈ అప్పునకు రూ.30 నుంచి రూ.40 వరకు వడ్డీగా ఉంది. తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో ఇటీవల వారు విద్యార్థి ఇంటికి వచ్చి నానాయాగి చేశారు. అయితే పరువు కలిగిన ఆ కుటుంబ సభ్యులు తమ కుల సంఘం నాయకుడి ద్వారా మధ్యవర్థిత్వం నెరిపి చివరకు సెటిల్మెంట్ చేసుకున్నారు. అప్పులవాళ్లు ఇచ్చిన రూ. 1.05 కోట్లను వడ్డీ లేకుండా చెల్లించే విధంగా ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిసింది. ఇలా.. పట్టణంలో బెట్టింగ్ యాప్ల వలలో పడి పలువురు యువకులు రూ. కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి సైబర్ నేరాలతో పాటు బెట్టింగ్ యాప్లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రూ.1.05కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యార్థి -
‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక
● పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి.. ● పోర్టల్పై నేటి నుంచి అవగాహన సదస్సులు నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్ ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్ గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. ● మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్దిన్నె దమ్గన్పూర్ దొరెపల్లి, జాదరావ్పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నా యి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండలంలో 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూరుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
వెళ్లొస్తాం.. లింగమయ్యా
పెరిగిన బందోబస్తు గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే అంచనాలకు మించి వాహనాలు, భక్తులు రావడంతో వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముందుస్తుగా అడవిలో చెత్త తొలగింపు, వాహనాలు, లోయ వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, బారీకేడ్లు, భద్రత నిర్వహణను పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా చేపట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలు సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గతంలో మాదిరిగా ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోలేదు. ● ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ● మూడురోజుల్లో లింగమయ్య దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు ● ఫర్హాబాద్ చెక్పోస్టులు మూసివేత అచ్చంపేట: నల్లమలలోని లోతట్టు ప్రాంతం సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. మూడు రోజుల సెలవు దినాలు రావడంతో సలేశ్వరం దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వరం క్షేత్రం దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. ఈసారి పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో ఇచ్చిన మూడు రోజుల వ్యవధిలో 24 గంటలపాటు సలేశ్వరం దర్శనానికి అనుమతించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. రాత్రివేళ ఎక్కువ మంది లింగమయ్య దర్శనం చేసుకోవడం ఎంతో అనుభూతి ఇచ్చింది. అయితే ప్రతిఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా వర్షం కురిసేది. దీంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే రెండేళ్లుగా ఎలాంటి వర్షం కురవకపోవడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. చివరిరోజు వస్తున్నాం.. లింగమయ్యా.. వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. చెక్పోస్టుల మూసివేత హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫర్హాబాద్, లింగాల మండలం అప్పాయిపల్లి ప్రాంతంలోని చెక్పోస్టులను అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఈసారి అంచనాలకు మించి వాహనాలు రావడంతో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్, అటవీ శాఖలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. శనివారం రాత్రి వాహనాలు భారీగా నిలిచిపోవడంతో టోల్చార్జీలు సైతం తీసుకోకుండానే లోపలికి అనుమతించారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ కొంత అదుపులోకి వచ్చింది. గతంలో మాదిరిగానే శ్రీశైలం వెళ్లే యాత్రికులకు మన్ననూర్ చెక్పోస్టును రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు. సలేశ్వరం వెళ్లాలనుకునే భక్తులను మాత్రం అటవీ ప్రాంతంలోకి అనుమతించరు. అచ్చంపేట ఆర్టీసీ మొదటి రోజు 30, రెండో రోజు 36, మూడోజు16 ట్రిప్పుల చొప్పున బస్సులు నడిపించారు. అటవీ ప్రాంతంలో ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకే బస్సులను నిలిపివేశారు. చిన్న పిల్లలతో కలిసి.. స్వచ్ఛంద సంస్థలు, దాతల సేవలు.. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, అంబలి కేంద్రాలు, తాగునీటి వసతి భక్తులకు ఎంతగానో ఉపకరించాయి. సలేశ్వరం ఉత్సవాలతో అటవీశాఖ ముక్కుపిండి టోల్ ేరుసుం వసూలు చేసింది. సలేశ్వరం ఉత్సవాలు మాత్రం అటవీ శాఖకు మంచి ఆదాయ వనరుగా నిలిచిపోయిందనే చర్చ సాగుతోంది. ప్రతిఏటా రూ.లక్షలాది ఆదాయం సమకూరుతున్న అటవీశాఖ సరైన ఏర్పాట్లు చేయలేకపోతోంది. -
ఉమ్మడి పాలమూరుపై ఎందుకీ వివక్ష
అచ్చంపేట రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై పాలకుల దోపిడీ విధానం కొనసాగుతోందని, ఇక్కడి రైతాంగ భూములను నిండా ముంచి నల్లగొండ జిల్లాకు నీరు తరలించుకుపోతున్నారని.. ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలో జల వనరుల సాధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ.. పాలకుల స్వార్థ బుద్ధి, మన ప్రాంత ప్రజా ప్రతినిధుల బాధ్యతారాహిత్యం వలన దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా అనేక విధాలా నష్టపోతుందన్నారు. జిల్లా జల వనరుల సమస్యలపై ఇతర సమస్యలు తెలియజేస్తూ జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ అందజేయగా.. ఒక్కసామస్య పరిష్కరించలేదన్నారు. పోరాడి సాధించుకున్న పీఆర్ఎస్ఐ పథకం నీళ్లు నల్లగొండ జిల్లాకు తరలించుకుపోవడానికి ఆగమేఘాల మీద క్యాబినెట్ ఏర్పాటు, తీర్మానం చేసి, జనవరి 22న ఏకంగా జీవో 11 విడుదల చేశారన్నారు. ఏదుల నుంచి సొరంగం ద్వారా నీటిని బయటికి తీసి మన జిల్లా రైతాంగ భూములను ముంచి నల్లగొండ జిల్లాకు నీరు తరలించుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ సంఘటితమవ్వాలి ఇలాంటి కుట్రలు, అన్యాయాన్ని, జల దోపిడీని అడిగి నిలదీసే స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా పోయారని, నల్లగొండ జిల్లాకు నీళ్ల తరలింపు కోసం పెడుతున్న శ్రద్ధ మన ఎత్తిపోతల పథకాలపై ఎందుకుండటం లేదన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల జాతరలో ఉమామహేశ్వర చెన్నకేశవ రిజర్వాయర్లు నిర్మిస్తామని, అమ్రాబాద్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని వాగ్దానం చేసి సరైన విధానం ఏది లేక ప్రజలను గందరగోళంలో ముంచి చేతులెత్తేసిందన్నారు. అమ్రాబాద్ ఎత్తిపోతల కోసం ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించ తలపెట్టిన ప్రాంత గ్రామాల రైతులు తమ భూములు పూర్తిగా మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. జలవనరుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సంఘటితమవ్వాల్సిన అవరసరం ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, రామస్వామి, గోపాల్, వెంకటేష్, బాలస్వామి, నారాయణ, నాగయ్య, ఇంద్రారెడ్డి, సీతారాంరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. నీటి ప్రాజెక్టులపై పాలకుల దోపిడీ విధానాన్ని ఎండగడుదాం పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి -
సహాయక చర్యలు వేగవంతం
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం సొరంగం ప్రమాద ప్రదేశం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను ఎస్కవేటర్ల సాయంతో విచ్చిన్నం చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలించారు. ప్రమాద ప్రదేశానికి చేరుకునేందుకు మార్గం ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. సహాయక చర్యలు అత్యంత సమగ్రంగా, ప్రణాళికా బద్ధంగా కొనసాగుతున్నా యి. అయితే కన్వేయర్ బెల్టు తెగిపోతుండటంతో పనులకు ఆటంకంగా మారుతోంది. ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్టును పునరుద్ధరిస్తూ ఎస్కవేటర్ల సాయంతో మట్టిని బయటకు తరలిస్తున్నారు. కొనసాగుతున్న బండరాళ్ల తొలగింపు.. నిర్దేశిత గడువులోగా సొరంగం ప్రమాద ప్రదేశంలో పనులు పూర్తిచేసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. సొరంగం ఇన్లేట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సొరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలను ఉన్నతాధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంరగం లోపల కన్వేయర్ బెల్టు మరమ్మతు, వెంటిలేషన్ పొడిగింపు పనులతో పాటు మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. సొరంగం కూలిన ప్రదేశం నుంచి ఉబ్చికి వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు బారీ మోటార్ల సాయంతో బయటకు పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు. మరో 10 రోజుల్లో శిథిలాల తొలగింపు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు నిపుణుల సూచనల మేరకు.. సొరంగంలో నిపుణులు, అనుభవజ్ఞులైన వారి సూచనలు, సలహాల మేరకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినశాస్త్రవేత్తలు, నీటిపారుదల నిపుణులు, సొరంగం నిర్మాణంలో అనుభవం కలిగిన ఇంజినీర్లతో పాటు సంబంధిత శాఖల నిపుణుల సూచనలు, సలహాలు అనుసరించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సొరంగంలో వాతావరణం, మట్టి నిల్వలు, నీటి ప్రవాహం తదితర అంశాలపై నిత్యం పరిశీలనలు చేపడుతూ.. వీటి ఆధారంగా తదుపరి చర్యలు వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
నేత్రపర్వంగా
వీరభద్రుడి రథోత్సవంవైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వీరభద్రుడి రథోత్సవం కోయిల్కొండ మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి భక్తుల కోలాటాలు, నందికోళ్ల సేవ భజనలతో స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన ఈ వేడుకను తిలకించేందుకు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం అనంతరం ఆదివారం స్వామివారి దర్శనం కోసం కొండపై వేలాది మంది భక్తులు బారులుతీరారు. పలువురు రుద్రాభిషేకం చేయించారు. రాత్రి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. కాగా సోమవారం భద్రకాళిదేవి వీరభద్రస్వామి కల్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తమళి విజయ్కుమార్శర్మ తెలిపారు. – కోయిల్కొండ -
నేడు జిల్లాకేంద్రంలో విద్యుత్ సరఫరా బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలోని 11 కేవీ వీఐపీ ఫీడర్తో పాటు 11 కేవీ నవాబ్పేట ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ తవుర్యనాయక్, టు ఏఈ ఆదిత్య ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. దీంతో రామయ్యబౌలి, వేపురివేగిరి, హబీబ్నగర్, గోల్మజీద్, రాంనగర్, గణేష్నగర్, హన్మాన్పుర, రైమానియా మజీద్, పాతపాలమూరు, ఫరీద్ మజీద్ ప్రాంతం, సంజయ్నగర్, బోయపల్లిగేట్, మోతీనగర్, కొత్తగంజ్, నవాబ్పేట రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే నెల నుంచి వృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వయోవృద్ధులకు వచ్చే నెల నుంచి ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించేందుకు జిల్లా అధికారులు అంగీకరించారని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు చెప్పారు. ఆదివారం స్థానిక మెట్టుగడ్డలోని ‘ఫోరం’ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘ప్రజావాణి’కి జిల్లా నుంచి వయోవృద్ధులు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ విజయేందిర బోయి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో ఆమె స్పందించి అందరికీ అనుకూలమైన జిల్లా కోర్టు పక్కనున్న తహసీల్దార్ అర్బన్ మండల కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. 1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కల్వకుర్తి రూరల్: రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్మిల్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని బుకాయించగా.. ఈ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. కాగా.. వారు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు. రాత్రి 10 గంటల వరకు.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో ఏఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు. -
ఫుట్బాల్ టోర్నీ చాంపియన్ విశాఖపట్నం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించిన ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో చాంపియన్గా విశాఖపట్నం జట్టు నిలిచింది. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొనగా రాబిన్ రౌండ్ లీగ్ పద్దతిలో ఆరు మ్యాచ్లు నిర్వహించారు. విశాఖపట్నం జట్టు వరుసగా మూడు మ్యాచ్లు గెలుపొంది 9 పాయింట్లు సాధించి విన్నర్గా, నెల్లూర్ జట్టు రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి 6 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. ఆతిథ్య మహబూబ్నగర్ జట్టు 3 పాయింట్లు దక్కించుకొని తృతీయస్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో మహబూబ్నగర్ జట్టు 2–0 గోల్స్ తేడాతో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల జట్టుపై, విశాఖపట్నం జట్టు 1–0 గోల్ తేడాతో నెల్లూర్ జట్లపై విజయాలు నమోదు చేసుకున్నాయి. ట్రోఫీలు అందజేసిన ఎన్పీ వెంకటేశ్ ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో విన్నర్ విశాఖపట్నం జట్టు, రన్నరప్ నెల్లూర్ జట్లకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ.వెంకటేశ్ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్విటేషన్ టోర్నమెంట్లో నాలుగు జట్లు పాల్గొని తమ ప్రతిభచాటడం అభినందనీయమని అన్నారు. ఈ వయస్సులో కూడా సీనియర్ క్రీడాకారులు ఫుట్బాల్ ఆటపై తమనకున్న అభిమానంతో ఇన్విటేషన్ టోర్నమెంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ సంఘం ఉపాధ్యక్షులు టీఎస్.రంగారావు, శంకర్లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇమ్మాన్యుయెల్ జేమ్స్, గజానంద్కుమార్, నందకిషోర్, రామేశ్వర్, నగేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. రన్నరప్గా నిలిచిన నెల్లూరు జట్టు ముగిసిన ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్కొండ, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. సన్నవి ఇస్తుండడంతో ఊరికొచ్చి తీసుకున్నాం.. నా భార్య, పిల్లలతో సహా 15 ఏళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాం. మేం మొత్తం ఐదుగురం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈ సారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. – స్వామి, వలస కూలీ, దుప్పల్లి, మదనాపురం, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. సన్నబియ్యం ఇవ్వడం సంతోషం. అన్నం బాగానే అయింది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షా పుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం స రఫరా జరిగిపోయింది. గతంలో బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేది. కోటా అయిపోయి న కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, రేషన్ డీలర్, మద్దూరుఅవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ(మె) ల.ప.అ మహబూబ్నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్షాపులు, రే.కా: రేషన్కార్డులు, రే.షా.ప.అ(మె): రేషన్ షాపులకు పంపిణీ అయింది (మెట్రిక్ టన్నుల్లో) , ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
కోయిల్కొండ: ఛత్రపతి శివాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం కోయిలకొండ మండలం రాంపూర్లో హిందువాహిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నారాయఫేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలుపెరగని పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ అని కొనిడాయారు. ఆదిత్యపరాశ్రీ స్వామిజీ, విగ్రహ దాత మాజీ సర్పంచ్ కల్పన బచ్చిరెడ్డి, కుమ్మరి రాములు, రవీందర్, రవీందర్రెడ్డి, వై.విద్యాసాగర్, విజయ్భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
