Mahabubnagar District News
-
అనుమానిత వ్యక్తులతో అప్రమత్తం
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ వెంకటేశ్వరావు అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ, సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో మంగళవారం 11 మంది ఎస్ఐలు, 69 మంది పోలీస్ సిబ్బంది కలిసి సుమారు 200 ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నేర రహిత గ్రామాలుగా చేయాలనే ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అదే విధంగా మాదక ద్రవ్యాలు, గంజాయి, పేలుడు పదార్థాల నిల్వ చేసినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పేపర్లు, నంబర్ ప్లేట్లు లేని 40 వాహనాలను సీజ్ చేసి పట్టణ పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. సంబంధిత వాహనాల యజమానులు పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు. పాత వాహనాలు కొనేటప్పుడు అన్ని పత్రాలు సరిచూసుకోవాలన్నారు. సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వాటిని అరికట్టాలని కోరారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, వివిధ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
పచ్చి రొట్టతో ప్రయోజనాలు
పిల్లి పెసర సాగుతో.. ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం వేసుకోవాలి. పూత దశలో 4 నుంచి 5 టన్నుల పచ్చి రొట్ట ఇస్తోంది. దీనిని పరిశుభ్రంగా కూడా వాడుకోవచ్చు. ఒక టన్ను పిల్లి పెసరలో 4 కిలోల నత్రజనిని, ఒక కిలో భాస్వరం, 3 కిలోల పోటాష్ లభిస్తోంది. రైతులు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు చల్లుకొని భూముల్లో సేంద్రియ కర్భనం పెంపొందించుకోవాలి. అలంపూర్ : వరి సాగులో సేంద్రియ ఎరువులను సమపాళ్లలో అందించడంలో రైతులు విఫలమవుతున్నారు. దీంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. వర్షాకాలం ప్రారంభంకావడంతో పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పచ్చి రొట్టె ఎరువుల వినియోగంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ పేర్కొంటున్నారు. పచ్చి రొట్ట ఎరవులతో కలిగే లాభాలు పచ్చి రొట్ట వినియోగం వలన ముఖ్యంగా భూమి గుళ్ల బారుతుంది. అలాగే భూసారం కూడా పెరుగుతుంది. పొలానికి నీటిని, పొషక పదార్థాలను నిల్వ ఉంచుకొనే శక్తి పెరుగుతుంది. అలాగే మొక్కల వేర్లకు గాలి, నీరు పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము, జీలుగలు, పెసర వంటి పంటలను పచ్చి రొట్ట విత్తనాలు, ఎరువులను తక్కువగా వినియోగించుకొనే సాగు చేయవచ్చు. భూమిలో ఆమ్ల, క్షార గుణాలను పెంపొందించుకోవచ్చు. మొక్కలకు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా చూసుకోవడంతోపాటు పంట నాణ్యత, దిగుబడులు పెంచేందుకు పచ్చి రొట్ట మేలు చేస్తోంది. వీటి వలన చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. పంటలో కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలో ఇంకేలా చేస్తోంది. పంటలకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మ క్రిములు భూమిలో వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. పప్పు జాతి పచ్చి రొట్ట పైరు వలన భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెరుగుతుంది. పచ్చి రొట్ట విత్తన ఎరువుల ఎంపిక పచ్చి రొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా, కాండం వచ్చి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వలన వేర్లపైనే నత్రజని బుడిపెల ద్వారా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగి ఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండటంతో నీటి ఎద్దడిని తట్టుకొని పెరుగుతాయి. పచ్చి రొట్ట పైర్ల వేర్లు భూమిలోకి చొచ్చుకొనిపోయే గుణం కలిగి ఉంటాయి. త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టేందుకు ఉపయోగపడతాయి. జీలుగు సాగు పచ్చి రొట్ట ఎరువుల సాగు చేసుకుంటే భూమికి అవసరమైన సేంద్రియ పదార్ధాల్ని అందిస్తాయి. వీటి వలన భూమిలో సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెందుతాయి. జీలుగలు ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనం కావాలి. పూత దశలో కోసినపుడు ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్ట ఎరువు వస్తోంది. ఒక టన్ను జీలుగ సాగులో ఐదు కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 4 కిలోల పొటాష్ వస్తుంది. చౌడు భూములకు బాగా పనికొస్తుంది. జనుములు ఎకరానికి 20 కిలోల విత్తనం కావాలి. పూత దశ కంటే పంట వేసిన 8 వారాల తర్వాత కోసినప్పుడు 6–8 టన్నుల పచ్చి రొట్ట వస్తోంది. ఒక టన్ను జనుములో నాలుగు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, మూడు కిలోల పొటాష్ ఉంటుంది. పాడి–పంట -
బావిలో పడి మహిళ మృతి
మల్దకల్ : బావిలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మద్దెలబండ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సరస్వతి (38) భర్త సవారన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారు. సరస్వతి పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో బావిలో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోవడంతో ఈత రాక నీటిలో మునిగి మృతి చెందింది. మహిళ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలోరైతు దుర్మరణం తాడూరు: వ్యవసాయ పొలానికి వెళ్తున్న ఓ రైతును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుంతకోడూరుకు చెందిన లింగంగౌడ్ (45) తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే ప్రధాన రహదారిపై నడుచుకుంటూ పొలానికి వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని కోరారు. వ్యక్తి బలవర్మణం కొల్లాపూర్ రూరల్: మండలంలోని నార్లాపూర్ చెంచుగూడెం గ్రామానికి చెందిన తిరుగుడు బక్కన్న (45) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం భార్య సాలమ్మతో మృతుడు బక్కన్న ఘర్షణ పడ్డాడు. దీంతో ఆమె తన సొంత గ్రామానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకున్నాడు. సాయంత్రం కుమారుడు వచ్చి చూడగా అప్పటికే బక్కన్న మృతి చెందారని తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనపూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వ్యక్తికి ఏడాది జైలుశిక్ష మహబూబ్నగర్ క్రైం: భార్యను వేధించిన కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం మంగళవారం ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే నవాబ్పేట మండలం కారూర్కు చెందిన ఆటో డ్రైవర్ కావలి శ్రీనివాస్పై అతని భార్య తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని 2021లో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జీషిట్ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసు మంగళవారం వాదనకు రావడంతో వాదనలు విన్న మెట్రోపాలీటన్ మెజిస్ట్రేట్ కోర్టు కావలి శ్రీనివాస్ను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ మహిళలపై హింసకు పాల్పడితే పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ షాక్తో ఎద్దు మృతి మాగనూర్: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వడ్వాట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రైతు వాకిటి చిన్న మారెప్పకు చెందిన ఎద్దు పొలంలో మేత మేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలోకి వెళ్లగా కరెంట్ వైరు తగలడంతో అక్కడికక్కడే మరణించింది. మృతి చెందిన ఎద్దు విలువ రూ.60 ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యక్తిపై కేసు నమోదు బిజినేపల్లి: బిజినేపల్లి నుంచి నాగర్కర్నూల్ వైపు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని షీటీం బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు షీ టీం ఇన్చార్జ్ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. నిందితుడిని వికారాబాద్కు చెందిన శివగా గుర్తించామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఏస్పీ రామేశ్వర్ హెచ్చరించారు. -
సహకార బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులతో త్వరలోనే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మహాజన సభలో చైర్మన్ మాట్లాడారు. ఈ సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు డిపాజిట్లు రూ. 443 కోట్లకు చేరుకున్నాయని.. ఇప్పటి వరకు రూ. 685 కోట్ల స్వల్పకాలిక, రూ. 468 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు ఇచ్చామని వెల్లడించారు. అదే విధంగా వివిధ ప్రయోజనాల కోసం రైతులు, ఖాతాదారులకు వ్యవసాయేతర రుణాలు అందిస్తున్నామన్నారు. రుణ వసూళ్లలో ప్రగతిని కనబరుస్తూ.. ఆర్బీఐ నుంచి వీక్ బ్యాంకు స్టేటస్ తొలగిపోయేలా ఉద్యోగులు కృషి చేశారన్నారు. హన్వాడ రైతు సేవా సహకార సంఘాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంగా డీసీసీబీకి అనుసంధానం చేస్తూ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాగా, జీఓ 44 రద్దు కోసం కృషిచేసిన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డిని సింగిల్విండో చైర్మన్లు భూపాల్రావు, భాస్కర్రెడ్డి ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి జ్యోతిరాణి, డైరెక్టర్లు, పీఏసీఎస్ల చైర్మన్లు తదితరులు ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి -
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి
స్టేషన్ మహబూబ్నగర్: మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని పశుసంవర్ధక, యువజన, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మహబూబ్నగర్ ఫస్ట్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యెన్నం ఆలోచనతో మహబూబ్నగర్ ఫస్ట్ కింద సెట్విన్ ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. శ్రీనివాస్రెడ్డి పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన 3డీ యానిమేటెడ్ పుస్తకాలను మార్గదర్శకంగా తీసుకొని మక్తల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు అందజేయగా.. 62శాతం ఉన్న ఉత్తీర్ణత వందశాతం పెరిగినట్లు పేర్కొన్నారు. మయూరీ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తాం మహిళలు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి మయూరీ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తామని ఎమ్మెల్యే యెన్నం పేర్కొన్నారు. కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ.. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు మంత్రి, ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆనంద్గౌడ్, ఎన్పీ.వెంకటేశ్, సురేందర్రెడ్డి, విజయ్కుమార్, వసంత, సిరాజ్ఖాద్రీ, లక్ష్మీప్రసన్న, మహబూబ్నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 70= పశుసంవర్ధక, యువజన,క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం -
పార్వతమ్మకు పోలీసుల ఆశ్రయం
ఆత్మకూర్: నవమాసాలు మోసి కనీ పెంచి ప్రయోజకుడిని చేసిన ఆ తల్లిని బస్టాండ్లో వదిలేసిన వెళ్లి న కసాయి కొడుకు.. హృదయవిధారక ఘటనకు సంబంధించి మంగళవారం ‘సాక్షి’లో పట్నం వెళ్దామని.. ఆత్మకూర్లో దింపాడు.. కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఎస్పీ రావుల గిరిధర్ స్పందించి ఘటనపై ఆరాతీసి పార్వతమ్మకు ఆశ్రయం కల్పించాలని సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్కు ఆదేశాలు జారీ చేశారు. సీఐ, ఎస్సై ఆత్మకూర్ బస్టాండ్కు చేరుకొని వృద్ధురాలితో వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యానికి ఎస్పీ సిఫారసు ఆత్మకూర్ ఆర్టీసీ బస్టాండ్లో దీనిస్థితిలో ఉన్న పార్వతమ్మకు హైదరాద్లోని నిమ్స్లో మెరుగైన వైద్యం చేయించేందుకు ఎస్పీ గిరిధర్ అన్ని ఏర్పాట్లు చేయించారని సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్ తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో పార్వతమ్మ భర్త రామకృష్ణను పిలిపించామని.. కుమారులు భాస్కర్, రాములుపై వనపర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించామని తెలిపారు. పార్వతమ్మ ఆధార్కార్డు ఇతర వివరాలను సేకరించి ఇక్కడి నుంచే అంబులెన్స్లో హైదరాబాద్లోని నిమ్స్కు తరలిస్తామని, తమ సిబ్బందిని వెంట పంపిస్తామని వెల్లడించారు. ‘సాక్షి’ కథనానికి స్పందన ఎస్పీ ఆదేశాలతో నిమ్స్కు తరలింపు భర్తను పిలిపించి కుమారులపై ఫిర్యాదు -
ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం
చారకొండ: సీర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నెం 327, 328 భూమిలో గతంలో అక్రమంగా నిర్మించిన 34 ఇళ్లను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 19న తొలగిస్తామని దేవదాయఽ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీర్సనగండ్ల ఆలయ ఆవరణంలో గుట్ట దిగువన ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై తహసీల్దార్ సునీత ఆధ్వర్యంలో బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆలయ భమిలో ఇళ్లు నిర్మించుకున్న 34మందికి ఇళ్లు ఖాళీ చేయాలని గతంలో నోటీసులు అందించినట్లు తెలిపారు. గడువు మేరకు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి అధికారులు, దేవాదాయ శాఖకు సహకరించాలని కోరారు. దాంతో బాధితులు ఉన్నఫలంగా తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోమంటే ఎక్కడికెళ్లాలి, కొన్ని ఏళ్లుగా ఇక్కడే ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నాం.. ఇళ్లను తొలగించొద్దని వేడుకున్నారు. అధికారులు ఖాళీ చేయాల్సిందేనని తెల్చడంతో ప్రత్యామ్నాయంగా మరోచోటు చూసుకునేవరకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులకు కొంత సమయం కావాలని వినతిపత్రం అంజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు. సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ శంషోద్దిన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణధరి, ఈఓ ఆంజనేయులు, ఆర్ఐ భరత్, అధికారులు ఉన్నారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి కొంత సమయం కావాలని అధికారులకు బాధితుల వినతి -
మిగిలిన కుట్టు కూలి ఎప్పుడిస్తారు?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘గత ఏడాది విద్యా సంవత్సరం (2024–25) లో విద్యార్థుల కోసం యూనిఫాం కుడితే మొదటి విడత కుట్టు కూలి మాత్రమే ఇచ్చి, పెంచిన డబ్బులు ఇవ్వకపోతే ఎలా..?’ అంటూ ఓ మహిళా సంఘం సభ్యురాలు ఏకంగా మెప్మా భవనం తలుపులు కొద్దిసేపు మూసివేసి నిరసన తెలిపిన ఘటన తాజాగా వెలుగులో వచ్చింది. గత ఏడాది మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలోని సుమారు 140 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 18 వేల మంది విద్యార్థుల కోసం యూనిఫాం కుట్టడానికి మూడు ఏజెన్సీ (ఎస్హెచ్జీ)లకు మెప్మా అధికారులు పని అప్పగించారు. అప్పట్లో ఒక్కో జతకు రూ.50 మాత్రమే కూలి ఇస్తామనడంతో సరిపోదని ఏజెన్సీ నిర్వాహకులు మొరపెట్టుకున్నారు. దీంతో మరో రూ.25 చొప్పున అదనంగా ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఆ మేరకు పని పూర్తి చేసి అప్పగించినా ఇంకా రూ.తొమ్మిది లక్షల వరకు రావాల్సి ఉందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. విసిగి వేసారిన వారిలోని ఒకరు శ్రీనివాసకాలనీ మహిళా సంఘం సభ్యురాలు సౌధామిని మంగళవారం మధ్యాహ్నం మెప్మా భవనానికి చేరుకుని సీఓలతో వాగ్వాదానికి దిగారు. వారిని బయటకు పంపి తలుపులు మూసివేసి కొద్దిసేపు నిరసన తెలిపారు. తమకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని వేడుకున్నారు. చివరకు లెక్కలు తేల్చి త్వరలోనే ఇస్తామని వారు బదులివ్వడంతో ఆమె శాంతించి అక్కడి నుంచి వెనుదిగారు. ఈ విషయమై ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మిని వివరణ కోరగా గత ఏడాదికి చెందిన సుమారు రూ.8.06 లక్షలకు చెక్కు ఇటీవలే డీఆర్డీఏ అధికారులు తమకు ఇచ్చారన్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం రూ.తొమ్మిది లక్షలు రావాల్సి ఉందని అడుగుతున్నారని.. లెక్కల్లో తేడా ఉన్నందున ఇంతవరకు చెల్లించలేదన్నారు. త్వరలోనే వారిని పిలిపించి లెక్కలు సరిచూసి నిబంధనల మేరకు బకాయిలు ఇస్తామన్నారు. ● గత ఏడాదికి సంబంధించిన మిగతా డబ్బులు రూ.లక్షల్లో పెండింగ్లో ఉంచిన అధికారులు ● మెప్మా భవనం తలుపులు మూసివేసి నిరసన తెలిపిన మహిళా సంఘం సభ్యురాలు -
మన పాలమూరు ఫస్్ట..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు.. నాకు జన్మనిచ్చిన జిల్లా. మక్తల్ నుంచి ఇక్కడకు కాళ్లతో తిర్లాడిన.. సైకిల్పై తిర్లాడిన.. ఆ తర్వాత బండిపై తిర్లాడిన. ఇప్పుడు మంత్రిగా ఇక్కడికి రావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది.’ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, పాడి అభివృద్ధి, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించగా.. పలు విషయాలు వెల్లడించారు. తన రాజకీయ జీవితం, పలు పరిణామాలతో పాటు 1991లో ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ఇతర జిల్లాల్లో మంత్రి పదవులకు పోటీ ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో నన్ను మంత్రిగా చేయాలని కోరారు. పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఏ లక్ష్యంతోనైతే నాకు మంత్రిగా బాధ్యత కట్ట్టబెట్టారో.. అందుకనుగుణంగా నా విధులు నిర్వర్తిస్తా. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తా. -
టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): యువతకు నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ సహకారంతో టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ నిర్వహిస్తున్నట్లు టాస్క్ రిజినల్ సెంటర్ స్టేట్ హెడ్ నవీన్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్, సీ లాంగ్వేజ్, జావా, హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్..తదితర అంశాలపైన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ తరగతులు డిప్లామా డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు 9908092738 నంబర్కు ఫోన్ చేయాలని, జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని టాస్క్ ఆఫీసులో సంప్రదించి తమపేర్లను నమోదు చేసకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించాలి గండేడ్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ ప్రవీణ్కుమార్ సూచించారు. మంగళవారం మండలపరిధిలోని గాధిర్యాల ప్రాథమిక ఉన్నత పాఠశాల, కువ్హముది తండా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలా బోధిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లను నేర్పించాలన్నారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఆమె ఎన్ఎస్ఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు నిర్వహించే అంతర్జాతీయ వెబినార్లో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ వలంటీర్లు భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యోగా ప్రాధాన్యత, ఆరోగ్యం తదితర వివరాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అర్జున్కుమార్, రవికుమార్, రాఘవేందర్, శివకుమార్, గాలెన్న, ఈశ్వర్, చిన్నదేవి తదితరులు పాల్గొన్నారు. రేపు జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: నిజామాబాద్లో ఈనెల 28 నుంచి జూలై 1 వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను ఈనెల 19న ఉదయం 8 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో వనపర్తి జిల్లా మినహా పూర్వ మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో రావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9396439663 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. 16 అడుగులకుకోయిల్సాగర్ నీటి మట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ నీటి మట్టం మంగళవారం సాయంత్రం వరకు 16 అడుగులకు చేరింది. జూరాలకు ఇన్ఫ్లో కొనసాగడంతో ఉంద్యాల పంపుహౌస్ నుంచి నీటిని నిరంతరం ఒక పంపు ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి చేరడం ప్రారంభమైంది. యాసంగి పంటలకు వదిలిన తరువాత ప్రాజెక్టులో 11 అడుగుల మేర ఉన్న నీటి మట్టం 12 రోజుల్లో 5 అడుగుల మేర పెరిగింది. మరో 10.6 అడుగుల నీరు చేరితే పాత అలుగుస్థాయికి నీటి మట్టం చేరుతుంది. గేట్ల లెవల్ 32.6 అడుగులు కాగా మరో 16.6 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. -
వ్యాధుల ముప్పు.. అప్రమత్తతే మందు
● అర్బన్ ఏరియాలోనే అధిక కేసులు నమోదు ● ఇప్పటికే జిల్లాలో మొదలైన వర్షాలు ● దోమలు వృద్ధితో సీజనల్ వ్యాధుల ముప్పు ● నివారణకు కార్యాచరణ ప్రకటించిన ఆరోగ్య శాఖ పాలమూరు: జిల్లావ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పారిశుద్ధ్య లోపం, తినే ఆహారం కారణంగా ఇవి దరిచేరుతాయి. వర్షాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీనికితోడు వాతావరణంలో అనూహ్య మార్పులు ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా జ్వరాల దరువు మొదలైంది. వారం రోజులుగా ఆస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలిస్తే.. సాధారణ రోజుల కంటే 10 శాతం అవుట్ పేషెంట్ (ఓపీ)లు పెరిగారు. వీరిలో 70 శాతం జ్వరపీడితులే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. అపరిశుభ్రత.. వాతావరణ మార్పులు ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందుగానే రావడంతో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ వ్యాధులకు.. దోమల దండయాత్రకు వానాకాలం అనుకూలం. దోమలను నియంత్రించగలిగితే సగం వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా దోమకాటు వల్ల జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువ. మలేరియా, డెంగీ, గన్యా వంటి వ్యాధులు సోకుతాయి. దోమలు ప్రధానంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, మురుగు కాల్వలు, చెత్త, అపరిశుభ్రత వాతావరణంలో గుడ్లుపెట్టి సంతతిని వ్యాప్తి చేస్తాయి. ఇలాంటి ప్రాంతాలను గుర్తించి దోమల నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి.. ● గతేడాదితోపాటు ప్రస్తుతం వస్తున్న సీజనల్ వ్యాధులు అధిక సంఖ్యలో కేసులు మహబూబ్నగర్ అర్బన్ ఏరియాలో నమోదవుతున్నాయి. 70 శాతం కేసులు అర్బన్లో వస్తే.. 30 శాతం రూరల్ ఏరియాలో రావడం విశేషం. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంలోని భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, రామయ్యబౌళి, మర్లు, ప్రేమ్నగర్, వీరన్నపేటతోపాటు శివారులో వెలుస్తున్న నూతన కాలనీల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వ్యాధులు సోకుతున్నాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 58 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. ● ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓపీ కేసులు 1,61,016 ఉండగా.. ఐపీ కేసులు 13,221 ఉన్నాయి. ఈ నెల మొదటి వా నుంచి ఓపీతో పాటు ఐపీ కేసులు కొంత మేర పెరిగాయి. -
నమూనాలు సేకరిస్తున్నాం
వానాకాలంలో వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. రక్తకణాలు తగ్గాయని ఎవరూ ఆందోళన చెందరాదు. ఫీవర్ కేసులు అధికంగా వచ్చే ఏరియాలో వంద ఇళ్లను కవర్ చేసి పిచికారీ చేయిస్తున్నాం. ఎక్కువ కేసులు వస్తే అక్కడే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వేడి ఆహారం తీసుకోవడంతోపాటు పరిశుభ్రంగా ఉండాలి. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తాం.. ఆస్పత్రిలో బాధితులు పెరిగితే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఫీవర్ క్లినిక్ పేరుతో ప్రత్యేకంగా ఓపీ చూస్తున్నాం. వర్షాలు పడుతున్న క్రమంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి అధికంగా సోకుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. జనరల్ ఆస్పత్రిలో కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.వాతావరణ మార్పులతో ఒక్కసారిగా రోగుల తాకిడి పెరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. – సంపత్కుమార్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● -
ప్రజలతో మానవీయంగా వ్యవహరించాలి
జడ్చర్ల: ప్రజలతో పోలీసులు మానవీయంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు చేయడానికి వచ్చే బాధితులకు నమ్మకం కలిగే విధంగా పోలీసుల సేవలు ఉండాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. మంగళవారం ఆమె జడ్చర్ల పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఠాణాకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సీరియస్గా తీసుకుని న్యాయ పరిరక్షణకు పాటు పడాలన్నారు. ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యమని తెలిపారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్టేషన్కు వచ్చే మహిళలను గౌరవించాలన్నారు. జాతీయ రహదారులు 44, 167లపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. రహదారులపై ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో గస్తీని ముమ్మరం చేయాలని దొంగతనాలు, ఇతర నేరాల అదపునకు కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యల గురించి సీఐ కమలాకర్ను అడిగి తెలుసుకున్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. ● జూన్ 16 నుంచి జూలై 31 వరకు 45 రోజుల పాటు అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ 0–5 ఏళ్ల పిల్లలలో అతిసార ప్రబలకుండా నివారణలో భాగంగా పీహెచ్సీలు, సబ్సెంటర్ల ద్వారా ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ పాకెట్లు, జింక్ టాబ్లెట్లు పంపిణీ చేయనన్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అతిసార వల్ల దేశంలో 4.8 శాతం పిల్లలు చనిపోతున్నారని తెలిపారు. సోమవారం నుంచి జూలై 31వ తేదీ వరకు ఇంటింటికి ఓఆర్ఎస్ పాకెట్లు, జింక్ టాబ్లెట్ల పంపిణీతో పాటు.. వీటి వినియోగించడంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యాధికారులు సిబ్బంది ఈ విషయంలో సరియైన సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక ఓఆర్ఎస్ పాకెట్ను లీటర్ నీటిలో కలుపుకొని నీళ్ల విరేచనాలున్న పిల్లలకు తాగించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డా.భాస్కర్నాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మజ, జిల్లా మాస్ మీడియా అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 112 ఫిర్యాదులు -
సాగుకు సాయం
వివరాలు 8లో uమహబూబ్నగర్ (వ్యవసాయం): వానాకాలం ప్రారంభ సమయానికే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని సంబరపడుతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం రెండెకరాల లోపు ఉన్న రైతులకు డబ్బులు జమ చేసింది. ప్రతి ఏడాది వానాకాలం, యాసంగిలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ సాగును ప్రోత్సహిస్తోంది. 2,54,059 మందికి.. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 2,54,059 మంది రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా వ్యవసాయ అధికారులకు అందింది. దీని ఆధారంగా సంబంధిత యంత్రాంగం రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ట్రెజరీ, బ్యాంకర్లకు పంపించారు. ట్రెజరీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవ్వనున్నాయి. ఇందులో 2,54,059 మంది రైతులకు రూ.255.48 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చెల్లించాల్సిందిగా సంబంధిత వివరాలను ట్రెజరీకి పంపింది. అధికారులు రైతుల వివరాలను తనిఖీ చేసిన తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ● రైతు భరోసా డబ్బులు జమ చేయడంలో సర్కారు మొదటగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేసింది. సోమవారం 1,38,682 మంది రైతుల ఖాతాల్లో రూ.75,60,92,639 నగదును జమ చేసింది. ఇదిలా ఉంటే జూన్ 5వ తేదీ నాటికి పాస్ పుస్తకాలు పొందిన ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపజేస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలో రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోని రైతులు 10 వేల మంది ఉంటారని ఒక అంచనా. వీరందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది యాసంగి సీజన్లో సైతం రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. మిగతా రైతులు కూడా గత సీజన్కు సంబంధించి తమకు రైతు భరోసా అందించాలని సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్న పెట్టుబడి సాయం తొలిరోజు జిల్లాలో 1,38,682 మంది రైతులకు రూ.75.60 కోట్లు.. ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
28, 29 తేదీల్లో కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి ఫంక్షన్హాల్లో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ బ్రోచర్లను సోమవారం జిల్లాకేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు తెలంగాణలోని 20 జిల్లాల నుంచి 600కు పైగా విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, నాయకులు కిరణ్కుమార్రెడ్డి, రాజు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్కు ఐదోసారి గడువు పొడిగింపు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్–2020కి సంబంధించి 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మొదట గత మార్చి 31, ఆ తర్వాత ఏప్రిల్ 30, మూడోసారి మే 3 వరకు, నాలుగోసారి 31 వరకు తిరిగి ఇప్పుడు ఈనెల 30వ తేదీ వరకు ఇలా ఐదుసార్లు పొడిగించారు. దీనికి కారణం దరఖాస్తుదారుల నుంచి సరైన స్పందన రాకపోవడమేనని తెలుస్తోంది. పూర్తయిన క్షేత్రస్థాయి పరిశీలన ● అధికారికంగా వెల్లడించని అధికారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: షెడ్యూల్ ప్రకారం పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ముసాయిదా ప్రక్రియకు సంబంధించి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారంతో పూర్తయింది. కాగా, ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు మొత్తం 94 వచ్చాయి. ఈనెల 12 నుంచి అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఒక్కో డివిజన్లో కనిష్టంగా 3,000 గరిష్టంగా 3,400 వరకు ఓటర్లు ఉండేలా లెక్కలు గక్కారు. అయితే ఈ డివిజన్లలో చేసిన మార్పులు, చేర్పుల వివరాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంకా వెల్లడించలేదు. వచ్చిన దరఖాస్తులలో ఎన్ని పరిష్కరించారు? ఏమైనా తిరస్కరణకు గురయ్యాయా? లేదా? అనేది గోప్యంగా ఉంచారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఈ నివేదికను కలెక్టర్ విజయేందిర బోయికి ఈనెల 17న సమర్పించాల్సి ఉంది. కోయిల్సాగర్లో 15.6 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో సోమవారం సాయంత్రం వరకు నీటిమట్టం 15.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి నీటిని ఒక పంపు ద్వారా విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రతిరోజు కొంత మేర పెరుగుతోంది. ఈ నెల 6 నుంచి నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి రావడం ప్రారంభమైన విషయం తెలిసిందే. యాసంగి పంటలకు వదిలిన తర్వాత 11 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ప్రస్తుతం జూరాల నుంచి కృష్ణా జలాల రాకతో 4.6 అడుగుల మేర పెరిగింది. మరో 11 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి వస్తుంది. గేట్ల లెవల్ నీటిమట్టం 32.6 అడుగులు ఉంది. -
రైతు క్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రైతు క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మహబూబ్నగర్ మండలంలోని ధర్మాపూర్ రైతు వేదికలో కలెక్టర్ విజయేందిర, రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షలు మాఫీ చేసి, రైతులను రుణ విముక్తి చేశామని ఆయన గుర్తు చేశారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉందని విమర్శించారు. వరి వేస్తే నాడు ఉరి అన్నారని, కానీ ప్రజా ప్రభుత్వంలో వరి వేస్తే పండుగ అయిందని, సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం రైతును రాజును చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అనంతరం ధర్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చమ్మ, కృష్ణయ్య, గోవర్ధన్ జీ రైతు కుటుంబం సభ్యులకు రైతు బీమా చెక్కులను కలెక్టర్తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారిణి శ్రుతి, ఎంపీడీఓ కరుణశ్రీ, రాజుగౌడ్, ఎన్ బాలయ్య, శ్రీనివాస్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రతాప్రెడ్డి, ఖాజా, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి డబ్బులు అందాయి
ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. రైతు భరోసా డబ్బులతో సాగు పనులు ప్రారంభించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తాను. అప్పులు చేయకుండా రైతు భరోసాతో పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – జి.కుర్మయ్య, రైతు, కోడూర్, మహబూబ్నగర్ రూరల్ అర్హులందరికీ పెట్టుబడి సాయం జిల్లాలో వానాకాలం సీజన్ పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద 2.54 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదలయ్యాయి. మొదటి రోజు ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండెకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇంకా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోని రైతులంతా తమతమ మండలాల వ్యవసాయ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలి. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిఎంతో మేలు.. ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతు భరోసా సాయం జమ చేస్తుండటం సంతోషకరం. ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందజేస్తుండటంతో మా లాంటి చాలా మంది రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. – మల్లు వెంకటేశ్వర్రెడ్డి, రైతు, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ ● -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,315 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 63.37 శాతంతో 3368 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,690 మంది బాలురు పరీక్షలు రాయగా 56.1శాతంతో 1,509 మంది, 2,625 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 70.82 శాతంతో 1,859 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరంలో 509 మంది విద్యార్థులు హాజరైతే 343 మంది ఉత్తీర్ణులై 67.39 శాతం నమోదు చేశారు. ఇందులో 343 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా.. 67.64 శాతంతో 232 మంది, బాలికలు 166 మంది హాజరు కాగా.. 66.87 శాతంతో 111 మంది ఉత్తీర్ణత సాధించారు. ● ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ కోర్సుల్లో మొత్తం 2,944 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 49.88శాతంతో 1,469 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 1,811 మంది పరీక్షలకు హాజరైతే 47.73 శాతంతో 865 మంది, బాలికలు 1,133 మంది హాజరైతే 53.31 శాతంతో 604 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి సెకండియర్లో రీకౌంటింగ్, రీ వ్యాలువేషన్కు ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫస్టియర్లో 63.37 శాతం,సెకండియర్లో 49.88శాతం ఉత్తీర్ణత -
మిగిలిన పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలి హెచ్ఎంలుగా పదోన్నతులు ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులు, రిటైర్డ్ అయ్యాక ఖాళీ అయిన పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ను హైదరాబాద్లో కలిసి విన్నవించారు. ఈమేరకు ఇటీవల నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడులు సమర్థవంతంగా నిర్వహించేందుకు జోన్ –2లో ఖాళీగా ఉన్న 750 పోస్టులను వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేయగా మిగిలిన 507 పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం అధ్యక్షులు వివేక్, టీపీఆర్టీయూ నాయకులు శ్రవణ్, నిజాముద్దీన్ పాల్గొన్నారు. జాతీయ రహదారిపై గాల్లోకి ఎగిరిన కారు జడ్చర్ల: జడ్చర్ల శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం కారు అతి వేగంతో గాల్లోకి ఎగిరి ఓ చెట్టుపై పడిన సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న కారు కావేరమ్మపేట వద్దకు వచ్చే సరికి ఒక్కసారిగా కారు గాలిలోకి దాదాపు పది అడుగుల పైకి ఎగిరి రహదారిపై ఉన్న ఓ చెట్టు కొమ్మలపై పడింది. కొమ్మలు విరిగి కిందకు పడిన కారులో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన డ్రైవర్ రామయ్య స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన దాబా నుంచి ఓ కారు అకస్మత్తుగా జాతీయ రహదారిపై అడ్డు రావడంతో బ్రేక్ వేయబోయి ఎక్స్లేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని డ్రైవర్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. -
కేఎల్ఐ కాల్వలోపడి వ్యక్తి మృతి
మిడ్జిల్: మండల కేంద్రంలోని కొత్తూర్ రోడ్డు సమీపంలో కేఎల్ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మిడ్జిల్కు చెందిన వస్పరి లోకేష్(నాగయ్య) (34) ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్లాడు. రాత్రి గ్రామంలోని బంధువుల ఇంటి దగ్గర భోజనం చేశాడు, ఇంటికి వెళ్లలేదు, తరచు అతనికి మూర్చవ్యాధి వస్తూ ఉండేది, సోమవారం ఉదయం కొత్తూర్ రోడ్డు సమీపంలోని కేఎల్ఐ కాల్వ బ్రిడ్జి కింద వ్యక్తి పడి ఉండడం చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు లోకేష్ మృతదేహంగా గుర్తించారు. మూర్చవ్యాధితో ప్రమాద వశాత్తు కాల్వలో బ్రిడ్జిపై నుంచి పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్లకు తరలించినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. లోకేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి కేటీదొడ్డి: అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం గ్రామానికి చెందిన సగడం అనిత(26) తెల్లవారు జామున ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్ధానికులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు వెళ్లి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె బంధువులతో మనస్పర్ధలు ఉన్నాయని, ఆమె గొంతుపై గాట్లు ఉన్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులు వివరణ కోరగా, ఆమె తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం నర్వ: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అంకెన్పల్లికి చెందిన లక్ష్మన్న (54) తన కుమార్తెను చూసేందుకు సోమవారం సాయంత్రం గుడిగండ్లకు బయలుదేరాడు. రాత్రి 8 గంటల సమయంలో పాతర్చేడ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి హన్వాడ: మండలంలోని నాగినోనిపల్లి శివారులో ఈ నెల 13న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని సల్లోనిపల్లికి చెందిన సిరంజి నర్సిములు (45) 13వ తేదీ రాత్రి మహమ్మదాబాద్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నాగినోనిపల్లికి చేరుకోగానే హన్వాడ నుంచి కోస్గి వైపు వెళ్తున్న కారు బైక్ను ఢీకొనడంతో నర్సిములుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని.. తమ్ముడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
జూరాలకు జలకళ
ధరూరు/ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో పైనుంచి ఇన్ఫ్లో పెరిగిందని.. 50వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 21వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు 50వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 23, 957 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 63 క్యూసెక్కులు మొత్తం ప్రాజెక్టు నుంచి 25,835 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.184 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ● జూరాల ప్రాజెక్టుకు దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతునట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, 25.144 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 27.700 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 52.844 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువన కురిసినవర్షాలకు పెరిగిన ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి 50వేల క్యూసెక్కుల వరద దిగువకు 25,835 క్యూసెక్కులు విడుదల -
ట్రాక్టర్పై స్టంట్స్..జరిమానా విధింపు
మానవపాడు: జాతీయ రహదారిపై స్టంట్స్ చేస్తూ ట్రాక్టర్ను నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి జరిమానా విధించిన సంఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ చంద్రకాంత్ తెలిపినా వివరాలు.. ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామకృష్ణ మానవపాడు నుంచి ఉండవెల్లి మీదుగా జాతీయ రహదారిపై రెండు రోజుల క్రితం ట్రాక్టర్పై విన్యాసాలు చేస్తుండగా మానవపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని మోటార్వైకిల్ యాక్ట్ ప్రకారం రూ.1100 జరిమానా విధి ంచినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యుత్ తీగలు చోరీ మానవపాడు: మండలంలోని గోకులపాడు, చెన్నిపాడు గ్రామాల సరిహద్దులోని పొలాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వ్యవసాయ పొలాల్లో మోటర్లు, విద్యుత్ వైర్లు, ఫీజులు, పైపుల చోరీకి పాల్పడుతున్నట్లు ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. గోకులపాడుకు చెందిన రైతులు చిన్న నరసింహులు, జమ్మన్న, పలువురి పొలాల్లో చెందిన పొలాల్లో సుమారు రూ.70 వేలు విలువైన విద్యుత్ వైర్లు చోరీ జరిగినట్లు సోమవారం పేర్కొన్నారు. -
పట్నం వెళ్దామని.. ఆత్మకూర్లో దింపాడు
ఆత్మకూర్: మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. నవమాసాలు మోసి కనీ పెంచి ప్రయోజకుడిని చేసిన కన్నతల్లిని బస్టాండ్లో వదిలేశాడో కసాయి కొడుకు.. ఈ హృదయ విధారక ఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. వివరాలిలా.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టకాలనీలో నివాసముంటున్న పార్వతమ్మను(60) కుమారుడు భాస్కర్ హైదరాబాద్కు తీసుకెళ్తానని మూడురోజుల క్రితం ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చాడు. ఆత్మకూర్ బస్టాండ్లో దించి ఇక్కడే కూర్చోమని.. అరగంటలో వస్తానని చెప్పి పత్తాలేకుండా ఉడాయించాడు. తీర ఎంతరాత్రయినా రాకపోవడంతో తోటి ప్రయాణికుల సహాయంతో కుమారుడికి ఫోన్ చేయగా.. పొద్దున్నే వాస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మూడురోజులుగా కనిపించిన ప్రతి ప్రయాణికుడిని తనవద్ద ఉన్న కాగితం ముక్క చూయిస్తూ తన కుమారుడికి ఫోన్ చేయాలని కోరుతూ.. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కన్నీరు మున్నీరు అవుతుంది. పార్వతమ్మ కాళ్లకు గాయం కావడంతో బస్సు ఎక్కలేక, ఎక్కడికి వెళ్లలేక కంటతడి పెడుతూ బస్టాండ్లోనే బిక్కుబిక్కుమంటూ మూడు రోజులుగా కుమారుడి కోసం ఎదురుచూస్తోంది. వనపర్తిలోని తమ బంధువులు స్పందించి తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటుంది. అరగంటలో వస్తానని మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ కన్నతల్లిని బస్టాండ్లో వదిలేసిన కసాయి కొడుకు కాళ్లకు గాయాలతోవృద్ధురాలి కన్నీరుమున్నీరు బంధువులైనా తీసుకెళ్లాలని వేడుకోలు -
నేటి మహా ధర్నాను జయప్రదం చేయండి
మన్ననూర్: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పౌరహక్కుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు జక్కా బాలయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి మహాధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను 2024 నుంచి ఇప్పటి వరకు 540 మందిని కాల్చి చంపారని.. వీరిలో మూడోవంతు అమాయకులైన ఆదివాసి బిడ్డలే ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా సభ్యుడు బియ్యని వెంకటేష్, కుల నిర్మూలన పోరాట సమితి నాగర్కర్నూల్ జిల్లా కన్వీనర్ ముద్దునూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆడిపాడిన కలెక్టర్
పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా గడపాల్సిన కలెక్టర్ బదావత్ సంతోష్ మెడికల్ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. సోమవారం నాగర్కర్నూల్ శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన ట్రెడిషనల్ డే వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లంబాడా వేషధారణ విద్యార్థులతో కలిసి కలెక్టర్ నృత్యం చేసి ఉత్తేజపరిచారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ భారతీయ కళలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – నాగర్కర్నూల్ క్రైం -
అందరిపై జగద్గురువుల ఆశీస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: మనందరిపై జగద్గురువుల దివ్య ఆశీస్సులు ఉండాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పాలమూరు పట్టణానికి సమీపంలోని శ్రీవాసవీ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన యుగమానోత్సవం, బసవేశ్వర జయంత్యుత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని మాట్లాడుతూ.. బసవేశ్వరుడు విప్లవవాది అని, సమసమాజ స్థాపనకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. అందరూ సమానమేనని, అందరిని సమాన దృష్టితో చూడాలని ఆయన తెలియజేసినట్లు చెప్పారు. ఆయన స్ఫూర్తితో సమాజంలో కులమతాలు బేధాలు లేకుండా సమానత్వంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. కాశీ, ఉజ్జయిని ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రొఫెసర్ చంద్రశేఖర్రెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా చిన్నారులు, యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ భక్తిపాటలకు భరతన్యాటం, కూచిపూడి నాట్యం చేసి అలరించారు. హాజరైన జగద్గురువులు మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జగద్గురువులు, స్వామిజీలు హాజరయ్యారు. ఉజ్జయిని సద్ధర్మ సింహాసనాధీశ్వర శ్రీ10008 జగద్గురు శ్రీసిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య, శ్రీశైల సూర్యసింహాసనాధీశ్వర శ్రీ1008 జగద్గురు శ్రీడాక్టర్ చన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య, కాశీ జ్ఞానసింహాసనాధీశ్వర 1008 జగద్గురు శ్రీడాక్టర్ చంద్రశేఖర శివాచార్య, డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు పాల్గొన్నారు. అనంతరం స్వామిజీలు భక్తిప్రవచనాలు చేశారు. ఉదయం ఇష్టలింగ పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్, ముక్తా శ్రీశైలం, రాజశేఖరస్వామి, సిద్ధిరామప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాలమూరులో వైభవంగా పంచాచార్య యుగమానోత్సవం, బసవేశ్వర జయంత్యుత్సవం హాజరైన జగద్గురువులు – వేలాదిగా పాల్గొన్న ప్రజలు -
సర్వర్ బిజీ!
మెట్టుగడ్డ: రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆఫీస్ లాగిన్ సర్వర్ మొరాయించడంతో కార్యాలయాల్లో కార్యాకలాపాలు స్తంభించి దస్తావేజుల ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి అన్ని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయా ల్లో ఆన్లైన్ (సర్వర్) సమస్య తలెత్తడంతో మధ్యా హ్నం వరకు రిజిస్ట్రేషన్లు నిలిచాయి. సర్వర్ పనిచేయక కార్యాలయ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. అమ్మకపు, కొనుగోలుదారులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత సర్వర్ సమస్య తీరడంతో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయంపై మహబూబ్నగర్ సబ్రిజిస్ట్రార్ మొహమ్మద్ హమీద్ను వివరణ కోరగా రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక సేవల్లో సమస్య వచ్చిందన్నారు. ● రిజిస్ట్రేషన్ శాఖలో స్తంభించిన కార్యకలాపాలు -
విత్తన నాణ్యతోనే పంట దిగుబడి
ఉపయోగాలు ● రైతులు పైన పేర్కొన్న నాలుగు పద్ధతుల్లో తమ స్థాయిలో మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. ● మొలక శాతం పరీక్షల అనంతరం పంట పెంచుకోవడం వలన వృథా సమయం కాదు. ● ఎంచుకున్న విత్తనాలు సరైనవా.. కాదా..? అనే విషయం గుర్తించవచ్చు. ● విత్తనాల విషయంలో ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు. ● నాణ్యమైన విత్తనాలను నాటితే అధిక దిగుబడులు పొందవచ్చు. ● మంచి గింజలను ఎంపిక చేసుకోవాలి ● 90 శాతం విత్తనాలు మంచిగా ఉండాలి అలంపూర్: విత్తనం బాగుంటే మొలక బాగా వస్తుంది. మొలకలు బాగా వస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకే విత్తు కోసం నాణ్యమైన గింజలను ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచించారు. నాణ్యమైన విత్తనాలను క్రమ పద్ధతిలో కడితే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. విత్తనాలను మొలక కట్టి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. విత్తనాలను లెక్కించే విధా నాల గురించి రైతులకు ఈ విధంగా వివరించారు. విత్తన ఎంపిక : పంట సాగులో విత్తనం ప్రభావం నుంచి విత్తనాన్ని నాటితే ఉత్తమ ఫలితాలను అందుకోవచ్చు. – అనుకూలమైన, ఆరోగ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే రైతులకు అన్ని విధాల శ్రేయస్కరం. విత్తన నాణ్యత ప్రమాణాలను మొలక శాతం ఆధారంగా నిర్దారిస్తారు. అందుకు తెలుగు రాష్ట్రాల్లో విత్తన పరీక్షా కేంద్రాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజేంద్రనగర్, ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి గూడెం, ఎమ్మిగనూరులో విత్తన పరీక్షా కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి విత్తనాలను ఎంపిక చేస్తారు. ఆ విత్తనాలను ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు రైతులకు సరఫరా చేస్తారు. రైతులు పండించిన పంట నుంచి కూడా విత్తనాలు తయారు చేసుకోవ చ్చు. విత్తనాలను మొలక కట్టి వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. రైతులు నాలుగు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని తెలుసుకోనే పద్ధతులు ఉన్నాయి. పేపర్ టవల్ పద్ధతి : పేపర్ టవల్ లేదా మండపాటి బట్టను తీసుకొని బాగా తడిపి గచ్చు నేలపై పరిచి 100 గింజలను వరుసలో అమర్చాలి. దీనిపై మరో తడి పేపర్ టవల్ను పరచి రెండింటిని కలిపి చాపలా చూట్టాలి. చివర్లో దారంతో చుట్టి ఏదైనా పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడుపుతు ఉండాలి. ఈ పద్ధతి ద్వారా వరి, జొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను పరీక్షించుకోవచ్చు. ట్రే పద్ధతి : లావు గింజ రకాలైన పత్తి, వేరుశనగ, ఆముదం వంటి విత్తనాలను ఇసుక పోసిన ప్లాస్టిక్ ట్రేలో వేయాలి. 100 విత్తనాలను అంగుళం లోతు ఇసుకలో విత్తుకోవాలి. తేమ ఉండేటట్లు నీళ్లు చల్లుతు ఉండాలి. పెట్రి డిష్ పద్ధతి : వంగ, టమాట, మిరప వంటి చిన్న విత్తనం మొలకలను పరీక్షించుకోవచ్చు. పెట్రిడిష్లో బ్లాటింగ్ పేపరును అమర్చి నీటితో తడపాలి. గుడ్డమూట పద్ధతి : మొలక కట్టాల్సిన 100 విత్తనాలను గుడ్డలో మూతకట్టి దీనిని చిన్న ప్లేటులో పెట్టి అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా 5 నుంచి 10 రోజుల్లో మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. మొలక శాతం : ● సామాన్యంగా పరీక్షకు తీసిన శాంపిల్ గింజల్లో నూటికి 99 శాతం మంచి గింజలు ఉండాలి. ● మొక్కజొన్నకు 90 శాతం మొలకలు రావాలి. ● ఇతర ధాన్యాలకు 75నుంచి 80శాతం మొలకలు రావాలి. ● పప్పుదినుసులకు 75నుంచి 80శాతం మొలకలు రావాలి. ● నునెగింజలకు 70నుంచి 80శాతం మొలకలు రావాలి. ● పత్తి, బెండ విత్తనాలకు 65 శాతం రావాలి. పాడి–పంట -
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మాయల మాంత్రికుడు వనపర్తి జిల్లాకేంద్రంలో ఉంటూ మంత్రగాడిగా చెలామణి అవుతున్నాడు. తాను గుప్తనిధులను వెలికితీస్తానని నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన ఓ కుటుంబాన్ని నమ్మించాడు. జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్నవారి సొంత ఇంట్లోనే ఉన్న బంగారాన్ని బయటకు తీస్తానని చెప్పి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు. బాధితులు ఇంట్లో ఎంత లోతు తవ్వినా లంకె బిందెల జాడ కనిపించలేదు. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. వీరిలో చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు వేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు, గద్వాల, రాజోలి మండలాలతోపాటు నల్లమలలోని పురాతన ఆలయాల్లో గుప్తనిధుల తవ్వకాలు నిత్యకృత్యంగా మారాయి. గతేడాది డిసెంబర్ 15న గట్టు మండలం చిన్నంపల్లిలో కొందరు వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపగా, స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. గతేడాది జూన్లో గద్వాల మండలం పూడూరులోనూ గుప్తనిధుల తవ్వకాలు చోటుచేసుకున్నాయి. మూడేళ్ల కిందట ఏకంగా జిల్లాకేంద్రంలోని గద్వాల కోటలోనే దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. ●పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్ సాక్షి, నాగర్కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’ మహబూబ్నగర్ (వ్యవసాయం): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతునేస్తం పేరుతో సాగులో మెళకువలు, సూచనలు అందించే ప్రయత్నాలు మరింత విస్తరించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలో గతంలో 16 రైతు నేస్తం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విధానం రైతులకు ప్రయోజనకరంగా ఉండటంతో అధికారుల ప్రతిపాదనల మేరకు తాజాగా మరో 32 కేంద్రాలను మంజూరు చేశారు. అలాగే ఎంపిక చేసిన వేదికల్లో దృశ్య శ్రావణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులను పెంచే విధంగా నిపుణులు సూచనలు ఇస్తున్నారు. అన్ని గ్రామాల రైతులు కార్యక్రమానికి హాజరై వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. సందేహాల నివృత్తికి... జిల్లాలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు. చిరు ధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు విధానాలను రైతులు అడిగి తెలుసుకొని, సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. సీజన్కు అనుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాలపై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో ఇంకా మూఢనమ్మకాల జాఢ్యం వీడటం లేదు. మంత్రాలు, మాయలు, గుప్తనిధుల పేరుతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాయగాళ్లను నమ్మి పెద్దఎత్తున సొమ్మును కోల్పోయి మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూళనలో పోలీసులు, సంబంధిత అధికారులు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన నిందితులు, సూత్రదారులు పోలీసులకు చిక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో మాయగాళ్లు, నాటు వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అమాయకులే లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్నపిల్లలతోపాటు మహిళలు, వృద్ధులు అనారోగ్యానికి గురైనా తాయత్తులు, బిల్లలు కడతామంటూ రోజుకొకరు చొప్పున మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, నాటువైద్యం పేరుతో వ్యవస్థీకృతంగా దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా మాయగాళ్లకే సహకరించిన ఘటనలే ఎక్కువ. ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూ అపురూపమైన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలలోని పురాతన నవ నారసింహా ఆలయం, ప్రతాప రుద్రుని కోట, రాయలగండి చెన్నకేశవ ఆలయం, బైరాపూర్, వడ్డేమాన్లోని పురాతన ఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు ‘రైతు నేస్తం‘ కార్యక్రమం మాయగాళ్లు, నాటువైద్యులు ఆలయాల విధ్వంసం.. అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దందాలు అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రైతు నేస్తం కార్యక్రమానికి రైతువేదికల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిరఆదేశించారు. రైతునేస్తం నిర్వహణ, ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ వ్యవసాయ అధికారులతో వెబెక్స్ నిర్వహించి సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని కలెక్టర్ తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులందరూ వీక్షించి సద్వినియోగం చేసుకునే విధంగా రైతు వేదికలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 86 రైతు వేదికలు ఉండగా, ప్రస్తుతం 16 రైతు వేదికలలో వీడియో కాన్సరెన్స్ విధానం అందుబాటులో ఉందని, సోమవారం మరో 32 రైతు వేదికలలో వీసీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా రైతు వేదికల పరిధిలోని కనీసం 250 మంది రైతులు సిద్ధంగా ఉండేలా జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు టెక్నికల్ సెషన్ ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి రైతు వేదికను పండగ వాతావరణంలో పచ్చని తోరణాలు, పూలతో అలంకరించాలని చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఏపీఓ, మండల వ్యవసాయాధికారులు, మండల ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండాలని, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు వారికి అందుబాటులో ఉన్న రైతు వేదికలో ‘రైతు నేస్తం‘ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించామని, ఆయా నియోజకవర్గంలోని ఓ రైతు వేదికలో వారు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. వెబెక్స్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఆర్డీఓ నవీన్, డీఏఓ వెంకటేష్, డీఆర్డీఓ నర్సింహులు, ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. లక్ష్యాలివే... జిల్లావ్యాప్తంగా 86 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించి వాటి ద్వారా పలు రకాల సలహాలు ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అఽధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించే విధంగా రైతుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో రైతు నేస్తం ఒకటి. దృశ్య శ్రావణ సేవల విస్తరణకు వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా ఉండే ఉద్యాన, మత్స్య, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, నీటి పారుదలశాఖలకు సంబంధించి సలహాలు అందిస్తున్నారు. రైతునేస్తం ద్వారా కర్షకులకు అధికారులు పలు రకాల ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. జిల్లాకు మంజూరైన రైతునేస్తం యూనిట్లను రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సాయంతో దృశ్య శ్రావణ విధానం కొనసాగుతుంది. ఈ నిర్వహణ మొత్తం ఏఈఓలకు అప్పగించారు. -
కృష్ణానదిలో మునిగిన పంటలు
పెంట్లవెల్లి: మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతం మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, వే ముకల్ గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం కృష్ణా నది తీరాన వందలాది ఎకరాలు నువ్వులు, మినుములు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఎ ప్పటిలాగే పలు రకాల పంటలు కృష్ణానది తీరంలో ఒండ్రుమట్టి పొలాల్లో సాగు చేశారు. ఈ పొలాలు కృష్ణానది నీరు తీసిన తర్వాత పంటలు సాగు చేస్తా రు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పంటలు సాగు చేశారు. కానీ ఈ సంవత్సరం మందస్తుగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు కృష్ణానది నీరు ప్రవహిస్తోంది. దీంతో వందల ఎకరాల పంటలు నీటిలో మునుగుతున్నాయి. కోసిన పంటల కుప్పలు రాల్పడానికి రోజూ వర్షాలు పడడంతో రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. మరో వైపు చేతికి వచ్చిన పంట నీళ్లలో మునిగిపోతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు ఎకరా సాగు చేయడానికి కౌలుతో కలిపి రూ.60 వేలు అవుతోంది. అలా 5, 10 ఎకరాలు సేద్యం చేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రైతులు నీటిలో మునుగుతున్న పంటను ట్రాక్టర్ల ద్వారా కూలీలతో నీటిలో నుంచి బయ టకు తీసుకొస్తున్నారు. నీట మునిగిన పంటలు నదిపరివాహక ప్రాంత రైతులు పాట్లు -
వికసించిన బ్రహ్మ కమలాలు
జడ్చర్ల: హిందూ సంస్కృతిలో బ్రహ్మకమలం మొక్కను చాలా పవిత్రమైందిగా భావిస్తారు. బ్రహ్మ కమలాలను శివుడికి సమర్పిస్తే ప్రసన్నమై కోరికలు నెరవేరుస్తారని శివ భక్తుల విశ్వాసం. ఎక్కువగా హిమాలయాలు, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, చైనా దేశాల్లో పెరిగే బ్రహ్మకమలాలు జడ్చర్లలో ఆదివారం రాత్రి వికసించాయి. స్థానిక శ్రీనివాస థియేటర్ సమీపంలో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మల్లికేడి కొండాజి, విజయలక్ష్మి దంపతుల ఇంటిలో ఏకంగా 14 పుష్పాలు వికసించాయి. దీంతో కుటుంబ సభ్యులు బ్రహ్మకమలాలకు ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు బ్రహ్మకమలాలను చూసి సంబురపడ్డారు. -
‘కురుమూర్తి’కి మహర్దశ
చిన్నచింతకుంట: ఉమ్మడి జిల్లాలో పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరై ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు మంజూరు చేయడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. అధికారులు శనివారం ఘాట్ రోడ్డు నిర్మాణానికి స్థలాన్ని పొక్లెయిన్తో చదును చేయించారు. అలాగే ఆలయ పరిసరాల్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ఉద్దాల మండపం స్వామి వారి పాదుకల వరకు 20 పిల్లర్లతో ఎలివేటెడ్ కారిడార్.. అక్కడి నుంచి స్వామివారి ప్రధాన ఆలయం, కురుమూర్తి గిరుల వెనకభాగం నుంచి అమ్మాపురం సమీపంలోని ఆత్మకూర్, దేవరకద్ర ప్రధాన రహదారి వరకు ఘాట్ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం 2.850 మీటర్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పుతో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం జరగనుంది. రోడ్డు నిర్మాణంతో భక్తులకు స్వామివారి దర్శనం సులభమవుతుంది. భక్తుల సౌకర్యార్థం.. అమావాస్య, ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆయా సమయాల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సహకారంతో ఆలయ అధికారులు ప్రస్తుతం ఆలయం వద్ద ఎలివేటెడ్ కారిడార్, ఘాట్రోడ్డు నిర్మాణం, స్వామివారి ప్రధాన ఆలయం ఎదుట మహా మండపం, రాజగోపురం ఎదుట పీఎస్బీ షెడ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేక నిధులతో తాగునీటి ట్యాంకు నిర్మించారు. కల్యాణ మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాల నిర్మాణానికిగాను ఆలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ఎమ్మెల్యే సహకారంతో.. ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సహకారంతో కురుమూర్తిస్వామి ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. అంతేగాక ఆలయం వద్ద మహా మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాలు, కల్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నాం. – గోవర్ధన్రెడ్డి, చైర్మన్, కురుమూర్తిస్వామి ఆలయం త్వరగా పూర్తి చేస్తాం.. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద ఎలివేటెడ్ కారిడార్ ఘాట్రోడ్డు పనులు ప్రారంభించాం. ఆయా పనులకు రెండేళ్ల అగ్రిమెంట్ ఉంది. అంతలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – సంధ్య, డీఈఈ, ఆర్అండ్బీ రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు ఎలివేటెడ్ కారిడార్ ఘాట్రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన అధికారులు -
పండ్ల దుకాణాలు తొలగిస్తే ఊరుకోం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బస్టాండ్ ముందున్న పండ్ల దుకాణాలను తొలగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బస్టాండ్ ముందున్న పండ్ల దుకాణాలను తొలగించాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలతో ఆందోళన జరిగిన నేపథ్యంలో ఆదివారం ఆయన పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రోడ్డుపై దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న వారికిపై ఆర్టీసీ అధికారుల దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. బస్టాండ్ను ఆసరాగా చేసుకుని నిరుపేదలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తుంటారన్నారు. బస్టాండ్ను ఆసరా చేసుకుని వ్యాపారం చేసుకునే పండ్ల వ్యాపారులను శ్రీనివాసకాలనీకి తరలిస్తే ఎట్లా అని ప్రశ్నించారు. తాతముత్తాతల నుంచి ఇక్కడే పండ్లు అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకున్న వాళ్లను ఉన్నఫలంగా తొలగిస్తామడం సరికాదన్నారు. పండ్ల వ్యాపారం చేసుకున్న వారికోసం తమ హయాంలో 80 దుకాణాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పండ్ల వ్యాపారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పండ్ల దుకాణాలు ఎలా తీస్తారో చూస్తాం.. ఆర్టీసీ డిపో కూడా పెద్దచెరువు ఎఫ్టీఎల్లో ఉందన్నారు. ఆర్టీసీకి ఓ నిబంధన.. పండ్ల వ్యాపారులకు ఓ నిబంధనా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, వెంకన్న, శివరాజు, రామ్లక్ష్మణ్, ఇమ్రాన్, ఆంజనేయులు, శ్రీనివాస్రెడ్డి, నవకాంత్, సత్యం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ -
పెరిగిన పత్తి విత్తనాల ధరలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా సంవత్సరం పాకెట్ ధర (రూ.లలో..) 2018 690 2019 710 2020 730 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 ఒక్కో పాకెట్పై రూ.37 పెంపు -
జూరాలకు 21 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు పీజేపీఅధికారులు తెలిపారు. శనివారం 15వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 9 గంటలకు 21వేల క్యూసెక్కులకు పెరిగిందని పేర్కొన్నారు. విద్యదుత్పత్తి కోసం 15,804 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 57 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 17,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం6.081 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జన్కో ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రంలో 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, 22.448 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 24.376 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్ప టివరకు 46.824 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. -
సండే.. కాసేపు సరదాగా..
