Mahabubnagar District News
-
ఉపాధి ప్రణాళిక ఖరారు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఎన్ని పనిదినాలు కల్పించాలి.. వారికి కేటాయించాల్సిన బడ్జెట్ ఎంత.. ఏయే పనులు చేయించాలనే అంశాలపై ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలో వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేకపోవడం, కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా అధికారులు ఈ ప్రణాళిక తయారు చేశారు. వ్యవసాయం, మత్స్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో చేపట్టే పనులను గుర్తించారు. అయితే జిల్లాలో 85,25,900 పనులను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ పనులు చేపట్టేందుకు రూ.426 కోట్ల నిధులు ఖర్చు చేయాలని అంచనా వేశారు. జిల్లాలో అడిగిన ప్రతి కూలీకి పని కల్పించేలా ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళిక రూపొందించారు. చేపట్టే పనులు.. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులను పంచాయతీ కార్యదర్శులు గ్రామసభలు నిర్వహించి గ్రామస్తులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘం సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి గుర్తించారు. గ్రామాల్లో మట్టి రోడ్లు వేయడం, చెరువుల్లో మట్టి పూడికతీత, అవసరమైన రైతుల పొలాలకు ఒండ్రుమట్టి తరలించడం, నీటి నిల్వ కోసం కట్టలు కాల్వలు తవ్వడం, కందకాలు ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతారు. అలాగే అత్యవసర పనులతోపాటు రైతుల, గ్రామస్తులకు అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇస్తారు. మండలాల వారీగా లక్ష్యం.. జిల్లాలో 16 మండలాలు ఉండగా 423 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే అధికారులు మండలాల వారీగా పని దినాలను కేటాయించారు. ఇందులో అడ్డాకుల మండలానికి సంబంధించి 4,25,000 పనిదినాలు, బాలానగర్ 5,62,500, భూత్పూర్ 4,06,400, చిన్నచింతకుంట 6,18,600, దేవరకద్రకు 6,53,900, గండేడ్కు 8,99,900, హన్వాడకు 6,93,500, జడ్చర్లకు 7,09,700, కోయిలకొండకు 7,55,800, మహబూబ్నగర్కు 6,02,000, మిడ్జిల్కు 5,06,500, మూసాపేట్కు 3,32,500, నవాబ్పేటకు 9,19,400, రాజాపూర్కు 4,40,200 పనిదినాలు కేటాయించారు. ప్రణాళిక ప్రకారం.. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులన్నీ వినియోగించుకునేలా ఈ సంవత్సరం ప్రణాళిక తయారు చేశాం. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన 85,25,900 పనిదినాల లక్ష్యం పూర్తిచేస్తాం. – నర్సింహులు, డీఆర్డీఓ గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు పూర్తి 2025– 26 సంవత్సరానికి 85.25 లక్షల పనిదినాల గుర్తింపు రూ.426 కోట్ల నిధులు వెచ్చింపు వ్యవసాయ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట ప్రతి కూలీకి పని కల్పించేలా చర్యలు -
చదువుంటేనే భవిష్యత్కు భరోసా
హన్వాడ: చదువుంటేనే భవిష్యత్కు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని చిన్నదర్పల్లి, మునిమోక్షం, గొండ్యాల్, వేపూర్ గ్రామాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం తన సొంత నిధులతో 2డీ, 3డీ యానిమేషన్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే నెల రోజులపాటు విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ నెలరోజులపాటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంఓ బాలుయాదవ్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రి, కార్యదర్శులు కృష్ణయ్య, కృష్ణయ్యయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్, ఏఎంసీ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటాద్రి, అచ్చెన్న తదితరులు పాల్గొన్నారు. ఉదండాపూర్లో రీసర్వే ప్రారంభం జడ్చర్ల: మండలంలోని ఉదండాపూర్లో శుక్రవారం అధికారులు రీ సర్వే చేపట్టారు. జిల్లా నుంచి వచ్చిన మొత్తం 11 బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. అదనపు కలెక్టర్ మోహన్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్కుమార్, స్థానిక తహసీల్దార్ నర్సింగరావు తదితరులు సర్వేను పరిశీలించారు. అయితే మొదటిరోజు 113 ఇళ్లను సర్వే చేశారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు సర్వే కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