స్టేషన్ మహబూబ్నగర్: హజ్యాత్రికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని అన్నారు. జిల్లాకేంద్రంలోని వైట్ హౌజ్ కన్వెన్షన్లో జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హజ్యాత్రికులకు మెగా డిజిటల్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మన దగ్గర వాతావరణానికి, అక్కడి వాతావరణానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. అక్కడ ఎండలు మన కంటే ఎక్కువగా ఉన్నాయని, హజ్యాత్రికులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హజ్యాత్రలో ఎక్కువగా నడవాల్సి వస్తుందని, అందువల్ల యాత్రికులు ఈ సమయంలో ఎక్కువగా నడవడానికి ప్రాక్టీస్ చేయాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి హజ్ హౌస్, ఉర్దూఘర్ నిర్మాణానికి నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ హజ్యాత్రికులు ప్రజల క్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దువా చేయాలన్నారు. జిల్లా హజ్ సొసైటీ రూపొందించిన హజ్యాత్ర గైడ్లను చైర్మన్లు ఆవిష్కరించారు. ఢిల్లీకి చెందిన మోనిస్ఖాన్ డిజిటల్ ట్రైనింగ్ నిర్వహించగా మౌలానా తస్లీం అన్సారీ, ముఫ్తి ఆసిఫ్, ఖలీల్ అహ్మద్ హజ్యాత్రపై శిక్షణ అందజేశారు. ఎస్హెచ్సీ ఎగ్జిక్యూటివ్ అధికారులు మహ్మద్ సజ్జాద్ అలీ, ఇర్ఫాన్ షరీఫ్, జిల్లా హజ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహమూద్ అలీ, ఎండీ మేరాజుద్దీన్, రవూఫ్పాష, సత్తార్, సులేమాన్, యూసుఫ్, సుల్తాన్, ఫైజొద్దీన్ పాల్గొన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబాని -
వైభవంగా హనుమాన్ విజయయాత్ర
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలో హనుమన్ జయంతిని పురస్కరించుకొని శనివారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. స్థానిక రామమందిరం నుంచి మేళతాళాలతో స్వామివారి ఊరేగింపుతో విజయయాత్ర క్లాక్టవర్, అశోక్టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ చౌరస్తా మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు నిర్వహించారు. అనంతరం హనుమంతుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. విశ్వహిందు పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్, హిందువాహిని తదితర ధార్మిక సంస్థల నేతలు, కార్యకర్తలు కాషాయ ధ్వజాలను చేతబూని ఈ విజయయాత్రలో ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడి జీవిత చరిత్ర మనకందరికీ ఆదర్శమని అన్నారు. ఆ దివ్య హనుమంతుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ విజయయాత్రలో పాల్గొని హనుమంతుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు ఏపీ మిథున్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, సాయిబాబా, మనోహర్తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే ఘటన స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్నగర్ అద్దాలు, టోపీలతో మేలు దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్కర్నూల్ ● -
ట్యాంక్బండ్ సుందరీకరణ పనుల పరిశీలన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్న మినీ ట్యాంక్బండ్ వద్ద కొనసాగుతున్న సుందరీకరణ పనులను శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం ఇక్కడి కట్టపై ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం రూ.రెండు కోట్లు ముడా నుంచి కేటాయించామని వివరించిన విషయం విదితమే. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ నగర ప్రజలు వచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి వివిధ పనులు చేపడుతున్నారు. తాజాగా అక్కడి విభిన్నమైన ఆకృతిలో తీర్చిదిద్దిన పెద్ద డోమ్కు జాతీయ భావం పెంపొందించేలా మూడు రంగులతో పెయింటింగ్ వేస్తున్నారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు. హనుమాన్ జయంతికి భారీ బందోబస్తు మహబూబ్నగర్ క్రైం: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్శాఖ పాల మూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 200 మంది బలగాలతో ప్రధాన కూడళ్లు, ర్యాలీ వెంట విధులు నిర్వహించారు. బందోబస్తు విధానాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడు తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ప్రాంతాన్ని పరిశీలించే విధంగా సీసీ కెమెరాల సహాయంతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ బందోబస్తులో మహిళ సిబ్బంది, ప్రత్యేక విభాగాలు, క్యూఆర్టీ బలగాలు, ట్రాఫిక్ పోలీసులు కలిసి సమన్వయంతో పని చేసినట్లు తెలిపారు. ర్యాలీ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ చేసి ఇతర వాహనదారులకు ఇబ్బందులు రాకుండా చూసినట్లు తెలిపారు. -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాలుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్నగర్ క్రైం ఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్స్టేషన్ మహబూబ్నగర్లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్కర్నూల్లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను బట్టి రెండు షిఫ్ట్లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్నగర్లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్గేట్, ఔట్గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
మన్యంకొండలో వైభవంగా కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతినెల పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తులు తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్ఛరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కనులపండువగా సాగింది. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామివారి దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. -
ఎస్ఎల్బీసీ @ 50 రోజులు
నిషేధిత ప్రదేశంలో.. సొరంగం పైకప్పు కూలిన 13.936 కిలోమీటరు డీ–1 వద్ద సుమారు 40 మీటర్ల వరకు సహాయక సిబ్బంది వెళ్లలేని ప్రదేశాన్ని నిషేధిత(డేంజర్ జోన్) ప్రాంతంగా గుర్తించారు. నిషేధిత ప్రదేశం దాటి ముందుకు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే మిగిలిన 40 మీటర్ల ప్రాంతం పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సొరంగం ప్రమాద ధాటికి 125 మీటర్ల పొడవు 1,500 టన్నుల బరువు కలిగిన టన్నెల్ బోరింగ్ మిషన్ సుమారు 50 మీటర్ల వెనక్కి వచ్చింది. సొరంగం తవ్వకాలకు అడ్డంగా ఉన్న టీబీఎం స్టీల్ భాగాలను దక్షిణమధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్తో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు, బురద, టీబీఎం భాగాల తొలగింపు, డీవాటరింగ్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతోంది. నిషేధిత ప్రదేశం వరకు యుద్ధ ప్రాతిపదికన మట్టి, బురద తొలగింపు పనులు త్వరితగతిన ముగించాలని సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నిపుణుల సలహాల మేరకు ప్రమాద ప్రదేశం వద్ద చేపట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ● కార్మికుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శనివారం సొరంగం ఇన్లెట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తవ్వకాలకు ఆటంకంగా ఉన్న సమస్యలను అధి గమిస్తూ వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మట్టి తవ్వకాలు జరుపుతూ కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకు చేరవేస్తున్నామన్నారు. నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా పంపింగ్ చేస్తూ బయటకు తోడేస్తున్నామన్నారు. అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలు 50 రోజులకు చేరాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ద్వారా తవ్వకాలు చేపడుతున్న క్రమంలో ఫ్రిబవరి 22న జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా.. మార్చి 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్సింగ్, 25న ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్కుమార్ మృతదేహాలను గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఆరుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా రెస్క్యూ సిబ్బంది వాటిని అధిగమిస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా మిగిలిన వారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. రోబోల సేవలు ఎక్కడ? సొరంగం లోపల అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు గత నెల 11న తీసుకొచ్చిన రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. మానవులు చేయలేని పనులను రోబోలు చేస్తాయని, వీటిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో రూ.4 కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన రోబోలు నెలరోజులు దాటినా ఇంత వరకు కనీసం సొరంగం లోపలికి కూడా వెళ్లలేకపోయాయి. రోబో యంత్రాలు సొరంగం ఇన్లెట్ వద్ద వృథాగా పడి ఉన్నాయి. ఐదురోజుల పాటు ప్రయత్నించిన అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబోల అనుసంధానంగా వ్యాక్యూమ్ పంపు, వ్యాక్యూమ్ ట్యాంకు సాంకేతిక సమస్యల కారణంగా వాటి పనితీరు నిలిచింది. మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు తీసుకొచ్చిన రోబో యంత్రం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. టీబీఎం స్టీల్ భాగాలు అడ్డుగా ఉండటంతోనే వీటి సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప అత్యంత ప్రమాద ప్రదేశానికి రోబోలు వెళ్లలేవనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచే సే రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ పెద్ద పె ద్ద రాళ్లు, శిథిలాలను ముక్కలు చేయడంతోపాటు బురద, మట్టిని వ్యాక్యూమ్ పంపు సాయంతో నేరు గా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. ప్రస్తుతం ఐ దు ఎస్కవేటర్లు (హిటాచీలు) సహాయంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు నేటికీ లభించని ఆరుగురి కార్మికుల ఆచూకీ -
‘మాస్టర్’పై శిక్షణకు 2 కళాశాలల ఎంపిక
● మహబూబ్నగర్, కొడంగల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోపైలట్ ప్రాజెక్టు అమలు ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● తాజాగా జిల్లాలోని ప్రిన్సిపాళ్లతో సమావేశమైన వైఐఎస్యూ వీసీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మాస్టర్’పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు ప్రభుత్వ డిగ్రీ–పీజీ కళాశాలలు ఎంపికయ్యాయి. వీటిలో మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ–పీజీ కళాశాల, కొడంగల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి ‘మాస్టర్’ (మహబూబ్నగర్ స్కిల్ ట్రెయినింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ రెడీనెస్) ను పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదివిన విద్యార్థులకు వృత్తిపరమైన, దైనందిన జీవితంలో అవసరమయ్యే అన్ని నైపుణ్యాలను నేర్పిస్తారు. ముఖ్యంగా విద్యార్థులను భవిష్యతులో అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దనున్నారు. అవగాహన కల్పించేందుకు ట్రైనర్లు ఇందులో భాగంగా తాజాగా శనివారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్యూ) వైస్ చాన్స్లర్ వీఎస్వీఎస్ఎస్ సుబ్బారావు అధ్యక్షతన శనివారం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో స్థానిక ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ–పీజీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మాస్టర్’పై డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను నిష్ణాతులైన ట్రైనర్లను పంపిస్తామన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా హాజరు శాతాన్ని, అవగాహన సామర్థ్యాలను బేరీజు వేస్తూ వారిని రెండు తరగతులుగా విభజిస్తామన్నారు. మొదటిది ‘బేసిక్’లోగల విద్యార్థులకు కిందిస్థాయి నుంచి సాఫ్ట్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ వృద్ధి చేస్తారన్నారు. రెండో కేటగిరీ కింద ‘బేసిక్ ప్లస్’లో విద్యార్థులకు కోర్ సబ్జెక్టులలో లోతుగా అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఐఎస్యూ రిజిస్ట్రార్ చమన్ మెహతా, విషయ నిపుణురాలు సౌమ్య నటరాజన్, ప్రొఫెసర్ జె.సుధాకర్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల డాక్టర్ బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల (మహబూబ్నగర్), గద్వాల, కొడంగల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా.కె.పద్మాతి, ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, డా.జి.సుకన్య, డా.బి.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్విటేషన్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్లను పరిచయం చేసుకొని మాట్లాడారు.ఈ వయసులో కూడా సీనియర్ క్రీడాకారులు ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న సీనియర్ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ సంఘం ఉపాధ్యక్షులు టీఎస్.రంగారావు, రమేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, గజానంద్కుమార్, నందకిషోర్, వడెన్న, నగేశ్తోపాటు విశాఖపట్నం కోచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ● ఈ టోర్నీలో విశాఖపట్నం, నెల్లూర్, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల జట్టు, మహబూబ్నగర్ జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు మ్యాచుల్లో విశాఖపట్నం 4–2 గోల్స్ తేడాతో ఆతిథ్య మహబూబ్నగర్ జట్టుపై విజయం సాధించింది. నెల్లూరు జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులపై గెలుపొందింది. విశాఖపట్నం 1–0 గోల్స్ తేడాతో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులపై, నెల్లూరు జట్టు 4–1 గోల్స్ తేడాతో మహబూబ్నగర్పై విజయం సాధించాయి. ఆదివారం కూడా ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నీ కొనసాగనుంది. టోర్నీలో ఆరు మ్యాచ్ల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్లు విన్నర్, రన్నరప్గా నిలుస్తాయి. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ -
పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లి తండ్రి మృతి
గోపాల్పేట: తన పిల్లలకు ఈత నేర్పేందుకు వెళ్లి ఓ తండ్రి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం గ్రామంలో మధ్యాహ్నం చోటుచేసుకుంది. గోపాల్పేట ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాలు.. బుద్దారం గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం(41) భార్య ఏర్పుల మంగమ్మతో కలిసి ఇద్దరు కుమారులకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బుద్దారం పెద్దచెరువు వద్ద పెద్దతూము, నడింతూము మధ్య ప్రాంతంలో ఈత నేర్పేందుకు వెళ్లారు. మంగమ్మ ఇద్దరు పిల్లలకు నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ క్యాన్లు కడుతుండగా శ్రీశైలం ఒక్కసారిగా నీటిలోకి దూకాడు. అనంతరం బయటకు తేలలేదు. ఈ నేపథ్యంలో భార్యాపిల్లలు కేకలు వేయగా స్థానికులు నీటిలోకి దిగి వెతకగా, సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మృతదేహం బయటపడింది. బురదలో ఇరుక్కోవ డంతో శ్రీశైలం మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఎర్రవల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని మునగాల శివారులో చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన కళ్యాణ్ కుమార్ (27) బైక్పై శుక్రవారం రాత్రి తమ బంధువు వివాహం నిమిత్తం వల్లూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మునుగాల శివారులో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సరోజతో పాటు కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ వైర్లు తగిలి డీసీఎం దగ్ధం గట్టు: మండలంలోని లింగాపురం సమీపంలో శనివారం విద్యుత్ వైర్లు తగిలి డీసీఎం దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు.. లింగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి లింగన్న, పెద్దన్న పండించిన పొప్పాయి పండ్లను మార్కెట్కు తరలించేందుకు డీసీఎం వచ్చింది. అయితే పొప్పాయి తోట వద్ద డీసీఎంను వెనక్కి తీసుకుంటున్న క్రమంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న రైతులు డీసీఎం డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. డీసీఎంకు అంటుకున్న మంటలు డీజిల్ ట్యాంక్ వరకు వ్యాపించడంతో వాహనం మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకరిపై కేసు నమోదు మహబూబ్నగర్ క్రైం: రెండు నెలల కరెంట్ బిల్లు కట్టలేదని.. మీటర్ కట్ చేసిన లైన్మన్ను అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదైంది. టూటౌన్ ఎస్ఐ ఓబుల్రెడ్డి వివరాల మేరకు.. విద్యుత్శాఖ అసిస్టెంట్ లైన్మన్ శివకిషోర్ స్థానిక న్యూటౌన్లో ఉన్న మనోజ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్కు సంబంధించిన రెండు నెలల కరెంట్ బిల్లు కట్టాలని యజమానికి సూచించారు. అయినప్పటికీ బిల్లు కట్టకపోవడంతో ఈ నెల 10న ఆఫీస్కు సంబంధించిన విద్యుత్ మీటర్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో ఆఫీస్ యజమాని మనోజ్కుమార్ 11న మధ్యాహ్నం లైన్మన్కు ఫోన్చేసి అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు అదే రోజు సాయంత్రం జెడ్పీ కార్యాలయానికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