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగవ నుంచి వ రద తాకిడి మొదలైంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. జలాశయం అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో సందర్శకులు సరదాగా గడిపారు. ఎగువ భాగంలో జలాశయం అందాలను చూస్తూ.. దిగువన నదీలోపలికి వెళ్లి పిల్లాపాపలతో సెల్ఫీలు దిగారు. సెల్ఫీల మోజులో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. జూరాలకు సందర్శకుల తాకిడి దిగువ భాగాన పిల్లాపాపలతో సెల్ఫీలు -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతన రీజియన్ కమిటీ అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సత్యశీలారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ రహెమాన్ సోఫి, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సత్యన్న ఆచారి, రాష్ట్ర కార్యదర్శి బసన్న ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శిగా సత్యశీలారెడ్డి, కోశాధికారిగా కేకే మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాంమూర్తి, ఉపాధ్యక్షుడిగా గోపాల్రెడ్డి, చీఫ్ అడ్వయిజర్గా ఎంకే జోసెఫ్, జాయింట్ సెక్రటరీగా దమ్మాయిపల్లి శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని పది డిపోలకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి న్యాయవాది మృతి
జడ్చర్ల: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ న్యాయవాది ప్ర మాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడిన సంఘటన ఆదివారం జడ్చర్ల మినీ ట్యాంక్బండ్ నల్లచెరువులో జరిగింది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. స్థానిక కావేరమ్మపేటకు చెందిన న్యాయవాది గుండు తిరుపతయ్య(55) ఆదివారం మినీ ట్యాంక్బండ్ వద్ద చేపలు పట్టే క్రమ ంలో కాలుజారి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డా డు. ఈ క్రమంలో కణతకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించి స్థానికులు నీటి నుంచి బయటకు తీసేలోగా మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భవనంపై నుంచి దూకి వివాహిత బలవన్మరణం జడ్చర్ల: మూడంతుస్తుల భవనంపై నుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బాదేపల్లి పట్టణంలో చోటుచేసుకున్నది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. బాదేపల్లికి చెందిన అనూష(30) భర్త ఆంజనేయులు, తన ముగ్గురు పిల్లలతో కలిసి స్థానిక 4వ వార్డులోని మాధవరావు కాంపౌండ్లోని ఓ భవనంలో అద్దెకు ఉంటుంది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై భవనంపై నుంచి కిందకు దూకడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. డబ్బుల కోసం భర్త వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి ఆరోపించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి మరికల్: తామర పూలను కోసేందుకు చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం పెద్దచింతకుంటలో జరిగింది. గ్రామానికి చెందిన బీరప్ప, మల్లమ్మ దంపతుల కుమారుడు మల్లేష్ (42) నిత్యం శివుడి పూజకు తామరపూలను తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పూజకు తామరపూలు కోసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులోపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య వెల్దండ: మండలంలోని నారాయణపూర్తండాలో ఇస్లావత్ శిరీష(19)నీట్లో సీట్ రాలేదని ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇస్లావత్ పాండు, చిట్టికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా.. నీట్లో సరైన మార్కులు సాధించలేదు. శనివారం వెలువడిన ఫలితాల్లో మార్కులు తక్కువ రాగా.. మానస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
విస్తరణకు గ్రీన్సిగ్నల్
రైతుల సందేహాలు నివృత్తి రైతునేస్తం వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో కార్యక్రమానికి హాజరయ్యే రైతుల అన్ని రకాల సందేహాలు నివృత్తి అవుతున్నాయి. జిల్లాలో కొత్తగా ఎంపిక చేసిన 32 గ్రామాల్లోని రైతువేదికల్లో రైతు నేస్తానికి సంబంఽధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేయిస్తున్నాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి● తాజాగా మరో 32 కేంద్రాలు మంజూరు ● అఽధిక దిగుబడులు సాధించేలా కార్యక్రమాలు -
పీర్ల పండుగను గుర్తించాలి: టీఎఫ్టీయూ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీర్ల పండుగను తెలంగాణ పండుగగా గుర్తించాలని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పీర్ల నిర్వాహకుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీర్ల పండుగ నిర్వహణ(మొహర్రం)లో ముజావర్లు, ముల్లాలు, సవారి ఎత్తేవారు, డప్పులు కొట్టే, భాజాభజంత్రీలు వాయించే కళాకారులు ఎలాంటి పారితోషికం లేకుండా సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం తెలంగాణచౌరస్తా వరకు ఊరేగింపుగా వెళ్లి కొద్దిసేపు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గట్టన్న, సంఘం నాయకులు ముజీబ్, మద్దూర్ చారి, మహమ్మద్ రఫీ, సత్యనారాయణ, యాదయ్య, జలాల్పాషా, జాహెద్, టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ పాల్గొన్నారు. -
బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
కొత్తకోట రూరల్: బైక్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్కు చెందిన మణికంఠ చిత్తూర్ జిల్లా మదనపల్లికి చెందిన ఓ యువతితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. అత్తగారి ఇంటి నుంచి భార్యను, బామర్ది, అత్త, తల్లితో కలిసి మణికంఠ ఆదివారం ఉదయం మదనపల్లి నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. కొత్తకోటకు చెందిన రాధమ్మ, కుమారుడు కళ్యాణ్కుమార్రెడ్డి బైక్పై పెబ్బేరు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి కొత్తకోటకు వస్తుండగా ఎన్హెచ్44 మదర్థెరిస్సా జంక్షన్ సమీపంలో పట్టణంలోకి మలుపుతుండగా.. అటు నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుకు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. బైక్ సైతం అదపు తప్పి కింద పడటంతో కళ్యాణ్కుమార్రెడ్డి, రాధమ్మకు గాయాలయ్యాయి. కారులో ఉన్న ఐదుగురికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్తో గొడవ..పోలీసులకు ఫిర్యాదు
జడ్చర్ల: ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి బస్సు డ్రైవర్కు మధ్య గొడవ జరగగా చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటు చేసుకుంది.సీఐ కమలాకర్ కథనం మేరకు.. హైదరాబాద్–2 ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కొల్లాపూర్ బయలుదేరింది. జడ్చర్లలోని శ్రీనివాస కాలనీకి చెందిన అనసూయ అనే ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కింది. బస్సు ఫుట్బోర్డుపై నిలబడడంతో బ్రేక్ వేస్తే కింద పడిపోయే ప్రమాదముందని డ్రైవర్ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఒక్కసారిగా డ్రైవర్పై మండిపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో బస్సును మార్గమధ్యలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆపి పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పోలీసులు ఇద్దరిని విచారించి బస్సును పంపించి వేశారు. మోదీపూర్లో ట్రాక్టర్ చోరీ కోయిల్కొండ: మండల పరిధిలోని మోదీపూర్ గ్రా మానికి చెందిన మైపాల్గౌడ్కు చెందిన ట్రాక్టర్ శనివారం రాత్రి చోరీకి గురైంది. రైతు మైపాల్గౌడ్ 15 రోజుల క్రితం రూ.12 లక్షలు పెట్టి ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వ్యవసాయ పనుల అనంతరం తన కిరాణషాపు ముందు నిలబెట్టాడు. ఉదయం లేచి చూసేసరికి ట్రాక్టర్ కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాజీ తెలిపారు. -
సోయాబీన్లో యాజమాన్య పద్ధతులు
అలంపూర్: నైరుతి రుతుపవనాల రాకతో వానలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సిద్ధం అవుతున్నారు. నల్లరేగడి నేలల్లో పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పంటను సాగు చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. కందిలో సహయ పంటగా, పండ్ల తోటలో అంతర్ పంటగానూ సోయాబీన్ విత్తుకోవచ్చన్నారు. నేలలు.. మురుగు నీరు పోయే వసతి ఉండి, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి. రకాలు.. జేఎస్–335, ఎల్ఎస్బీ–1, పీకే–472 ఇందులో జేఎస్ 335 రకం ప్రసిద్ధి చెందింది. పంట కాలం.. సోయాబీన్ పంట కాలం 100 నుంచి 110 రోజులు పంట వేసే పద్ధతి.. సోయాను పత్తి, కందిలో అంతర్, మిశ్రమ పంటగా వేయవచ్చును. వానాకాలంలో సోయా సాగు తర్వాత రబీలో శనగ, మినుములు వేసుకోవచ్చు. విత్తనం.. విత్తనం ఎకరానికి 25 నుంచి 30 కిలోలు అవసరం. విత్తనాన్ని 45 ఇంటూ 5 సెంటీమీటర్ల దూరంలో వరుసకు వరసలోని మొక్కల మధ్య 3 సెంటీమీటర్ల లోతులో మొత్తటి దుక్కిలో నాటు వేసుకోవాలి. విత్తే కాలం : జూన్ రెండో వారం నుంచి జూలై మొదటి వారం వరకు సోయాబీన్ విత్తడానికి అనుకూలం. కలుపు నివారణ.. సోయాలో మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి 250 మి.లీ ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కలుపును నివారించొచ్చు. ఎరువులు.. ఎకరానికి 25 కిలోల యూరియా, 150 కేజీల సూపర్, 25 కిలోల పొటాష్ అవసరం. విత్తేటప్పుడు ఫోరేట్ 10 జీ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున వాడితే కాండపు ఈగలాంటి పురుగును నివారించుకోవచ్చు. పాడి–పంట పంట కోత ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి, రాలిపోవడం మొదలైనప్పుడు లేదా కాయలు ఆకుపచ్చ నుంచి బూడిద రంగులోకి మారినప్పుడు కోయాలి. కోత ఆలస్యం అయితే కాయలు చిట్లి గింజలు రాలిపోతాయి. పంట కోసిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఆరనిచ్చి గింజలోని తేమ శాతం 14 వరకు చూసి నూర్పిడి చేయాలి. దిగుబడి సోయా సాగుకు ఎకరానికి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుంది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. -
నాన్నే.. సూపర్ హీరో
వెన్నుదన్నుగా నిలబడ్డారు.. నా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న మహదేవ్ చిన్నపాటి వ్యాపారం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు ప్రాముఖ్యత తెలియజేశారు. నేను ఇంజినీరింగ్ అయిన తర్వాత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నేను నిర్దేశించుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. ఆ సమయంలో నాన్నే నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సివిల్స్ రెండు ప్రయత్నాల్లో సాధించలేకపోయా. ఈ సమయంలో నీ వెనకాల నేనున్నా అంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● జీవిత పాఠాల్లో తండ్రికి మించిన గురువు లేరు ● పిల్లల ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ భరోసా ● భవితకు మార్గదర్శిగా ఉంటూ.. వారి ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడే శ్రమజీవి ● నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం -
తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్
వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్ సాధించి ఐపీఎస్ సాధించారు. మహారాష్ట్ర ఐపీఎస్ కేడర్కు ఎంపికై హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యశ్వంత్నాయక్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. -
లోక్ అదాలత్లో 24,713 కేసులు రాజీ
పాలమూరు: లోక్ అదాలత్లో కేసులు రాజీ కావడం వల్ల హైకోర్టుకు మళ్లీ అప్పీల్ వెళ్లడానికి అవకాశం ఉండదని, ఇలా చేయడం వల్ల ఇరువురు కక్ష్యిదారులు గెలుస్తారని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన కోర్టులో శనివారం ఏర్పాటు చేసి జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో భారీ స్థాయిలో కేసులు రాజీ అయ్యాయని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఐదు బెంచీలు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా.. మొత్తం 24,713 కేసులు రాజీ అయ్యాయన్నారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో నష్టపరిహారం కింద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కక్ష్యిదారుడికి రూ.33 లక్షల చెక్కను ప్రధాన న్యాయమూర్తి అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, రాజరాజేశ్వరి, ఈశ్వరయ్య, రాధిక, మహ్మద్ మునావర్ హుస్సేన్, రవిశంకర్, కె.భావన, నిర్మల, శశిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో 3,177 కేసులు లోక్ అదాలత్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 3,177 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో పలు రకాల ఐపీసీ కేసులు 436, డ్రంకెన్ డ్రైవ్, ఎంవీఐ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 883, ఈ–పెటీ, బహిరంగ మద్యం కేసులు 1,858 కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లు, అధికారులకు త్వరలో రివార్డ్స్ అందజేస్తామన్నారు. -
నా తండ్రి సహకారంతోనే..
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అమ్మ వసుంధర గృహిణి కాగా.. నాన్న శ్రీనివాసులు ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ.. మా ముగ్గురిని చదివించారు. ఆర్థిక స్థోమత లేకపోయినా ఆ విషయాన్ని మేం గుర్తించకుండా అవసరమైనవి సమకూర్చారు. చిన్నతనం నుంచి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నన్ను నిరుత్సాహపర్చకుండా ఎంత కష్టమైనా డబ్బులు పెట్టి చదివించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం గ్రూప్స్ పరీక్ష రాయగా తాజాగా వచ్చిన ఫలితాల్లో 484.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంకు, మల్టీ జోన్–2లో మూడో ర్యాంకు.. మహిళా కేటగిరిలో రెండో స్థానంతో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యాను. నా తండ్రి సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. -
రెడ్క్రాస్కు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డు
పాలమూరు: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రెడ్క్రాస్కు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అందజేశారు. రాష్ట్రంలో 2024– 25 సంవత్సరానికి గాను మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో 7,589 యూనిట్ల రక్తం సేకరించి ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ అవార్డు అందుకున్నారు. రెడ్క్రాస్ నుంచి బ్లడ్ బ్యాంక్, సన్నిధి ఆశ్రమం, అక్షర పాఠశాల, శాంతివన్తోపాటు పేదలకు సేవలు అందిస్తోంది. కార్యక్రమంలో అశ్విని చంద్రశేఖర్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025రియల్ హీరో.. ‘మా నాన్న రఘునాథ్ గైక్వాడ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. కిరాణ షాపు నిర్వహిస్తూ మా చదువుల కోసం ప్రోత్సహించారు. ఆయన నుంచి కష్టపడే తత్వాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్చుకున్నా. ప్రతి ఒక్కరికీ నాన్నే రియల్ హీరోగా ఉంటారు. నాన్న రఘునాథ్ గైక్వాడ్తో నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నాన్నంటే ఓ ఆసరా.. ఓ భరోసా.. నాన్నంటే ఓ బాధ్యత.. ఓ ధైర్యం.. నాన్నంటే ఓ స్ఫూర్తి..ఓ ఆర్తి.. బరువెక్కుతున్న గుండె భారంగా మారుతున్నా, కంటి నిండా నిద్ర కరువవుతున్నా కుటుంబ బరువు బాధ్యతలను భుజాన వేసుకునే సూపర్ హీరో. నవ మాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడిస్తాడు. బుడిబుడి అడుగుల నుంచి ప్రతి చోట వెన్నంటి ఉంటాడు. కష్టాల్లో నిర్భరంగా.. ఆపదలో ధైర్యంగా నిలబడేలా భరోసానిస్తాడు. విజయంలో మెట్టుగా మారుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాన్ని కళ్లలో దాచిపెట్టి.. సంతోషాన్ని చేతినిండా పంచిపెట్టి.. తన కోసం ఏదీ దాచుకోకుండా.. కన్న బిడ్డలే సర్వస్వంగా బతుకుతాడు. అందుకే నాన్నంటే ప్రతి కుమారుడు, కుమార్తెకు కొండంత ధైర్యం. తండ్రి చేయి పట్టుకొని ఉన్నత గమ్యం వైపు నడిచిన వారు ఎందరో ఉన్నారు. ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. – సాక్షి నాగర్కర్నూల్/ నారాయణపేట రూరల్/ గద్వాల/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/ పాలమూరు -
జూరాలకు నిలకడగా ఇన్ఫ్లోలు
ధరూరు /ఆత్మకూరు/దోమలపెంట/శాంతినగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోలు నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు 14వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లలో విద్యుదుత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 15వేల 241 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 17,125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.710 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 37.424 ఎంయూ విద్యుదుత్పత్తి ఎగువలో 2 యూనిట్లద్వార 78 మెగావాట్లు 17.808 మిలియన్యూనిట్లు, దిగువలో 2 యూనిట్లద్వార 80 మెగావాట్లు 19.616 మిలియన్యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని ఎస్ఈ శ్రీధర్ అన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 37.424 మిలియన్యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. శ్రీశైలంకు 37,136 క్యూసెక్కుల ఇన్ఫ్లో. జూరాలలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 15,241 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 21,895 మొత్తం 37,136 క్యూసెక్కుల నీటి ప్రవాహం శుక్రవారం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 836.7 అడుగుల వద్ద 57.1874 టిఎంసీల నీటి నిల్వ ఉంది. రేగుమాన్గడ్డ నుంచి ఎంజికెఎల్ఐకు 326 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 3.641 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి 7,860, ఎపి.జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 1.308 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 2,695 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేశారు. సుంకేసుల 3 గేట్లు ఎత్తివేత రాజోళి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం ఇన్ఫ్లో కొనసాగింది. ఎగువన కురుస్తున్న మోస్తరు వర్షాలతో బ్యారేజీ కి 13,296 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.110 టీఎంసీలు నిల్వ వుంచుతు 3 గేట్లు మీటరు ఎత్తి దిగువకు 13,137 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ప్రైవేటు స్కూల్స్ నిర్వాకం
●ఇది చివరి నోటీసు.. గతంలో ప్రియదర్శిని పాఠశాలలో అనుమతులు లేకుండా హైస్కూల్ విద్యార్థులకు బోధించడం, అక్కడే హాస్టల్ నిర్వహించడం వంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో ఎంఈఓ విచారణ రిపోర్టు ఆధారంగా నోటీసులు ఇచ్చాం. ఈ పాఠశాలలకు ఓపెనింగ్ పర్మిషన్, నామినల్ రోల్స్ శ్రీప్రతిభ పాఠశాలకు చెందినవిగా గుర్తించి ఆ పాఠశాలకు గతంలో నోటీసు ఇచ్చినా స్పందించలేదు. మళ్లీ ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చాం. నిర్ణీత గడువులోగా నోటీసులకు స్పందించకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీప్రతిభ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. దానిపై నోటీసులు ఇచ్చాం. తదుపరి చర్యలు ఉంటాయి. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు చేసే పనులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తాము ఏం చేసినా చెల్లుతుందిలే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అసలు హైస్కూల్కు అనుమతులే లేకున్నా.. నేరుగా 8 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుని విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. అడ్మిషన్లు చేసుకుని ఏకంగా తరగతులు సైతం బోధించడంతో విచారణకు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలల్లో వసతులు, నిబంధనల ప్రకారం నిర్వహణ లేకపోవడం, యూనిఫాంలు, పుస్తకాలు అమ్మడం, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోవడం ఒక ఎత్తయితే అసలు హైస్కూల్కు అనుమతులు లేని ప్రైమరీ పాఠశాలలో హైస్కూల్ అడ్మిషన్లు తీసుకుని నిర్వహించడం మరో ఎత్తు. ఇదీ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలకు పరాకాష్టగా మారింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ తతంగం.. గత ఏప్రిల్లో ఓ విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా బయటికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు అనేక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీప్రతిభ, ప్రియదర్శిని పాఠశాలలకు నోటీసులు.. మహబూబ్నగర్ పట్టణంలోని మోనప్పగుట్ట ప్రియదర్శిని పాఠశాలకు కేవలం ప్రైమరీ స్కూల్ నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కానీ, ఏకంగా 8 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏప్రిల్లో ఈ విషయమై ఓ విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 8వ తరగతిలో 10, 9వ తరగతిలో 12, 10వ తరగతిలో 12 మంది విద్యార్థులు తరగతులు వింటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా సదరు పాఠశాలకు కేవలం 1 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇదే విషయమై గతంలో శ్రీప్రతిభ స్కూల్కు కూడా డీఈఓ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందుకు ప్రధాన కారణంగా పాఠశాల నిర్వహిస్తున్నది ప్రియదర్శిని పాఠశాల కాగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఇచ్చే నామినల్ రోల్స్, ఈటీసీ వంటి శ్రీప్రతిభ పాఠశాలకు చెందినవిగా అధికారులు అక్కడ గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఇచ్చారు. వెంటనే సమధానం చెప్పాలని గతంలో ఈ పాఠశాలకు నోటీసులు ఇస్తే స్పందించలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరోసారి గత నాలుగైదు రోజుల క్రితం నోటీసులు ఇచ్చామని నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పలు ప్రైవేటు పాఠశాలలు హైస్కూల్ అనుమతి లేకపోయినా తరగతులు బోధించిన ప్రియదర్శిని మరో పాఠశాల పేరు మీద ఎన్ఆర్స్, ఈటీసీ పెట్టినట్లు గుర్తింపు ఇది వరకే ఆ రెండింటికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన విద్యాశాఖ విచారణకు వెళ్లినప్పుడు 8 నుంచి 10వ తరగతి వారికి తరగతుల నిర్వహణ -
వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
అమరచింత: తెల్లవారుజామున టీ తాగేందుకు రోడ్డు దాటుతున్న వృద్ధురాలు హరిజన్ ఉత్తమ్మ (70)ను బొలేరో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని నాగల్కడ్మూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉత్తమ్మ ఎస్సీకాలనీలో నివసిస్తోంది. తెల్లవారుజామున రోడ్డు పక్కనున్న హోటల్లో టీ తాగేందుకు వస్తుండగా సీసీరోడ్డు ఎక్కుతుండగా వడ్లలోడ్తో వేగంగా వస్తున్న బొలేరో ఢీకొట్టింది. దీతో బొలేరో వెనుక టైర్ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సురేశ్ గ్రామంలోని సీసీ కెమెరాలోని ఫుటేజీలను పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. 11 ఏళ్ల బాలుడు బలవన్మరణం వెల్దండ: ఉరేసుకొని 11 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దండ మండలం బొల్లిగుట్టతండాకి కొర్ర శారద, కిషన్ దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయం పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. చిన్నకుమారుడు కొర్ర తమన్న చౌహాన్ (11) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో అమ్మమ్మ ఊరు కుందారం తండాలో ఉన్న తమన్నచౌహాన్ శుక్రవారం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం నుంచి పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు ఆ బాలుడికి చెప్పి.. పత్తి విత్తనాలు నాటేందుకు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిపైన అలంకరణ కోసం ఏర్పాటు చేసే పైపులకు తాడుతో ఉరేసుకొని కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. విద్యార్థి మరణంతో తండా విషాదంలో మునిగిపోయింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్లు (డీడీఏడీఎస్) ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్తో పాటు జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట తదితర జిల్లాల్లో డీ–అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. డ్రగ్ డీ–అడిక్షన్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండి.. అర్హత కలిగిన ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఓలు), స్వచ్ఛంద సంస్థలు, ఇతర అర్హత కలిగిన సంస్థలు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం – సాధికారత శాఖ ఈ–అనుదాయ్ పోర్టల్ (https: //grants&msje.gov.in/ngo&login) ద్వారా ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సంస్థలు తప్పనిసరిగా ఎన్పీఓ దర్పన్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగి ఉండాలని.. ఒకవేళ లేకపోతే దర్పన్ వెబ్సైట్ (https:// ngodarpan.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు మరిన్ని వివరాల కోసం టీజీఏఎన్బీ అవేర్నెస్ వింగ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు (87126 61735), సీనియర్ అసిస్టెంట్ వరప్రసాద్ (98859 38488)ను సంప్రదించాలని సూచించారు. -
ఢీలిమిటేషన్..!