పాలమూరు: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది కంటే ఈసారి 18 శాతం పెరిగిందని, ఎలాంటి ఓవర్ లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్ ప్లాన్ పనులను శుక్రవారం పరిశీలించడంతోపాటు టీడీగుట్ట సబ్స్టేషన్లో దాదాపు రూ.కోటి వ్యయంతో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు ఎంవీఏ ఫవర్ ట్రాన్స్ఫార్మర్లను కలెక్టర్ విజయేందిరతో కలిసి సీఎండీ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది పీక్ డిమాండ్ 352 మెగావాట్లు కాగా ఈసారి 415 మెగావాట్లకు చేరిందని, ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి ఓవర్లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ 500 మెగావాట్లకు చేరిన సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, గతేడాదితో పోల్చితే ఈసారి జనవరి వరకు దాదాపు 15 వేల మంది చేరికతో మొత్తం వినియోగదారులు 3.99 లక్షలకు చేరారని, గృహాజ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. గతేడాది దాదాపు 9 సబ్స్టేషన్ల్ పరిధిలో ఫవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, డివిజన్ల వారీగా పెరుగుతున్న లోడ్లకు తగ్గట్టుగా నూతన ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల విభజన చేయడం జరిగిందన్నారు. కేవలం హైదరాబాద్కు పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ 1912 సదుపాయాన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. విద్యుత్ అంతరాయాలు జరిగిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు అంబులెన్స్ తరహా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య ఉంటే వినియోగదారులు 1912 ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది కంటే ఈసారి జిల్లాలో 18 శాతం పెరిగిన డిమాండ్ విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ -
‘సాగునీరు అడిగితే సాకులు చెబుతున్నారు’
వనపర్తి: రైతులు సాగునీరు అడిగితే.. కాంగ్రెస్ నాయకులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కేటాయింపుల విషయంలో మొదటి నుంచి తెలంగాణకు అన్యాయమే జరిగిందని.. గత పాలకులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి గ్రామగ్రామాన తిరిగి ప్రజానికాన్ని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి, పాలమూరు–రంగారెడ్డి పనులను చివరి దశకు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నది జలాల వాటా తేల్చాలని అప్పటి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా పదేళ్లుగా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నది జలాల వాటాను తేల్చని కేంద్రాన్ని ఏమీ అనలేక గత పాలకుల నిర్లక్ష్యం అనడం కాంగ్రెస్ పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నమన్నారు. నది జలాల వాటా తేల్చకపోతే కేంద్రంపై యుద్ధం చేస్తామని రేవంత్రెడ్డి అంటున్నారని.. తెలంగాణ ప్రజల తరుఫున ప్రతిపక్ష హోదాలో ఉన్న తమ పార్టీ మద్దతు తెలుపుతుందని దీక్షలు, పోరాటాలు చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, మాణిక్యం, జోహెబ్, రాము తదితరులు పాల్గొన్నారు. -
3న ఎంవీఎస్లో జాతీయ సదస్సు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ– ఆర్థికాభివృద్ధి– అవకాశాలు’, ‘సవాళ్లు ఎంఎస్ఎంఈల పాత్ర’ అనే అంశంపై వచ్చే నెల 3న జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి పీయూ వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ రాజ్కుమార్ తదితరులు హాజరవుతారన్నారు. ఆముదాలు క్వింటాల్ రూ.5,750 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన ఈ టెండర్లలో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,750 ధర లభించింది. అలాగే రాగులు క్వింటాల్ సరాసరిగా రూ.4,204 ధర పలికింది. సీజన్ లేకపోవడంతో మార్కెట్లో లావాదేవీలు మందకోడిగా సాగాయి. ఐదురోజుల పనివిధానం అమలుచేయాలి స్టేషన్ మహబూబ్నగర్: బ్యాంకులో ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని ఎస్బీఐ అవార్డు స్టాప్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి నరేష్కుమార్, ఆఫీసర్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి జగన్నాథ్రెడ్డి అన్నారు. తమ విధులు ముగించుకొని పట్టణంలో వివిధ ఎస్బీఐ బ్రాంచీల ఉద్యోగులు జిల్లాకేంద్రం మెట్టుగడ్డలోని ఎస్బీఐ రీజినల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల పిలుపుమేరకు వచ్చే నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దశల వారీగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతామన్నారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న అన్నిస్థాయిల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగ పద్ధతిని తీసివేయాలని, తాత్కాలికంగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. -
సోషలిజం వైపు ప్రపంచ పయనం
మహబూబ్నగర్ న్యూటౌన్: పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో రెడ్బుక్ డేను పురస్కరించుకొని రాజకీయ సమీక్ష నివేదిక, సీపీఎం 24వ మహాసభల ముసాయిదా తీర్మానాలపై ఒకరోజు అధ్యయనం, పుస్తక పఠనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం సోషలిజం వైపు పయనిస్తుందన్నారు. పెట్టుబడిదారీ విధానంలో రోజురోజుకు సంక్షోభాలు ముదురుతున్నాయన్నారు. వియత్నాం, చైనా, క్యూబ, ఉత్తరకొరియా, శ్రీలంక, దావోస్ లాంటి దేశాల్లో కమ్యూనిజం సోషలిజం వేగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. యువతీ, యువకులు, అభ్యుదయవాదులు, మేధావులు పుస్తక అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, కార్యవర్గ సభ్యులు కురుమూర్తి, రాంరెడ్డి, మోహన్, చంద్రకాంత్ పాల్గొన్నారు. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 70 ఏళ్లకు సీఎం పదవి హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిదేశంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ మంజూరు చేశామని సీఎం అన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం పేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్రెడ్డి ధ్వజం రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
ఖాళీలను భర్తీ చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: సమస్యల పరిష్కారం కోసం అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సభ్యు లు శుక్రవారం జిల్లాకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ రీజినల్ కార్యాలయం ఎదుట యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఐదు రోజుల పనిదినాన్ని ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వచ్చే నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తిరుమల్రెడ్డి, అధ్యక్షుడు జె.రాజే ష్, కెనరా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ఎంఆర్.జయకర్, అభిలాష్రెడ్డి, శివనరేంద్రనాథ్ పాల్గొన్నారు. -
స్వామివారి సేవలో..
పట్టువస్త్రాల తయారీలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నియమ నిష్టలతో ఉపవాస దీక్ష చేపట్టి వస్త్రాలు తయారు చేస్తున్నాం. ఈ అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. – మహంకాళి సత్యనారాయణ, అమరచింత ఏటా వెళ్తున్నా.. శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాల తయారీ పనులకు ఏటా వెళ్తున్నా. స్వామివారి సేవలో పాల్గొనేందుకు అ వకాశం దక్కడం సంతోషం కలిగిస్తుంది. శక్తి ఉన్నంత వరకు వస్త్రాల తయారీలో పాల్గొంటా. – లడ్డు శ్రీను, అమరచింత నేత పనుల్లో సాయం.. శ్రీశైలంలోని పద్మశాలిభవన్లో ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని పట్టువస్త్రాలు తయారు చేస్తున్న పనుల్లో తనవంతు సాయం చేయడానికి ఏటా వెళ్తున్నా. ఈ ఏడాది కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. – మహంకాళి ఎల్లప్ప, అమరచింత● -
నల్లమలలో మార్మోగుతున్న శివనామస్మరణ