పొన్నకల్ చెరువులో ఆటో బోల్తా
అడ్డాకుల: మండలంలోని పొన్నకల్ చెరువులో ఆటో బోల్తాపడగా అందులో ఉన్న ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. రాచాలకు చెందిన దాసరి ఆంజనేయులు తన ఆటోలో దాసరి కురుమూర్తి, దాసరి నర్సింహులు, దాసరి వెంకటేశ్వరమ్మ, మడిగెల రవిశంకర్ను జాతీయ రహదారి వద్ద దింపేందుకు ఊళ్లో ఆటో ఎక్కించుకున్నాడు. దుబ్బపల్లి స్టేజీ దాటిన తర్వాత పొన్నకల్ నల్ల చెరువుకట్టపై మేకలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ఆంజనేయులు ఆటోను పక్కకు తిప్పగా ఆటో అదుపు తప్పి.. చెరువు కట్ట లోపలికి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆటోలో ఉన్న కొందరు ఆటో నీళ్లలో పడేలోపే వెంటనే అందులోంచి పక్కకు దూకగా.. డ్రైవర్ ఆంజనేయులు, మరొకరు ఆటోతోపాటు నీళ్లలో మునిగిపోయారు. ఎలాగోలా ప్రయత్నించి ఆటోలోంచి బయటకు వచ్చి ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. డ్రైవర్ ఆంజనేయులు, మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్లో జిల్లా కేంద్రానికి తరలించారు. అటుగా వెళ్తున్న కలెక్టర్ విజయేందిర ఘటనా స్థలం వద్ద ఆగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. తర్వాత స్థానికులు తాళ్ల సాయంతో ఆటోను బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. అదుపు తప్పిన ఆటో చెరువు లోపలికి దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. చెరువుకు మరోవైపు దూసుకెళ్తే లోతైన పొలాల్లో పడి పెద్ద ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు -
నేటినుంచి ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో శనివా రం, ఆదివారాల్లో ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. స్థానిక మెయిన్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. విశాఖపట్నం, నెల్లూరు, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు, మహబూబ్నగర్ జట్లు టోర్నీకి హాజరవుతున్నాయి. 40 ఏళ్లకు పైబడి క్రీడాకారులు ఫుట్బాల్ మ్యాచులు ఆడనున్నారు. రౌండ్రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో ఆరు మ్యాచ్లు జరగనున్నాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన జట్లు విన్నర్, రన్నరప్గా నిలుస్తాయి. మొదటిసారిగా జిల్లా కేంద్రంలో ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడంగా విజయవంతం కోసం ఫుట్బాల్ సంఘం ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్ స్టేడియంలో ఫుట్బాల్ ఇన్విటేషన్ టోర్నీ ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇమ్మాన్యుయెల్ జేమ్స్, రామకృష్ణ, శశిధర్, రాజశేఖర్, నాగేశ్, కె.రాజేందర్ పరిశీలించారు. ఇన్విటేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టోర్నీ విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు, సీనియర్ క్రీడాకారులు ఎన్పీ వెంకటేశ్, ఉపాధ్యక్షులు టీఎస్.రంగారావు, శంకర్లింగం, రాయల రమేష్, ప్రేమ్రాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు జట్ల హాజరు రౌండ్రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్లు -
కేంద్రం జేబులో కృష్ణా ట్రిబ్యునల్
వనపర్తి: కృష్ణానదిలో నీటి వాటా తేల్చే కృష్ణా ట్రిబ్యునల్ కేంద్రం జేబులో ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు గడుస్తున్నా.. నేటికీ కృష్ణానదిలో నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇటీవల శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ లైనింగ్ పనులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణకు సాగునీటి కష్టాలు తెచ్చిపెట్టనుందని.. లైనింగ్ పనులతో కాల్వ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 89,762 క్యూసెక్కులకు పెరుగుతుందని వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులు నాగార్జునసాగర్, కేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత తగ్గించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా బలపడటానికి నీటి లభ్యతను పెంచే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భావిస్తోందని.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉన్న కేఆర్ఎంబీ ఏపీ ప్రయత్నాలను నిలువరించడం లేదని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి సిర్సవాడ కాల్వతో నల్లగొండ ప్రాంతానికి సాగునీటిని అందించవచ్చని.. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ నుంచి టన్నెల ద్వారా నీరు తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇందుకుగాను మొదటి విడతగా రూ.1,300 కోట్లకు టెండర్ సైతం నిర్వహించారని.. తక్కువ ఖర్చుతో అయ్యే పనికి రూ.వందల కోట్లు వెచ్చించడం సీఎం బంధువులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకేనని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్ నుంచి నల్గొండకు నీరు తరలించేందుకు ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు, తనతో పాటు ఎంపీ సైతం సంతకం చేసి అప్పటి ముఖ్యమంత్రికి లేఖలు రాశామని గుర్తుచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు తిరుమల్, రహీం, గులాం ఖాదర్, కురుమూర్తి యాదవ్, నందిమళ్ల అశోక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి -
సొరంగంలో కొనసాగుతున్న మట్టి తొలగింపు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం లోపల కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు దాదాపు పూర్తి అయ్యాయి. సొరంగం ప్రమాదం జరిగి శుక్రవారం నాటికి 49 రోజులు అవుతోంది. ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగం, రెస్క్యూ టీములు, టన్నెల్ నిపుణుల సమన్వయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక బృందాలు నాలుగు రోజులు శ్రమించి 13.730 కిలోమీటరు నుంచి 13.800 కిలోమీటరు వరకు కన్వేయర్ బెల్టు జాయింట్ చేసి పొడిగించారు. మట్టి, బురద, రాళ్లు, టీబీఎం భాగాలు తొలగింపు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తొలగించిన మట్టి ఎస్కవేటర్లతో కన్వేయర్ బెల్టుపై ఎత్తిపోస్తున్నారు. ఐదు ఎస్కవేటర్లతో సొరంగం లోపల తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలకు ఆటంటకంగా మారిన నీటి ఊటను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల సహాయంతో సొరంగం బయటకు పంపింగ్ చేస్తున్నారు. మిగిలిన 70 మీటర్ల ప్రదేశంలో శిథిలాలను పూర్తిగా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సొరంగం పైకప్పు కూలిన అత్యంత ప్రమాదకరమైన 13.936 కిలోమీటరు ప్రదేశంలో ఇప్పట్లో తవ్వకాలు జరిపే అవకాశం లేదని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులో ఈ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సొరంగం ప్రమాద ప్రదేశంలో మట్టి, బురద తవ్వకాలు కొనసాగుతున్నాయని, సహాయక చర్యలు ముమ్మరం చేశామని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శుక్రవారం సొరంగం ఇన్లెట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచూకీ కొనుకొనేందుకు సహాయక బృందాలు ఎంతో శ్రమిస్తున్నాయన్నారు. సొరంగం లోపల భారీగా పేరుకపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం భాగాలను కత్తిరించే పనులు నిరాంతరాయంగా కొనసాగుతున్నాయని, తవ్వకాలు చేపట్టి ప్రదేశం నుంచి మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నామన్నారు. ఉబికి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్లతో పంపింగ్ చేస్తూ బయటకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. 49 రోజులుగా శ్రమిస్తున్నా.. లభ్యం కాని ఆరుగురి ఆచూకీ -
టాస్ కోఆర్డినేటర్ నియామకంపై వివాదం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో టాస్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ పోస్టు కేటాయింపు విషయంలో రెండు సంఘాల మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. మొదట జీటీఏ (గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్) నాయకులు టాస్ కోఆర్డినేటర్ నియామకం అక్రమం అని, 1972లో విడుదల చేసిన జీఓ 1214 ప్రకారం కేవలం గవర్నమెంట్ టీచర్స్కే కేటాయించాలని స్పష్టంగా ఉన్నప్పటికీ గత డీఈఓ నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా కేటాయించారని నాయకులు పలుమార్లు కలెక్టర్, డీఈఓకు సైతం ఫిర్యాదు చేశారు. కామన్ సర్వీస్ రూల్స్ లేనందున లోకల్ బాడీ వారికి లోకల్ బాడీలో, గవర్నమెంట్ వారికి గవర్నమెంట్లో మాత్రమే కేటాయించాలని, డీఈఓ కార్యాలయం పూర్తిగా గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి లోకల్ బాడీలో ఉన్న ఉపాద్యాయుడికి టాస్ కోఆర్డినేటర్ పోస్టు కేటాయించవద్దని పేర్కొంటున్నారు. ● ఇదిలా ఉండగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన జేఏసీ నాయకులు డీఈఓ ప్రవీణ్కుమార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1214 జీఓ ప్రకారం లోకల్ బాడీ, గవర్నమెంట్ బాడీలో వారు ఎవరైనా కూడా ఆ పోస్టుకు అర్హులేని, ఎవరినైనా ఆ పోస్టులో నియమించవచ్చని పేర్కొన్నారు. కొంతమంది కావాలనే ఈ విషయాన్ని వివాదంగా మార్చుతున్నారని, త్వరలోనే దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ● ఈ విషయమై డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా గత జీఓలో గవర్నమెంట్ టీచర్స్ అని ఉందని, అయితే కోఆర్డినేటర్ నియామకంపై గత డీఈఓ విద్యాశాఖ కమిషనర్ సూచన మేరకు పోస్టును కేటాయించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు. దీనిపై ఒక వర్గం గవర్నమెంట్ బాడీకి ఇవ్వాలని, మరో వర్గం లోకల్ బాడీకి ఇవ్వాలని ఫిర్యాదులు చేస్తున్నారని, ఈ విషయమై కమిషనర్కు ఫైల్ పంపించామన్నారు. అక్కడి నుంచి స్పష్టత వస్తే ఎవరిని కేటాయించాలనేది తెలుస్తుందని చెప్పారు. అక్రమంగా కేటాయించారని జీటీఏ సంఘం నాయకుల ఆరోపణ ఎవరికై నా ఇవ్వొచ్చని జేఏసీ నాయకుల వాదన స్పష్టత కోసం విద్యాశాఖ కమిషనర్కు ఫైల్ పంపిన డీఈఓ -
సేంద్రియ వ్యవసాయంతో లాభం
అలంపూర్: పూర్వం సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం జరిగేది. అప్పట్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సేంద్రియ ఎరువులతో పంటలు పండించే వారు. కాలక్రమేణ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతో పాటు రసాయనాలు వినియోగించుకోవాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడుతూ.. దిగుబడులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సేంద్రియ ఎరువులతో పంటల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియ నాయక్ సూచించారు. వీటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. రసాయనాల వాడకంతో కలిగే నష్టాలు.. పంటల సాగులో విచక్షణరహితంగా బస్తాల కొద్దీ రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకునే స్థాయి పంటలకు ఆశించే పురుగుకు పెరుగుతుంది. కాలక్రమేణ పురుగులు, తెగుళ్ల బెడద అధికమవుతుంది. మరోవైపు సాగు ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతుంది. సరైన అవగాహన లేకుండా రసాయనాల వాడకం వల్ల వాటి అవశేషాలు నీటిలో, సాగు నేలలో కలిసి కలుషితమవుతాయి. మిత్ర కీటకాలు నశించి పర్యావరణంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వీటి నివారణ కోసం వ్యవసాయంలో పురుగు మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్లో పోటీకి మన ప్రాంత రైతులు నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. సేంద్రియ విధానం.. సాగులో లింగాకర్షన బుట్టలు వాడాలి. పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి. అందుకు గంధకం, రాగి ఉత్పత్తులు వాడవచ్చు. వృక్ష సంబంధ నూనెలను కొన్ని జాగ్రత్తలతో వినియోగించవచ్చు. వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీ కంపోస్టు ఎరువులపై దృష్టిపెట్టాలి. పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు. తక్కువ ఖర్చు.. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించారు. వానపాములు, పశువులు, కోళ్ల ఎరువుతో పాటు పచ్చి ఆకులు, పిండి చెక్కలు వినియోగిస్తున్నారు. తద్వారా నాణ్యమైన, రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయశాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండే వర్మీ కంపోస్టు బెడ్స్ను రూ. 5వేల సబ్సిడీపై రైతులు పొందవచ్చు. వ్యవసాయశాఖ పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాలను 5శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. పాడి–పంట -
ఉపాధి పనులకు వెళ్తూ.. మహిళా కూలీ మృతి
మహమ్మదాబాద్: ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తూ ఓ మహిళా కూలీ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మదాబాద్కు చెందిన మాల జయమ్మ(55) ఉపాధి కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో శుక్రవారం సైతం పాంపాండ్ పనుల కోసం ట్రాక్టర్పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అకస్మాత్తుగా జయమ్మ సొమ్మ సిల్లిపడిపోగా.. వెంటనే ప్రాథమిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమె వడదెబ్బ కారణంగా మృతిచెందిందా.. లేక అనారోగ్యంతో మృతిచెందిందా అన్నది తేలాల్సి ఉంది. జయమ్మకు భర్త జయప్రకాశ్, ఒక కుమారుడు ఉన్నారు. అధికారులు వివరాలు సేకరించి తగిన సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాంక్రీట్ మిషన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం గద్వాల క్రైం: కాంక్రీట్ మిషన్ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గద్వాల మండలం కొండపల్లికి చెందిన రైతు తెలుగు వెంకటన్న (53) మహిళా రైతు లక్ష్మితో కలిసి శుక్రవారం ఉదయం బ్యాంకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై పూడూరుకు బయలుదేరారు. 99వ ప్యాకేజీ కాల్వ వద్ద సీసీ పనులకు వినియోగిస్తున్న కాంక్రీట్ వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో వెంకటన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. యువకుడి బలవన్మరణం మల్దకల్: ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కుర్వ రామకృష్ణ (24)కు ఆరేళ్ల కిందట కృష్ణవేణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గద్వాలకు చెందిన ట్రాన్స్జెండర్ శ్రీవాణితో పరిచయం ఏర్పడింది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున శ్రీవాణితో పాటు మరో ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఇంటికి వెళ్లారు. అప్పటికే రామకృష్ణ ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రత్యేక వాహనంలో చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ట్రాన్స్జెండర్ వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో జిల్లాకేంద్రంలో ట్రాన్స్జెండర్ వేధింపులతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మరువక ముందే మల్దకల్లో మరో సంఘటన చోటు చేసుకోవడం చర్యనీయాంశమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ నందికర్ వివరించారు. ఇల్లు దగ్ధం.. త్రుటిలో తప్పిన ప్రమాదం మక్తల్: వంట గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని కర్నిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన రాంపూర్ నర్సింహులు తన ఇంట్లో కొంత భాగాన్ని బీరప్ప భక్తులకు అద్దెకిచ్చాడు. శుక్రవారం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ ఏర్పడి మంటలు చెలరేగగా చుట్టుపక్కల వారు గమనించి ఆర్పివేశారు. అప్పటికే ఫ్యాన్, బీరువా, నిత్యావసర సరుకులతో పాటు ఇంటి పైకప్పు రేకులు కాలిపోయాయి. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి మాగనూర్: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాగనూరు మండలంలోని అడవిసత్యారంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సింధనూర్కు లక్ష్మణ్ (40) కొంతకాలంగా కృష్ణ మండలం చెక్పోస్టు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర వరికోత మిషన్కు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం యాసంగి వరి కోతల నేపథ్యంలో అడవిసత్యారం గ్రామ శివారులో వరికోత పనులు సాగిస్తుండగా.. పొలంలోని విద్యుత్ వైర్లు మిషన్కు తాకడంతో దానిపై ఉన్న లక్ష్మణ్ విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ముందుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా.. గ్రామంలో ఆనోటా ఈ నోటా పడి.. అందరికి తెలిసింది. దీంతో మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
180 ఎకరాల్లో పంటనష్టం
దేవరకద్ర: మండలంలోని బల్సుపల్లిలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దాదాపు 180 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటను శుక్రవారం ఏఓ రాజేందర్ అగర్వాల్ పరిశీలించారు. వడగండ్ల వర్షానికి జరిగిన పంటనష్టంపై అధికారులకు నివేదిక అందిస్తామన్నారు. తడిచిన ధాన్యం పరిశీలన దేవరకద్ర రూరల్: అకాల వర్షంతో దేవరకద్ర మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని తహసీల్దార్ కృష్ణయ్య పరిశీలించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఉన్నతాధికారుల అదేశాల మేరకు తహసీల్దార్ పరిశీలించి.. రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. -
పరిశ్రమలకు గడువులోగా అనుమతులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్):జిల్లాలోని పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరిశ్రమలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీజీ ఐ–పాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి, నిర్దేశిత గడువు లోగా జారీ చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా చేయవలసిన పనులు మరియు మంజూరులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. టీ ప్రైడ్ పథకం కింద షెడ్యూల్ కులాలకు చెందిన వారికి 4, షెడ్యూల్ ట్రైబ్ చెందిన వారికి 2 చొప్పున వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి, భూగర్భజల వనరులశాఖ డీడీ రమాదేవి, ఎల్డీఎం భాస్కర్ పాల్గొన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా భవానీప్రసాద్ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజి యన్లో డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తున్న ఇత ను ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్లోని మియాపూర్కు బదిలీపై వెళ్లారు. ముగిసిన జాబ్మేళా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయా ్యరు. టీఎస్కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జాబ్మేళాలో 120 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్ఆర్ కిరణ్ పాల్గొన్నారు. వైభవంగా అయ్యప్పస్వామి పంబ ఆరట్టు స్టేషన్ మహబూబ్నగర్: అఖిలభారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబ ఆరట్టు (చక్రస్నానం) వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువింటి శ్రవణ్కుమార్ శర్మ, మోనేష్, పవన్ ఆధ్వర్యంలో స్థానిక చెలిమేశ్వర శివాలయం ఊటబావిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి రఘుపతిశర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ప్రచార సమితి అధ్యక్షుడు సీమ నరేందర్, రామేశ్వర్, సతీష్, సంతోష్, శ్రీనుస్వామి, యుగంధర్, సత్యం, రఘురాంగౌడ్, కొండల్, కురుమయ్య పాల్గొన్నారు. హక్కులు ఎంత ముఖ్యమో.. విధులు అంతే ముఖ్యం హన్వాడ: రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం హక్కులు ఎంత ముఖ్యమో విధులు సైతం అంతే ముఖ్యమని, ఇవి ప్రతి పౌరుడికి వర్తిస్తాయని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. శుక్రవారం పల్లెమోని కాలనీ పంచాయతీలోని గురుకుల పాఠశాలలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అనంతరం ఆమె ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు, విధుల పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, మాన వ అక్రమ రవాణా అరికట్టడం, వెట్టిచాకిరి విముక్తి వంటి చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణనాయక్, ఎంపీడీఓ యశోదమ్మ, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు చేపట్టాలి
అడ్డాకుల: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. అడ్డాకుల మండలం పొన్నకల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లకు సరిపడే విధంగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కొనుగోళ్లకు సరిపడే విధంగా పౌర సరఫరాల సంస్థ ద్వారా గన్నీ బ్యాగులను తెచ్చి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు జరిపిన వివరాలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని చెప్పారు. తేమ 17శాతానికి మించకుండా ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అధికారులు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. తగిన విధంగా తేమ శాతం ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకుంటే కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఇబ్బందులు తలెత్తవన్నారు. సన్న వడ్లు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వివరించారు. పెద్దవాగులో ఇసుక రీచ్ పరిశీలన పొన్నకల్ శివారులోని పెద్దవాగును కలెక్టర్ విజయేందిర పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్థానిక ఇసుక రీచ్ల నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక తరలించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనిపై స్థానిక మండల అధికారులతో కలెక్టర్ మాట్లాడి తగిన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం సుధీర్కుమార్ తదితరులు ఉన్నారు. -
పూలే ఆశయాలు కొనసాగిస్తాం
స్టేషన్ మహబూబ్నగర్: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక పద్మావతీకాలనీలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ విజయేందిర, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ విద్యావంతులు అవుతారని నమ్మిన వ్యక్తి పూలే అని అన్నారు. బ్రిటీష్ వారి కాలంలోనే చదువు అంటే ఎవరికి తెలియని సమయంలో మన పిల్లలు చదువుకోవాలని, ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసిన విద్యను అందించిన ఘనత ఆ మహనీయుడిదని అని కొనియాడారు. ఆయన ఆలోచనా విధానాన్ని అందిపుచ్చుకొని జిల్లాలో కలెక్టర్ సహకారంతో విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించే కార్యక్రమంతో ఇప్పుడు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ను లర్నింగ్ సెంటర్గా మార్పు చేసి, మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించే జీఓ త్వరలో రాబోతుందన్నారు. దానికి అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ అని నామకరణ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ అంటరాని తనం నిర్మూలన, కులవివక్ష, మహిళ విద్యకు కృషి చేసిన మహానీయుడని అన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది గ్రూప్–1లో ఎంపికైన నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ను సన్మానం చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు వినోద్కుమార్, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేశ్, జహీర్ అక్తర్, చంద్రకుమార్గౌడ్, సిరాజ్ఖాద్రీ, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, డీపీఆర్ఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
సీఈఐఆర్ పోర్టల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: మొబైల్ ఫోన్లు చోరీకి గురైన వారితో పాటు పలు సందర్భాల్లో జారవిడుచుకున్న ప్రతి ఒక్కరి ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు జారవిడుచుకున్న వంద మంది బాధితుల సెల్ఫోన్లను గురువారం జిల్లా పరేడ్ మైదానంలో ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చోరీ జరిగిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల చోరీకి గురైన ఫోన్లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించవచ్చునని తెలిపారు. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతిశీల టెక్నాలజీపై ఆధారపడిన ఒక గొప్ప సాధనమని తెలిపారు. అలాగే సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని ఎస్పీ నగదు రివార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసులు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ఎస్ఐ విజయ్భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
దేవరకద్ర మార్కెట్లో తడిసిన ధాన్యం
దేవరకద్ర/అడ్డాకుల: జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా.. దేవరకద్ర మార్కెట్లో ధాన్యం తడిసింది. గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరి కోతలు ప్రారంభం కావడంతో దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం మార్కెట్ వచ్చింది. మధ్యాహ్నం వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. తూకాలు వేసిన ధాన్యం బస్తాలపై తాట్పాల్ కవర్లు కప్పినప్పుటికీ ఆలస్యంగా అమ్మకానికి తెచ్చిన ధాన్యం కుప్పలు మార్కెట్ యార్డు ఆవరణలోనే ఉండడంతో వర్షానికి ధాన్యం తడిపోయింది. నీటిలో కొట్టుకుపోకుండా రైతులు చాలా ప్రయత్నాలు చేశారు. దాదాపు 400 బస్తాల ధాన్యం తడిసిపోయిందని, ఎంతో ఆశతో అమ్ముకుందామని తెస్తే.. వర్షం ముంచేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసాపేట మండలంలోని మూసాపేట, జానంపేట, చక్రాపూర్, వేముల, సంకలమద్ది, నిజాలాపూర్, కొమిరెడ్డిపల్లి, దాసర్పల్లి, నందిపేట, అడ్డాకుల మండలంలోని శాఖాపూర్, గుడిబండ, పొన్నకల్, రాచాల గ్రామాల్లో వర్షం కురిసింది. సర్వీస్ రోడ్లపై రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. మహబూబ్నగర్ పట్టణంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో 15 నిమిషాల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. -
బావాజీ ఉత్సవాలకు సర్వం సిద్ధం
మద్దూరు/కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకామాసంద్ ప్రభు(బావాజీ)జయంతి (చైత్ర శుద్ధ పౌర్ణమి) ఉత్సవాలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కొత్తపల్లి మండంలోని తిమ్మారెడ్డిపల్లిపల్లిలోని గురులోకామాసంద్ ప్రభు ఆలయంలో ఈనెల 11 నుంచి 14 వరకు చైత్ర శుద్ధ చతుర్ధశి నుంచి చైత్ర బహుళ విదియ వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు కర్ణాటక, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి గిరిజన భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకోనున్నారు. మొదటి రోజు ప్రభోత్సవం, బంజారాల సంస్కృతి కార్యక్రమాలు, 12న రఽథోత్సవం, 13న మహాభోగ్, ప్రభువారి పల్లకీసేవ, కాళికాదేవి మొక్కుల చెల్లింపు, 14న కాళికాదేవి పల్లకీ సేవ, హోమం, పూర్ణాహుతి, మంగళహారతి తదితర క్రతువులు జరిపిస్తారు. ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా అధికారులు ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించగా, గురువారం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను నోడల్ అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. నోడల్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు ఉత్సవాల ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్ల కోసం 450 మంది సిబ్బందిని నియమించినట్లు డీపీఓ కృష్ణ తెలిపారు. జాతరను 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ ఇన్చార్జ్గా ఎంపీఓ వ్యవహరించనున్నారు. ఫిర్యాదులకు 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు కోస్గి సీఐ సైదులు పేర్కొన్నారు. అదే విధంగా షీటీంలు, మఫ్టీలో పోలీసులు, పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇతర బందోబస్తుకు పోలీసులను నియమించినట్లు ఆయన తెలిపారు. నారాయణపేట డీఎస్సీ లింగయ్య పర్యవేక్షణలో 10 సీఐలు, 15 ఎస్ఐలు, 36 హెడ్కానిస్టేబుల్స్, 150 మంది పోలీసులు, 53 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. కోస్గి, మహబూబ్నగర్ డిపో నుంచి అదనంగా బస్సులు నడిపిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. నేటి నుంచి 14 వరకు ప్రత్యేక పూజాలు 6 రాష్ట్రాల నుంచి తరలిరానున్న గిరిజనులు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా అధికారులు -
చెరువులో మృతదేహం లభ్యం
గోపాల్పేట: ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి చెరువులో మృతదేహం లభ్యమైన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన జమ్మయ్య కుమారుడు మిద్దె చిన్నరాములు(45) మంగళవారం ఇంటి నుంచి పొలంవద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోయేసరికి బుధవారం కుటుంబ సభ్యులు వెతికారు. పొలానికి ఆనుకుని ఉన్న పెద్దచెరువు వద్ద చెప్పులు, బీడీ కట్ట ఉండటంతో బుధవారం చెరువులో వెతికారు అయినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో చెరువులో మృతదేహం కనిపించగా బయటికి తీయించారు. మిద్దె చిన్నరాములుకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేది. చేపలకోసం చెరువులోకి దిగగా ఫిట్స్ వచ్చి మరణించాడని భార్య మంజుల ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. -
కదిలిన రాములోరి రథచక్రాలు
● అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం ● జనసంద్రమైన సిర్సనగండ్ల ● మార్మోగిన శ్రీరామ నామం చారకొండ: వేదపండితుల మంత్రోచ్ఛరణాలు.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య అపరభద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి రథ చక్రాలు ముందుకు కదిలాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిర్వహించిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనాసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం (పెద్ద తేరు) కనుల పండువగా సాగింది. రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు రథాన్ని లాగి ప్రారంభించారు. ప్రధాన ఆలయం నుంచి ముక్కిండి పోచమ్మ, దత్తాత్రేయ మందిరం వరకు లాగి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. పెద్ద తేరు వేడుక అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల వరకు చూడముచ్చటగా సాగగా.. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామంతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. రథోత్సవంలో కళాకారుల కోలాటాలు, ఆటపాటలు అలరించారు. రాత్రికి స్వామివారికి నాగబలి, పూర్ణాహుతి, గజవాహన సేవ, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని చైర్మన్, ఈఓ తెలిపారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు బారులుదీరారు. స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారు, శివదత్తాత్రేయ ఆలయాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి జాతరలో ఉత్సాహంగా గడిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ శంషొద్దీన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు మురళీధర్శర్మ, లక్ష్మణ్, కోదండరా మ, వేణు, రఘు, ప్రవీణ్, సీతారామశర్మ, భక్తులు పాల్గొన్నారు. -
యువకుడి బలవన్మరణం