మహబూబ్నగర్ డివిజన్ల విభజనలో దుమారం నూతనంగా ఆవిర్భవించిన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల విభజనపై రాజకీయ దుమారం రాజుకుంది. రహదారులు, రైల్వేలైన్, పెద్ద పెద్ద నాలాల వంటిని హద్దులుగా చేసుకుని.. ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన సేవలందేలా శాసీ్త్రయ పద్ధతిలో చేపట్టాల్సిన డివిజన్ల కూర్పులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులఆరోపణలు, ప్రత్యారోపణలతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. డివిజన్ల విభజన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ● అశాసీ్త్రయంగా చేశారంటూప్రతిపక్షాల ఫైర్ ● పలువురు అధికార పార్టీనాయకుల్లోనూ అసంతృప్తి ● రాజకీయ పక్షాల భిన్నాభిప్రాయాలతో రాజుకున్న వేడి ● డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై 94 అభ్యంతరాలు ● ఈ నెల 16 వరకు కొనసాగనున్న అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన -
‘విభజన’ అభ్యంతరాలను పరిష్కరించాలి: ఆర్డీఎంఏ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) జె.శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారులకు డివిజన్ల మార్పు, చేర్పులను వివరించాలన్నారు. అలాగే రెవెన్యూ విభాగం అధికారులు, వార్డు ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించాలన్నారు. ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని సంబంధిత విభాగ అధికారులు తెలియజేయాలన్నారు. ఆస్తిపన్ను వసూళ్లతో పాటు అక్రమ కట్టడాలపై సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మినీ శిల్పారామం హాలులో సుమారు 400 మంది పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటోల సిబ్బందికి ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్డీఎంఏ జె.శ్రీనివాసరావు పరిశీలించారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 38వ వార్డు పరిధిలో కొనసాగుతున్న ‘వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక’ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సద్దలగుండులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని స్థానికులతో మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు సోకవని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీలు కరుణాకర్గౌడ్, జ్యోత్స్నాదేవి, ఆర్ఓ మహ్మద్ ఖాజా, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, గురులింగం, వజ్రకుమార్రెడ్డి, వాణికుమారి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్, ఆర్ఐలు నర్సింహ, రమేష్, అహ్మద్షరీఫ్, ముజీబుద్దీన్, మెప్మా సీఓలు నిర్మల, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి అపోహలు వద్దు..
డివిజన్ల విభనలపై ఎలాంటి అపోహలు వద్దు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలను అనుసరించి గడియారం పద్ధతిలో చేపట్టాం. ఈ నెల 4న వెలువడింది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 16వ తేదీలోపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. మార్పులు, చేర్పుల అనంతరం 17న కలెక్టర్కు నివేదిక అందజేస్తాం. అక్కడి నుంచి సీడీఎంఏకు ఫైల్ చేరుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం మేరకు 21న ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. – డి.మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్శాసీ్త్రయత లేకుంటే అనేక ఇబ్బందులు.. డివిజన్ల విభజన శాసీ్త్రయంగా లేకుంటే అనేక అవాంతరాలు ఎదురవుతాయి. అతుకుల బొంతగా డివిజన్లను ఏర్పాటు చేస్తే పాలనతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బందులు వస్తాయి. ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవు. రైల్వే ట్రాక్, జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న ప్రాంతాలను ఒకే డివిజన్లో కలిపితే ఎలా? ఇవతలి వైపు ఉన్న కాలనీలతో ఓ డివిజన్.. అవతలి వైపు ఉన్న ప్రాంతాలతో మరొకటి ఏర్పాటు చేయాలి. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ అధికార పార్టీకి అనుకూలంగానే.. సరైన రోడ్ మ్యాప్ లేకుండా ఇంటి నంబర్లతో డివిజన్ల విభజన చేయడం సరికాదు. కొత్తగా వీరన్నపేటలో ఏర్పాటు చేసిన 14వ డివిజన్కు సంబంధించి నోటిఫికేషన్లో 3,298 ఓట్లు ఉన్నట్ల చూపారు. కానీ ఈ ఏరియాలో 4,949 ఓట్లు ఉన్నాయి. వార్డుల విభజన శాసీ్త్రయంగా జరగలేదనడానికి ఇది నిదర్శనం. అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్ల విభజన జరిగింది. అధికారులు తగిన మార్పులు చేయాలి. లేనిపక్షంలో న్యాయపరంగా ముందుకెళ్తాం. – అంజయ్య, మాజీ కౌన్సిలర్ ● -
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
లోక్ అదాలత్తో రాజీ చేసుకోండి..
వివిధ కేసుల్లో రెండు వర్గాలు కొట్లాడుకుంటే ఒక్కరే గెలుస్తారు.. అదే లోక్ అదాలత్లో రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు. లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులకు తిరిగి హైకోర్టులో అప్పీల్ ఉండదు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. కక్షిదారులు రాజీపడ దగ్గ కేసులను రాజీ చేసుకోవాలి. సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. సివిల్ కేసులో ఇరుపార్టీలు రాజీ అయితే వారి కేసులలో కట్టిన కోర్టు ఫీజు తిరిగి ఇస్తాం. – బి.పాపిరెడ్డి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి -
జిల్లాకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకు 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కేటాయించినట్లు మహబూబ్నగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర తెలిపారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని సారంగపాణిని వివిధ జిల్లాల అథ్లెటిక్స్ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ను కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శరతచంద్ర మాట్లాడుతూ మహబూబ్నగర్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల అథ్లెటిక్స్ సంఘాలు, ఇతర క్రీడా సంఘాల సహకారంతో జిల్లాకు కేటాయించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి వెంకటేశ్వర్రెడ్డి, నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, ఆయా జిల్లాల ప్రతినిధులు మనోజ్కుమార్ (జనగామ), యుగేంధర్రెడ్డి (వరంగల్), జగన్, రాజు, సోమశేఖర వాసుదేవరావు, సాంబమూర్తి, రజనీకాంత్, ఆనంద్, ఆవుల అశోక్, చంద్రశేఖర్రెడ్డి, నాగరాజు, మహేందర్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, కోచ్ సునీల్కుమార్ పాల్గొన్నారు. విమాన దుర్ఘటన హృదయ విదారకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద దుర్ఘటన హృదయ విదారకమని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం స్థానిక తెలంగాణ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పాటు మానవ తప్పిదాలతో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వేల కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించే విమానాల గమనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ఉపాధ్యక్షుడు ఎ.రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు కె.వి.అశోక్, కోటిరెడ్డి, వి.అనంత్రెడ్డి, జి.నాగభూషణం, లోకయ్య, సురేష్బాబు, బస్వరాజ్, డేవిడ్, బుడ్డన్న పాల్గొన్నారు. ‘అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు’ కు గురుకుల విద్యార్థి ● రేపు జపాన్ వెళ్లనున్న దామరగిద్ద విద్యార్థి శివారెడ్డి దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయా రు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి స్వగ్రామం మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి. జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయస్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్ఫేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నాడు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని సాయంత్రం జపాన్కు బయలుదేరి వెళ్తాడు. -
రాజీ మార్గం.. ఇరువర్గాలకు న్యాయం
మహబూబ్నగర్ క్రైం: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉంటున్నాయి. సకాలంలో న్యాయం పొందక.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. ఈనేపథ్యంలో లోక్ అదాలత్లో ఇరు వర్గాలను ఒకే వేదికపై హాజరుపర్చి న్యాయమూర్తుల సమక్షంలో సామరస్యంగా రాజీ పద్ధతిలో వారి సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. న్యాయసేవల గురించి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఉచిత హెల్ప్లైన్ 15100ను సంప్రదించి సమస్యను చెప్పుకోవచ్చు. శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో ఆరు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ● ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే మండల, జిల్లాస్థాయిలో ఉన్న న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించవచ్చు. ఏదైనా తగాదా ఏర్పడితే న్యాయస్థానంలో దావా దాఖలు చేయకంటే.. నేరుగా న్యాయసేవా అధికార సంస్థను ఆశ్రయిస్తే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ఇరువర్గాల సమస్యను పరిష్కరించి వెంటనే తీర్పు చెబుతారు. న్యాయస్థానాల్లో దాఖలైన కేసులను కూడా లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చు. కుటుంబకలహాలు, మనోవర్తి, గృహహింస, అన్ని రకాల సివిల్ దావాలు, నష్ట పరిహారం కోరుతూ మోటారు వాహనాల చట్టం కింద నమోదయ్యే కేసులు, బ్యాంకు రుణాలు, భూ తగదాలు రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. ● చిన్నచిన్న గొడవలు, ఆస్తుల క్రయవిక్రయాలు, నగదు లావాదేవీలు, రోడ్డు ప్రమాదాలు, నష్టపరిహారాలు, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల విషయంలో నమోదైన కేసులను లోక్ అదాలత్లలో రాజీ చేయొచ్చు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, బాలికపై లైంగిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, ప్రత్యేక చట్టాలపై నమోదైన కేసులను లోక్ అదాలత్లో రాజీకి వీల్లేదు. నేడు జాతీయ లోక్ అదాలత్ సమయం ఆదా.. ఆర్థికంగా లాభం జిల్లాలో ఎనిమిది బెంచీలు ఏర్పాట్లు -
రక్తం ఇద్దాం..ప్రాణం పోద్దాం
● సాధారణంగా మూడు రకాల బ్లడ్ గ్రూప్లను అధికంగా వినియోగించడం జరుగుతుంది. ఏ, బీ, ఓ పాజిటివ్ గ్రూప్లను రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా రక్తదాతలు ఇస్తారు. ఏ–బీ నెగిటివ్ గ్రూప్ చాలా అరుదుగా లభ్యం అవుతాయి. జనరల్ ఆస్పత్రిలో ఉన్న బ్లడ్బ్యాంకు నుంచి ఉమ్మడి జిల్లాతో పాటు కొడంగల్, తాండూర్, వికరాబాద్ల నుంచి రెఫర్ కేసులు వస్తాయి. రక్తం ఎక్కువగా గైనిక్, రోడ్డు ప్రమాదం కేసులకు, తలసేమియా, ఏర్నియా (రక్తహీనత) కేసులకు అవసరం పడుతుంది. అరుదైన గ్రూపులు.. రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగెటివ్ గ్రూపులు ఉంటాయి. వీటిలో పాజిటివ్ గ్రూపులు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ గ్రూపులు చాలా అరుదుగా ఉంటాయి. ఏబీ నెగెటివ్ వేల మందిలో ఒకరు, ఇద్దరు మాత్రమే ఉంటారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంక్లో రక్తం తీసుకునే ముందు హెచ్బీ శాతం, హెచ్ఐవీ పరీక్షలు రిపోర్టు, కాస్ మాచింగ్ రిపోర్టు ఉందో లేదో సరిచూసుకోవాలి. ●2003లో మొదటిసారిగా.. నేను లయన్స్ క్లబ్ సభ్యుడిగా ఉన్న క్రమంలో 2023లో మొదటిసారి రక్తం ఇచ్చాను. 18ఏళ్ల కాలంలో 57సార్లు రక్తదానం చేశాను. బీ–నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వందలో పది మందికి మాత్రమే ఉంటుంది. చాలా అరుదుగా లభ్యం అవుతుంది. గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీలు చేస్తున్న క్రమంలో అత్యవసరం ఉన్న ఐదు నుంచి ఆరుగురికి ఆస్పత్రికి వెళ్లి రక్తం ఇచ్చాను. ఓసారి ప్రసవం కోసం వచ్చిన మహిళకు అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే.. వెళ్లి ఇవ్వగా ఆమె ప్రాణాలు నిలిచాయి. అదే విధంగా 15సార్లు రక్తదాన శిబిరాలు సైతం నిర్వహించాను. – కెంగూరి శ్రీకాంత్ యాదవ్, దేవరకద్ర అత్యవసర సమయంలో.. నేను ఐటీఐ చదువుతున్న సమయంలో కల్వకుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలు కాగా.. బీ–నెగిటివ్ రక్తం అత్యవసరం ఉందని స్నేహితుడి ద్వారా సమాచారం తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లి ఇచ్చాను. ఇప్పటి వరకు 7సార్లు రక్తదానం చేశాను. అత్యవసరం ఉందని ఫోన్ చేస్తే తప్పక వెళ్లి ఇస్తాను. – శేఖర్ యాదవ్, నవాబుపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీతో పాటు ఐదు ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు, పాలమూరు పట్టణంలో మూడు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. రోజు 100 నుంచి 150 మందికి రక్తం అవసరం పడుతుంది. ప్రధానంగా ఇటీవల రోడ్డు ప్రమాద కేసులు గణనీయంగా పెరిగాయి. వీరితో పాటు ప్రసవం కేసులు, రక్తహీనత కేసులకు సైతం రక్తదాతల నుంచి తీసిన రక్తం అవసరం పడుతుంది. జనరల్ ఆస్పత్రి, రెడ్క్రాస్లో రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గుముఖం పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. జనరల్ ఆస్పత్రిలో 500 యానిట్ల వరకు రక్తాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. కానీ ప్రతినెలా 250 నుంచి 350 యూనిట్లు అవసరం ఉండటంతో అదే స్థాయిలో రక్తాన్ని సేకరిస్తున్నారు. అయితే బ్లడ్ బ్యాంక్ల్లో ఒక్కోసారి రక్త నిల్వలు లేకుండా పోతుండటంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తాన్ని సేకరించాల్సి వస్తుంది. అదీ కూడా అవసరమున్న వ్యక్తులు దాతలను తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎదుటి వ్యక్తి ప్రాణం కాపాడాలి.. రక్తదానంతో ఎదుటి వ్యక్తి ప్రాణం కాపాడిన వాళ్లం అవుతాం. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కల్గిన నేను ఇప్పటి వరకు 48సార్లు రక్తదానం చేయడంతో పాటు ఎంతో మందిని ప్రోత్సహించి రక్తదానం చేయించాను. ఒకసారి ప్లాస్మాదానం కూడా చేశాను. లయన్స్ క్లబ్తో కలిసి ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలపై అవగహన కల్పించాను. – రంగినేని మన్మోహన్, హెడ్కానిస్టేబుల్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో.. రాష్ట్రంలోనే 157సార్లు రక్తదానం చేయడంతో పాటు 8 సార్లు ప్లాస్మా, 8సార్లు ప్లేట్లెట్స్ దానం చేయడం జరిగింది. నేను 1983 నుంచి రక్తదానం చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఓసారి రక్తదానం చేస్తున్నాను. రెడ్క్రాస్ నుంచి ఈ ఏడాది 162 క్యాంపులు నిర్వహించి 6,289 రక్త యూనిట్లు సేకరించాం. ప్రస్తుతం రెడ్క్రాస్లో ఎస్డీపీ మిషన్ అందుబాటులోకి తెచ్చాం. ప్లేట్లెట్స్ తగ్గిన వారికి రెడ్క్రాస్లో ఎక్కించడానికి కావాల్సిన శిక్షణ కూడా సిబ్బందికి ఇప్పించాం. – లయన్ నటరాజ్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ 39సార్లు రక్తదానం.. జిల్లా జనరల్ ఆస్పత్రి బ్లడ్బ్యాంక్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో చాలా అత్యవసరం ఉన్న రోగులకు రక్తదానం చేశాను. ఇప్పటి వరకు 39సార్లు రక్తదానం చేయడం జరిగింది. బ్లడ్బ్యాంకులో పని చేయడం వల్ల రక్తం విలువ తెలుసుకొని నా వంతు బాధ్యతగా రక్తదానం ఇవ్వడం మొదలుపెట్టాను. – కోటేశ్వర్రెడ్డి, బ్లడ్బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్, జిల్లా జనరల్ ఆస్పత్రి ● దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత కలిగిన వారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్న వారు ఆ విషయాల్ని వైద్యులకు చెబితే వారు ఎప్పటి వరకు రక్తదానం చేయరాదనే విషయం చెబుతారు. మూడేళ్ల కాలంలో జనరల్ ఆస్పత్రిలో రక్త సేకరణ ఇలా.. -
ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్షస్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 16వ బ్యాచ్ 86 మంది అభ్యర్థులకు హైదరాబాద్ సెట్విన్ ఆధ్వర్యంలో గురువారం వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలను జిల్లా యు వజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ 16వ బ్యాచ్కు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి మే 16 వరకు 86 మంది యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెట్విన్ వారిచే సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వార్షిక పరీక్షలను ఎగ్జామినర్లు హైదరాబాద్ సెట్విన్ కోఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, అసిమ్, బిల్ఖిస్ సుల్తానా పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, ఫ్యాకల్టీ సిబ్బంది హరిప్రసాద్, కౌసల్య, ఖలీల్, ఇమ్రాన్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలుపాలమూరు: బాల, బాలికలను దినసరి కూలీలుగా మార్చినా.. బలవంతంగా దుకాణాలు, ఇతర కర్మాగారాల్లో పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని మాడ్రన్ హైస్కూల్లో గురువారం బాల కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, బాలల హక్కులపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య దశలో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించాలని సూచించారు. -
జూరాల నీటితో ప్రాజెక్టును నింపుతాం..
జూరాలకు ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్సాగర్ను నింపుతాం. ప్రస్తుతం ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. ముందుగా ఫర్దీపూర్ రిజర్వాయర్ను నింపాం. ఇక్కడి నుంచి తీలేర్ పంపుహౌస్కు నీటిని తరలించి.. అక్కడి నుంచి కోయిల్సాగర్కు పంపింగ్ చేస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి కి చేరే వరకు నీటిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. – ప్రతాప్సింగ్, ప్రాజెక్టు ఈఈ, కోయిల్సాగర్ వరుణుడు కరుణించాడు.. ఈ ఏడాది వరుణుడు కరుణించాడు. ముందస్తుగానే రుతుపవనాలు రావడంతో భారీ వర్షాలు కురిశాయి. వైఎస్ హయాంలో భారీ వర్షాలు నమోదు కాగా, ప్రస్తుతం రేవంత్రెడ్డి హయాంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పంటలు సమృద్ధిగా పండించే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఆయకట్టు లక్ష్యం చేరుకుంటాం. – మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ● -
ముగిసిన అంత్యక్రియలు
అడ్డాకుల: మండలంలోని గుడిబండకు చెందిన ముగ్గురు యువకులు బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం పాఠకులకు విధితమే. కాగా వాస పవన్కుమార్ (26), వాస సాయితేజ (24), వాస రాఘవేంద్ర (22) మృతదేహాలకు శవ పరీక్షల అనంతరం బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఒకేరోజు వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకుల అంత్యక్రియలు జరగడంతో గ్రామం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మృతుల్లో ఇద్దరికి వివాహం కాకపోవడం.. వాస పవన్కుమార్కు భార్య, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంలో తల్లిదండ్రుల రోధనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీహరి, నాగిరెడ్డి, శెట్టి శేఖర్, విజయమోహన్రెడ్డి, దశరథ్రెడ్డి, శరత్రెడ్డి, చెన్నకేశవులు, శకుంతల, జగదీశ్, భరత్ ఉన్నారు. -
పాము కాటుతో యువకుడి మృతి
మల్దకల్: యువకుడు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన మండలంలోని అడివిరావల్చెర్వు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగరాజు (20) బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని అక్కడే ఉన్న గుడిసెలో నిద్రించాడు. తెల్లవారుజూమున నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు పాము కాటు వేసినట్లు గుర్తించి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. తీర్థయాత్రలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు మానవపాడు: మండల కేంద్రానికి చెందిన బోయ మూగి మద్దిలేటి అనే వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మద్దిలేటి మరో నలుగురు గ్రామస్తులతో కలిపి ఈ నెల 5న కాశీ, అయోధ్యను సందర్శించడానికి వెళ్లాడు. యాత్రలు ముగించుకొని రైలులో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ రైల్వేస్టేషన్లో మరణించాడు. పోలీసులు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా మానవపాడుకు పంపారు. మద్దిలేటి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి మల్దకల్: విద్యుత్ సర్వీస్ వైర్ను సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పావనంపల్లి గురువారం జరిగింది. వివరాలు.. పావనంపల్లి గ్రామానికి చెందిన తెలుగు పరుషరాముడు(45) ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తన ఇంటికి తీసుకున్న సర్వీస్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య శారదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మండల నాయకులు ఆస్పత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తెలకపల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలకపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేశ్ వివరాల మేరకు.. బల్మూరు మండలం జినుకుంటకు చెందిన కురాకుల మహేశ్ (32), తన భార్య విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత అతడికి దూరపు బంధువు అయిన తెలకపల్లి మండలం లక్ష్నారం గ్రామానికి చెందిన శివలీలతో పరిచయమైంది. ఆమె కూడా తన భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్న క్రమంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇటీవల శివలీల మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన భర్త మహేశ్ నిలదీశాడు. అయితే తన ప్రవర్తన మార్చుకోని శివలీల.. కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా 10 రోజులు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె అదృశ్యం కావడంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీని కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఆ తర్వాత తెలకపల్లిలో నివాసం ఉన్నప్పటికీ శివలీల తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త మహేశ్.. తెలకపల్లిలో తన సోదరి అంజలి నివాసముంటున్న అద్దె ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి దాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి బలవన్మరణం తెలకపల్లి: క్షణికావేశంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు.. మండలంలోని పెద్దూరుకు చెందిన పబ్బాల పరశురాములు (28) రెండు నెలలుగా ఎలాంటి పని చేయకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో భార్య, తల్లిదండ్రులు మందలించారు. దీంతో గురువారం ఉదయం ఇంట్లో సీసాలో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. తండ్రి పబ్బాల కురుమయ్య ఫిర్యాదు మేరకు సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. పరశురాములుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి వెంకటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్ నిర్వహించగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక మంది బాల, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి, క్రీడా శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వాకిట శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి జిల్లాకు చెందిన వారేనని, వీరి హయాంలో క్రీడారంగం అభివృద్ధి పథంలో వెళ్లడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సరూర్నగర్ డీవైఎస్ఓ సెలక్షన్ కమిటీ నామినీ వెంకటేశ్వర్లు, ఎల్బీ స్టేడియం వాలీబాల్ కోచ్ ప్రవీణ, జింఖానా వాలీబాల్ కోచ్ రుషిందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ, ఓల్వో బస్సు ఢీ : 18 మందికి గాయాలు
మక్తల్: ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని బొందల్కుంట స్టేజీ వద్ద గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి 29 మంది ప్రయాణికులతో ఓల్వో బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున మండలంలోని బొందల్కుంట వద్ద 167 జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న లక్ష్మణ్, నవీన్, సంజీవ్, అన్నపూర్ణ, షరీఫ్, రహీం, మణెమ్మ, శంకర్, నర్సింహులు, రమేశ్ అనిత తదితరులు మొత్తం 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ సంజీవ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మక్తల్, రాయచూర్, మహబూబ్నగర్ ఆస్పత్రులకు తరలించారు. గురువారం ఉదయం ఎస్పీ యోగేష్ గౌతమ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ యోగేష్ గౌతమ్ -
జడ్చర్ల కాలనీల్లో వరద నీరు
జడ్చర్ల మున్సిపాలిటీ మరోమారు జలమయమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్డుతో పాటు పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. బాదేపల్లి పైభాగం ఊరకుంట పద్మావతి కాలనీ నుంచి వచ్చిన వరద నీరు ప్రధాన రోడ్డుపైకి చేరడంతో చిన్నపాటి చెరువును తలపించింది. మోకాలు లోతుకుపైగా నీళ్లు నిలవడంతో ఇటు సిగ్నల్గడ్డ, అటు నేతాజీ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. సిగ్నల్గడ్డ నుంచి క్రాస్రోడ్డుకు వెళ్లే దారిలో జాతీయ రహదారి–167పై శ్రీకృష్ణ ఆలయం వద్ద సైతం వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. రోడ్డుపై వ్యాపారాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్వీపీనగర్ కాలనీలో సౌరమ్మ అనే మహిళ ఇళ్లు, రాజీవ్నగర్ కాలనీలోనూ ఇళ్లు, ప్రహరీ కూలిపోయాయి. మరో ఇంటి నిర్మాణానికి వేసిన పిల్లర్లు పడిపోయాయి. ఏరియా ఆస్పత్రి ఆవరణలోనూ భారీగా వర్షపు నీరు నిలిచింది. వర్షానికి కూలిన ఇంటిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించారు. -
ఉత్సాహంగా టీజీపీఈ సెట్ ఈవెంట్స్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో టీజీపీఈ సెట్–2025 ఈవెంట్స్ రెండో రోజు గురువారం ఉత్సాహంగా కొనసాగాయి. ఈవెంట్స్ను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్చైర్మన్లు పురుషోత్తం, శ్రీరామ్ వెంకటేశ్తో పాటు పీయూ వీసీ శ్రీనివాస్ పరిశీలించారు. ముందుగా 100 మీటర్ల రన్నింగ్ను వారు గన్ పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఎంపికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించామన్నారు. మిగతా ఈవెంట్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెండో రోజు బీపెడ్లో 544 మందికి గాను 370 మంది, డీపెడ్లో 231 మందికి గాను 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ దిలీప్, రిజిస్ట్రార్ రమేశ్బాబు, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా సంబరాలు చేద్దాం
జడ్చర్ల టౌన్: బాదేపల్లి బాలుర జెడ్పీ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుందామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అన్నారు. హైస్కూల్ ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ హైస్కూల్లో చదివిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోఆర్డినేషన్ కమిటీ తేదీ నిర్ణయిస్తే మూడు రోజుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గవర్నర్తో పాటు మంత్రులను ఆహ్వానించే బాధ్యత తీసుకుంటానన్నారు. వేడుకలకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. అయితే శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చే రాష్ట్రపతిని ఆహ్వానించి, అదే సమయంలో వేడుకలు నిర్వహించాలని కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరుతున్నారని, అందుకోసం ముఖ్యమంత్రి ద్వారా ప్రయత్నిద్దామని తెలిపారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను సైతం కలుసుకుని రాష్ట్రపతిని ఆహ్వానిద్దామన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు బి.రవిశంకర్, వి.కృష్ణ, రమణాచార్యులు, ఇబ్రహీం, వెంకటేశ్, పెద్దిబాలు, పరమటయ్య, శ్రీహరి, సంతోష్చారి, బాబర్, మార్కెట్ చైర్పర్సన్ జ్యోతి, వార్డుకౌన్సిలర్ రఘురాంగౌడ్, పట్టణ ప్రముఖులు బి.శివకుమార్, కె.లక్ష్మయ్య, ఎంఈఓ మంజులాదేవి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులను ఆహ్వానిద్దాం బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి -
అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
మహబూబ్నగర్ న్యూటౌన్: సమాజంలో వెనుకబడిన జాతులు అణచివేతకు గురవుతూనే ఉన్నాయని, అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులు, భూ సమస్యలు నెల రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు, భూ సమస్యలు, వివిధ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి ఎస్పీ జానకి వివరించారు. ఈ ఏడాది 26 కేసులు నమోదు కాగా 6 చార్జీషీట్ చేశామని, 20 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. గతేడాది 78 కేసులు నమోదైనట్లు చెప్పారు. 2014 సంవత్సరం నుంచి 2023 వరకు 530 కేసులకు గాను 90 కేసులు చార్జిషీట్ వేయలేదని, కారణాలు ఏమిటని చైర్మన్ ఆరాతీశారు. 2023– 24లో 27 అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించామని, ఈ ఏడాది 71 మందికి రూ.78 లక్షలు పరిహారం చెల్లింపునకు నిధులు రావాల్సి ఉందన్నారు. సంబంధిత శాఖ రాష్ట్ర అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని చైర్మన్ తెలిపారు. అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి కింద గతేడాది ఒక అమ్మాయికి రూ.20 లక్షలు విదేశాల్లో చదువుకునేందుకు మంజూరు చేశామని ఎస్సీ అభివృద్ధి అధికారి చెప్పారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య, రవీంద్రబాబు, లక్ష్మణ్, మోహన్లాల్, కృష్ణయ్య, హన్వాడ నాగయ్య సమస్యలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్, ఎస్సీ అభివృద్ధి అధికారి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నిధులు పక్కదారి పట్టించొద్దు చైర్మన్ బక్కి వెంటయ్య మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉందని, అదే స్థాయిలో వారికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు. ప్రతినెల చివరి రోజున కచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని, తహసీల్దార్, ఎస్ఐలు హాజరై ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందులో వారి వాటా గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిపి సమీక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించవద్దన్నారు. ఆర్అండ్బీ, పీఆర్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు వారి స్థోమతను బట్టి చిన్నపాటి పనులు కేటాయించాలని సూచించారు. ఉన్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు బెడద అరికట్టాలని, వ్యవసాయ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలలో అవకాశం కల్పించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారికి సూచించారు. పెండింగ్ కేసులు, భూ సమస్యలునెలలోగా పరిష్కరించాలి ప్రతినెలా చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