అచ్చంపేట: నల్లమల కొండల్లో శివనామస్మరణ మార్మోగుతోంది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం క్షేత్రానికి శివస్వాములు, భక్తులు కాలినడకన తరలివెళ్తున్నారు. వనపర్తి–అచ్చంపేట, మహబూబ్నగర్– అచ్చంపేట, హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారులతో పాటు నల్లగొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుంచి శివస్వాములు శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన తరలివస్తుండటంతో అఽభయారణ్యంలో రద్దీ పెరిగింది. అచ్చంపేట–ఉమామహేశ్వరం మీదుగా అటవీ మార్గంలో శివస్వాములు పాదయాత్ర చేస్తున్నారు. మదిలో శివయ్యను తలుస్తూ.. సుదూర ప్రాంతాల నుంచి అలుపెరగని కాలినడక సాగిస్తున్నారు. ఏ చెట్లు, గుట్టలు, కాలిబాటలు చూసిన శివస్వాములే దర్శనమిస్తున్నారు. ఎంతో నిష్టతో 41 రోజులపాటు శివదీక్ష బూని భక్తిపారవశ్యంతో ముందుకు సాగుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక, సామాజిక సేవకులు అన్నదానం, తాగునీటి సదుపాయం కల్పిస్తూ.. శివస్వాములు సేవలు అందిస్తున్నారు. మరికొందరు పండ్లు పంపిణీ చేస్తున్నారు. ● మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం ఉత్తరద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో శివస్వాములు, భక్తులకు మేఘ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి 21 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివస్వాములు, భక్తులకు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందన్నారు. ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భీరం మాధవరెడ్డి, పవన్, కృష్ణారెడ్డి, మన్సూర్ పాల్గొన్నారు. -
శ్రీశైల మల్లన్నకు అమరచింత పట్టువస్త్రాలు
అమరచింత: మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే పనుల్లో అమరచింత పద్మశాలీలు నిమగ్నమయ్యారు. ఇందుకుగాను వారం క్రితమే శ్రీశైలం క్షేత్రంలోని పద్మశాలి భవన్లో ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని నేత పనులు ప్రారంభించారు. మహాశివరాత్రి నాటికి నేత పనులు పూర్తిచేసి ఆలయ ఈఓకు వీటిని భక్తిశ్రద్ధలతో అందించనున్నారు. ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని సంఘం పట్టణ అధ్యక్షుడు మహంకాళి విష్ణు తెలిపారు. నియమనిష్టలతో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు తయారు చేస్తున్నామని వివరించారు. అందరి భాగస్వామ్యంతో.. పట్టణంలోని పద్మశాలి కులస్తులందరి భాగస్వామ్యంతోనే పట్టువస్త్రాలు తయారుచేయడం అనాదిగా వస్తోంది. భక్త మార్కండేయస్వామి పద్మశాలీల కులదైవం.. కాబట్టి ఆయన కొలిచే శివయ్యకు తమవంతుగా పట్టువస్త్రాలు అందిస్తున్నామని కులపెద్దలు వివరించారు. గతంలో అమరచింతలో వస్త్రాలు నేసి శ్రీశైలానికి వెళ్లి అందించే వారమని.. ప్రస్తుతం క్షేత్రంలోనే మగ్గం ఏర్పాటు చేసుకొని తయారు చేస్తున్నట్లు తెలిపారు. అమరచింతలోని శివచౌడేశ్వరి ఆలయం నిర్మించిన మహంకాళి గంగ, శ్రీనివాసులు సోదరులు పట్టువస్త్రాల తయారీకి అయ్యే ఖర్చును ఏటా అందిస్తున్నారని చెప్పారు. శ్రీశైలంలో కొనసాగుతున్న నేత పనులు మహాశివరాత్రికి ఆలయ ఈఓకు అందజేత మహాభాగ్యం.. శ్రీశైలంలో ఉంటూ స్వామి, అమ్మవార్ల పట్టువస్త్రాల తయారీలో పాల్గొనడం మహాభాగ్యంగా భావిస్తున్నా. మగ్గంపై వస్త్రాల తయారీకి అవసరమైన దారం కండెలు చుట్టడం, మగ్గం పనులు చేస్తూ తరిస్తున్నా. – కడుదాసు సిద్ధమ్మ, అమరచింత -
చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టండి
నారాయణపేట: నారాయణపేట నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దివంగత చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టేందుకు పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ, రాజస్తాన్తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారన్నారు. మారుమూల ప్రాంతంలో మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందో తెలుస్తోందన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో తిరస్కరించారని, కానీ ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేసిందన్నారు. తండాల్లో, గూడాల్లో, గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలని ముందుకు సాగుతుందన్నారు. టీచింగ్, నాన్టీచింగ్ లేకుండా గొప్ప డాక్టర్లు కావడం అనేది కష్టమని, మేము ఎంత చేసినా ఇన్ఫ్రాస్టక్చర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు.. నిజమైన పేదవారికి సంక్షేమ ఫలాలు అందించాలని, చదువుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లా పరిధిలోని పోలేపల్లి ఎల్లమ్మదేవిని ముఖ్యమంత్రి, మంత్రులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిధులు మేమిస్తాం.. నిర్వహణ మీరు చేపట్టండి నిధులు మేమిస్తాం.. నిర్వహణ మీరు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి మహిళలకు భరోసానిచ్చారు. పెట్రోల్బంకును ప్రారంభించిన అనంతరం మహిళా సంఘాల సభ్యులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దెకు ఇవ్వడం జరిగిందని, సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నామన్నారు. కోటి మంది మహిళలతో హైదరాబాద్ రింగ్రోడ్డులో ప్రదర్శన నిర్వహించబోతున్నామన్నారు. సీటు వస్తుందో.. రాదో అనుకున్నా మాది రైతు కుటుంబం. ఎంతో కష్టపడి మా తల్లిదండ్రులు చదివించారు. నాకు ఎంబీబీఎస్ సీటు వస్తుందో రాదో అనుకున్నా. రాష్ట్రంలో 8 కొత్త కళాశాలు రావడంతో నాకు సీటు వచ్చింది. తక్కువ సమయంలో మారుమూల ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి ల్యాబ్స్, ఫ్యాకల్టీ ఇతర సదుపాయలను కల్పించారు. ఈ కళాశాలను తీసుకురావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. – శ్రీధర్, దేవరకొండ గ్రామం, నల్లగొండ జిల్లా ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేకంగా ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కళాశాలలో నర్సింగ్ కోర్సు చేస్తున్నాను. ఈ కోర్సు పూర్తి చేసి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తా. – నవనీత, నర్సింగ్ విద్యార్థిని, వికారాబాద్ అదృష్టంగా భావిస్తున్నాం నేను పారా మెడికల్ కళాశాలలో ఈసీజీ గ్రూప్లో జాయిన్ అయ్యాను. మా జిల్లాలో నూతనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించడంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలైనట్లయ్యింది. ఇంతకుముందు ఈసీజీ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి చూయించుకునే వారు. ప్రభుత్వం మారుమూల ప్రాంతమైన ఈ నారాయణపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – సాయిమాధురి, ఈసీజీ స్టూడెంట్, పారామెడికల్ కళాశాల, నారాయణపేట ఉపాధి పొందుతున్నా.. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికమ్మ, ఎంపీ అరుణమ్మ ఇద్దరూ మా ఊరు ధన్వాడ ఆడపడచులు. నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్. నా సొంతంగా జొన్న, రాగి రొట్టేల వ్యాపారం చేస్తున్నా. మహిళా సంఘం సభ్యురాలిగా ఉన్నా. నా భర్త 2011లో చనిపోయారు. పిల్లలను పోషించుకునేందుకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసి రూ.5 వేలు సంపాదించేదానిని. కానీ మహిళా సంఘంలో రుణం పొంది ఈ రోజు నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నా. – రాజేశ్వరి, మహిళా సంఘం సభ్యురాలు, ధన్వాడ సీఎం పర్యటన సాగిందిలా.. నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నారాయణపేట జిల్లాలో 3 గంటల 15 నిమిషాల పాటు సాగింది. పర్యటనలో భాగంగా దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ● మధ్యాహ్నం 2.05 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా పోలేపల్లి నుంచి నారాయణపేట మండలం సింగారం గేటు సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్కు సీఎం చేరుకున్నారు. ● 2.09 గంటలకు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడారు. ● 2.38 గంటల అక్కడి నుంచి బయలుదేరి 2.48 గంటలకు అప్పక్పల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ● 3 గంటలకు మెడికల్ కళాశాల వద్దకు చేరుకొని కళాశాలను ప్రారంభించారు. 3.35 గంటల వరకు మెడికల్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ● 3.40 గంటలకు బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, సీతక్క, జూపల్లి కృష్ణరావు, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ● 4.18 గంటల వరకు దాదాపు 40 నిమిషాల పాటు సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ● సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయలు దేరారు. ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన మెడికల్ కళాశాల విద్యార్థులతో సీఎం ముఖాముఖి -