బల్మూర్: మండలంలోని కొండనాగుల గ్రామానికి చెందిన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముడావత్ శ్రీను కుమారుడు రాము(22) కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకున్నాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తుండగా మృతి చెందాడు. రాము ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. చిరుతదాడిలో మేకలు మృత్యువాత కోస్గి రూరల్: చిరుతదాడిలో మేకలు మృత్యువాత పడిన సంఘటన బుధవారం గుండుమాల్ మండలంలో చోటుచేసుకుంది. గుండుమాల్ గ్రామానికి చెందిన పాతారి వెంకటయ్య ఎప్పటిలాగే తమ వ్యవసాయపొలం దగ్గర మూడు మేకలను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూసే సరికి రెండు చనిపోగా, మరొకటి ప్రాణపాయ స్థితిలో ఉంది. చిరుతదాడి చేసిందని ఫారెస్టు అధికారి లక్ష్మణ్నాయక్కు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకోని పంచనామా చేశారు. మండలంలో వరుసగా చిరుతదాడి ఘటనలు జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. మరికల్లో ఆవుదూడ.. మరికల్: మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో చిరుత దాడి చేయడంతో ఆవు మృత్యువాత పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శ్రీరామ్ తన ఆవును పొలం వద్ద కటేశాడు. అర్ధరాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపినట్లు రైతు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఫారెస్ట్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
వనపర్తి/కొత్తకోట రూరల్: బంగారు షాపుల్లో నగలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్టు గుంపుగా వచ్చి షాపులోని వారిని మాటల్లో పెట్టి బంగారు చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను కొత్తకోట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 3న కొత్తకోట పట్టణంలోని శివ హనుమాన్ జూవెలర్స్లో మధ్యాహ్నం షాపు యజమాని లేని సమయంలో ముగ్గురు ఆడవాళ్లు ముగ్గురు చిన్నారులతో కలిసి బంగారు కొనుగోలు చేసేందుకు వచ్చారు. షాపులో పనిచేసే వాళ్లను మాటల్లో పెట్టి రూ.6లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్ను దొంగిలించారు. షాపులోని సీసీ కెమెరాల్లో దొంగతనం జరిగినట్టు తెలుసుకుని షాపు యజమాని విశ్వమోహన్ అదేరోజు కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కొత్తకోట ఎస్ఐ ఆనంద్, సీఐ రాంబాబు ఆధ్వర్యంలో రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. గురువారం పట్టణంలో అనుమానంగా తిరుగుతున్న మహిళలను పట్టుకుని తమదైన శైలీలో విచారించగా, చేసిన దొంగతనం ఒప్పుకున్నారు. నేరస్తుల వివరాలను జిల్లా కేంద్రంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నందకిషోర్ పవార్, రోహిత్ మచ్చీంద్ర, ఆకాష్ అంకూష్ పదుల్కర్ అలియాస్ అజయ్, సోనాలి, నిర్మలబాయితో పాటు ఇద్దరు బాలికలు ముఠాగా ఏర్పడి ఈనెల కొత్తకోటకు వచ్చి ఓ లాడ్జిలో రూంను తీసుకున్నారు. 3న ఉదయం పట్టణంలోని బంగారు షాపులను రెక్కి నిర్వహించారు. షాపులో యజమాని లేకపోవడం, పనిచేసే అబ్బాయి ఉన్నాడని చూసుకుని శివహనుమాన్ జూవెలర్స్ షాపులో బంగారు కొనేందుకు వెళ్లారు. షాపులో పనిచేసే అబ్బాయికి అడ్డంగా మహిళలు నిలబడి మాటల్లో పెట్టగా షాపులోని కౌంటర్లో గల రూ.6లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్ను ముఠాలోని బాలిక దొంగతనం చేసింది. పథకం ప్రకారం పని పూర్తయిందని గమనించిన ముఠా సభ్యులు బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో కొద్ది దూరం వెళ్లారు. ముఠాలోని మగవారు వారికోసం కారును పెట్టుకొని ఎదురు చూస్తుండగా ఆటోలో వచ్చిన ఆడవాళ్లు కారులో ఎక్కి కర్నూల్ వైపు వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి త్వరగా ఛేదించినందుకు ఎస్ఐ ఆనంద్ను, పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పాటు చేసిన సీఐ రాంబాబును, సీసీఎస్ ఎస్ఐ రామరాజు, కానిస్టేబుల్స్ యుగంధర్గౌడ్, సత్యనారాయణయాదవ్, మురళి, మహిళా కానిస్టేబుళ్లు ప్రవళికతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ప్రతి షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాపు యజమానులకు డీఎస్పీ సూచించారు. రూ.6 లక్షల బంగారు, కారు స్వాధీనం -
48 రోజులైనా.. దొరకని ఆచూకీ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. ఆరుగురి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది 48 రోజులుగా శ్రమిస్తున్నాయి. సొరంగం లోపల 13.730 కిలోమీటరు నుంచి 13.800 కిలోమీటరు వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపునకు గురువారం లోకో ట్రైన్లో కన్వేయర్ బెల్టు, ఇతర సామగ్రిని తరలించారు. అత్యంత ప్రమాదకరమైన 13.936 కిలోమీటరు ప్రదేశంలో 45 మీటర్ల వరకు కంచె నిర్మించారు. ఈ ప్రదేశంలో టీబీఎం ఎర్త్ కట్టర్ శిథిలాల కింద కూరుకుపోయింది. 13.800 మీటర్ల వద్ద సహాయక సిబ్బంది తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి వరకు కన్వేయర్ బెల్టు పొడిగించి మట్టి, బురద, రాళ్లు బయటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టి, బురద తొలగించే క్రమంలో నీరు ఉబికి వస్తోంది. నిమిషానికి 10 వేల లీటర్ల నీరు వస్తుండటంలో భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. శిథిలాల కింద టన్నుల కొద్ది స్టీల్, కూలిన కాంక్రీట్ సెగ్మెంట్లు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నా.. సహాయక సిబ్బంది వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. వారంలో శిథిలాల తొలగింపు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. కన్వేయర్ బెల్టు పొడిగిస్తున్నాం.. సొరంగ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. గురువారం సొరంగం ఇన్లెట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక చర్యల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాద ప్రదేశం వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్యం కలిగిన మోటార్లతో బయటకు తరలిస్తున్నామని, సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో పనులు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఆటంకాల నడుమ కొనసాగుతున్న సహాయక చర్యలు వారంలో శిథిలాల తొలగింపునకు యత్నిస్తున్న సిబ్బంది -
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా రెండు పడక గదుల లబ్ధిదారులకు కేటాయింపు, రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఉచిత ఇసుక సరఫరా సంబంధిత పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహసీల్దార్కు ఇసుక సరఫరా కేటాయింపు నివేదికను పంపించాలన్నారు. చిన్నచింతకుంట మండలంలోని నెల్లికొండి, చిన్నవడ్డెమాన్, అప్పంపల్లి, గూడూరు, ముసాపేట మండలంలోని పొల్కంపల్లి, అడ్డాకుల మండలం కన్మనూరు, పొన్నకల్, రాచర్ల రీచ్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణ అరికట్టేందుకు రెవె న్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్టర్ ఇసుక తయారీ అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్కార్డులకు వచ్చిన దరఖాస్తును వెరిఫికేషన్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు మోహన్రావు, ఏఎస్పీ రాములు, గనుల శాఖ ఏడీలు సంజయ్కుమార్, వెంకటరమణ, ఆర్డీఓ నవీన్, హౌజింగ్పీడీ వైద్యం భాస్కర్, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్ పాల్గొన్నారు. -
తల్లులకు అవగాహన కల్పించాలి: ఎంపీ
పాలమూరు: దేశంలో ఫ్రీ మెచ్యూర్, బర్త్ వెయిట్ ద్వారా 40 శాతం పిల్లలు పుట్టడం జరుగుతుందని ఇలాంటి వారికి ఈ మిల్క్ బ్యాంక్ ఉపయోగకరంగా ఉంటుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో సుషేనా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ధాత్రి సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్–మదర్ మిల్క్ బ్యాంక్ను గురువారం ఎంపీతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తల్లిపాల సేకరణ చేయడానికి అవసరమైన అంబులెన్స్ను ఎంపీ నిధుల కింద మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు తల్లి పాలను మించిన ఔషధం లేదని, తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలన్నారు. ఈ సెంటర్ ద్వారా ఏడాదికి 2,500 మంది పిల్లల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ సెంటర్ వినియోగంతో పాటు ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. తల్లులకు పోషకాహార లోపం, తల్లి పాల విషయంలో అవగాహన, సలహాలు అవసరమన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత మిల్క్ బ్యాంక్ సెంటర్ ఉన్న మొదటి ఆస్పత్రి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి అని తెలిపారు. ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యాప్తి చేసి డోనర్స్ నుంచి పాలు సేకరించాలన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ ఇలాంటి మిల్క్ బ్యాంక్ జిల్లాకు రావడం సంతోషకరమని, ఎలాంటి నిర్వాహణ లోపం లేకుండా విజయవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ సింగ్, డాక్టర్ జలాలం, ధరణికోట సుయోధన, శ్రీనివాస్, సంతోష్, శంకర్రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం -
పెళ్లి ఊరేగింపులో అపశుృతి
గద్వాల క్రైం: పెళ్లి కుమారుడి స్నేహితులు, డీజే నిర్వాహకుడి మధ్య జరిగిన ఘర్షణలో 10 మందికిపైగా గాయపడిన ఘటన గురువారం తెల్లవారుజామున పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జిల్లాకేంద్రంలోని గజ్జెలమ్మవీధికి చెందిన కుర్వ రామచంద్రి, సత్యమ్మ కుమారుడు అమృత్కు ధరూర్ మండలం చింతరేవులకు చెందిన యువతితో బుధవారం ఉదయం పట్టణంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో జరిగింది. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి వద్ద ఊరేగింపు నిర్వహించారు. డీజే పాటలకు పెళ్లి కుమారుడి స్నేహితులు మద్యం తాగి చిందులు వేస్తూ సౌండ్ బాక్స్లను కిందకు నెట్టడంతో పాటు డీజే నిర్వాహకుడిపై దాడి చేశారు. దీంతో అతను తన జేబులో ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో యువకుల తల, శరీర భాగాలకు గాయాలయ్యాయి. అక్కడున్న పలువురు వారిని నియంత్రించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో.. స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, గద్వాల, ధరూర్, కేటీదొడ్డి ఎస్ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు క్షణాల్లో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఘర్షణకు దారి తీసిన అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి జరిగిన తీరును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వస్తువులు, సామగ్రి ధ్వంసం కావడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనపై పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ కేసు నమోదు చేసుకొని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కత్తితో దాడి.. 10 మందికి గాయాలు -
పారదర్శకంగా.. వేగవంతంగా
మెట్టుగడ్డ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు మరింత సులువుగా, వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభించగా.. పైలెట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ నూతన విధానంపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో మొదటిరోజు అంతంత మాత్రంగానే స్పందన లభించింది. మహబూబ్నగర్ కార్యాలయంలో స్లాట్ ద్వారా 74 దస్తావేజులు, వాక్ ఇన్ ద్వారా 10, నాగర్కర్నూల్లో స్లాట్ ద్వారా 8 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. స్లాట్ సేవలు పరిశీలన.. మహబూబ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభమైన స్లాట్ బుకింగ్ సేవలను జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్లాట్ ద్వారా జరుగుతున్న రిజి స్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్లాట్ బుక్ చేసుకుని సమయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కార్యాలయంలోని సిబ్బందిని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సబ్ రిజిస్ట్రార్లకు సూచించారు. స్లాట్ బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నా ఆఫీసులో ఇష్టారాజ్యంగా దస్తావేజులేఖరుల దగ్గర పనిచేసేవారు, ప్రజలు గుమిగూడి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ సీన్ రివర్స్.. మహబూబ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేది. కానీ, నూతన విధానం అమలులోకి రావడంతో.. స్లాట్ బుక్ చేసుకున్న దస్తావేజుల అమ్మకం, కొనుగోలుదారుల కోసం సుమారు గంట సేపు కార్యాలయ సిబ్బంది వేచిచూడటం గమనార్హం. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను గురువారం మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రజలు పారదర్శకంగా, వేగంగా స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – రవీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారి, మహబూబ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభం పైలెట్ ప్రాజెక్టు మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో అమలు మొదటిరోజు అంతంత మాత్రమే స్పందన మహబూబ్నగర్లో ప్రక్రియను పరిశీలించిన జిల్లా అధికారి -
తల్లి పాల బ్యాంక్
దామరగిద్దలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటున్న యువకులునేడు జనరల్ ఆస్పత్రిలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం ● ఎస్ఎన్సీయూలో చికిత్స పొందేనవజాత శిశువులకు ఉపయోగకరం ● అత్యాధునిక పద్ధతిలో ఉత్పత్తి ● దాతల ద్వారా తల్లిపాల సేకరణ పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో గురువారం సుషేనా హెల్త్ ఫౌండేషన్–జనరల్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్– కంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం చేయనున్నారు. తల్లి పాలు నిల్వ చేయడంతో పాటు లాక్టేషన్ సపోర్ట్ సర్వీస్, బరువు తక్కువగా చిన్నారులకు, నెలలు నిండకముందే ప్రసవం అయిన చిన్నారులకు, తల్లిపాలు లేని చిన్నారుల కోసం తల్లి పాలను సేకరించి.. అవసరమైనన వారికి అందించడమే ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ప్రసవం తర్వాత పాలు ఉత్పత్తి కాని తల్లులకు సైతం బ్రెస్ట్ పంప్ వంటి ప్రత్యేక పద్ధతి ద్వారా వారి నుంచి పాలు ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు చేపడతారు. అలాంటి తల్లులు మొదట వారి పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను బ్యాంకులో వితరణ చేయాల్సి ఉంటుంది. అలాగే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాలు వితరణ చేసిన తల్లుల పాలను సేకరించి అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి చిన్నారులకు అందిస్తారు. ● ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ ఆస్పత్రిలో ప్రతి రోజు 30 నుంచి 35 ప్రసవాలు అవుతాయి. ఇందులో ముగ్గురి నుంచి నలుగురు శిశువులకు ఆరోగ్య సమస్యలతో పాటు తల్లిపాలు సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈక్రమంలో ఇలాంటి నవజాత శిశువులను ఎస్ఎన్సీయూలో అడ్మిట్ చేసి చిన్న పిల్లల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుంటారు. ప్రతి నెల జనరల్ ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూలో 350 చిన్నారులు చేరుతుంటే.. ఇందులో బయటి ఆస్పత్రుల నుంచి రెఫర్ మీద దాదాపు వంద కేసులు వస్తుంటాయి. వీరందరికీ తల్లి పాలు ఉండవు. ఈ క్రమంలో ఇలాంటి శిశువులు అందరికీ తల్లి పాల బ్యాంకు వల్ల మేలు జరగనుంది. ● పాల బ్యాంకు ద్వారా పెస్టరైజ్ చేసిన డోనర్ బ్రెస్ట్ మిల్క్ను అందించడం జరుగుతుంది. సేకరించిన పాలలో 10ఎంఎల్ కల్చర్ పరీక్షలు పూర్తి చేసిన త ర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పెస్టరైజ్ డోనర్ వ్యూమన్ మిల్క్ను జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులకు వైద్యుల సలహా, సూచన మేరకు ఉచితంగా అందిస్తారు. సాధారణంగా పౌడర్, డబ్బా పాలు, గేదె, ఆవు పాలు తాగించడం వల్ల నవజాత శిశువు ల జీర్ణక్రియ అరిగించే సామర్థ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు వస్తా యి. ఈ పద్ధతి ద్వారా సేకరించిన తల్లి పాలు దాదా పు ఏడాది పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ● జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకులో అత్యంత ఖరీదైన పరికరాలు ఏర్పాటు చేశారు. పెస్టరైజ్ ఫ్రీజర్లు, –20 డిగ్రీ ఫ్రిజ్లు, బ్రెస్ట్ పంప్లు మూడు, ప్రత్యేక ఆర్ఓ ప్లాంట్, ప్రత్యేక మిషనరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నిలోఫర్ ఆస్పత్రి తర్వాత అత్యంత పెద్ద తల్లిపాల బ్యాంకుగా పాలమూరు జనరల్ ఆస్పత్రి నిలిచిపోనుంది. ప్రీటర్మ్, బరువు తక్కువగా ఉన్న పిల్లలు సాధారణ పాలు మింగలేరు. దీంతో డోనర్ పాల ద్వారా వారికి ముఖ్యమైన పోషకాలు, యాంటీబాడీస్, వృద్ధికారకాలను అందించడానికి ఉపయోగపడుతుంది. -
అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే..
ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించాలనే లక్ష్యంతో ఈ తల్లి పాల బ్యాంకు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఎంతో మంది తల్లిలేని పిల్లలు, పాలు సక్రమంగా ఉత్పత్తి కానీ తల్లులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పాలు ఉత్పత్తి కానీ తల్లులు ధాత్రి పాల బ్యాంకు ఉపయోగించుకోవాలి. పాలు ఉత్పత్తి చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం పాటు సేకరించిన పాలకు అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత చిన్నారులకు అందిస్తాం. – రమేష్ లక్కర్స్, పాల బ్యాంకు ప్రోగ్రామ్ అధికారి నవజాత శిశువులకు మేలు.. చాలా మంది బాలింతలు, తల్లులకు హార్మోన్లతో పాటు అనారోగ్య సమస్యల వల్ల పాలు ఉత్పత్తి జరగవు. అలాగే నెలల నిండకముందే ప్రసవం అయిన తల్లులకు సైతం పాలు సకాలంలో రావు. ఇలాంటి వారి కోసం పాల బ్యాంకు నుంచి తల్లిపాలు సేకరించి అందిస్తాం. ఇది నవజాత చిన్నారులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ప్రతి శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్పత్రిలో నేడు ప్రారంభం చేయడానికి కలెక్టర్ విజయేందిర, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి హాజరవుతారు. – డాక్టర్ సంపత్కుమార్ సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలి
దేవరకద్ర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం యూనిట్ కాస్ట్లో నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినుగోనిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో ఐదు ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తికాగా, 14 ఇళ్లు మార్కింగ్ వేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా బేస్మెంట్ పూర్తయిన లబ్ధిదారురాలు మాసమ్మ ఇంటి వద్దకు కలెక్టర్ వెళ్లి పనులను పరిశీలించారు. బేస్మెంట్ కట్టడానికి ఎంతయిందని ఆమె ప్రశ్నించగా రూ.95 వేలు ఖర్చు అయినట్లు మాసమ్మ తెలిపింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిజైన్ ప్రకారం యూనిట్ కాస్ట్లో తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా కట్టుకోవచ్చని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరాఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. గ్రామంలోని అంగన్వాడీ, ఆశావర్కర్లవి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అడిగారు. కలెక్టర్ పర్యటిస్తున్న సమయంలో అక్కడిి నుంచి వస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఆమె వెంట గృహ నిర్మాణ పీడీ వైద్యం భాస్కర్, ఎల్డీఎం భాస్కర్, డీఆర్డీఓ నర్సింహులు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. బుధవారం తన చాంబర్లో పోషణ పక్షం వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షంలో భాగంగా ఈ నెల 22 వరకు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పోషకాహార లోపం అధిగమించడానికి గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్ధిదారులతో పాటు వారి కుటుంబసభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్రావు, మహిళ శిశు సంక్షేమాధికారి జరీనాబేగం, డీఎంహెచ్ఓ కృష్ణ, అదనపు డీఆర్డీఓ జోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపైన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పార్టీ ఏర్పడి 25ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లోజరిగే రజతోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్రాజేశ్వర్గౌడ్, నాయకులు నర్సిములు, వెంకటన్న, ఆంజనేయులు, గణేష్, దేవేందర్రెడ్డి, శివరాజు, సాయిలు, శ్రీనివాస్రెడ్డి, నవకాంత్, శ్రీకాంత్రెడ్డి, శరత్, వర్థభాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
టూరిజం స్పాట్గా వానగట్టు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: త్వరలో స్థానిక నవాబుపేట రోడ్డులోని వానగట్టు టూరిజం స్పాట్ గా మారనుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న సు మారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక, అటవీ, మున్సిపల్ కార్పొరేషన్ శాఖల ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం శివారులో పిల్లలమర్రి, మయూరి పార్కు, మినీ ట్యాంక్బండ్, శిల్పారామం తదితర ప్రాంతాలు టూరిజం స్పాట్గా కొనసాగుతున్నాయి. తాజాగా వానగట్టు సైతం చేరింది. ఇది ఎత్తయిన ప్రదేశం కావడంతో నగరం మొత్తం ఇక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉండేందుకు విరివిగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటుకు బుధవారం స్థల పరిశీలన చేశారు. కాగా, ఇప్పటికే అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించి మయూరి నర్సరీ ఆవరణలో వ్యూ పాయింట్ ఉంది. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఎఫ్ఓ సత్యనారాయణ, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. వ్యూ పాయింట్ కోసం స్థల పరిశీలన 3 శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు -
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు– మహబూబ్నగర్), (పురుషులు–నాగర్కర్నూల్)లలో విద్యార్థులకు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని టీడబ్ల్యూ గురుకులం మహబూబ్నగర్ రీజియన్ కో–ఆర్డినేటర్ పీఎస్ కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీలో నాలుగు, ఫిజిక్స్లో రెండు, హిస్టరీ, కామర్స్, తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అలాగే ఆయా సబ్జెక్టులలో సెట్, నెట్, పీహెచ్డీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈనెల 16వ తేదీలోగా మహబూబ్నగర్ శివారు తిరుమల హిల్స్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ (మహిళలు) ప్రిన్సిపాల్కు పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే కళాశాలలో నిర్వహించే డెమోకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.7901097704, 9848616564లను సంప్రదించ వచ్చని పేర్కొన్నారు. ఈద్గానిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మహబూబ్నగర్ క్రైం: సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రతి గ్రామం ఈద్గానిపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. రాజాపూర్ మండలం ఈద్గానిపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో రూ.4 లక్షల చెక్కును ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల భద్రతను పెంపొందించుకోవడానికి, గ్రామంలో శాంతి భద్రతలను మెరుగుపరుచుకోవడానికి, దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడానికి గ్రామస్తులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానందంగౌడ్, గ్రామ పెద్దలు పంభాక్షరి, నరేందర్రెడ్డి, బాలగౌడ్, శ్రీనివాసులు, జగన్మోహన్రెడ్డి, రఘువీరారెడ్డి, శేఖర్గౌడ్ పాల్గొన్నారు. బెట్టింగ్పై కఠినంగా వ్యవహరిస్తాం జిల్లాలో ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ ఆడినా, వాటిని ప్రోత్సాహించిన వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని ఎస్పీ డి.జానకి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈజీమనీ కోసం యువత అలవాటుపడి అధికంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని, దీనివల్ల బంగారు భవిష్యత్ అంధకారంగా మారుతుందని పేర్కొన్నారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే 8712659360 నంబర్కు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి రూ.465 కోట్లు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.465 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జితేందర్రెడ్డి నివాసంలో బుధవారం లాక్రోస్ క్రీడాకారులు, రాష్ట్ర సంఘం ప్రతినిధులు ఆయనను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో క్రీడలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఓ క్రీడలో పాలుపంచుకోవాలని సూచించారు. లాక్రోస్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. లాక్రోస్ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని, ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్ ఇండియా టీమ్ కెప్టెన్ అనుదీప్రెడ్డి తెలిపారు. త్వరలో ఆగ్రాలో లాక్రోస్ క్రీడ నేషనల్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ లాక్రోస్ అకాడమీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం మా గ్రామానికి సంబంధం లేని బ్యాంక్ చూపిస్తోంది.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా. మండల కేంద్రంలో కావడం లేదని మహబూబ్నగర్కు రెండుసార్లు వచ్చాను.వెబ్సైట్లో గ్రామం పేరు ఎంపిక చేసుకుంటే.. ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ కోడ్ చూపించడం లేదు. హెచ్డీఎఫ్సీ చూపిస్తోంది. నాకు అందులో ఖాతా లేదు. ఇలా కాదని ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంపిక చేసుకుంటే కంచంపల్లి గ్రామం పేరు చూపిండం లేదు. పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. నా సమస్యను పరిష్కరించాలి. – రమేష్, కంచంపల్లి, మహమ్మదాబాద్ టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
కుంటలో పడి రైతు మృతి
గోపాల్పేట: మోటారు బాగుచేసేందుకు కుంటలోకి దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని బుద్ధారం లక్ష్మీతండాలో వెలుగుచూసింది. ఎస్ఐ నరేష్ కుమార్ వివరాల మేరకు.. బుద్ధారం లక్ష్మీతండాకు చెందిన కోటయ్య చిన్న కుమారుడు కిషన్ (39), అతడి భార్యకు చిన్నచిన్న గొడవలు జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఐదారు నెలలుగా కిషన్ లక్ష్మీతండాలో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. గ్రామ సమీపంలోని కొత్తకుంటలో తన చిన్నాన్న బోరుమోటారు పనిచేయకపోవడంతో మంగళవారం సరిచేసేందుకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అతడి కోసం స్థానికులు గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం కుంటలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి కోటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. రాజోళి: పురుగు మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం రాత్రి మృతిచెందినట్లు ఏఎస్ఐ ప్రేమ్కుమార్ తెలిపారు. వివరాలు.. రాజోళికి చెందిన వీరన్న(23)కు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఏడాది కిత్రం ఆయనకు పచ్చకామెర్లు వచ్చాయి. అయినా కూడా మద్యం సేవిస్తుండటంతో తల్లి ఎన్నో సార్లు మందలించింది. క్రమేణా తన ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఈ నెల 5న పురుగుమందు తాగాడు.చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. గోపాల్పేట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఏదుల మండలం చెన్నారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రేవల్లి హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన అబ్దుల్ అలీం (35) ఇంట్లోనే చికెన్ విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం ఎప్పటిలాగే చికెన్ డ్రెస్సింగ్ మిషన్ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే కారులో వనపర్తి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అలీంకు భార్య ఫర్జానాబేగం, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి అబ్దుల్ రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ వివరించారు. -
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్
మెట్టుగడ్డ: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కార్యాలయాల్లో మాత్రమే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. గంటల తరబడి నిరీక్షణకు ముగింపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలు గంటల తరబడి వేచి యుండే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో ఉదయం వస్తే సాయంత్రంకు కూడా డాక్యుమెంట్ ప్రక్రియ కొనసాగుతుండేది. ఇందులో భాగంగానే దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా, వేగంగా పూర్తయ్యేందుకు ఈ స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకవస్తుంది. ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఒక్క దస్తావేజు రిజిస్ట్రేషన్కు 10నుంచి 15 నిమిషాలలో పూర్తయ్యేలా ఈ కొత్త విధానంలో తేనున్నారు. కొన్ని కార్యాలయాల్లో 80 నుండి 100 దస్తావేజులు వచ్చేవి. దీనితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకొడిగా సాగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొందరు దళారులను ఆశ్రయించి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకునేవారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రతి కార్యాలయంలో పని వేళల్లో 48 స్లాట్స్గా విభజించారు. రోజుకు కేవలం 48 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగేలా అందుబాటులోకి తేనున్నారు. ప్రజలే దస్తావేజులను తయారు చేసుకునేలా మాడ్యుల్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు మధ్యవర్తులపై, దస్తావేజు లేఖరులపై, ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్ లో ఒక మాడ్యుల్ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం సేల్డీడ్ దస్తావేజులు మాత్రమే చేసుకునేలా అవకాశం కల్పించారు. నూతన విధానానికి శ్రీకారం స్లాట్ బుకింగ్తో ప్రజలకు మేలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ సేవలతో ప్రజలకు మేలు జరుగుతుంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువుగా, వేగంగా కానుంది. ప్రజలు మధ్యవర్తులు, దస్తావేజు లేఖరులపై ఆధారపడకుండా స్వంతంగా దస్తావేజులు తయారు చేసుకునేలా మాడ్యు ల్ కూడా అందుబాటులోకి వచ్చింది.. – మొహమ్మద్ హమీద్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, మహబూబ్నగర్ రోజుకు 48 మాత్రమే ప్రజలకు మరింత సులువుగా, వేగవంతంగా 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి పైలట్ ప్రాజెక్ట్గా మహబూబ్నగర్, నాగర్కర్నూలు ఎంపిక నేటి నుంచి ప్రారంభం స్లాట్ బుకింగ్ విధానం ఇలా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in లోని పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకొని, ఆ రోజు నిర్దేశించిన సమయానికి నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్లాట్ బుక్ చేసుకొని వారి కోసం ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లు జరిపేలా, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరించేలా మరో నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. -
పబ్బతి అంజన్న.. పాహిమాం
అచ్చంపేట/మన్ననూర్: చారిత్రాక ప్రాశస్త్య్రం కలిగి ప్రకృతి రమణీయ ప్రదేశంలో పబ్బతి ఆంజనేయస్వామి కొలువుదీరారు. కష్టాలను కడతేర్చే ఇష్టదైవంగా ఇక్కడి ప్రజలు ఆరాధిస్తారు. అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని మద్దిమడుగులో ఉన్న ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. గిరిజనులనేగాక నాగరీకులు, పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచేగాక నల్గొండ, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. నల్లమల కొండల్లో కృష్ణానది పశ్చిమ భాగాన దుంధుబి నది సంఘమించే రెండు నదుల కలయిక నడుమ శ్రీశైలం పుణ్య క్షేత్రానికి ఉత్తర దిశలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1120లో గుర్తించినట్లు.. పురాతన దేవాలయం కనుగొని ఓ చెట్టు కింద విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఏటా రెండు పర్యాయాలు.. మద్దిమడుగు అభయాంజనేయస్వామి ఉత్సవా లు ఏటా రెండు పర్యాయాలు పవిత్ర కార్తీక మాసం, చైత్రమాసంలో జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయస్వామి మాలలు ధరిస్తారు. మాలధారుల సంఖ్య ప్రతి సంవత్సరం ఊహకందని విధంగా పెరిగిపోయింది. ఉత్సవాల సందర్భంగా మాచర్ల, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, హైదరాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చైత్రమాసం బ్రహ్మోత్సవాలు 10 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములునాయక్, ఈఓ నర్సింహులు తెలిపారు. కోట మైసమ్మ ఆలయం.. ఆంజనేయస్వామి ఆలయ ప్రదేశంలోనే కోట మైసమ్మ అమ్మవారు వెలిశారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది భక్తులు ఇక్కడ కోళ్లు, మేకలు సమర్పిస్తారు. భక్తుల ప్రగాడ విశ్వాసం.. స్వామివారిని దర్శించుకొని ఆలయం ఎదుట ఉన్న చెట్టుకు ఉయ్యాల కడితే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. అలాగే కోరిన కోర్కెలు తీరాలని ముడుపులు కట్టి.. తీరగానే ఆ ముడుపులను వారే స్వయంగా విప్పుతారు. ఆవు పాలు, నెయ్యి, బెల్లం, తేనె, గోధుమ రొట్టెలతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. కార్యక్రమాలు ఇలా.. 10న గురువారం అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, శివపార్వతుల కల్యాణం 11న శుక్రవారం గవ్యాంతపూజ, ద్వాదశ వాస్తుపూజ, హోమం, రుద్రహోమం, మన్యసూక్తి హోమం, బలిహరణం, సహస్ర నామార్చన, రాత్రి 8 గంటలకు స్వామివారి వాహనసేవ, సీతారాముల కల్యాణం 12న శనివారం హన్మాన్ జయంతి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాకుంభాభిషేకం, శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞంలో పూర్ణాహుతి, హనుమాన్ దీక్షదారుల మాల విరమణ. మూడు రోజులు సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం నల్లమల కొండల్లో కొలువుదీరిన స్వామివారు వేలాదిగా తరలిరానున్న భక్తులు -
బ్యాంకింగ్ రంగంపై ప్రభావం..