573 బస్సులకు నో ఫిట్నెస్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైనపాఠశాలలు నేటినుంచి స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు -
శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు’లో శిక్షణ పొందిన మహిళలకు 30 నుంచి 40 శాతం వరకు ఉద్యోగావకాశాలు లభించాయని పర్యవేక్షకుడు గుండా మనోహర్ తెలిపారు. ఇక మిగతా వారు ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలోని ఈ శిక్షణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సొంత నిధులతో కొనసాగుతున్న ‘నవరత్నాలు’ ముఖ్యంగా మహిళలకు వరంగా మారిందన్నారు. ఇక్కడ కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గంవర్క్, ఫ్యాషన్ డిజైనింగ్లో శిక్షణ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్లో 217 మంది, రెండో బ్యాచ్లో 247 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు యత్నిస్తున్నామన్నారు. మొదటి బ్యాచ్ పూర్తి చేసిన వారికి ఈనెల 17న ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అదేరోజు రెండో బ్యాచ్ వారికి ఫేర్వెల్ పార్టీ ఉంటుందన్నారు. మూడో బ్యాచ్కు అడ్మిషన్లు జరుగుతున్నాయని 18న శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అలాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సైతం ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ నిజలింగప్ప, సెట్విన్ కో–ఆర్డినేటర్ విజయకుమార్, ‘నవరత్నాలు’ ఫ్యాకల్టీలు గౌతమి, భవాని, కవిత, అనూష తదితరులు పాల్గొన్నారు. 18 నుంచి మూడో బ్యాచ్ ప్రారంభం -
గుడిబండ.. శోకసంద్రం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద రోడ్డు ప్రమాదం అడ్డాకుల: బర్త్ డే సెలబ్రేషన్స్కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం మండలంలోని గుడిబండలో మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మృతులు, క్షతగాత్రులందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వాస శివకుమార్ అలియాస్ కుమార్ హైదరాబాద్లో ప్రైవేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మంగళవారం అతడి బర్త్ డే ఉండటంతో అతనికి వరుసకు సోదరులయ్యే వాస పవన్కుమార్(25), వాస సాయితేజ (22), వాస రాఘవేంద్ర (23)తో పాటు సొంత తమ్ముడు సాయికుమార్, మూసాపేటకు చెందిన సందీప్, హైదరాబాద్కు చెందిన శివకుమార్గౌడ్ కలిసి ఉదయం కారులో హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వద్ద ఉన్న వైజాగ్కాలనీకి వెళ్లారు. వేడుకలు జరుపుకొని అర్ధరాత్రి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాస పవన్కుమార్, వాస సాయితేజ, వాస రాఘవేంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. కుమార్, అతడి తమ్ముడు సాయికుమార్, సందీప్, శివకుమార్గౌడ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒక్కగానొక్క కుమారుడు.. వాస బుర్రన్న, పద్మ దంపతులకు కుమారుడు వాస పవన్కుమార్, కుమార్తె ఉండగా. కుమార్తె వివాహం జరిగింది. పవర్కు భార్య వరలక్ష్మి, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. మధుమేహ వ్యాధి తీవ్రమై బుర్రన్నకు ఇటీవల కాలు తొలగించారు. పవన్ కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉంటూ భవన నిర్మాణాల వద్ద మిల్లర్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ పోషణ కాలు లేని తండ్రికి భారం కానుంది. పవన్ భార్య వరలక్ష్మి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. కారు డ్రెవింగ్కు వెళ్లి.. వాస బాలస్వామి, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు వాస సాయితేజ హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేస్తుండేవాడు. సోదరుడు రవితేజ బెంగళూర్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. సాయితేజకు ఇంకా పెళ్లి కాలేదు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదుకుంటాడనుకుంటే.. వాస లక్ష్మయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. పెద్ద కుమారుడు వాస రాఘవేంద్ర ప్రైవేట్లో ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. హైదరాబాద్లో ఉంటున్న రాఘవేంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఘటనపై ఎమ్మెల్యే ఆరా.. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు తగిన సాయం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురి దుర్మరణం.. మరో నలుగురికి గాయాలు బర్త్ డే వేడుకలు ముగించుకొని వస్తుండగా ప్రమాదం -
టీజీపీఈసెట్
పారదర్శకంగా ఈవెంట్కు 517మంది హాజరు పీయూలో సెట్ అభ్యర్థులు ఈవెంట్స్ను కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్బాబు, సెట్ కన్వీనర్ దిలీప్ ఉదయం 7:30గంటలకు సింథటిక్ ట్రాక్లో 100 మీటర్ల పరుగు పందేన్ని గన్ఫైర్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన రెండు క్రికెట్ నెట్లను ప్రారంభించగా.. వీసీ బౌలింగ్ చేస్తే కౌన్సిల్ చైర్మన్ బ్యాటింగ్తో అలరించారు. వీటితోపాటు పీజీ కళాశాల పక్కనున్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పలు కోట్లను పరిశీలించారు. మొదటిరోజు ఈవెంట్స్కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 732మంది మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 517మంది పాల్గొనగా.. 215మంది గైర్హాజరైనట్లు సెట్ కన్వీనర్ దిలీప్ పేర్కొన్నారు. అభ్యర్థులు రన్నింగ్ షార్ట్పుట్, లాంగ్జంప్ అనతతరం 11 క్రీడాంశాల్లో పాల్గొన్నారు.మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తున్న టీజీపీఈసెట్–2025ను పారద్శకంగా నిర్వహిస్తామని టీజీహెచ్ఈసీ (తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్) చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలోని సింథటిక్ ట్రాక్ గ్రౌండ్స్లో సెట్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఈవెంట్స్నుఆయన గన్పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా ఎప్పుడూ పీయూకు రాలేదుని, ఇప్పుడు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాని, పచ్చని చెట్లమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో యూనివర్సిటీ ఉండడం విద్యార్థులకు ఎంతోమేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా పీయూలో అందుబాటులో ఉన్న సింథటిక్ ట్రాక్, గ్రౌండ్స్ ఇతర సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని సెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. తాను పాలమూరుకు చెందిన వ్యక్తిని అయినప్పటికీ జిల్లాల మధ్య తారతమ్యాన్ని చూడనని పేర్కొన్నారు ఉన్నత విద్యామండలి అంటేనే అఫర్డబులిటీ, యాక్ససబిలిటీ, క్వాలిటీ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా మంచి నాణ్యతా ప్రమాణాలను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. దేశానికి నిజమైన ఆస్థి యువతనేనని.. నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించిన వెంటనే ఉద్యోగ అవకాశాలు పొందేవిధంగా కోర్సుల్లో మార్పులు తీసుకొస్తున్నామని, సిలబస్లో కూడా మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. సెట్ను సమర్థవంతంగా నిర్వహిస్తాం పాలమూరు యూనివర్సిటీ చరిత్రలో ఒక రాష్ట్రస్థాయి సెట్ నిర్వహణకు మొట్టమొదటిసారి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సెట్ నిర్వహణ బాధ్యతలను తమపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పాలమూరుపై మంచి అభిమానం ఉన్న ఆయన పీయూలో జరిగే సెట్ ఈవెంట్స్కు హాజరుకావడం గొప్ప విషయమన్నారు. ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. గతంలో పనిచేసిన వీసీలు వసతుల కల్పనకు కృషిచేశారని, సింథటిక్ ట్రాక్, గ్రౌండ్ నిర్మించడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ దిలీప్కుమార్, పీయూ రిజిస్ట్రార్ రమేశ్బాబు, మాజీ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, పీడీ శ్రీనివాస్, భూమయ్య, అర్జున్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. టీజీహెచ్ఈసీ చైర్మన్ బాలకిష్టారెడ్డి పీయూలో 170ఎకరాల్లో ఆహ్లాదరకమైన వాతావరణం, వసతులు అందుకే టీజీపీఈసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాం విద్యార్థులకు అందుబాటులోకి ఉపాధి అధారిత కోర్సులు ఉత్సాహంగా ఈవెంట్స్లో పాల్గొన్న అభ్యర్థులు -
రోటవేటర్ కింద పడి విద్యార్థి మృతి
కోడేరు: రోటవేటర్ కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనుంపల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి నాగేంద్రం ఉదయం తన కుమారుడు సాయికుమార్(13)ను పొలం వద్దకు తీసుకెళ్లాడు. డ్రైవర్ సత్యనారాయణ నాగేంద్రం పొలంలో రోటవేటర్తో దుక్కి దున్నుతుండగా వెనకాల ఉన్న సాయికుమార్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్ కింద పడి మృతిచెందాడు. నాగేంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి రాజాపూర్: పరిశ్రమలో పైకప్పు షీట్వేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కిందపడిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం మండలంలోని గుండ్లపొట్లపల్లిలో చోటుచేసుకున్నది. రాజాపూర్ ఎస్సై శివానందంగౌడ్ కథనం ప్రకారం.. గుండ్లపొట్లపల్లి శివారులో బిన్జ్రాజ్కవలేవ్యు పరిశ్రమలో మంగళవారం సాయంత్రం పాతసీట్స్ తొలగించి కొత్తసీట్స్ వేసి వెల్డింగ్ చేస్తుండగా.. హైదరాబాద్కు చెందిన అబ్దుల్హమీద్ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న అతని తమ్ముడు చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి అబ్దుల్సలీం ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లితో గొడవ పడి యువతి.. ఎర్రవల్లి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సుధాకర్ కథనం మేరకు.. మండలంలోని షాబాద్ గ్రామానికి చెందిన మహేశ్వరి(25)కి గతంలో వివాహం కాగా, భర్తతో విడాకులు తీసుకొని కొంత కాలంగా తల్లి పద్మమ్మతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు చదువుకోవడం కోసం తనకు రూ.1లక్ష కావాలని ఈ నెల 2న తల్లిని కోరింది. ఆమె రెండు రోజుల్లో సమకూరుస్తానని చెప్పడంతో గొడవపడి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి ఆమెను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. బాలికపై లైంగికదాడికి యత్నం పాన్గల్: ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన సంఘటన బుధవారం మండలంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం గ్రామంలో కోళ్ల షెడ్డు నిర్మాణం పనులు చేసేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టకు చెందిన తిరుపతయ్య(65) కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం షెడ్డు సమీపంలో ఓ ఇంటి ముందు ఊయల ఊగుతున్న బాలిక(6)ను మద్యం మత్తులో చేతిపట్టుకొని షెడ్డు లోపలికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించగా బాలిక గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు 100 సమాచారం ఇవ్వడంతో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడాది తర్వాత దొరికిన బాలుడు మిడ్జిల్: మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఎండీ సలీమా, జహంగీర్ దంపతుల పెద్ద కుమారుడు ఎండీ సమీర్ (15) గతేడాది 15 ఏప్రిల్ 2024న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అదే రోజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. అదే రోజు బాలుని వివరాలు ఆన్లైన్ యాప్లో నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ యాప్ ద్వారా బాలుడు బెంగూళూర్లోని ఒక హాస్టల్లో ఉన్నాడని సమాచారం రావడంతో, ఆ బాలుని బెంగూళూర్ నుంచి తీసుకొచ్చి బుధవారం కుటుంబ సభ్యులకు అస్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. సంవత్సరం తర్వాత కుమారుడు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
పాతికేళ్లకు వృద్ధ భారతం!
uమొదటి పేజీ తరువాయిరెట్టింపునకు మించి 34.7 కోట్లకు (జనాభాలో 20.8 శాతం) చేరుకుంటుందని అంచనా. ఇది దేశ ఆరోగ్య, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక అభద్రత, కుటుంబపరమైన సహాయ సహకార వ్యవస్థ క్షీణత, వైద్య, ఆరోగ్య సేవల విషయంలో అసమానతల పెరుగుదల లాంటి తదితర కారణాల వల్ల వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక అంశాలను ప్రభావితం చేస్తుండటం చర్చనీయాంశంగా ఉంది. భారత్ క్రమంగా వృద్ధ సమాజంగా మారనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఒక సంక్షోభంగా పరిణమించవచ్చుననే హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఇండియాస్ ఏజింగ్ సొసైటీ: ద ల్యాండ్ స్కేప్ టుడే’– గివ్ గ్రాంట్స్ ఇండియా’ నివేదిక’లో ఇందుకు సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 (యూఎన్ఎఫ్పీఏ ఇండియా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సంయుక్త పరిశీలన), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్ పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 29 శాతం మందికే పెన్షన్ పెన్షన్ అందని వృద్ధుల బతుకు భారంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలోని వృద్ధులలో 29% మందికే పెన్షన్ (వివిధ రూపాల్లో) లభిస్తోంది. దాదాపు 40% మంది వృద్ధులు అత్యల్ప ఆదాయ వర్గ కుటుంబాలకు చెందినవారు. వారి జీవితం.. భద్రమైన ఆదాయం, కుటుంబ మద్దతు తగ్గిపోతున్న ఈ కాలంలో మరింత కష్టతరంగా మారుతోంది. వృద్ధులపై జరిగే దౌర్జన్యాలలో 71% కేసులు మహిళలకు సంబంధించి ఉంటున్నాయి. దేశంలోని సగానికి పైగా వృద్ధులు మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ ఉపయోగించలేరు. ఇది వారిని సమాజం నుంచి పూర్తిగా వేరుచేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కు పైగా మాత్రమే వృద్ధుల వసతి గృహాలున్నాయి. దెబ్బతీస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు... ప్రస్తుతం వృద్ధులలో..50% మందికి అధిక రక్తపోటు, 43% మందికి మధుమేహం (డయాబెటిస్) 33% మందికి అస్తమా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నిత్యం వైద్య పర్యవేక్షణ అవసరమ య్యే పరిస్థితులు. కానీ దేశవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో మాత్ర మే గెరియాట్రిక్ వైద్య నిపుణులున్నారు. పౌర ఆరోగ్య బీమా పథకం ద్వారా 25% వృద్ధులకు మాత్రమే బీమా లభిస్తోంది. వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అటల్ వయో అభ్యుదయ యోజన, జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, రాష్ట్రీయ వయోశ్రీ పథకం. అయితే వీటిపై ప్రజల్లో అవగాహన లోపం, ఇవి సరిగా అమలు కాకపోవడం, గ్రామీణ ప్రాంతాలకు చేరిక తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలి? పెన్షన్ వ్యవస్థను విస్తరించాలి. అసంఘటిత రంగం వృద్ధులకు కూడా చేరుకునేలా చూడాలి. అత్యాధునిక వృద్ధుల నివాస గృహాలు స్థాపించాలి. సహాయ జీవన, ఆరోగ్య ఆధారిత సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీరో టాలరెన్స్ పథకం – వృద్ధులపై దౌర్జన్యాలపై కఠినచర్యలు. డిజిటల్ సహిత వృద్ధులు – డిజిటల్ సాంకేతికతపై శిక్షణ. వృద్ధ మహిళల ప్రత్యేక పథకాల కు, ఆర్థిక స్వయం సాధన, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. -
కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర మంత్రులు సమష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయన బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకపోతే పథకాలు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద తప్పుల మీద తప్పులు చేసిందని ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు రావడం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు భవితవ్యాన్ని తేల్చాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు విద్యుత్ చార్జీలకు, మరో రూ.10 వేల కోట్లు అప్పులకు చెల్లించే పరిస్థితుల నుంచి బయటపడాలన్నారు. ఎక్కువ ఊహించుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును, పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.ఉద్యోగ క్యాలెండర్ మాదిరి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. వందేళ్ల పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడం సరికాదన్నారు. సంబాల కేశవరావును చంపిన తర్వాత దేశంలోని కోట్లాది మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రభుత్వాలు పనిచేయడం సరికాదన్నారు. మార్క్సిజం, లెనినిజం ద్వారానే పేదల బతుకుల్లో వెలుగులు.. భరత గడ్డ విముక్తి పోరులో భారత కమ్యూనిస్టు పార్టీ నడిపిన వీరోచిత కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రాత్మకమని, కమ్యూనిజాన్ని అంతం చేయాలనుకుంటే కాలి బూడిదైపోతారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా మీదుగా వందలాది మంది ప్రజలు, కార్మికులు, సీపీఐ శ్రేణులతో అల్మాస్ ఫంక్షన్ హాలు వరకు ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అల్మాస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శతాబ్దిఉత్సవాల సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలో తుదిశ్వాస వరకు సొంత ఆస్తులు పంచుతూ జైలు నిర్బంధాలను, అక్రమ కేసులను లెక్కచేయకుండా ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని నైజం కమ్యూనిస్టులేదే అన్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని 2026 డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆనంద్, పరమేశ్గౌడ్, ఉసేనయ్య, నరేందర్రెడ్డి, సురేశ్, రాము పాల్గొన్నారు. మంత్రులు సమష్టిగా పనిచేసి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి
పాలమూరు: పెద్ద ధన్వాడ వద్ద చేపడుతున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని, ఇకపై తెలంగాణలో ఇథనాల్ కంపెనీల ఏర్పాటు మానుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడేవిధంగా ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు చేస్తామని, ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని బెదిరింపు గొంతుతో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడటం సరికాదని.. ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇథనాల్ కంపెనీల పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్ష చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో రద్దు చేసినట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకు రద్దు చేయడంలేదనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా జిల్లాను కాలుష్యం నుంచి రక్షించడం లేదన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘నవరత్నాలు’ శిక్షణ కేంద్రంలో బుధవారం సెట్విన్ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ మూడు నెలలపాటు కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ కోర్సులలో శిక్షణ పొందిన రెండో బ్యాచ్కు చెందిన 247 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను సెట్విన్ హైదరాబాద్ కో–ఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, మహబూబ్నగర్ డీవైఎస్ఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఆయా కోర్సులలో ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ ప్రశాంతంగా జరిగాయి. ఇక డీవైఎస్ఓ సూపరింటెండెంట్ రవీందర్రెడ్డి, సెట్విన్ నిర్వాహకులు విజయకుమార్, ఎగ్జామినర్లు పి.వనజ, అజ్మత్ ఉన్సీస, తన్వీర్సుల్తాన్ పర్యవేక్షించారు. కాగా, కొత్తగా మూడో బ్యాచ్ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని ‘మహబూబ్నగర్ ఫస్ట్ – నవరత్నాలు’ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 550 మంది అభ్యర్థులు శిక్షణ పొందారని వివరించారు. ● పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి -
ఎట్టకేలకు..!
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీ డాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీ డాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచేవారు. నిధుల నిర్వహణ భారంతో 2008లో వాలీబాల్ అకాడమీ ని మూసివేశారు.అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వా లీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. మెయిన్ స్టేడియంలో ఏర్పాటు మెయిన్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా.. మూడేళ్ల కిందట పునఃప్రారంభ మైంది. రూ.19లక్షల70వేలతో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశారు. స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లోని పైఅంతస్తుల గదులను అకాడమీ క్రీడాకారుల వసతికి కేటాయించారు. గదుల ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు సంబంధించి కొంతమేర వసతి సౌకర్యాలు ఇప్పటికే అకాడమీకి చేరాయి. మంచాలు, టేబుల్స్, బీరువాలతోపాటు ఇతర వస్తువులు వచ్చాయి. అకాడమీలో ప్రవేశాలు పొందే బాల, బాలికలకు నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో వాలీబాల్లో మెరుగైన శిక్షణ అందజేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతారు. నేడు, రేపు అకాడమీ ప్రవేశాల సెలక్షన్స్ మెయిన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నూతన వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని బాల, బాలికలకు సెలక్షన్స్ నిర్వహించారు. అయితే సెలక్షన్స్ జరిగినప్పటికీ క్రీడాకారుల ప్రవేశాలు మాత్రం కల్పించలేదు. ఎట్టకేలకు వాలీబాల్ అకాడమీకి ముందడుగు పడింది. నేడు, రేపు రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్ చేపట్టనున్నారు. 14–16ఏళ్ల బాల, బాలికలు ఎంపికలకు అర్హులు. వాలీబాల్ అకాడమీకి కదలికలు నేడు, రేపు రాష్ట్రస్థాయి సెలక్షన్స్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సెలక్షన్స్కు అన్ని ఏర్పాట్లు చేశాం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నేడు, రేపు జరిగే వాలీబాల్ అకాడమీ సెలక్షన్స్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే బాల, బాలికలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సంబంఽధిత ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. – శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం
జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సెజ్ సమీపంలో బుధవారం ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు కర్రలతో కాగితం అట్టలు తయారయ్యే డెక్కన్ గోల్డ్ ఇండస్ట్రీలో యంత్రాలలో సాంకేతిక సమస్యలు ఏర్పడి షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పరిశ్రమలో ముడిసరుకు అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై పరిశ్రమ నిర్వాహకులు ఎలాంటి వివరాలు వెళ్లడించలేదు. బావిలో జారిపడి వ్యక్తి మృతి అమరచింత: ప్రమావశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి పట్టణానికి చెందిన బిందే కురుమన్న(45) మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కురుమన్న జములమ్మ ఆలయం సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. బావిలో నీటిని తీసుకోచ్చేందుకు వెళ్లి కాలుజారి బావిలో పడి మృతిచెందాడు. పొలానికి వెళ్లిన కురుమన్న ఇంటికి రాకపోవడంతో పొలం, బావివద్ద గాలించగా.. బావిలో మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. మృతుడికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కల్యాణం కమనీయం..
సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి పాలమూరు: ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ను కలిశారు. ఈ సందర్భంగా నారాయణపేటలోని సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్ధత వల్ల సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయిన విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైనంత త్వరగా సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రికి ఎంపీ డీకే అరుణ వినతి -
ఎస్ఎల్బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యా గ్నటిక్ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సీఈ అజయ్కుమార్లు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ వీరేంద్ర తివారీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డీజీగా పనిచేసిన హర్పాల్సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టన్నెల్ పనుల పూర్తికోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా డిప్యుటేషన్పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. టన్నెల్ ప్రాంతంలో నేల స్వభావాన్నికచ్చితంగా గుర్తించే ప్రయత్నం రక్షణ శాఖ హెలికాప్టర్లతో సర్వే నిర్వహిస్తాం: మంత్రి ఉత్తమ్ -
విద్యాబోధనపై నిరంతర శోధన చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యాబోధనపై నిరంతరం పరిశోధనలు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో మారిన నూతన విద్యావిధానం రీసెర్చ్ మెథడ్స్పై విద్యాకళాశాల అధ్యాపకులు ఏర్పాటు చేసిన వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆవిష్కరణలతో విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో బోధించేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో పరిశోధన ధృక్పథాన్ని పెంపొందించడంతో ఆలోచనా ధోరణి మారుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అధ్యాపకులు పాటుపాలని, బోధనలో సమర్థవంతమైన నైతిక విద్యను అందిచేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశోధన కార్యక్రమాలతో విద్యాప్రమాణాలను గణనీయంగా పెంచుతుందని, వర్క్షాప్ల నిర్వహణతో అధ్యాపకులు, గణాంకసాధనాలు, డాటా విశ్లేషణ, విద్యారచణ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెరుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, ఐక్యూఏసీ డైరెక్టర్ మధుసూదన్రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, ఆంజనేయులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి -
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి.. ఔత్సాహికులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలశాఖ, మున్సిపల్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో విరివిగా పరిశ్రమలు ఏర్పాటుచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి.. నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. గ్రీన్ ఇండస్ట్రీయల్ సెజ్, పోలేపల్లి సెజ్లో వీధిలైట్ల ఏర్పాటు, రోడ్డు మరమ్మతు పనులను జూలైలోగా పూర్తిచేయాలని టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. అనంతరం టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వాహనాల మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్, ఎల్డీఎం భాస్కర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కె.నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ గణేశ్ ఉన్నారు. రైల్వే స్టేషన్లో నేస్తం ఫిర్యాదు కార్యక్రమం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్లో బుధవారం నేస్తం ఫిర్యాదు పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్కట్టా, ఐఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేస్తం కార్యక్రమం ద్వారా ఉద్యోగులు వ్యక్తిగతంగా శాఖ అధికారులను కలిసి తమ సేవా సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని పొందుతారని అధికారులు తెలిపారు. సమస్యను బట్టి వాటిని తక్షణం, వారం, 15 లేదా 30 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేగవంతమైన సమస్యల పరిష్కారం, సానుకూలమైన పని వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. 26న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ స్కూళ్లలో 4 తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్, 6x10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాల కోసం 8–9 సంవత్సరాలు 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించిన వారు ఎంపికలకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి ప్రొగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. పైన పేర్కొన్న ధ్రువపత్రాల్లో ఏది లేకున్నా ఎంపికలకు అనుమతించమని తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపికలు జూలైలో ఉంటాయని, మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ లెక్కన మక్తల్ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు,యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
బడికి పోదాం.. చలో
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో ఆడిపాడిన పిల్లలు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. నెలన్నర రోజులుగా మూతబడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు సర్కారు బడుల్లో అడ్మిషన్లు భర్తీ చేసేందుకు పది రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3,360 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. కాగా.. విద్యార్థులకు మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాం పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించాలని, అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు గతంలో పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు, మార్కులతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల హెచ్ఎంను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 820 పాఠశాలలు ఉండగా.. అందులో 50 జీరో–టచ్ ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ● ఇప్పటి వరకు పార్ట్–1 పాఠ్య పుస్తకాలు 4,39,060 రావాల్సి ఉండగా 4,30,260 ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్విరార్మెంటల్ సైన్స్కు సంబంధించి 2 టైటిల్స్ పెండింగ్లో ఉన్నాయి. హైస్కూల్ విద్యార్థులకు సంబంధించి నోటు పుస్తకాలు 1.40 లక్షలు రావాల్సి ఉండగా 1.10 లక్షలను ఆయా పాఠశాలలకు అందజేశారు. 66 వేల యూనిఫాంలు కుట్టేందుకు మహిళా సంఘాలకు అప్పజెప్పగా.. కుట్టే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆటాపాటలకు బైబై జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం మొదటి రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేత సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటింటి ప్రచారం బడిబాట ద్వారా 3,360 మంది చేరిక జిల్లాలో 50 పాఠశాలల్లో ఏఐ తరగతుల బోధన -
మొదటి రోజు పండగలా ఉండేది..