రెస్టారెంట్లో అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ క్రైం: పట్టణంలోని శ్రీనివాసకాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న అరేబియాన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్లోని రెండో అంతస్తు ఫ్యామిలీ సెక్షన్లో శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుర్చీలకు మంటలు వ్యాపించి దట్టమైన పొగ రావడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పాటు ఐదుగురు సిబ్బందిని నిచ్చెన ద్వారా సురక్షితంగా కిందకు దించారు. రెస్టారెంట్ ప్రధాన రహదారిపై ఉండటంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కిషోర్ మాట్లాడుతూ.. కుర్చీలకు రెగ్జీన్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని, ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని తెలిపారు. ఈ ప్రమాదంతో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్లడించారు. ఐదుగురు సిబ్బందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది -
నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం
జడ్చర్ల టౌన్: మండలంలోని పోలేపల్లి ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిని బుధవారం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స అనంతరం ముగ్గురు విద్యార్థులను మినహా మిగిలిన వారందరిని డిశ్చార్జ్ చేశారు. గురువారం మరో విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఎస్వీఎస్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి జెడ్పీ మాజీ వైస్చైర్మన్ కోడ్గల్ యాదయ్య పరామర్శించారు. అంతకుముందు యూనివర్సిటీ నిర్వాహకులతో వివరాలను తెలుసుకున్నారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడి నీళ్లు పడటం లేదని.. అందుకే ఇలా జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన.. ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన ఫుడ్ ఇన్చార్జిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇలాంటి ఘటనలు మరోమారు చోటు చేసుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుంటే యూనివర్సిటీ అనుమతి రద్దు చేయించాలని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
ఊట్కూరు: ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఊట్కూరుకు చెందిన కల్వాల్ ఖయ్యూం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో కర్ణాటకలోని గుల్బరకు వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామానికి వస్తుండగా.. మండల కేంద్రంలో రోడ్డుపై అడ్డుగా గుర్రాలు రావడంతో సడన్బ్రేక్ వేశారు. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న కల్వాల్ ఖయ్యూ కుమారుడు అబ్దుల్ ఆది (7) డ్యాష్బోర్డుకు బలంగా తలగడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ బాలుడు గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేఎల్ఐ కాల్వలో పడి యువకుడు.. ఉప్పునుంతల: మండలంలోని తాడూరు–చెన్నారం మార్గమధ్యంలో కొత్తగా తవ్వుతున్న కేఎల్ఐ కాల్వలో పడి కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన సంబు వినోద్గౌడ్ (26) మృతిచెందినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. వినోద్గౌడ్ గురువారం స్వగ్రామం నుంచి తాడూరులోని బంధువుల ఇంటికి బైక్పై బయలుదేరాడు. రాత్రి తాడూరు నుంచి చెన్నారం వైపు వెళ్తుండగా.. మార్గమధ్యంలో రోడ్డుపై తవ్విన కేఎల్ఐ కాల్వలో బైక్తో సహా పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి సుల్తాన్గౌడ్ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య తెలకపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ వివరాల మేరకు.. ఆలేరుకు చెందిన భాషమోని యాదగిరికి నాలుగేళ్ల క్రితం పెద్దముద్దునూరుకు చెందిన శివలీల (24)ను ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివలీల భర్త యాదగిరి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపనికి గురైన శివలీల.. గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి పిట్టల యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్ లింగాల: మండలంలోని అంబట్పల్లి సమీపంలో గురువారం రాత్రి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. అంబట్పల్లి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామని.. ఇసుక తరలిస్తున్న గోవిందు, రాముపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. కేసు నమోదు లింగాల: మండలంలోని అవుసలికుంట సమీపంలో నిలిపిన గొర్రెల మంద నుంచి గురువారం