బ్యాంకింగ్ రంగంలోనూ కృత్రిమ మేధ ప్రభావం చూపనుంది. రోజు జరిగే అన్ని వ్యవహారాలపై రిజర్వు బ్యాంక్ ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది. ప్రజల డిపాజిట్లు కాపాడి.. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి స్థాయిలో నియంత్రణ అవసరం అవుతుంది. ఈ నియమాలు కచ్చితంగా అమలు చేయడం కోసం బ్యాంకులు ఆటోమేషన్ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. దాన్ని రెగ్ టెక్ అని పిలుస్తాం. రెగ్ టెక్ పనితీరు మరింత మెరుగుపర్చడానికి కృత్రిమ మేధను బ్యాంకింగ్ రంగం వినియోగిస్తుంది. – సురేష్, అధ్యాపకుడు, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ కళాశాల -
ఏఐతో విప్లవాత్మక మార్పులు
ఉద్యోగాలు సృష్టించాలి.. విద్యార్థులు ఉద్యోగం కోసం చదవకుండా సాంకేతికతను ఉపయోగించుకుని ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధం కావాలి. అందుకోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీని అవకాశంగా మార్చుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా సైన్స్, కామర్స్, ఇంజినీరింగ్తో పాటు అన్ని కోర్సుల సిలబస్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు గ్రామీణ ప్రాంత, మధ్యతరగతికి చెందిన వారే అధికం. వారందరికీ సాంకేతికతను అందించేందుకు కృషిచేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్లో అనేక మార్పులు తీసుకురానుంది. ఆ దిశగా మనం మారాలి. ఇలాంటి సదస్సుల్లో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు తమ అభిప్రాయాలు పంచుకుని సాంకేతికంగా ముందుకెళ్లాలి. సెమినార్లలో జ్ఞానం పంచుకోవటం అందరికీ ఉపయోగకరం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ●● ప్రపంచంలో భారతదేశం కీలకం కాబోతుంది.. ● ఒక్క సముద్ర రంగంలోనే 20లక్షల ఉద్యోగాలు ● కళాశాల సిలబస్లోనూ మార్పులు తెచ్చేందుకు వీసీలతో చర్చలు ● జాతీయ సెమినార్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కృత్రిమ మేఽధా పనితనం ప్రశంసనీయం.. వాణిజ్య నిర్వహణలో కృత్రిమ మేధా పనితనం ప్రశంసనీయం. కృత్రిమ మేధ నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడానికి సంఖ్యాకశాస్త్రం, సంభావ్యత శాస్త్రం విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు కృత్రిమ మేధ నుంచి అనేక దుష్పరిణామాలు సైతం ఎదుర్కొబోతున్నాం. వాటిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. పెరిగిన సాంకేతికత అభివృద్ధికి సోపానం కావాలి. – యలమంచిలి రామకృష్ణ, ఐపీఈ కళాశాల ప్రొఫెసర్ -
మట్టి తరలింపు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ)సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల అచూకీ కనుకొనేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. సహాయక సిబ్బంది నిత్యం 20మీటర్ల వరకు మట్టి తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా సహాయక చర్యలు పూర్తి చేసేందుకు వేగం పెంచారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు సలహాలు,సూచనల మేరకు రెస్క్యూ బృందాలు ముందుకు సాగుతున్నారు. ఉబికి వస్తున్న నీటి ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. సొరంగం ప్రమాదానికి ప్రధాన కారణం నీటి ఊటేనని జీఎస్ఐ,సీఎస్ఐ,ఎన్జీఆర్ఐలు నిర్థారించారు. వారి పర్యవేక్షణలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మినహా మిగిలిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతూ వెంటిలేషన్, కన్వేయర్ బెల్టు పొడిగింపు, టీబీఎం స్టీల్ భాగాల కత్తిరింపు వంటి పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 రకాల సహాయక బృందాలకు చెందిన సిబ్బంది 47రోజులుగా గాలిస్తున్నా వారి అచూకీ నేటికీ లభ్యం కాలేదు.బుధవారం సొరంగం లోపల కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులతో పాటు ఎస్కవేటర్ల సహాయంతో మట్టి, బురద,రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి త వ్వకాలు పూర్తి అయిన ప్రదేశం వరకు లోకో ట్రైన్ వెళ్లే విధంగా ట్రైన్ ట్రాక్ పొడగించే పనిలో నిమగ్నమయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మైన్స్ సీనియర్ శాస్త్రవేత్త జీసీ నవీన్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీ నివాసులు,కంపెనీ సీనియర్ ఇంజనీర్ సంజయ్ కు మార్సింగ్ ప్రమాద ప్రదేశంలో పరిస్థితులను క్షుణంగా పరిశీలించి సూచనలు, సలహాలు చేస్తున్నారు. లోకో ట్రాక్ పునరుద్ధరణ ప్రమాద ప్రదేశం సమీపం వరకు లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అన్నారు. బుధవారం సొరంగం ఇన్లేట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక చర్యల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మట్టి తవ్వకాలకు అనుగుణంగా లోకో ట్రైన్ ట్రాక్ వెళ్లేవిధంగా మార్గం చేస్తున్నారని చెప్పారు. టీబీఎం స్టీల్ బాగాలు కత్తరింపు పనులు,డీవాటరింగ్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగతుందన్నారు. కన్వేయర్ బెల్టు, వెంటిలేషన్ ప్రక్రియ ముందుకు కొనసాగిస్తున్నామని, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారన్నారు.అర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య,ఎన్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఉబికి వస్తన్న నీటితో ఆటంకం 47రోజలుగా కొనసాగుతన్న సహాయక చర్యలు -
పప్పుధాన్యల దిగుబడులు పెంచాలి
బిజినేపల్లి: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమాజ నిర్మాణానికి పప్పు దినుసులు, తృణధాన్యాల సాగు పెంచాలని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డా. బలరాం కోరారు. వానాకాలం, యాసంగి సాగులో అతివృష్టి, అనావృష్టి, చీడపీడలను తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలంలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం రెండోరోజు జెడ్ఈఆర్ఏసీ సమావేశం జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. సేంద్రియ సాగు, సమగ్ర వ్యవసాయం, వాణిజ్య పంటల్లో దిగుబడుల పెంపు, చీడపీడల నివారణపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శాస్త్రవేత్తలు, అధికారులు పెద్ద రైతులను ఎంపిక చేసుకొని వారితో విప్లవాత్మక ప్రయోగాలు చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సరైన సూచనలు, సలహాలిస్తూ పంటల సాగులో దిగుబడుల్ని పెంచాలని కోరారు. రెండోరోజు ఆయా విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పంటల సాగులో వాతావరణ పరిస్థితులు, సస్యరక్షణ చర్యలు, సమగ్ర వ్యవసాయం, సాంకేతిక పద్ధతుల్లో విత్తనోత్పత్తి, విస్తరణ అంశాలు, చీడపీడలు, దిగుబడులు, నేలలు తదితర వాటిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డా. ఎం.యాకాద్రి, ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డా. సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
చేప బక్క చిక్కింది..
సబ్సిడీ చేపల నాణ్యతపై అనుమానాలు ● చెరువుల్లో వదిలిన చేపపిల్లల వృద్ధిపై మత్స్యకారుల్లో ఆందోళన ● పావు కేజీ నుంచి అర కేజీ వరకే పెరిగిన వైనం ● జిల్లాలో గతేడాది 93.68 లక్షల చేప పిల్లల పంపిణీ మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రతి ఏడాది చెరువులు నిండగానే రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పంపిణీ చేస్తున్న చేపపిల్లల నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతేడాది చెరువుల్లో వదిలిన చేపపిల్లల సైజులో పెద్దగా వృద్ధి కనిపించకపోవడంతో మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తోంది. గత వర్షాకాలంలో చెరువులు నిండడం, ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. తీరా.. చేపపిల్లల పంపిణీ సగానికి తగ్గించడం, ప్రైవేటు హేచరీలలో కొందామంటే అందుబాటులో లేకపోవడం వల్ల వారు నిరాశపడాల్సి వచ్చింది. చాలీచాలని చేపపిల్లలు చెరువుల్లో వదిలి ఉత్పత్తి కోసం ఎదురుచూసిన మత్స్యకారులకు మండుతున్న ఎండలతో నీరు పూర్తిగా అడుగంటిపోవడం, చేపల సైజు రాకపోవడం వల్ల వారి జీవనంపై ప్రభావాన్ని చూపింది. గతేడాది అక్టోబర్ నెలలో పంపిణీ చేసిన చేపపిల్లలు కనీసం అర కేజీ కూడా పెరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్ల సమయంలో కొనుగోలు కమిటీ హేచరీలను సందర్శించి నాణ్యతపై సముఖత వ్యక్తం చేసిన తర్వాతే చేపపిల్లల పంపిణీకి టెండర్ ఫైనల్ చేస్తారు. ఆ సమయంలో నాణ్యతను పరిశీలించాల్సిన సంబంధిత శాఖ అధికారులు హడావుడిగా పంపిణీ చేయడం, వాటిలో కూడా సగం వరకు కోత విధించడం వల్ల మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది. ● మహబూబ్నగర్ జిల్లాలో 234 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 12,496 మంది సభ్యులున్నారు. జిల్లావ్యాప్తంగా 1,091 చెరువులు, కుంటలు ఉండగా.. గత వర్షాకాలం సీజన్లో 993 చెరువుల్లో చేపపిల్లలను వదలాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 1.92 కోట్ల చేపపిల్లలు అవసరమవుతాయని అంచనా వేయగా.. సగానికి కుదించి పంపిణీ చేశారు. పథకాల అమలులోనూ జాప్యం మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయికి ఆశించిన స్థాయిలో చేరడం లేదు. ఎన్నో సంక్షేమ పథకాలున్నా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పథకాలపై అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే హడావుడి చేయడమే గానీ.. మిగతా సమయాల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారే విమర్శలున్నాయి. -
పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం
మహబూబ్నగర్ రూరల్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కోడూర్లోని ఎస్సీ కాలనీలో రేషన్కార్డు లబ్ధిదారుడు హెచ్.గోపాల్, సత్యమ్మ ఇంట్లో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. జిల్లాలో మొత్తం 506 చౌకధర దుకాణాల ద్వారా 5,228 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడూర్లో 761 రేషన్కార్డులు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చౌకధర దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి టి.వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రవినాయక్, తహసీల్దార్ సుందర్రాజ్, ఎంపీడీఓ కరుణశ్రీ ఉన్నారు. సన్న బియ్యం బాగుంది.. సన్న బియ్యం ఎలా ఉందని కలెక్టర్ అడగగా.. బాగుంది మేడం అని గోపాల్ చెప్పాడు. కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను తన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారని గోపాల్ కలెక్టర్కు తెలిపాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరూ రేషన్షాపుల ద్వారా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోపాల్ కుమారుడితో మాట్లాడుతూ ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా.. ‘కలెక్టర్ తన ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు భోజనం చేయడం ఆ నందంగా ఉందని, మా జీవితంలో మర్చిపోలేం.’ అని లబ్ధిదారుడు గోపాల్ తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి -
నేడు ఏఐపై జాతీయ సెమినార్
జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఆమె మాట్లాడారు. ‘వాణిజ్య రంగంలో ఏఐ ప్రభావం’ అన్న అంశంపై ఒకరోజు సెమినార్ కొనసాగుతుందని దేశంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి సెమినార్ కోసం ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 130 జనరల్స్ వచ్చాయ న్నారు. త్వరలోనే విద్యార్థులకు పాఠ్యాంశంగా తేబోతున్న ఏఐతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దానివల్ల కలిగే అనర్థాలను అదే తరహా లో వివిధ కళాశాలల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారన్నారు. సెమినార్కు రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, పీయూ వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్, సీసీఈ జేడీ జి.యాదగిరి, రాజేందర్సింగ్, ఏజీఓ బాల భాస్కర్, ముఖ్యవక్త యలమంచిలి రామకృష్ణ, రీసోర్స్ పర్సన్ డా.కె.రాజ్కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. వైస్ప్రిన్సిపాల్ డా.నర్మద, మీడియా కన్వీనర్ రాఘవేందర్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన పద్మావతి కాలనీలోని నిర్మల్ ఆర్గనైజేషన్ నియర్ రెడ్ బక్కెట్, మన్నార్ ట్రైడర్స్ బిల్డింగ్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి మైత్రిప్రియ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిది రకాల ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. వివరాల కోసం 99485 68830 నంబర్కు సంప్రదించాలని కోరారు. నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లకు ప్రతి యజమాని వేరు చేసిన చెత్తను ఇవ్వాలని సూచించారు. ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్ ప్లాట్లలో, కూడళ్లలో చెత్త పారవేయొద్దన్నారు. ఇప్పటికీ ఎక్కడైనా చెత్త ఇవ్వని వారు ఉంటే వెంటనే గుర్తించి తమకు సమాచారం అందజేయాలన్నారు. ఈ విషయంలో ఎవరితోనూ ఘర్షణ పడొద్దని, సామరస్యంగా వ్యవహరించాలని, అలాంటి వారిలో మార్పు వచ్చేందుకు యత్నించాలన్నారు. ఇక డంపింగ్ యార్డుకు సిల్ట్ తప్పా మిగతా చెత్తను వేరు చేసి డీఆర్సీసీకి అప్పగించాలన్నారు. అక్కడ గుట్టలు గుట్టలుగా చెత్త పోగు కాకుండా చూడాలన్నారు. అంతకుముందు డంపింగ్ యార్డులోని సెగ్రిగేషన్ షెడ్లు, బయో మైనింగ్, డీఆర్సీసీలను పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, రవీందర్రెడ్డి, వజ్రకుమార్రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమిత్రాజ్ పాల్గొన్నారు. ‘దాడులపై ప్రభుత్వంస్పందించాలి’ పాలమూరు: రాష్ట్రంలో దశలవారీగా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరగడం అత్యంత బాధాకరమని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది సయ్యద్ ముస్తాబా అలీపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులతో పాటు మహిళా జూనియర్ న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి కోర్టుకు నుంచి బయటకు ర్యాలీగా వెళ్లి ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు. ఆ తర్వాత కోర్టు నుంచి ర్యాలీగా తెలంగాణ కూడలి వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులపై దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వెంకట్రావు, నాగోజీ, ఎన్పీ వెంకటేష్, ఉమామహేశ్వరి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