నేను మలక్పేట నెహ్రూ మెమోరియల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. కాలనీలో స్కూల్స్లో ఉండడం వల్ల పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది కాదు. సెలవుల తర్వాత మొదటి రోజు పాఠశాలకు వెళ్లాలి అంటే ఒక పండగా ఫీల్ అయ్యే వాళ్లం. బడి ప్రారంభం రోజు కొత్త టీచర్ ఎవరు వస్తారని ఆలోచించేవాళ్లం. పుస్తకాలు, నోటు బుక్కులు కొనుక్కోవడం ఉత్సాహంగా ఉండేది. – ప్రవీణ్కుమార్, డీఈఓ చాలా సంతోషంగా వెళ్లే వాళ్లం ఎండకాలం సెలవులు ముగిసిన తర్వాత తొలిరోజు సంతోషంగా స్కూల్కు వెళ్లేవాళ్లం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుండుగుండ్లపాలెం మా సొంతూరు. మా ఊరి నుంచి పాలకవీడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. మా ఊరి నుంచి స్కూల్కు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతిరోజూ స్నేహితులతో కలిసి నడిచి వెళ్లే వాళ్లం. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. స్కూల్ నాటి జ్ఞాపకాలు జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తులు. – వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ ● -
14న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ అధిక సంఖ్యలో పెండింగ్ కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్క విభాగం బాధ్యత తీసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో 17,431 కేసులు రాజీ చేశామని, ఈనెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్ అంతా కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్శాఖ, బ్యాంకు నిర్వహకులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన కక్షిదారులు కోర్టుకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే చెక్ బౌన్స్పై వారం రోజుల పాటు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కేసులు రాజీ చేయనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి.. రాజీ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి కేసులో కక్షిదారులు హాజరుకావాలని సూచించారు. 14న నిర్వహించే లోక్ అదాలత్లో భాగంగా మహబూబ్నగర్ కోర్టులో ఆరు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 3,010 కేసులలో ఉన్న కక్షిదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసిన సందర్భంలో కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కోర్టుకు చెల్లించిన ఫీజు సైతం తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 8 బెంచీలు ఏర్పాటు ఇప్పటికే 3వేల కేసుల్లో కక్షిదారులకు నోటీసులు జారీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి -
జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్ స్కూల్
గండేడ్: పేరులోనే కాదు ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తోంది జిల్లాలో ఏకై న ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్). మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గండేడ్ మండలం వెన్నాచేడ్లో ఉన్న ఈ పాఠశాలను 2013లో అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మోడల్ మంజూరైనప్పటికీ ప్రభుత్వ భూమి లేకపోవడంతో వెన్నాచేడ్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం ద్వారా వచ్చిన డబ్బు, గ్రామస్తుల సహకారంతో ఐదు ఎకరాల భూమిని సమకూర్చి.. పక్కా భనన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన సాగుతోంది. 2016లో పదో తరగతి మొదటి బ్యాచ్ పదో తరగతి పరీక్షలు రాశారు. 64 మంది పరీక్ష రాయగా.. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 2017లో 93 శాతం 2019లో 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. మిగతా అన్ని విద్యా సంవత్సరాల్లో 2025 వరకు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఏడాది 91 మంది పదోతరగతి పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 483 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్లో 110 మంది ఉన్నారు. ప్రతి ఏటా వందశాతం ఉత్తీర్ణత -
టీజీపీఈసెట్కు సర్వం సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా డీపెడ్, డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న టీజీపీఈసెట్–2025 అర్హత పరీక్షకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పాలమూరు యూనివర్సిటీలో పరీక్షకు సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల నుంచి మొత్తం 2, 561 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈవెంట్స్ను బుధవారం ఉదయం 11గంటలకు రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం అర్హత పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు రాత్రి పీయూకు చేరుకోనున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బాలుర, బాలికలకు వేర్వేరు హాస్టల్స్లో వసతి ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను మంగళవారం పీయూ వీసీ శ్రీనివాస్, కన్వీనర్ దిలీప్ పీయూలోని సింథటిక్ ట్రాక్, పీజీ కళాశాల గ్రౌండ్, ఇండోర్ స్టేడియం పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు టీజీపీఈసెట్ పరీక్ష నిర్వహణకు అన్నిఏర్పాట్లు పూర్తి చేశాం. ఈవెంట్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీయూలో అథ్లెటిక్స్కి సింథటిక్స్ ట్రాక్ గ్రౌండ్, సాధారణ క్రీడలకు పీజీ కళాశాల గ్రౌండ్లో 11 కోట్లను ఏర్పాటు చేశాం. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు రాత్రికి ఉండేందుకు వివిధ హాస్టల్స్లో వసతి కల్పించాం. ఇప్పటికే హాల్టికెట్లను అభ్యర్థులకు జారీ చేశాం. అందులో సూచించిన తేదీలు, సమయం ఆధారంగా ఈవెంట్స్కు విద్యార్థులు రావాలి. – దిలీప్, టీజీపీఈసెట్ కన్వీనర్ నేటినుంచి పీయూలో పరీక్ష ఈవెంట్స్ నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా హాజరుకానున్న 2, 561 మంది విద్యార్థులు ప్రారంభించనున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పీయూలో ఏర్పాట్లను పరిశీలించినవీసీ శ్రీనివాస్, సెట్ కన్వీనర్ దిలీప్ -
కోనేరులో దూకి వ్యక్తి బలవన్మరణం
మాగనూర్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్ఐ మన్నన్ కథనం ప్రకారం.. మాగనూర్కు చెందిన వాకిటి పరశురాం(39) అదే గ్రామానికి చెందిన ముత్యమ్మతో 13 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో పరశురాం తాగుడుకు బానిసై భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తాగిన మైకంలో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకగా ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే స్థానిక లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కోనేరులో పరశురాం మృతదేహం గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పరశురాం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా బాలురు 100 మీటర్లు, 800 మీటర్లు రన్నింగ్, షార్ట్పుట్ 6 కేజీలు, లాంగ్జంప్ లేదా హైజంప్లో పాల్గొనాల్సి ఉంది. ఇక బాలికలకు సంబంధించి 100 మీటర్లు, 400 మీటర్లు, షార్ట్పుట్ 4 కే జీలు లాంగ్జంప్ లేదా హైజంప్లో పాల్గొనాలి. వీటికి సంబంధించి ఏర్పాట్లను ఇటీవల నిర్మించిన సింథటిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఇక ఆప్షన్ కింద విద్యార్థులు ఎంచుకునేందుకు ఉన్న గేమ్స్లో మొత్తం 11కోట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కబడ్డీ 5 కోట్లు, వాలీబాల్ 3, లాన్ టెన్నీస్ 1, ఖోఖో 3, బాస్కెట్బాల్ 1, బ్యాట్మెంటన్ 3, బాల్ బ్యాట్మెంటన్ 1, హ్యాండ్బాల్ 1, హాకీ 1, ఫుట్బాల్ 1, క్రికెట్లు 2 నెట్లను ఏర్పాటు చేశారు. మొదటిరోజు ఈవెంట్స్కు 760 మంది విద్యార్థులు హాజరుకాన్నునారు. -
బావిలో పడి మహిళ మృతి
బల్మూర్: బావిలో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని బాణాలలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ రాజేందర్, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇమ్మడి చిన్నమ్మ (45) మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుండేది. రెండ్రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వెదుగుతుండగా సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ పాడుబడ్డ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారుడు అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు మంగళవారం నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు. ఉరేసుకుని వ్యక్తి మృతి గోపాల్పేట: వ్యక్తి ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గోపాల్పేట ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుణమోని రేణుక, గుణమోని రాములు(40) భార్యాభర్తలు. మంగళవారం ఉదయం డబ్బుల విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాములు పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేలోపు మరణించడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి జడ్చర్ల: విద్యుదాఘాతానికి గురై ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని గోప్లాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కావేరమ్మపేటకు చెందిన వెంకటేశ్ యాదవ్ (45) టైల్స్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం గోప్లాపూర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో టైల్స్ పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైల్స్ వేసేందుకు వినియోగించిన యంత్రం వైర్ను ప్లగ్ తీయకుండా చుడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్ యాదవ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. వివాహిత బలవన్మరణం లింగాల: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వెంకటేష్గౌడ్ కథనం మేరకు.. మండలంలోని చెన్నంపల్లికి చెందిన వల్లెపు సుజాత (43) మండల కేంద్రం సమీపంలోని అప్పాయపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్దవాగులో శవమై కనిపించింది. ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. పెద్దవాగులో మృతదేహాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్త సలేశ్వరం పదేళ్ల కిందటే చనిపోగా.. అప్పులు చేసి పెద్దకుమార్తె పెళ్లి చేసిందని, పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలి, రెండో కుమార్తె పెళ్లి ఎలా చేయాలనే బెంగతో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య కొత్తకోట రూరల్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అప్పరాలలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్ కథనం మేరకు.. మండలంలోని పాలెం గ్రామానికి చెందిన సువర్ణకు అప్పరాలకు చెందిన సందెపాగ రవితో 22 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా.. ఇటీవల కుమార్తె వివా హం చేశారు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఓమారు సువర్ణ తల్లిగారింటికి వెళ్లింది. పెద్దమనుషులు ఆనంద్ను మందలించి సువర్ణను పంపించారు. ఈ నెల 8న గొడవ పడగా పురుగుమందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వనపర్తి ఏరియా ఆసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. అన్న మూలింటి రాములు ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి శాంతినగర్ : తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ కొడుకు మృతి చెందిన ఘటన స్థానిక రాఘవేంద్ర కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శాంతినగర్ రాఘవేంద్ర కాలనీలో ఉండే అమర్నాథ్ (53) తండ్రి గత నెలలో మరణించాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అమర్నాథ్ గత నెల 29న రాత్రి పొలం వద్ద గడ్డి మందు తాగి కూతురుకు ఫోన్చేసి విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన పొలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు బాధితడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
నాగర్కర్నూల్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టి జైలుకు తరలించడం అప్రజాస్వామికమైన చర్య అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు, ఫ్లకార్డులతో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. జర్నలిజంలో 50 ఏళ్ల అపార అనుభవం ఉన్న కొమ్మినేనిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని మండిపడ్డారు. టీవీ డిబేట్లో మాట్లాడే విశ్లేషకుల వ్యాఖ్యలను జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు ఆపాదించడం ఏమిటని ప్రశ్నించారు. పాత్రికేసులపై ఏదైనా చర్యలు తీసుకునేందుకు చట్టబద్ధ సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుందని, అక్రమ కేసులతో జైలులో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆక్షేపించారు. రాజకీయ కక్షలో భాగంగానే జర్నలిస్టులపై కేసులు, అరెస్ట్లకు పాల్పడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాదం వెంకటేశ్, కందికొండ మోహన్, బాదం పరమేశ్, కాణాపురం ప్రదీప్, శ్రీనుబాబు, మల్లేశ్, రామ్లక్ష్మణ్, వినయ్, శ్రీశైలం, సాధిక్ పాషా, పిన్నంశెట్టి సైదులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై నాగర్కర్నూల్లో జర్నలిస్టుల నిరసన -
యథేచ్ఛగా ఇసుక దందా
● రాత్రిపూట పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్ ● పట్టపగలు దర్జాగా పొక్లెయిన్లు, టిప్పర్లతో రవాణా ● వాహనాలను పట్టుకొని వదిలేసిన పోలీసులు అనుమతులు ఉన్నాయని వదిలేశాం బహార్పేటలో జేసీబీతో ఇసుకను టిప్పర్లో లోడ్ చేస్తున్న విషయంలో సమాచారం రాగానే ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించా. అనుమతి తీసుకొని మాగనూర్ నుంచి తెచ్చి ఇక్కడ నిల్వ చేసినట్లు రశీదులు చూపించారు. రవాణా చేయడం కుదరదని టిప్పర్లో లోడ్చేసిన ఇసుకను ఖాళీ చేయించి జేసీబీ, టిప్పర్ను వదిలేశాం. – బాలరాజు, ఎస్సై, కోస్గి కోస్గి: కొన్నిరోజులుగా కోస్గి పట్టణం అక్రమ ఇసుక దందాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. పట్టణంలోని బహార్పేట, సాయినగర్ కాలనీ, చెన్నారం రోడ్డు, సబ్స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి పూట ఇసుకను డంపింగ్ చేసి పగలు జేసీబీలతో టిప్పర్ల ద్వారా బహిరంగంగా విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం బహార్పేటలోని మహబూబ్నగర్–తాండూర్ ప్రధాన రహదారి పక్కనే నిల్వ చేసిన డంప్ నుంచి జేసీబీ, టిప్పర్ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. గతకొన్ని రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అటుగా వెళ్తున్న కొందరు యువకులు ప్రశ్నించగా హైదరాబాద్ వరకు అమ్ముకునేదుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులున్నాయని, అపడానికి మీరెవరంటూ ఇసుక మాఫీయా ఎదురు తిరగడంతో యువకులు స్థానిక విలేకర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుకొని వదిలేసిన పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. వాహనాలను స్టేషన్కు తరలించకుండా టిప్పర్ నుంచి ఇసుకను ఖాళీ చేయించి వాహనాలను వదిలేశారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తుండగా.. ఏకంగా ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలోనే ఇసుక అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది. అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో హద్దూ అదుపు లేకుండా పట్టపగలే జేసీబీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఇసుక మాఫీయా అందినంతా దండుకుంటుంది. అక్రమ దందాను అడ్డుకునేందుకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి వాహనాలను వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
వేధింపులు సరికాదు..
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం. రాజకీయ పార్టీలు జర్నలిస్టుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరించవద్దు. పార్టీలు ఐదేళ్ల పాలన కోసం వచ్చి జర్నలిస్టులను వేధించడం సరికాదు. రెడ్బుక్ రాజ్యాంగం అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలను అందరూ గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కొమ్మినేని అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. – వినోద్కుమార్, న్యాయవాది, మహబూబ్నగర్ ● -
ఎండీసీఏ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం
మహబూబ్నగర్ క్రీడలు: ఎండీసీఏ మైదానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో ఇటీవల నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలతో పాటు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బస్వరాజు మాట్లాడుతూ మహబూబ్నగర్లో పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హెచ్సీఏకు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మహబూబ్నగర్, నిజామాబాద్లో క్రికెట్ మైదానాలు ఉన్నట్లు తెలిపారు. మహిళలు క్రికెట్లో పాల్గొంటుండడం సంతోషంగా ఉందన్నారు. క్రికెట్లో ప్రతిభ కనబరిచే మహిళలకు రైల్వేస్ ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు. చదువుతో పాటు క్రికెట్ ఆడాలని కోరారు. ఇక్కడి మైదానంలో బీసీసీఐ మహిళ మ్యాచ్ పెడుతామని అన్నారు. జిల్లాలో రెండు క్రికెట్ అకాడమీలు లేదా 10 ఎకరాల్లో మరో క్రికెట్ స్టేడియం ఉండాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అపెక్స్ సమావేశంలో కూడా చర్చించినట్లు తెలిపారు. ఈ మైదానాన్ని అభివృద్ధి చేయడం తమవంతు బాధ్యత అని అన్నారు. ఈ మైదానంలో బీసీసీఐ, త్రీడే, టూడే లీగ్ మ్యాచ్లు జరిపిస్తామని అన్నారు. బీపీఎల్ కింద ఉన్న వారికి ఉచిత క్రికెట్ శిక్షణ అందజేస్తామన్నారు. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు దల్జిత్సింగ్ మాట్లాడుతూ మైదనాంలో అండర్–16 మ్యాచ్ నిర్వహిస్తామని అన్నారు. క్రికెట్లో క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లు నిర్వహించడం సంతోషంగా ఉందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్–23 టూడే లీగ్, 19తో పాటు మహబూబ్నగర్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిరుపేద క్రీడాకారులను గుర్తించి వారికి ఎండీసీఏ తరపున విద్యతోపాటు క్రికెట్లో కోచింగ్ అందజేస్తామని చెప్పారు. అనంతరం అండర్–23, అండర్–19 విభాగాల విన్నర్ జట్లు మహబూబ్నగర్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ రెడ్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, హెచ్సీఏ సభ్యులు శంకర్, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, ఆబెద్ హుస్సేన్, మహేష్, రంజిత్కుమార్, శంకర్ పాల్గొన్నారు. హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజు ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ విన్నర్ జట్లకు ట్రోఫీలు ప్రదానం ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో ఉత్తమ ప్రతిభ క్రీడాకారులు అండర్–23 విభాగంలో ఉత్తమ బ్యాట్స్మెన్ కేతన్కుమార్–జడ్చర్ల (473 పరుగులు), ఉత్తమ బౌలర్ ముఖితుద్దీన్–మహబూబ్నగర్ (33 వికెట్లు), అండర్–19లో ఉత్తమ బ్యాట్స్మెన్ అబ్దుల్ రాఫే–మహబూబ్నగర్ (495 పరుగులు), ఉత్తమ బౌలర్ జశ్వంత్–నాగర్కర్నూల్ (11 వికెట్లు), ఉమెన్స్ లీగ్లో ఉత్తమ బౌలర్ దివ్యరాథోడ్ (7 వికెట్లు), ఉత్తమ ఆల్రౌండర్ అనిత (59 పరుగులు, 4 వికెట్లు). -
నల్లమల అభయారణ్యంలో చిరుత
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో సఫారీ ప్రయాణికులకు మంగళవారం చిరుత పులి కనిపించింది. నిజాం బంగ్లా (సికార్ఘర్) సమీపంలోని కొత్త రోడ్డు నుంచి చిరుత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లడాన్ని సఫారీ వాహనం డ్రైవర్ గమనించి పర్యాటకులకు తెలియజేశారు. దీంతో సెల్ఫోన్లలో చిరుతను చిత్రీకరించుకున్నారు. అభయారణ్యంలో అతి సమీపంగా చిరుత పులి కనించడంతో సఫారీ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. సంజీవగుట్టపై చిరుత సంచారం మరికల్: మండలంలోని పూసల్పహాడ్ శివారు సంజీవ గుట్టపై మంగళవారం చిరుత సంచరించింది. దీంతో అటు వైపు రైతులు, గ్రామస్తులు వెళ్లాలంటనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సంజీవ గుట్టపై గత ఐదేళ్ల నుంచి చిరుత సంచరించడంతో పశువులను బలి తీసుకుందని రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బందించాలని కోరుతున్నారు. -
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయాలని ఎంపీ వినతి
పాలమూరు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులపై మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ వినతి పత్రం అందించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుందన్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ పనులపై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,256 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిమార్కెట్కు మంగళవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,256, కనిష్టంగా రూ.1,301 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,257, కనిష్టంగా రూ.6,247, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,838, కనిష్టంగా రూ.1,621, ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,605 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,100 ఒకే ధర లభించింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు బుధవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. -
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి: ఎస్పీ
జడ్చర్ల: మహిళా పోలీసులు విధుల నిర్వహణలో మరింత చిత్తశుద్ధి, నిబద్ధత కనబరిచి అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. మంగళవారం జడ్చర్ల శివారులోని పోలీసు శిక్షణకేంద్రంలో మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుశాఖలో విధులు, బాధ్యతలు, ప్రవర్తన నియమావళి, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. శిక్షణ దశ నుంచే ఉత్తమ సేవ ధ్యేయంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో బాధ్యతగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఎక్కడా ఆరోపణలకు, విమర్శలకు తావివ్వకుండా పారదర్శకంగా బాధితుల తరఫున నిలబడాలని సూచించారు. మహిళా సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిబాబు, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆర్ఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు ప్రత్యేక డ్రైవ్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ నెల 11, 12 తేదీల్లో బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు కార్మికశాఖ, పోలీస్ సంబంధిత శాఖలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో బాలకార్మికులు, కౌమార దశ బాల కార్మికులపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీస్, కార్మిక శాఖ, బాలల సంరక్షణాధికారి, ఎన్జీఓలు ఇతర శాఖలతో మూడు బృందాలు ఏర్పాటు చేసి బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలో 14 ఏళ్ల లోపు బాల కార్మికులు, 14–18 ఏళ్ల వయసు ఉన్న కౌమార దశ బాలలు హాట్ స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్లు, ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, హోటళ్లలో వలస కుటుంబాలకు చెందిన బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారని, సంబంధిత యజమానులపై బాల, కౌమార బాల కార్మికుల చట్టం ప్రకారం వివిధ సెక్షన్ల కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని తెలిపారు. బాల కార్మికులను రక్షించి స్టేట్ హోంలో అప్పగించి వారికి కౌన్సెలింగ్ విద్య, వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. వలస కుటుంబాలు పని చేస్తున్న ప్రదేశాలలో వారి పిల్లలకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందించాలని సూచించారు. 1098 చైల్డ్ లైన్కు కూడా సమాచారం అందించాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీఆర్డిఓ నర్సింహులు, డీఏఓ వెంకటేశ్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులకు పునరావాసంకల్పించాలి కలెక్టర్ విజయేందిర బోయి -
నీలినీడలు
మహబూబ్నగర్బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025● పాలమూరులోనిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగానష్టపోతున్న మత్స్యకారులు న్యూస్రీల్ ‘మీన’మేషాలు -
6 రోజుల్లో 29 దరఖాస్తులు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ముసాయిదా ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాల దరఖాస్తుల స్వీకరణకు గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు 29 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో ఆయా డివిజన్ల సరిహద్దులను నక్షాలతో సరిచూసుకుంటున్న ప్రత్యేక బృందం తాజాగా 33 నుంచి 42వ డివిజన్ వరకు వెళ్లొచ్చింది. ఎక్కడికక్కడే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి సవరించిన ఓటరు జాబితాను ముందుంచుకున్నారు. కొత్తగా ప్రతిపాదించిన డివిజన్ల పరిధిలో ఇంటి నంబర్ల ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓటర్లు ఉన్నారో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వారి పేర్లను పోలింగ్ కేంద్రం వారీగా విభజిస్తున్నారు. పారదర్శకంగా చేపట్టాలి: బీజేపీ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర రహదారులతో పాటు రైల్వేలైన్ విభజించకుండా అంతర్గత ప్రధాన రోడ్లను ఆధారంగా చేసుకొని జరగాలన్నారు. ముఖ్యంగా ఏ డివిజన్లో ఉన్న ఓటర్లు అదే డివిజన్లో వచ్చేలా చూడాలన్నారు. గతంలో ఓటరు ఒక వార్డులో ఉంటే ఓటు మాత్రం వివిధ చోట్ల ఉండేదన్నారు. ఇప్పుడు అలా జరగకుండా, ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేకుండా విభజించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు పద్మజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు రామాంజనేయులు, ఎ.అంజయ్య, జిల్లా నాయకులు నారాయణ, దర్పల్లి హరికృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు. స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు కొనసాగుతున్న డివిజన్ల విభజన ప్రక్రియ -
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, నాగర్కర్నూల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచవ్యాప్తం అయిందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కులంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని వివరించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి ఘటనను పాక్ ప్రధానే ఒప్పుకున్నా.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరమన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్ప్రసాద్, ప్రమోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు నాగర్కర్నూల్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు -
కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం
స్టేషన్ మహబూబ్నగర్: కార్మికుల హక్కుల సాధన కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో మంగళవారం ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డాక్టర్ సంజీవరెడ్డి నాయకత్వంలో ఐఎన్టీయూసీ అంచలంచెలుగా ఎదిగి ఈ రోజు పెద్ద సంఘంగా ఏర్పడినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సెక్టార్లలో, అసంఘటితరంగ సెక్టర్లలో, బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ రంగాలతోపాటు అనేక ఫ్యాక్టరీలలో అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకొని బలమైన సంఘంగా మారిందన్నారు. అనంతరం జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములుయాదవ్, ఉపాధ్యక్షులుగా కావలి శ్రీనయ్య, దమ్మాయిపల్లి శ్రీనివాసులు, ఎండీ అలీం, రాంనాయక్, హాజీ, బలరాం, ప్రధాన కార్యదర్శిగా రాంమోహన్, కోశాధికారిగా విజయబాబు, ప్రచార కార్యదర్శిగా శర్వ లింగం, సలహాదారులుగా ఎస్.సాయిరెడ్డి, కొండ పురుషోత్తం, సహాయ కార్యదర్శులుగా సాయిబాబా, టి.నర్సింలు, బాబుమియాలను ఎన్నుకున్నారు. అనంతరం ఐఎన్టీయూసీకి సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర నాయకులు వి.భాస్కర్రెడ్డి, బోరింగ్ శ్రీనివాసులు, బాలయ్య, పర్వతాజు, లక్ష్మణ్తోపాటు జిల్లా నాయకులు ఆవిష్కరించారు. -
నేటినుంచి.. అమ్మ మాట– అంగన్వాడీ బాట
మహబూబ్నగర్ రూరల్: జిల్లాలో ‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం సూచించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలను గ్రామ పంచాయతీ కమ్యూనిటీ సహకారంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సెల్ఫీ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడానికి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమంలో కేంద్రాలను, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. మదర్ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కలిసి ప్రతి గ్రామంలో ర్యాలీలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల సేవలను వివరించాలని చెప్పారు. రోజువారీ కార్యక్రమాలు ఇలా.. 10న అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించడం, తల్లిదండ్రులు, పిల్లలను స్వాగతించి సెల్ఫీ తీసుకొని ప్రోత్సహించడం, ప్రతి గ్రామ మహిళా సంఘాల సభ్యులు, ఏయే గ్రామ ప్రజలతో ఎన్నుకొనబడిన గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించాలి. 11న సంవత్సరాల పిల్లలను టీచర్లు గుర్తించి, ఆ పిల్లల ఇంటిని సందర్శించడం, తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రంలో అడ్మిషన్స్ గురించి ఫ్రీ స్కూల్, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పిల్లలను నమోదు చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇందులో ఫ్రీ స్కూల్ విద్య అయిపోయిన వారికి సర్టిఫికెట్స్ అందించాలి. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి. 12, 13, 16 తేదీల్లో పోషణ్ పట్టిక, కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయడం, లబ్ధిదారులకు ఆహార పోషకాల గురించి వివరించాలి. 17న పూర్వ ప్రాథమిక విద్య గురించి, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వారంరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ -
ప్రజావాణికి 96 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను తిప్పుకోకుండా ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్రప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 25.. మహబూబ్నగర్ క్రైం: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిష్కరించాల ని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న 25 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యా దులు స్వీకరించారు. పోలీస్ సేవలను ప్రజల కు మరింత చేరువ చేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని సమీక్షించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. డీసీసీబీ విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గం మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ఎన్నికయ్యారు. ఈ మేరకు స్థానిక డీసీసీబీ ఆడిటోరియంలో సోమ వారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా రాంమోహన్, అబ్దుల్ వాసిక్, కార్యదర్శిగా రాములు, సహాయ కార్యదర్శిగా యాదగిరి, కోశాధికారిగా కుబేరుడు, కార్యవర్గ సభ్యులుగా సుధాకర్రెడ్డి, ఓఎన్ మూర్తి, సత్యనారాయణ, రాములు, చంద్రశేఖర్రెడ్డి, వెంకటరమణచారి, బాపయ్య, భీమయ్య, జగన్నాథ్గౌడ్లను ఎన్నుకున్నా రు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ ఎయిడ్ కోసం రూ.5 వేలను గ్రాంట్ చేసినందుకు డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డికి విశ్రాంత ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాసీ్త్రయంగానే డివిజన్ల విభజన ముసాయిదా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నిబంధనల మేరకు శాసీ్త్రయంగానే డివిజన్ల ముసాయిదాను తయారు చేశామని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. గత జనవరి 27 నుంచి మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిందన్నారు. గతంలో ఉన్న 49 వార్డులతోపాటు దివిటిపల్లి, జైనల్లీపూర్ విలీనం కావడంతో ప్రస్తుతం 60 డివిజన్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం నగరంలో ప్రస్తుతం 1,96,602 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఒక్కో డివిజన్లో సరాసరిగా 3,200 మంది ఓటర్లు ఉండేలా విభజన ముసాయిదాలో పొందుపరిచామన్నారు. జీఓ 12లో సూచించిన మేరకు ఆయా డివిజన్ల నక్షాలతోపాటు హద్దులను రూపొందించామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 5న దినపత్రికలలో ముసాయిదాకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అలాగే తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచామన్నారు. వీటిపై ఏమైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలుంటే ఈ నెల 11లోగా లిఖిత పూర్వకంగా నేరుగా అందజేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఆరు దరఖాస్తులు వచ్చాయని, గడువులోగా ఇంకేమైనా వస్తే అన్నింటినీ ఈ నెల 12 నుంచి 16 వరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో హద్దులు సరిగా.. ఉన్నాయో లేదో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం బృందం సరిచూస్తోందన్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని, 21న తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. సమావేశంలో ఏసీపీ కరుణాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
నవాబుపేట: బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలని, అలాగే బాలికలు మధ్యలో డ్రాపౌట్ కాకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆర్జేడీ విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని ఆమె డీఈఓ ప్రవీణ్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల కారణాలు చెప్పి వలస వెళ్లిన వారంతా ఎక్కడో ఒకచోట విధిగా బడిలో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు సిద్ధం చేయాలని, మహిళా సంఘాలు క్లస్టర్ల వారిగా వాటిని ఏర్పాటు చేసి పాఠశాలలకు అందించాలన్నారు. గ్రామాల్లో ఉపాధ్యాయ, సిబ్బంది బడిబాటను మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంపై ప్రతిరోజు రాష్ట్ర, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నవాబుపేటలో గతేడాది బడి మానేసిన బాలిక అనూషను తల్లిదండ్రులతో మాట్లాడి బడిలో చేర్పించారు. అలాగే కేజీబీవీ విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫాంలను ప్రిన్సిపల్కు అందజేశారు. అనంతరం నవాబుపేటలో అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట ప్ర తిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీఎంఓ బాలునాయక్, ఎంపీడీఓ జయరాంనాయక్, ఎంఈఓ నాగ్యనాయక్, సీఆర్పీ జనార్దన్, కేజీవీవీ ప్రత్యేకాధికారి మాధవి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా టీజీపీఈసెట్ నిర్వహణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీపెడ్, డీపెడ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీపీఈ సెట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పీయూ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం పీయూకు మొదటిసారి అప్పగించిందని, దీనిని విజయవంతంగా నిర్వహిస్తే భవిష్యత్లో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు పీయూలో నిర్వహించే ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 11న ఉదయం 7 గంటలకు ఈవెంట్స్ను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి హాజరై ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,700 సీట్లు ఉండగా.. 2,557 మంది దరఖాస్తు చేశారన్నారు. ఇందులో 1,496 మంది బాలురు కాగా.. 1,061 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈవెంట్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని, వాటి ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థులు ఈవెంట్స్కు హాజరుకావాలని కోరారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, సెట్ కన్వీనర్ దిలీప్, పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, పీఆర్వో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా శక్తిని వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఇందిర మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టు పనులు వేగంగా జరిగాయని, దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 12న పాఠశాల పునఃప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణంలో పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో త్వరలో 1000 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించనున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మహిళా సంఘాల ద్వారా రైస్మిల్స్, సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపన, ఆర్టీసీకి అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాల కోసం మహిళలు పోయే దుస్థితి రాకుండా, జిల్లాలో పూర్తిస్థాయిలో నూతన మహిళా సంఘాలను తయారు చేసి మహిళలను చేర్పించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పూర్తిచేయాలన్నారు. సీఎస్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ వందశాతం పిల్లలు బడుల్లో నమోదు కలిగి ఉండాలన్నారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఆర్డీఓ నర్సింహులు, డీఈఓ ప్రవీణ్కుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖాధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీలో మనోళ్లు
● ఉమ్మడి పాలమూరు నుంచి ఆరుగురికి చోటు ● ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ● ప్రధాన కార్యదర్శులుగా ‘పేట’ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితోపాటు మరో నలుగురు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామక జాబితాను సోమవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నాయకులకు చోటు దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ఐదుగురు ప్రధాన కార్యదర్శులుగా ఉండగా.. ఈసారి ఆరుగురికి కార్యవర్గంలో చోటు కల్పించారు. కార్యవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని ఎంపిక చేయగా వీరిలో ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 69 మందితో జాబితా ప్రకటించగా ఉమ్మడి జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఎం.రాజీవ్రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన నందిమల్ల యాదయ్య ముదిరాజ్లను ఎంపిక చేశారు. వీరిలో సంజీవ్ ముదిరాజ్ ప్రస్తుత కార్యవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా మళ్లీ అదే పదవిని కట్టబెట్టారు. కార్యకర్తల్లో హుషారు టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు నింపింది. ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించగా.. టీపీసీసీ కార్యవ ర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు నాయకులకు చోటు దక్కడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక? టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరో వారంలో రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
‘ఇథనాల్’ అనుమతులు రద్దు చేయాలి
గద్వాల క్రైం: పచ్చని పల్లెలను కాలుష్యమయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీపీఎం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో పార్టీ శ్రేణులతో కలిసి రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామ సందర్శనకు సిద్ధమయ్యారు. అయితే సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్, పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును జాన్వెస్లీ తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్స్టేషన్ ఆవరణలోనే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తినని చెప్పే సీఎం రేవంత్రెడ్డి పాలన ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందన్నారు. పచ్చని పల్లెలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, కూలీలు జీవన మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 11 గ్రామాల ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేపడితే.. ఫ్యాక్టరీ నిర్వాహకులు బయటి వ్యక్తులతో దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బయటి వ్యక్తుల దాడులను ప్రతిఘటించిన రైతులు, ప్రజలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలో లేని వ్యక్తులపై రాజకీయ జోక్యంతో కేసులు నమోదు చేయడం చూస్తుంటే, వ్యూహాత్మకమైన కుట్ర జరిగిందని చెప్పవచ్చన్నారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం ప్రజలు నిలదీస్తే.. అధికారం అడ్డుపెట్టుకుని రైతులపై బూటకపు కేసులు నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలే తప్ప.. స్వలాభాలు, వారి ఏజెండాల కోసం పనిచేయడం దుర్మార్గమైన చర్యన్నారు. శ్రామిక, కర్షక, కూలీలు, ప్రజలకు సీపీఎం అండగా నిలబడి పోరాడుతుందన్నారు. అరెస్టయిన వారిలో సీపీఎం నాయకులు శ్రీరాంనాయక్, వెంకటస్వామి, నాగర్దొడ్డి వెంకట్రాములు, ఈదన్న, రాజు, నర్సింహ తదితరులు ఉన్నారు. కేంద్రం సమాధానం చెప్పాలి గద్వాల టౌన్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్– పాక్ మధ్య నెలకొన్న యుద్ధం తన చొరవతోనే ఆగిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. భారతదేశ విదేశాంగ విధానంలో అమెరికా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. భారత్ జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలకు గల కారణాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో అట్టడుగు కులాలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు నింపి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని, ప్రజాస్వామ్య శక్తుల బలోపేతంతోనే విద్వేశ రాజకీయాలకు చరమగీతం పాడగలమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆర్థిక పరిస్థితి పేరుతో వెనకడుగు వేయడం సరికాదన్నారు. గద్వాల జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పేదలపై పెత్తనం చెలాయిస్తున్న బంగ్లా రాజకీయాలకు వ్యతిరేకంగా అట్టడుగు కులాలు ఐక్యమై ప్రజా పోరాటాల ద్వారా వారిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రైతులపై కేసులు ఎత్తివేయాలి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్: జోగుళాంబ, బాలబహ్వ్రేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేద్దామని ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం ఆలయంలో జరిగిన ధర్మకర్తల కార్యవర్గ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆలయాల ప్రాంగణంలో సీసీ రహదారుల పనులు పునః ప్రారంభించాలని, గోశాలలో ఆవుల సంఖ్య పెరగడం.. సిబ్బంది కొరతతో నిర్వహణ భారంగా మారిందని.. కొన్నింటిని ఇతర గోశాలలకు విక్రయించడం లేదా తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన వివిధ టెండర్ల బకాయిలు త్వరగా వసూలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. వీటితోపాటు ఆదాయ వ్యయాలు, వెండి, బంగారు ఆభరణాలు, ఆలయ భూముల వివరాలను పరిశీలించారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అలంపూర్ ఆలయాల అభివృద్ధి హైలేవల్ కమిటీ సమావేశం ఉంటుందని ఈఓ పురేందర్కుమార్ చెప్పారు. సమావేశం ప్రసాద్ స్కీం భవనంలో కొనసాగనుండగా.. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశ నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షలో చర్చించారు. సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు నాగ శిరోమణి, గోపాల్, జగదీశ్వర్గౌడ్, అడ్డాకుల వెంకటేశ్వర్లు, విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, జయరాముడు తదితరులు పాల్గొన్నారు. -
చోరీలకు పాల్పడిన నిందితుల రిమాండ్
మక్తల్: తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య పేర్కొన్నారు. సోమవారం మక్తల్లో పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మక్తల్ మండలంలోని జక్లేర్కు చెందిన సుభమ్ విష్టువర్ధన్రెడ్డి నవంబర్ 11వ తేదీన ఇంటి తాళాలు విరగ్గొట్టి చోరీ చోటుచేసుకున్న ఘటనపై ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ యోగేశ్గౌతమ్ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సోమవారం నారాయణపేట క్రాసింగ్ వద్ద తనిఖీలు చేపడుతుండగా.. పోలీసులను చూసి పారిపోతున్న ఎండీ గౌస్, హన్మంతును మక్తల్ పోలీసులు పట్టుకొని విచారించారు. కర్ణాటకలోని సింధనూర్కు చెందిన ఎండీ గౌస్, రాయిచూర్లోని దేవదుర్గకు చెందిన హన్మంతుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు తాళాలు వేసిన ఇండ్లనే టారెట్ చేయడం చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకొన్నారు. వారినుంచి 5తులాల బంగారం రికవరీ చేశామని, సుమారు రూ.4లక్షల50వేలు ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీ కేసుల్లో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి, కృష్ణ ఎస్సై నవీద్, క్రైమ్ పోలీసులు అశోక్, శ్రీకాంత్, నరేశ్, శశి పనితీరును డీఎస్పీ అభినందించారు. పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. 5తులాల బంగారం రికవరీ నారాయణపేట డీఎస్పీ లింగయ్య -
ఉత్సాహంగా మహిళా క్రికెట్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ లీగ్ అండర్– 25 జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో ఎండీసీఏ ఉమెన్స్ రెడ్ టీం 53 పరుగుల తేడాతో ఎండీసీఏ ఉమెన్స్ బ్లూ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రెడ్టీం నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కెప్టెన్ అనిత ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. 45 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయడంతోపాటు రెండు వికెట్లు తీసి రెడ్ టీం గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఇతర క్రీడాకారిణులు అక్షర 43, ప్రతీక 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బ్లూ టీమ్ జట్టు 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జట్టులో ప్రవళిక 24, స్రవంతి 21 పరుగులు చేశారు. రెడ్ జట్టు బౌలర్లు మహేశ్వరి 5 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 4, సింధూజ 2 వికెట్లు తీశారు. 43 పరుగుల తేడాతో.. రెండో లీగ్ మ్యాచ్లో బ్లూ జట్టు 43 పరుగుల తేడాతో పింక్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బ్లూ జట్టు నిర్ణీత 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. జట్టులో కరీనా 34, ఆర్.స్వాతి 28, మంజుల 23 పరుగులు చేశారు. పింక్ జట్టు బౌలర్లు మేఘనాగౌడ్ 2, త్రివేణి, కవిత చెరో వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పింక్ జట్టు బ్లూ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 19.1 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో పవిత్ర 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. బ్లూ జట్టు బౌలర్ దివ్య రాథోడ్ 4.1 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా ప్రవళిక 2, నిర్మల, స్వాతి, తేజశ్రీ చెరో వికెట్ తీశారు. భారత జట్టుకు ఆడాలి జిల్లా క్రీడాకారిణులు క్రికెట్లో మెరుగైన ప్రతిభ కనబరిచి భారత జట్టుకు ఆడాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ వి.మనోహర్రెడ్డి అన్నారు. సమర్థ స్కూల్ మైదానంలో ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ను ప్రారంభించారు. క్రీడాకారిణులను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రికెట్లో మహిళలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ క్రికెట్లో క్రీడాకారిణులు తమ ప్రతిభచాటాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారిణులను క్రికెట్లో ప్రోత్సహించడం కోసం మొదటిసారిగా ఉమెన్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ నిర్వహిస్తున్నందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలిపారు. లీగ్లో రాణించే క్రీడాకారిణులను త్వరలో హెచ్సీఏ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో సమర్థ స్కూల్ డైరెక్టర్ యాదయ్యగుప్తా, ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ఆబెద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు రెడ్, బ్లూ జట్ల గెలుపు పోటీలను ప్రారంభించిన ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి -
అన్నదమ్ముళ్లను మింగిన పాంపాండ్
అచ్చంపేట రూరల్: తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పొలానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ముళ్లను పాంపాండ్ (నీటి గుంత) రూపంలో మృత్యువు వెంటాడింది. కళ్లెదుట ఆడుకుంటూ కనిపించిన చిన్నారులు క్షణ కాలంలోనే విడతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటింది. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మన్పల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల వివరాల మేరకు.. బొమ్మన్పల్లికి చెందిన కుంభం సుధాకర్ – ధరణి దంపతులకు ఇద్దరు కుమారులు అక్షిత్(8), చేతన్ (6) ఉన్నారు. తమకు ఉన్న వ్యవసాయ పొలంలో సోమవారం పత్తి విత్తనాలు విత్తడానికి సిద్ధమయ్యారు. తమతో పాటు ఇద్దరు కుమారులను పొలానికి తీసుకెళ్లారు. పొలంలో తల్లిదండ్రులు పత్తి విత్తనాలు విత్తడంలో నిమగ్నం కాగా.. ఇద్దరు చిన్నారులు అక్కడే ఆడుకుంటూ సమీపంలో ఉన్న పాంపాండ్ వద్దకు వెళ్లారు. మొదట చేతన్ కాలుజారి నీటిగుంతలో పడిపోగా.. తమ్ముడిని బయటకు తీసుకొద్దామనే క్రమంలో అన్న అక్షిత్ అందులో పడిపోయాడు. ఇద్దరు నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందారు. అయితే తల్లిదండ్రులకు తమ కుమారులు కనిపించక పోవడంతో కేకలు వేశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి పాంపాండ్లోకి దూకి చూశారు. అందులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కళ్లెదుటే ఆడుకుంటున్న ఇద్దరు కుమారులు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు చిన్నారుల మృతితో బొమ్మన్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. అచ్చంపేట మండలం బొమ్మన్పల్లిలో విషాదం -
కుంటలో పడి వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: కుంటలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం పెద్దకారుపాములలో చోటుచేసుకున్నది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లలింగస్వామి(37) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గ్రామంలోని ఈదోనికుంటలో పడిమృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు కుంటలో గాలించగా.. అప్పటికే మృతిచెందగా.. మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి భార్య నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. టిప్పర్ ఢీకొని వృద్ధుడి దుర్మరణంమిడ్జిల్: మిడ్జిల్–కొత్తూర్ రోడ్డుకు మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని మిడ్జిల్కు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై శివనాగేశ్వర్నాయుడు కథనం ప్రకారం.. మిడ్జిల్కు చెందిన మైసయ్య(65) సోమవారం ఉదయం కేఎల్ఐ కాల్వ సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్తున్నాడు. మిడ్జిల్–కొత్తూర్ రోడ్డుకు మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో మైసయ్య తీవ్రగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వృద్ధుడిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి బల్మూర్: పాత కక్షలతో తండ్రి, కుమారుడు కలిసి ఓ వృద్ధుడిపై దాడి చేయగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అచ్చంపేట సీఐ నాగరాజు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కమ్మరి రేణయ్య (72)ను అదే గ్రామానికి చెందిన బోయ ఎర్ర య్య, అతడి కుమారుడు శివ కలిసి పాత కక్షలతో ఆదివారం ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో అచ్చంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం చూడగా మృతిచెంది ఉన్నాడని.. సోదరుడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. రేణయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందినట్లు తెలిపారు. వ్యక్తి బలవన్మరణం జడ్చర్ల: పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న మహేశ్ కన్నారెడ్డి (30) ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లికి చెందిన మహేశ్ కన్నారెడ్డి జడ్చర్లలోని సాయినగర్లో నివాసం ఉంటూ జిమ్ నిర్వహిస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య తగాదాలతో మనస్థాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి టవల్తో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గుర్తించిన భార్య టవల్ను లైటర్తో కాల్చి కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేశ్ కన్నారెడ్డి తండ్రి మంద శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. యువతిపై అత్యాచారం.. కేసు నమోదు నవాబుపేట: మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన 19 ఏళ్ల యువతిపై అదే తండాకు చెందిన ప్రేమ్కుమార్నాయక్ అత్యాచారం చేయగా కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. సోమవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు వివరించారు. ప్రేమ్కుమార్నాయక్ గిరిజన సంఘంలో జిల్లాస్థాయి హోదాలో ఉండటంతో పాటు అధికారపార్టీ నాయకుడని.. అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య వనపర్తి రూరల్: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ జలేందర్రెడ్డి వివరాల మేరకు.. పెద్దగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు (40 వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే వాడు. అతడి భార్య వెంకటమ్మ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. నాటి నుంచి అతడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన అతడు.. తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన స్థానికులు తాడును తొలగించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు కుమ్మరి తరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సినీఫక్కీలో నగదు చోరీ
కొత్తకోట రూరల్: బ్యాంకులో సీసీ కెమెరాల మధ్యన క్యాష్ కౌంటర్ నుంచి రూ.లక్ష నగదు డ్రా చేసుకొని జేబులో పెట్టుకున్న ఓ వ్యక్తి నుంచి గుర్తుతెలియని వ్యక్తి సినీఫక్కీలో అపహరించిన ఘటన సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోట యూనియన్ బ్యాంకులో చోటుచేసుకున్నదని సీఐ సీఐ రాంబాబు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం కన్మనూర్కు చెందిన మోడల శ్రీనివా సులు ఏడాది క్రితం కొత్తకోటలోని యూనియన్ బ్యాంకులో గోల్డ్లోన్ రూ.2లక్షలు తీసుకున్నాడు. రెన్యూవల్ చేసేందుకు వచ్చి రూ.2లక్షలు చెల్లించాడు. అనంతరం మళ్లీ గోల్డ్లోన్ రూ.లక్ష క్యాష్ కౌంటర్ నుంచి డ్రా చేసి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కౌంటర్ నుంచి పక్కకు వచ్చి 5 నిమిషాల తర్వాత జేబులో చూసుకోగా.. డబ్బులు లేకపోవడంతో బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ రాంబాబు సిబ్బందితో బ్యాంకు దగ్గరకు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాంకులో సైరన్ పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంకులో సీసీ కెమెరాలు తక్కువగా ఉండడంతో దొంగను పట్టుకునేందుకు కాస్త ఇబ్బందిగా ఉందని, బ్యాంకులో సీసీ కెమెరాల సంఖ్య పెంచాలని మేనేజర్కు సూచించారు. బ్యాంకు సీసీ కెమెరాలతోపాటు చుట్టుపక్కల కెమెరాల్లో దొంగ వివరాలను పరిశీలిస్తున్నామని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. బ్యాంకులో వ్యక్తి నుంచి రూ.లక్ష కొట్టేసిన అగంతకుడు గోల్డ్లోన్ రెన్యూవల్ చేసి బయటికొచ్చి చూసి కంగుతిన్న బాధితుడు -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
అమరచింత: ఏళ్ల తరబడి భవనం అద్దె ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.. బకాయిలు చెల్లించే వరకు తాళం తెరవనంటూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి యాజమాని మహంకాళి సురేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సురేందర్ ఇంటిని ప్రతి నెల అద్దె రూ.10 వేలకు తీసుకొని ఎంపీడీఓ కార్యాలయం కొనసాగిస్తున్నారు. గతంలో బకాయి ఉన్న అద్దె మొత్తానికి రూ.3 లక్షల చెక్కును ఎంపీడీఓ అందించారు. ఎస్టీఓకు పంపినా డబ్బులు మాత్రం నేటికీ చేతికందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బకాయిలతో పాటు ప్రస్తుతం చెల్లించాల్సిన 5 నెలల అద్దె ఇచ్చేవరకు కార్యాలయానికి వేసిన తాళం తీయనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఎంపీడీఓ చెన్నమ్మతో సహా సిబ్బంది కార్యాలయం బయటే ఉండిపోయారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవించగా వారి ఆదేశాల మేరకు పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల గదుల్లోకి మార్చేందుకు సిద్ధమై సామగ్రి, రికార్డులను తరలించారు. మంగళవారం నుంచి అక్కడే కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఎంపీడీఓ వివరించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదుల్లోకి ఎంపీడీఓ కార్యాలయం మార్చాలని గతంలో కలెక్టర్ సూచించడంతో అందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టారు. ● అద్దె చెల్లించనందుకు తెరవని యజమాని ● ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉర్దూ మీడియం పాఠశాలలోకి మార్పు -
చదువుతోనే బంగారు భవిష్యత్కు బాటలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ముదిరాజ్ బిడ్డలు బాగా చదువుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో పదో తరగతిలో ఏ–గ్రేడ్ సాధించిన ముదిరాజ్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో ముందంజ వేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించి అత్యధిక జనాభా ముదిరాజులదే అని గణాంకాలతో నిరూపించింది అని పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు చైర్మన్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అద్యక్షుడు జగన్మోహన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య దర్శి సంజీవ్, జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అఽ ద్యక్షుడు నారాయణ, నాయకులు పుష్పలత, శ్రీనివాస్, మనోహర్, బాలప్ప, పరమేశ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జాడలేని వరుణుడు
తొలకరి వర్షాలకు విత్తనాలు నాటిన రైతులు ●జూలై 20 వరకు.. ఈ నెలలో సుమారు 60 మి.మీ., నుంచి 70 మి.మీ., వరకు వర్షపాతం నమోదైన పడిన తర్వాతే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అప్పుడు విత్తనాలు నాటితే మంచి మొలకలు వస్తాయి. జూన్ 15 నుంచి జూలై 15 వరకు పత్తి విత్తనాలు వేసుకునేందుకు సమయం ఉంది. జూలై 20 వరకు కూడా వేసుకోవచ్చు. రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు నాటుకోవాలి. నాణ్యమైన వాటిని కొనుగోలు చేయాలి. అలాగే రశీదులు, విత్తన పాకెట్ కవర్లను రైతులు భద్రపరుచుకోవాలి. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మహబూబ్నగర్ రూరల్ మండలం పోతన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల నరేష్ 12 రోజుల క్రితం తన రెండెకరాల పొలంలో పత్తి విత్తనాలు నాటాడు. ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు వాడుముఖం పట్టడంతో బోరుబావి ద్వారా ిస్ప్రింక్లర్లు నీటి తడులు అందిస్తూ మొక్కలను కాపాడుకుంటున్నాడు. ఒకవేళ సొంతంగా బోరుబావి లేకుంటే పత్తి మొలకలు ఎండిపోయి.. తీవ్రనష్టం వాటిల్లేదని రైతు చెప్పుకొచ్చాడు. మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో వర్షాధార పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందస్తుగా మురిపించిన వరుణుడు ప్రస్తుతం ముఖం చాటేశాడు. ఈ ఏడాది రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోకి నైరుతి పవనాలు ముందుగానే ప్రవేశించడంతో తొలకరి జల్లులు పడ్డాయి. వారం రోజులపాటు వానలు విస్తారంగా కురవడంతో రైతన్నలు పొలంబాట పట్టారు. దుక్కులు దున్ని.. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోగా.. కొందరు పత్తి విత్తనాలు నాటారు. విత్తనాలు మొలకెత్తే దశలో ఉండగా.. వరుణుడు ముఖం చాటేయడంతో నీరు అందక.. మొలకలను భూమిపై మొలిపించుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా వాన జాడ లేకపోవడంతో రైతులకు ఆదిలోనే కష్టాలు ఆరంభమయ్యాయి. ఎండలు భగ్గుమంటుండటంతో.. మొలకలు వాడిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. చినుకు.. చింత ఎండలు, వడగాలులతో వాడుబడుతున్న మొక్కలు పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అష్టకష్టాలు నాలుగైదు రోజుల్లో వర్షం రాకపోతే తీవ్రనష్టమే.. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతాంగం -
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు. -
అజిలాపూర్ లిఫ్ట్కు గ్రీన్సిగ్నల్
●కష్టాలు తీరుతాయి.. కోయిల్సాగర్ ప్రాజెక్టు మా ఊరి పొలాలకు ఆనుకొని ఉన్నా చుక్క నీరు అందని పరిస్థితి. దీంతో ఇక్కడి భూములు బీడుగా మారాయి. గత పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అజిలాపూర్ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది. లిఫ్ట్ పనులు పూర్తయితే మాకు సాగునీటి కష్టాలు తీరుతాయి. – రాజుగౌడ్, రైతు, అజిలాపూర్ వ్యవసాయం చేసుకుంటా.. నాకు ఆరెకరాల భూమి ఉన్నప్పటికీ సాగునీరు లేక వ్యవసాయం చేయడం లేదు. సాగునీటి కోసం కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నా. రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పనులు త్వరగా పూర్తిచేసి సాగునీరు అందిస్తే సంతోషంగా వ్యవసాయం చేసుకుంటా. – తిరుమలయ్య, రైతు, అజిలాపూర్ ఇచ్చిన మాట కోసం.. కోయిల్సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికీ సాగునీరు అందక 6 గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు దిగువ వైపు పొలాలు ఉన్న రైతులు సాగు చేసుకుంటే.. ఎగువ వైపు ఉన్న రైతులకు సాగునీరు అందక వలసలు పోతున్నారు. రైతులందరికీ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అజిలాపూర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం. పనులు వేగంగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తాం. – మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర దేవరకద్ర రూరల్: కోయిల్సాగర్ ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ వేలాది ఎకరాలకు చుక్కనీరు అందడం లేదు. ఎత్తయిన ప్రదేశంలో పొలాలు ఉండటమే ఇందుకు కారణం. దీంతో వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. తమ భూములుకు సాగునీటిని అందించాలని రైతులు గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఈ ప్రాంత రైతుల ఆకాంక్షకు మోక్షం లభించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కృషితో అజిలాపూర్లో లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పథకం నిర్మాణం కోసం రూ.32 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల జీఓ జారీ చేసింది. త్వరలోనే పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. రెండు దశల్లో పనులు.. ఎత్తిపోతల పథకం పనులను రెండు దశల్లో చేపట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందించారు. ముందుగా స్టేజ్–1లో భాగంగా కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి కొంత దూరంలో ఉన్న జీలుగ గుట్ట వద్ద 0.05 టీఎంసీ సామర్థ్యంతో పంప్హౌజ్ నిర్మించనున్నారు. పంప్హౌజ్ నుంచి పైప్లైన్ ద్వారా వచ్చే నీటిని నింపేందుకు అజిలాపూర్ సమీపంలోని పూరికుంట వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఓపెన్ కాల్వలు, పిల్ల కాల్వల ద్వారా సమీప రైతుల పొలాలకు సాగునీరు అందించనున్నారు. రూ.32 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం రెండు దశల్లో పనులు.. త్వరలోనే టెండర్లు స్టేజ్–2లో భాగంగా కోయిల్సాగర్ నుంచి గతంలో ఏర్పాటు చేసిన గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీటి ఆధారంగా గద్దెగూడెం చెరువు నట్టలవానికుంట వద్ద 0.05 టీఎంసీ సామర్థ్యంతో రెండో పంప్హౌజ్ నిర్మించనున్నారు. కిలోమీటరు దూరంలో రెండో మినీ రిజర్వాయర్ ఏర్పాటుచేసి.. అక్కడి నుంచి పైప్లైన్ లేదా కాల్వల ద్వారా గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాల పరిధిలో ఉన్న 5 కుంటలను నీటితో నింపనున్నారు. అక్కడి నుంచి రైతుల పొలాలకు నేరుగా సాగునీరు అందించనున్నారు. -
పోలీస్స్టేషన్ వెనక ఇంట్లో చోరీ
జడ్చర్ల టౌన్: పోలీస్స్టేషన్కు ఆనుకుని ఉన్న ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల పోలీస్స్టేషన్ వెనక వైపు ప్రహరీకి ఆనుకుని నిజాం అనే వ్యక్తికి చెందిన ఇళ్లు ఉంది. బక్రీద్ సందర్భంగా పట్టణంలోని హౌజింగ్బోర్డుకాలనీలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి శనివారం వెళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తాళం విరగ్గొట్టి ఉండటం, దుస్తులు చిందరవందరగా వేసి ఉండటాన్ని గుర్తించాడు. అందులో ఉన్న 6 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి, రూ.40 వేల నగదు చోరీకి గురైందని గుర్తించి.. డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎవరూ స్పందించలేదని తెలిసింది. -
అతివేగానికి నిండు ప్రాణం బలి
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తకు ఓ నిండు ప్రాణం బలైంది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ యుగంధర్రెడ్డి వివరాల మేరకు.. ఓ ట్రావెల్స్కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో బయలుదేరింది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో బస్సు అదుపుతప్పింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న కర్ణాటకకు చెందిన బస్సును తప్పించబోయి పక్కనే వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు హెల్పర్ నాగేంద్ర ప్రసాద్ (19) అనే యువకుడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ సురేశ్తో పాటు ప్రయాణికులు స్వాతి, క్రాంతిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
శుభకార్యానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
బంధువుల ఇంట్లో వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం చెందిన విషాదకర ఘటన నవాబుపేట మండలం కొల్లూరు గేట్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నవాబుపేటకు చెందిన మరికంటి లక్ష్మమ్మ (52), ఆమె కుమారుడు యాదగిరి (20) కొందుర్గు మండలం ఆగిర్యాలలో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోని కొల్లూరు గేట్ సమీపంలో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకొడుకుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా.. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతితో నవాబుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలు లక్ష్మమ్మకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో మృతుడు యాదగిరి చివరి వాడు. మిగిలిన అందరి వివాహాలు జరిగాయి. మృతురాలి భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
దుందుభిలో అక్రమ దందా!