నాణ్యతగా ఉన్నవిసరఫరా చేయాలి
ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను నాణ్యతగా సరఫ రా చేయాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తీవ్రంగా నష్టపోతున్నాం. గత సంవత్సరం పంపిణీ చేసిన చేప విత్తనా ల సైజు రాలేదు. పావు కేజీ నుంచి అర కేజీ మాత్రమే వచ్చింది. చేపపిల్లలను ఎ ప్పటికప్పుడు పరిశీలించిన తర్వాత పంపిణీ చేస్తే బాగుంటుంది. – జిల్లెల శేఖర్, మత్స్యకారుడు, పెద్దదర్పల్లి, హన్వాడ నాణ్యతపరిశీలించేపంపిణీ చేశాం చెరువుల్లో పంపిణీ చేసే సమయంలో పరిశీలించి తీసుకోమని చెబుతున్నాం. నాణ్యత చూసుకొని సంతృప్తి చెందాకే చేప పిల్లలు పంపిణీ చేశాం. టెండర్ ప్రక్రియ ద్వారా చేపపిల్లలు పంపిణీ చేశాం. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి అర కేజీ కూడా పెరగలేదు.. గత సంవత్సరం చెరువుల్లో ప్రభుత్వం వదిలిన ఉచిత చేపపిల్లలు పెరగలేదు. సైజు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా చెరువులో పావు కేజీ నుంచి అర కేజీ లోపే చేపల సైజులో వృద్ధి వచ్చింది. చేప పిల్లలు నాణ్యతపై అనుమానాలున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లలను నాణ్యతగా సరఫరా చేయాలి. – వెంకటయ్య, కొత్తపేట మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తీవ్రంగా నష్టపోతున్నాం.. చెరువుల్లో ప్రతి సంవత్సరం ఉచితంగా వదిలే చేప విత్తనాల నాణ్యతపై నిర్లక్ష్యం వహించడం సరికాదు. బాధ్యత కలిగిన ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం వదిలిన చేప విత్తనాలు సైజు రాకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. – శ్రీకాంత్, హజిలాపూర్, నవాబ్పేట మండలం -
వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని భారత మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని స్థాయిలో ఉంటే మరోవైపు గ్యాస్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు అందించే ఉజ్వల గ్యాస్ సిలిండర్పై కూడా రూ.50 పెంపు మోయలేని భారమేనన్నారు. అంబానీ, అదానీలకు ఆదాయం కట్టబెట్టడానికే ధరల పెంపని తేట తెల్లమవుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పడిపోతే.. దేశంలో మాత్రమే పెరిగిందని సాకు చూపుతూ ధరల పెంపు ఏ మాత్రం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా కార్యదర్శి గీత, కమిటీ సభ్యులు మాధవి, సత్యమ్మ, సింధు, పద్మ, మహిళలు పాల్గొన్నారు. -
విద్య, స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత
స్టేషన్ మహబూబ్నగర్: నియోజకవర్గంలో విద్య, స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్తో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ‘మహబూబ్నగర్ ఫస్ట్’ పేరుతో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, తక్కువ సమయంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తాయన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేస్తామని తెలిపారు. టెట్, డీఎస్సీ, వీఆర్ఏ, వీఆర్ఓ, గ్రూప్స్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాల య సంస్థ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలకు ఉచిత శిక్షణ ప్రారంభించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాలు ద్వారా 250 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ నిర్వహించడం, మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకొని, రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మహబూబ్నగర్ ఫస్ట్ కోచింగ్ సెంటర్ అడ్మిషన్ దరఖాస్తులను ఆవిష్కరించారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కోచింగ్ ఫ్యాకల్టీ రవికుమార్, గాలి బాల్రాజు, నాని యాదవ్, రాజేంద్రచారి పాల్గొన్నారు. -
జోరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ఉల్లి విక్రయాలు జోరుగా సాగాయి. బుధవారం ఈశ్వర వీరప్పయ్యస్వామి రథోత్సవం ఉండటంతో మార్కెట్కు సెలవు ప్రకటించగా.. ఒకరోజు ముందుగానే ఉల్లి వేలం నిర్వహించారు. సుమారు మూడు వేల బస్తాల ఉల్లి మార్కెట్కు రాగా.. నాణ్యమైన ఉల్లి ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలుదారుల సందడి కనిపించింది. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఉల్లిని తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేశారు. నిలకడగా ధరలు.. మంగళవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగానే ఉన్నాయి. ఉదయం 10 గంటలకే వేలం ప్రారంభం కాగా క్వింటా గరిష్టంగా రూ.1,800.. కనిష్టంగా రూ.1,200 ధర పలికింది. మార్కెట్ నిబంధనలు సడలించిన తర్వాత బస్తా 50 కిలోలుగా నిర్ణయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.900.. కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. క్వింటా గరిష్టంగా రూ.1,800.. కనిష్టంగా రూ.1,200 -
రిజర్వాయర్ భూసర్వేను అడ్డుకున్న రైతులు
బల్మూర్: మండలంలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా తమకు నష్టం కలిగించే ప్రాజెక్టుపై ఏడాదిగా పోరాటం చేస్తున్న తమతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్చించకుండా పరిహారాలు ఇవ్వకుండానే భూసర్వే చేయడం ఏమిటని వారు సర్వే సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈసందర్భంగా మైలారం–అంబగిరి రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై కోర్టులో కేసు ఉన్న కూడా నిబంధనలు పాటించకుండా సర్వే చేయడంపై రైతులు మండిపడ్డారు. గతంలో రెండు సార్లు సర్వే పనులను అడ్డుకున్నా మళ్లీ సర్వే చేయడం తగదని, మరోసారి సర్వేకు వస్తే దాడులు తప్పవని రైతులు సర్వే సిబ్బందిని హెచ్చరించారు. దీంతో సర్వే సిబ్బంది వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతు నాయకులు తిరుపతయ్య, శివశంకర్, కృష్ణయ్య, రాజేష్, కాగుల మల్లయ్య, శ్రీశైలం,తో పాటు బల్మూర్, అనంతవరం గ్రామానికి చెందిన భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు. సర్వే సిబ్బందితో వాగ్వాదం మరో సర్వేకు వస్తే దాడులు తప్పవు: రైతులు -
కనులపండువగా పూల రథోత్సవం
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంగళవారం తెల్లవారుజామునా పూల రఽథోత్సవం(చిన్నతేరు) కనులపండువగా సాగింది. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ అంజనేయులు, మేనేజర్ నిరంజన్ అర్చకులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిథులు, భక్తులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై దత్తాత్రేయ గుడి, ముక్కిండి పోచమ్మ, మైసమ్మ దేవాలయాలను దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, భజనలు, భక్తుల శ్రీరామనామస్మరణతో రథం ముందుకు సాగింది. రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు క్యూలైన్ద్వార స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు మురళిధర్ శర్మ, లక్ష్మణ్ శర్మ,వేణు శర్మ, ఆనంద్ శర్మ, గోపి శర్మ, భాస్కర్ శర్మ, ప్రవీణ్ శర్మ భక్తులు పాల్గొన్నారు. నేటి రాత్రి పెద్ద రథోత్సవం బుధవారం అర్ధరాత్రి దాటాక పెద్ద రథోత్సవం ప్రారంభమవుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఆలయ ఈఓ ఆంజనేయులు తెలిపారు. అర్చకుల ప్రత్యేక పూజలు పోటెత్తిన భక్తులు -
బస్సు, బైక్ ఢీ : ఒకరి దుర్మరణం
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై మంగళవారం బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఆయన కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటకు చెందిన కింగ్లీకార్ ప్రవీణ్ కుమార్(40), అతడి స్నేహితుడు గోపికృష్ణ పెద్దాపూర్లో ఉన్న స్వామి గురూజీని కలవడానికి బైక్పై వస్తున్నారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న అచ్చంపేట డిపోకు చెందిన బస్సు పెద్దాపూర్ స్టేజీ వద్ద నిలిచిన బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్కుమార్, గోపికృష్ణకు గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్కుమార్ మృతిచెందాడు. భార్య అక్షర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు. గోపీకృష్ణ మిఠాయి దుకాణంలో పనిచేస్తుండగా.. ప్రవీణ్కుమార్ బడంగ్పేటలో మటన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మహిళ బలవన్మరణం రాజోళి: కుటుంబ సమస్యలతో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జగదీశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కటిక లలితాబాయి (58)కి ఇద్దరు కుమా ర్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త చంద్రారావు మానసికంగా సక్రమంగా లేకపోవడం, కుమారులకు వివాహాలు కాక పోవడం, వ్యాపారాలు సాగకపోవడంతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద కుమారుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మదనాపురం: తల్లి గొడ్డలితో దాడి చేయగా గాయపడ్డ కొడుకు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ శివకుమార్ తెలిపారు. వివరాలు.. మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన కోటకొండ బాలకృష్ణ (35) పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఏడాదిగా బాలకృష్ణ బదులు తల్లి లక్ష్మి పనిచేస్తుంది. ఈ నెల జీతం కుమారుడు ఖాతాలో పడింది. 3వ తేదీన డబ్బులు ఇవ్వమని లక్ష్మి కొడుకును కోరింది. దీంతో తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. లక్ష్మి గొడ్డలితో కొడుకుపై దాడి చేసింది. చిన్నకుమారుడు రవి హుటాహుటిన బాలకృష్ణను వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఖిల్లాఘనపురంలో బాలిక.. ఖిల్లాఘనపురం: మండల కేంద్రానికి చెందిన సుష్మ(10) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ సురేశ్గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన అక్కి శ్రీశైలంకు సుష్మ (10), నిశిత కుమార్తెలు. వీరిద్దరు ఈ నెల 6న గొర్రెలు మేపుతుండగా.. సుష్మ అకస్మాత్తుగా కూలిపడి నోటిలో నుంచి నురగ వచ్చింది. గుర్తించిన నిశిత వెంటనే తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి అటు నుంచి మహబూబ్నగర్, హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందింది. విష పురుగు కరిచి తమ కుమార్తె మృతి చెందిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. గుర్తుతెలియని జంతువు దాడిలో ఆవు మృతి ధరూరు : మండలంలోని మార్లబీడుకి చెందిన రైతు బాయిదొడ్డి రాజుకు చెందిన ఆవుపై ఓ గుర్తు తెలియని జంతువు దాడి చేయగా మృతిచెందింది. బాధితుడు తెలిపిన వివరాలు.. మార్లబీడుకి చెందిన రైతు బాయిదొడ్డి రాజు పొలం ధరూరు గట్టు శివారులో ఉంటుంది. పశువులను అక్కడే కట్టేసిన రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా.. ఆవు గొంతు భాగం రక్తగాయాలతో కనిపించింది. దీంతో రైతు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా వారు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆవు మధ్యాహ్నం మృతిచెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు రాఘవేంద్ర, మార్లబీడు గ్రామస్తులు కోరారు. -
46 రోజులుగా శ్రమిస్తున్నారు..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం లోపల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం పైకప్పు కూలిన ఘటన జరిగి మంగళవారం నాటికి 46 రోజులు గడవగా.. సొరంగం లోపల మట్టి, బురద, రాళ్లు, టీబీఎం బాగాల తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. అలాగే ఎప్పటికప్పుడు వెంటిలేషన్ పనులు చేపడుతున్నారు. మంగళవారం రాత్రి షిఫ్ట్కు వెళ్లిన సహాయక సిబ్బంది కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 13.730 కి.మీ., వరకు కన్వేయర్ బెల్టు ఉండగా మరో 70 మీటర్ల మేర దీనిని పొడిగించనున్నారు. ఈ నెల 11 వరకు నాలుగు రోజుల పాటు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు కొనసాగనుండగా.. ఈ సమయంలో మట్టి, బురద బయటకు తరలించడం సాధ్యం కాదు. కన్వేయర్ బెల్టు పొడిగింపు ఇదే చివరి అవకాశంగా అధికారులు చెబుతున్నారు. తొలగించిన టీబీఎం బాగాలు, రాళ్లు, శిథిలాలను లోకో ట్రైన్ ప్లాట్ఫాం ద్వారా బయటకు తరలిస్తారు. మిగిలిన 70 మీటర్ల వరకు ఉన్న శిథిలాలను ఈ నెల 16 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి. సొరంగం పైకప్పు కూలిన 13.938 కి.మీ., ప్రదేశం అత్యంత ప్రమాదకరమైనదిగా నిర్ధారించి 45 మీటర్ల వరకు కంచె ఏర్పాటు చేశారు. అక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో మిగిలిన 70 మీటర్ల వరకు ఉన్న మట్టి, బురద, రాళ్లు, టీబీఎం బాగాలను తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వెంటిలేషన్ కొనసాగింపు.. సొరంగం లోపల మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ పనులు కొనసాగిస్తున్నారని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. మంగళవారం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద ప్రదేశంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిగిలిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఐదు ఎస్కవేటర్ల సహాయంతో మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్టు ద్వారా మట్టి బయటకు తరలిస్తున్నామని చెప్పారు. సొరంగంలో నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు పంపింగ్ చేస్తున్నామన్నారు. మరోసారి కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు ప్రారంభం ఈ నెల 16 వరకు 70 మీటర్ల శిథిలాలు తొలగించేలా ముందుకు.. ఎస్ఎల్బీసీలో ముమ్మరంగా సహాయక చర్యలు