నిబంధనలు అతిక్రమించి ఇసుక తరలింపు జడ్చర్ల: మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు దుందుభి వాగులో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా.. సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. రోజు వందలాది టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలుతుండగా.. ఇసుకాసురులకు అధికారులు, పోలీసులు వంత పాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వే బిల్లులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. మిగతా పర్యవేక్షణ తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండగా.. రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ అధికారులు జాడ లేకుండా పోయారు. ఆయా శాఖల నుంచి కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ మచ్చుకై నా లేదు. ఇచ్చిన అనుమతుల మేరకే తవ్వకాలు చేపడుతున్నారా.. బఫర్ జోన్లోకి వచ్చారా అన్న విచారణ చేయని దుస్థితి నెలకొంది. నిబంధనలు గాలికి.. కొత్తపల్లి ఇసుక క్వారీలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం 2.5 మీటర్లు తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా.. సుమారు 9 మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్నా అడిగే వారు కరువయ్యారు. ఇక సామర్థ్యానికి మించి ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరు. 10 టైర్ల లారీలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ (26 టన్నులు) మాత్రమే తరలించాల్సి ఉండగా అంతకుమించి లారీలపై చెక్కలు అడ్డుపెట్టి తరలిస్తున్నారు. టీజీఎండీసీ జారీ చేసే వేబిల్లులో 19.5 టన్నులని పేర్కొంటున్నా.. అధికంగా తరలిస్తున్నారు. అంతేగాక జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు మాత్రమే ఇసుకను రవాణా చేయాల్సి ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి తదితర సుదూర ప్రాంతాలకు తరలించి హద్దులు దాటి సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక తరలించాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా రేయింబవళ్లు తరలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇసుకను లారీలో నింపడానికి సుమారు రూ.9 వేలు వసూలు చేస్తుండగా.. దూరభారాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పైగా విక్రయిస్తున్నారు. పట్టించుకోని రవాణాశాఖ.. అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను రవాణాశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నా ఎక్కడకూడా రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్.. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని, రెవెన్యూశాఖ అధికారులు నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశించినా.. ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. హద్దుల నిర్ధారణ వరకే మా బాధ్యత.. కొత్తపల్లి క్వారీకి సంబంధించి పట్టా భూముల హద్దుల నిర్ధారణ చేశామని, తదుపరి బాధ్యత టీజీఎండీసీ అధికారులదేనని తహసీల్దార్ రాజు తెలిపారు. హద్దుల లోపలే తవ్వకాలు చేస్తున్నారని, నిబంధనలు అతిక్రమిస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేసి చర్యలు చేపడుతామని వివరించారు. టీజీఎండీసీ అధికారిని వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. జాడలేని అధికారులు.. ఇసుక క్వారీ పర్యవేక్షణను సంబంధిత అధికారులు గాలికొదిలేయడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతికి పాల్పడి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9 మీటర్ల మేర తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు జాడలేని టీజీఎండీసీ అధికారులు కొత్తపల్లి క్వారీలో ఇదీ పరిస్థితి -
క్రీడా పాఠశాల పిలుస్తోంది
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు త్వరలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని టీజీజీఎస్ఎస్ హకీంపేటతోపాటు కరీంనగర్, ఆదిలాబాద్లోని ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వారికి 4వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ స్కూళ్లు ఉండగా ప్రతి పాఠశాలలో 4వ తరగతిలో 20మంది బాలుర, 20మంది బాలికలను ఎంపిక చేస్తారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చోటుదొరికితే అంతర్జాతీయస్థాయికి ఎదగవచ్చని పలువురు క్రీడానిపుణులు పేర్కొంటున్నారు. మూడంచెల్లో ఎంపికలు స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మూడంచెల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈనెల 16నుంచి 19 వరకు మండలస్థాయి, 23నుంచి 26వరకు జిల్లాస్థాయి, జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో ఎవరైతే ఎంపికవుతారో వారికి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కల్పిస్తారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనన్నారు. కావాల్సిన ధ్రువపత్రాలు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశ ఎంపికకు విద్యార్థులు పలు ధ్రువపత్రాలతో హాజరుకావాలి. ఒరిజినల్ ఆధార్కార్డు, 4వ తరగతి చదువుతున్న సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ పత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్ఫొటోలు, విద్యార్థులు 8నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు. సద్వినియోగం చేసుకోవాలి ఈనెల చివరి వారంలో జిల్లాస్థాయిలో స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికలు నిర్వహిస్తాం. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు పొందితే విద్యార్థులకు మెరుగైన క్రీడా శిక్షణ లభిస్తుంది. వారు నైపుణ్యమైన క్రీడాకారులుగా ఎదగవచ్చు. ఎంపికల్లో అర్హులైన విద్యార్థులు పాల్గొని ప్రతిభచాటాలి. – శ్రీనివాస్, డీవైఎస్వో, మహబూబ్నగర్ శారీరక, సామర్థ్య పరీక్షలు విద్యార్థులకు శారీరక, సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800మీటర్ల రన్, 610 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీతోపాటు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటితోపాటు జిల్లాస్థాయిలో అదనంగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు 4వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలకు ఎంపికలు ప్రతిపాఠశాలలో 20మంది బాలుర, 20 మంది బాలికలకు అవకాశం ఈనెల 16నుంచి వచ్చేనెల 5వరకు మూడంచెల్లో పరీక్షలు -
లూజ్ విత్తనాలతో జాగ్రత్త
అలంపూర్: వానకాలం పంటల సీజన్ ఆరంభమవుతోంది. అన్నదాతలు ఆరుగాళం కష్టించడానికి సిద్ధమవుతున్నారు. పంటసాగులో కీలక భూమికను నిర్వహించే విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న వానకాలం సీజన్కు కావాల్సిన విత్తనాల కొనుగోలు చేసే రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ సూచించారు. దళారులు రైతులకు లూజ్ విత్తనాలు విక్రయించి మోసం చేస్తారని హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు లూజుకు కంపెనీ(ప్యాకెట్లలో) తేడాలు తెలుసుకుంటే మంచిదన్నారు. ఈ విషయంలో అవగాహన ఉంటే పంటసాగు నుంచే ఇలాంటి నష్టాలను నివారించుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. దళారులు అమ్మే లూజ్ విత్తనాలు ● విత్తనాలకు ఎటువంటి నాణ్యత ఉండదు. ● విత్తనాల తయారీలో కంపెనీ, ధృవీకరణ అధికారుల ప్రమేయం ఉండదు. ● లూజు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో ఎటువంటి బిల్లు ఇవ్వరు. ● ప్రాసెసింగ్, శుద్ధి ఇతర ప్రమాణాలు ఉండవు. ● విత్తనాలు విత్తినప్పుడు, పంట మధ్యకాలంలో పూత, కాత దశలో ఏమైనా నష్టాలు జరిగితే రైతులకు న్యాయం జరగదు. ● విత్తనాలకు జన్యు నాణ్యత ఉండదు. ● విత్తనాలను దళారులు రైతులను మోసం చేసేవారు మాత్రమే విక్రయిస్తారు. పాడి–పంట కంపెనీ ప్యాకుడు విత్తనాలు విత్తనాలకు పూర్తి నాణ్యత ఉంటుంది. విత్తనాల తయారీలో వివిధ దశల్లో కంపెనీ, ధృవీకరణ అధికారులు పాల్గొంటారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా బిల్లు ఇస్తారు. విత్తన తయారీలో ప్రాసెసింగ్, శుద్ధి, ఇతర నాణ్యత ప్రామాణాలు తప్పక పాటిస్తారు. విత్తనాలు కొనగోలు చేసిన సమయంలో రైతులకు బిల్లు ఇస్తారు. కాబట్టి పూర్తి న్యాయం జరుగుతుంది. విత్తనాలకు ఖచ్చితంగా జన్యు నాణ్యత ఉంటుంది. ఈ విత్తనాలు వ్యవసాయ శాఖవారిచే లైసెన్సు పొందిన డీలర్లు విక్రయిస్తారు. -
మూగజీవాల ఉసురుతీస్తున్న పిడుగులు
బిజినేపల్లి/ తాడూరు/ చారకొండ: అన్నదాతలకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే కాడెద్దులు, మూగజీవాలను పిడుగుపాట్లు బలి తీసుకుంటున్నాయి. రూ.వేలు విలువ చేసే కాడెద్దులు అకాల మృత్యువాత పడుతుండటంతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం బిజినేపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం కాడెద్దులను పొలం వద్ద చెట్టు కింద కట్టేశాడు. అయితే సాయంత్రం వర్షంతోపాటు పిడుగు పడటంతో కాడెద్దులు మృతిచెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. అలాగే తాడూరు మండలంలోని చర్లఇటిక్యాలలోనూ రైతు బ్రహ్మానందరెడ్డికి చెందిన ఎద్దు పిడుగు పడి మృతిచెందింది. చారకొండ మండలంలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు అంజయ్య వ్యవసాయ పొలంలో కట్టేసిన పాడిగేదెలు పిడుగు పడి మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. బాధిత రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
బైక్ అదుపుతప్పి..
బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మిడ్జిల్ మండలం వేముల శివారులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బాలానగర్ మండల పోచ్చమ్మగడ్డ తండాకు చెందిన చంద్రునాయక్ (42) మిడ్జిల్ మండలంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై తిరిగి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో వేముల శివారులో బైక్ అదుపుతప్పి కిందపడటంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. అమ్మమ్మ అంత్యక్రియలకు కట్టెలు తెచ్చేందుకు వెళ్లి.. ● ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి దుర్మరణం తన అమ్మమ్మ అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు తీసుకురావడానికి ట్రాక్టర్పై వెళ్లిన మనువడు దుర్మరణం చెందిన ఘటన గండేడ్ మండలం బల్సుర్గొండ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బల్సుర్గొండకు చెందిన మల్లెపల్లి పద్మమ్మ (70) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని దహనం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన కట్టెలు తీసుకురావడానికి పద్మమ్మ మనువడు మల్లెపల్లి బాలవర్ధన్రెడ్డి (40) ట్రాక్టర్ తీసుకొని గండేడ్కు వెళ్లాడు. కట్టెలు లోడు చేసుకొని తిరిగి వస్తుండగా.. కొండాపూర్ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న బాలవర్ధన్రెడ్డికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అమ్మమ్మ, మనువడు ఇద్దరు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మధ్యాహ్నం పద్మమ్మ అంత్యక్రియలు నిర్వహించగా.. సాయంత్రం బాలవర్ధన్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అతడికి భార్య ఉంది. గ్రామంలో వీబీకేగా పనిచేసే వాడని గ్రామస్తులు తెలిపారు. -
లారీల ఢీ.. తప్పిన ప్రమాదం
భూత్పూర్: దివిటిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. జడ్చర నుంచి భూత్పూర్ వైపు పల్లిపొట్టు లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా భూత్పూర్ వైపు నుంచి వస్తున్న లారీని సైతం ఢీకొట్టింది. భూత్పూర్ వైపు నుంచి వస్తున్న లారీ ప్రమాదానికి గురి కాగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న ఓ కారు సైతం లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పొట్టులారీ డ్రైవర్ పారిపోయాడు. రోడ్డు ప్రమాదం వల్ల రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు లాగి రాకపోకలలను పునరుద్ధరించారు. -
మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణం
అయిజ: పంట పొలానికి బాట లేదని చెప్పినందుకు మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం అయిజ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అయిజ పట్టణానికి చెందిన దేవర మహేష్ (45) 393 సర్వే నంబర్లో ఉన్న తన పొలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, కొందరు వ్యక్తులు మీకు ఇటువైపుగా బాట లేదని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన మహేష్ ఇంటికి వెళ్లి ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. మహేష్ మృతదేహాన్ని బాట ఇవ్వమని చెప్పిన వారి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి గండీడ్/మహమ్మదాబాద్: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. నారాయపేట జిల్లా కోస్గి మండలం మల్రెడ్డిపల్లికి చెందిన అలికె మొగులయ్య(45)ను అదే గ్రామానికి చెందిన గొల్ల నర్సయ్య గొర్రెలు కడగడానికి గండీడ్ మండలంలోని వెన్నాచేడ్లో పెద్దచెరువుకు వెళ్దామని చెప్పాడు. ముందుగా అనుకూలంగా ఉందో.. లేదో చూసి వద్దామని చెప్పాడు. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మరొకరితో కలిసి మొగులయ్య వెన్నాచేడ్లోని పెద్దచెరువుకు చేరుకున్నాడు. చెరువు పెద్ద తూము వద్ద లోతు చూద్దామని నీటిలోకి దిగాడు. అక్కడ ఎక్కువ లోతు ఉండడంతో మునిగిపోయాడు. బయట ఉన్న మిగతావారు మొగులయ్య పైకి రాకపోవడంతో అనుమానం వచ్చి నీటిలో దిగి బయటికి లాగారు. అప్పటికే మొగులయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యువకుడి ఆత్మహత్య మన్ననూర్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య కాలనీకి చెందిన చంద్రకాంత్ (30) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రజిత తెలిపిన వివరాల మేరకు.. చంద్రకాంత్ శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందాడు. ఏడాది క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చంద్రకాంత్ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసుకొని పోస్టుమర్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం మహమ్మదాబాద్: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని కంచన్పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోతుల అశోక్(24) గత రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అశోక్ కొన్నిరోజులుగా మహబూబ్నగర్లో ఉంటూ ఎలాంటి కూలీ పనిచేయకుండా ఉంటున్నాడు. దీంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొని మనస్తాపానికి గుర య్యాడు. శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యు లు స్థానిక జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కాల్వ ఇలా.. నీరు పారేదెలా?
నెట్టెంపాడులో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వచ్చే కాల్వ గట్టు మండలంలోని పెంచికలపాడు శివారులో మొదలై.. ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి, గట్టు, మాచర్ల, బల్గెర, ఇందువాసి వరకు పారుతోంది. అయితే ఈ కాల్వలో జమ్మితోపాటుగా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు పారక తరుచుగా కోతకు గురవుతోంది. కాల్వ నీటిపై ఆధారపడి పంటలు పండించుకుంటున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే రెండు నెలల్లో కాల్వకు సాగునీటిని విడుదల చేస్తారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాల్వ మరమ్మతు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. – గట్టు -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ముకుందం రమేష్ పాల్గొన్నారు. – స్టేషన్ మహబూబ్నగర్ విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. -
‘సీఈఐఆర్’తో పట్టేస్తున్నారు..!
మహబూబ్నగర్ క్రైం: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనిషి రోజువారి దినచర్యలో సెల్ఫోన్ భాగమైంది. ప్రతిఒక్కరి దగ్గర విలువైన స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. అయితే గతంలో ఫోన్లు చోరీకి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా తిరిగి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోల్పోయిన ఫోన్లను వెంటనే గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న సెల్ఫోన్లను వెనువెంటనే గుర్తించి రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. దీంతో రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లు పలు సందర్భాల్లో చోరీలకు గురై కోల్పోయిన బాధితులు సకాలంలో తిరిగి లభించడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చోరీకి గురైన సెల్ఫోన్ల వివరాలు పోలీస్స్టేషన్ మొత్తం రికవరీ ఫిర్యాదులు చేసిన ఫోన్లు అడ్డాకుల 12 1 బాలానగర్ 91 40 చిన్నచింతకుంట 41 30 భూత్పూర్ 101 27 దేవరకద్ర 99 31 హన్వాడ 29 20 జడ్చర్ల 284 103 కోయిలకొండ 13 4 మ.నగర్ రూరల్ 149 63 వన్టౌన్ 145 35 టూటౌన్ 224 103 మిడ్జిల్ 33 15 మహమ్మదాబాద్ 26 20 మూసాపేట్ 26 20 నవాబ్పేట 43 10 రాజాపూర్ 29 5 పోలీస్స్టేషన్ల వారీగా.. జిల్లాలో 2024లో 3,261 సెల్ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు అందగా ఇందులో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,141 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. ఇందులో అత్యధికంగా జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 715, మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 576 ఫిర్యాదులు, వన్టౌన్ 381, రూరల్ 337, దేవరకద్ర 230, బాలానగర్ 210 ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఈ ఏడాది మే 31 వరకు 1,348 ఫిర్యాదులు రాగా.. ఇందులో 520 ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. సీఈఐఆర్ పోర్టల్ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత బాధితులు కోల్పోయిన సెల్ఫోన్లు త్వరగా రికవరీ చేసి తిరిగి అప్పగిస్తున్నాం. బాధితులు ఎవరైతే ఫోన్లు కోల్పోయిన వారు ఉంటే మొదట సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి తర్వాత సదరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ చోరీకి గురైన సెల్ఫోన్ల గుర్తింపులోసాంకేతిక తోడ్పాటు రూ.వేల విలువైన ఫోన్లు తిరిగి వస్తుండటంతో బాధితుల ఆనందం -
మతసామరస్యాన్ని కాపాడుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: బక్రీద్ పండగ సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలో ఉన్న ఈద్గాల దగ్గర ఎస్పీ డి.జానకి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ భద్రతను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్యం నిలుపుకోవడం అందరి బాధ్యత అని, వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎప్పుడూ కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి పాలమూరు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేసిన దీక్షల నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం 2023లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ, 12 గ్రామాల రైతులు, ప్రజలు కంపెనీ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. సరైన న్యాయం కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే చిత్తనూర్లో ఇథనాల్ కంపెనీ వల్ల పెరిగిన కాలుష్య పరిస్థితిని అర్థం చేసుకుని కంపెనీ రద్దు చేయకపోతే తమ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉపాధి హామీ కూలీలతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎఫ్ఏ)కు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ అన్నారు. శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీలకు తొమ్మిది వారాల నుంచి, ఎఫ్ఏలకు మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. ఈ విషయమై గత నెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఉపాధి కూలీలకు రోజుకు రూ.600, పని దినాలు 200 రోజులకు పెంచాలని, ఎఫ్ఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, 4 కి.మీ. దూరం పనికి వెళితే ఆటో చార్జీలు సైతం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న హైదరాబాద్లోని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనరేట్ (సీఆర్డీ) ఎదుట నిర్వహించే ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
స్టేషన్ మహబూబ్నగర్: బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగను ముస్లింలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లాకేంద్రంలోని రహెమానియా ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. జామియా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా మహ్మద్ హాఫిజ్ ఇస్మాయిల్ ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. పండుగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. బక్రీద్ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరపున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. త్యాగాన్ని, క్షమను గుర్తుచేస్తూ స్వార్థాన్ని త్వజించాలన్నదే బక్రీద్ పండుగ మనకు ఇచ్చే సందేశం అన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, భగవంతురావు ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, అబ్దుల్ జకీ, అజ్మత్అలీ, అవేజ్, ఫయాజ్, గులాం జహీర్, షాఫైసల్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
ఏడు గంటల వ్యవధిలో కేసు ఛేదన
గద్వాల క్రైం: నిలిపి ఉంచిన 10 టైర్ల లారీని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటనలో పోలీసులు ఏడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ శనివారం తెలిపిన వివరాల మేరకు. ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున గద్వాల పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏపీ 39 వీడీ 6377 నంబర్ గల 10 టైర్ల గల లారీని నలిపి యాజమాని సాధిక్ ఇంటికి వెళ్లాడు. అయితే సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చి చూడగా లారీ కనిపించలేదు. ఆందోళన చెందిన సాధిక్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమీప సీసీ కెమెరాలను పరిశీలించగా లారీ ఎర్రవల్లి వైపుగా వెళ్తున్నట్లు రికార్డు అయ్యిందన్నారు. వాటి ఆధారంగా లారీని అపహరించిన దుండగులను పట్టుకునేందుకు సిబ్బంది టోల్ప్లాజాల వద్ద పహారాగా ఉండగా దుండగులు చాకచాక్యంగా వ్యవహరించారన్నారు. పెబ్బేరు, వనపర్తి, బిజనేపల్లి, బాలానగర్ మీదుగా రాయకల్ టోల్ప్లాజా సమీపంలోని ఓ దాబా వద్ద లారీని నిలిపిన దుండగులు నంబర్ను ఏపీ 39 డబ్ల్యూ 3553గా మార్పులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సిబ్బంది లారీని గుర్తించి అక్కడికి చేరుకోవడంతో దుండగులు తప్పించుకున్నారన్నారు. శనివారం తెల్లవారుజామున లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీ విలువ రూ.15లక్షలు ఉంటుందన్నారు. కేసు చేధనలో సాంకేతిక విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రాజుయాదవ్ కీలకంగా వ్యవహరించారన్నారు. సీసీ కెమెరా రికార్డుల ద్వారా నిందితులను గుర్తించి త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. చోరీకి గురైన రూ.15లక్షల విలువ గల లారీ స్వాధీనం పరారీలో నిందితులు -
హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు..
ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉమ్మడి జిల్లాలో మూడు జట్లతో మహిళా లీగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మహిళా క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలి. హెచ్సీఏ మహిళా లీగ్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారిణులు ప్రతిభ చాటాలి. త్వరలో జరిగే హెచ్సీఏ ఉమెన్స్ లీగ్లో పాల్గొనే ఉమ్మడి మహిళా జట్టును ఈనెల 10న ఎంపిక చేస్తాం. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో మహిళా క్రీడాకారిణులు రాణించాలి. ఇటీవల అండర్–23 టూడేలీగ్, అండర్–19 లీగ్లను విజయవంతంగా నిర్వహించాం. మహిళా క్రికెట్ లీగ్ను కూడా అదే విధంగా నిర్వహిస్తాం. – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ● -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
అలంపూర్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధం అవుతుండడంతో ఆయన పలు సూచనలు చేశారు. బ్రీడర్, సర్టిఫైడ్, టూత్ ఫూల్ లేబుల్స్లో నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఇందులో ఏ రకాన్ని సాగు చేసినా మంచి ఫలితం ఉంటుందన్నారు. వీటితో రైతులు విత్తన భారం తగ్గించుకోవడంతో పాటు తోటి రైతులకు అందించి అధిక రేటు పొందవచ్చన్నారు. బ్రీడర్ విత్తనం : ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు తయారు చేసేది ఇలాంటి విత్తనాలే. ఈ విత్తనం వంద శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి ఇవ్వరు. ఫౌండేషన్ విత్తనం : ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల అధ్వర్యంలో వీటిని పండిస్తారు. దాదాపు వంద శాతం జన్యు నాణ్యత ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు. సర్టిఫైడ్ (ధ్రువీకరించిన) విత్తనం : దీన్ని ఫౌండేషన్ విత్తనం నుంచి వేరుగా ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో విత్తన పర్యవేక్షకుల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు. పాడి–పంట -
చిన్నరాజమూర్ గుట్టల్లో చిరుత సంచారం
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం, చిన్నరాజమూర్ సమీపంలోని పులిగుట్టపై శనివారం చిరుత సంచారం కలకలం రేపింది. సాయంత్రం సమయంలో రహదారిపై వెళ్తున్న గ్రామ యువకులకు గుట్టపై చిరుత సంచరిస్తూ కనిపించింది. కొద్దిసేపు గుట్టపై అటు, ఇటు తిరిగి అక్కడే ఉన్న చిన్న గుహలోకి వెళ్లిందని, చిరుతతో పాటు ఒక చిన్న చిరుత పిల్ల కూడా ఉండటం గమనించినట్లు యువకులు తెలిపారు. గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు, సమీప వ్యవసాయ పొలాల రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. జూరాలకు నిలకడగా ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 7,500క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 68 క్యూ సెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,533 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.551 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. -
ప్లాస్టిక్ రహితం
మైసమ్మ అడవిఅటవీ సంరక్షణకు ప్రభుత్వం చర్యలు నవాబుపేట: నల్లమల అటవీ ప్రాంతం సరసన పర్వతాపూర్ మైసమ్మ అడవి నిలుస్తోంది. అక్కడ పెద్దపులులు ఇతర వన్యప్రాణులు ఉండగా.. ఇక్కడ చిరుతలకు ఆవాసంగా అటవీ ప్రాంతం ఉంది. అయితే అటవీ ప్రాంతాల్లోని మార్గాల్లో ప్రయాణించే వారు ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తుండటంతో వన్యప్రాణ్యుల మనుగడకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్లాస్టిక్ రహితంగా అడవులను తీర్చిదిద్దాలని సంకల్పించింది. నల్లమల తరహాలోనే మైసమ్మ అడవిని సైతం ప్లాస్టిక్ రహితంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రస్థాయిలో పర్వతాపూర్ మైసమ్మ అడవిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి ఆది, మంగళవారాల్లో మైసమ్మ దర్శనానికి వేలాది భక్తులు వస్తుంటారు. ఇతర రోజుల్లో సైతం అడవిలో రద్దీ ఉంటోంది. ఈ తరుణంలో అడవి సంరక్షణ కోసం అందరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధం పాటించాల్సిన అవసరం ఉంది. నల్లమలను తలపిస్తున్న మైసమ్మ అడవి అందరూ సహకరించాలి.. మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను అడవిలో వేయొద్దు. ఆలయ ఆవరణలోని వ్యాపారులు సైతం ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలి. అడవిలో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు అందరూ సహకరించాలి. – జగన్మోహన్రెడ్డి, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ● -
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని.. ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్య, రాత పుస్తకాలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతుందని.. బడిబాట ద్వారా బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో వలంటీర్లను నియమించాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, మండల విద్యాధికారి కృష్ణయ్య, నోడల్ అధికారి కుర్మయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వివేకానంద, తపస్ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు దేవన్న, శివ నారాయణ, లక్ష్మయ్య, రాములు, అరవింద్రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కిరణ్కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
9,10 తేదీల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ మహిళా క్రికెట్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా అండర్–23, అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మహిళా క్రికెట్ లీగ్ పోటీలకు శ్రీకారం చుట్టారు. 9, 10 తేదీల్లో మహిళా క్రికెట్ లీగ్ ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 9,10 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. లీగ్లో పాల్గొనే జట్లను ఈనెల 1న ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో పరీక్షించి క్రీడాకారిణులను ఎంపిక చేశారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది. లీగ్ మ్యాచ్ల వివరాలు.. క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే మహిళా క్రీడాకారిణులను మూడు జట్లుగా విభజించారు. 30 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈనెల 9న రెడ్–బ్లూ జట్లు, బ్లూ–పింక్ జట్లు, 10న పింక్–రెడ్ జట్లు లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి. బ్లూ మహిళా జట్టు.. మంజుల (కెప్టెన్), స్వాతి, కరీనా, మనీషా, ప్రవళిక, శ్రవంతి, దివ్య, నిర్మల, తనుజశ్రీ, తేజశ్రీ, శారద, సాయిశృతి, సాయి ప్రణవి, స్పందన, సంజన. రెడ్ జట్టు... అనిత (కెప్టెన్), అక్షర రాథోడ్, వైశాలి, అనూష, మహేశ్వరి, మంజు, ప్రతీక, మీనాక్షి, సింధూజ, కీర్తన, గోపిక, యూ.కీర్తన, నందిని, లోకేశ్వరి, భానుమతి. పింక్ జట్టు.. త్రివేణి (కెప్టెన్), ఇందు, నిహారిక, చంద్రకళ, పవిత్ర, రిషికాసాయి, ఎన్.కవిత, మనీషా, వెన్నెల, శైలు, మేఘన, ఎం.నందిని, మౌనిక, పద్మ, ఐశ్వర్య. మూడు జట్లతో లీగ్ నిర్వహణ లీగ్లో అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత -
ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు
వనపర్తి రూరల్: పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లి నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం మహిళలు సిగపట్లు పట్టారు. బస్సులో సీటు కోసం మహిళల మధ్య మొదలైన గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. తోటి ప్రయాణికులతో పాటు బస్సు కండెక్టర్ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. మహిళల మధ్య గొడవ తారస్థాయికి చేరుకోవడంతో రూరల్ పోలీస్స్టేషన్ వద్ద బస్సును డ్రైవర్ నిలిపారు. గొడవకు దిగిన మహిళలను బస్సులో నుంచి దించి అందరూ సర్దిచెప్పడంతో శాంతించారు. అదే బస్సులో బస్టాండ్కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఎస్ఐ జలేందర్రెడ్డిని వివరణ కోరగా.. బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.