ఒక గొర్రెను దొంగిలించి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు పట్టుకున్నారని ఎస్ఐ నాగరాజు తెలిపారు. గొర్రెను తరలిస్తున్న రమేశ్, మహేశ్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. పశువుల కంటైనర్ పట్టివేత జడ్చర్ల: కంటైనర్లో గుట్టుగా తరలిస్తున్న 36 పశువులను మండలంలోని గొల్లపల్లి శివారులో శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. పశువులను అనంతపూర్కు తరలిస్తున్నారని.. డ్రైవర్ రాంషీద్ పున్నోలిని అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న పశువులను హన్వాడ మండలం చిన్నదర్పల్లి శివారులో ఉన్న గోశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. షాబాద్లో కిరాణ దుకాణం దగ్ధం ఇటిక్యాల: విద్యుదాఘాతంతో కిరాణ దుకాణం దగ్ధమైన ఘటన శుక్రవారం మండలంలోని షాబాద్లో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాధమ్మ కిరాణం దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న సుమారు రూ.70 వేల సామగ్రి కాలి బూడిదయ్యాయని బాధితురాలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి
● అంతకు ముందు జడ్చర్ల మండలం మాచారంలో రేషన్ దుకాణాన్ని ఆహార కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ తనిఖీ చేశారు. ప్రతినెలా 18వ తేదీ వరకే రేషన్ సరకులు ఇవ్వకపోవడం, ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అంత్యోదయ లబ్ధిదారులకు పంచదార ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. జిల్లాలో 18వ తేదీ వరకు 80 శాతం లబ్ధిదారులు మాత్రమే రేషన్ సరకులు పొందారని.. మిగతా 20 శాతం లబ్ధిదారులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ఇకపై ప్రతి రేషన్ దుకాణంలో అవసరమైన నిల్వల కన్నా అదనంగా తీసుకుని 25వ తేదీ వరకు సరకులు ఇచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేందాన్ని తనిఖీ చేశారు. చిన్నారులకు కూరగాయలతో కూడిన సాంబర్ వడ్డించాల్సి ఉండగా.. కేవలం సొరకాయ మాత్రమే తయారు చేయడాన్ని తప్పుపట్టారు. ఇళ్లల్లో ఇలాగే తింటారా అంటూ అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించారు. కోడిగుడ్లు కొన్ని సాధారణ పరిమాణం కన్నా చిన్నవిగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడిగుడ్ల కాంట్రాక్టర్నతో ఫోన్లో మాట్లాడి ఇకపై చిన్న గడ్లను సరఫరా చేయవద్దన్నారు. కోడిగుడ్లు చిన్నవిగా ఇచ్చినా ఎందుకు తీసుకుంటున్నారని అంగన్వాడీ టీచర్ను నిలదీశారు. విషయాన్ని సూపర్వైజర్కు వివరించామని బదులివ్వడంతో సీడీపీఓ, డీడబ్యుఓలపై అసహనం వ్యక్తంచేశారు. కాగా, గొల్లపల్లి వద్ద ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్రావు ఆహార కమిషన్ చైర్మన్, సభ్యులకు స్వాగతం పలికారు. పాలమూరు/జడ్చర్ల టౌన్/భూత్పూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనంలో ప్రభుత్వం ఇచ్చిన మెనూను వందశాతం తప్పనిసరిగా అమలుచేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో తాజా కూరగాయలు, సరకులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలు, రెసిడెన్షియల్ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాల్లో అధికారుల వివరాలతో కూడిన బోర్డులతో పాటు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు నాణ్యతగా ఉండాలన్నారు. గుడ్ల సైజ్ చిన్నగా ఉంటే వెనక్కి పంపించాలని తెలిపారు. రేషన్ దుకాణాల్లో అంత్యోదయ కార్డు కల్గిన వారికి చక్కెర, గోధుమలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. 15 నుంచి 20వ తేదీ వరకు రేషన్ తీసుకునే వారికి బియ్యం కొరత లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో ఆహార కమిషన్ సభ్యులు ఆనంద్, గోవర్ధన్, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ అనిల్, డీఎంహెచ్ఓ డా.కృష్ణ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు నాణ్యతగా ఉండాలి రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి భూత్పూర్ మండలంలోని తాటికొండ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని ఆహార కమిషన్ చైర్మన్ పరిశీలించారు. రోజు భోజనంలో అందిస్తున్న మెనూ గురించి విద్యార్ధులతో ఆరా తీశారు. కార్యక్రమాల్లో డీఎస్ఓ వెంకటేశ్, డీఈఓ ప్రవీణ్కుమార్, డీడబ్ల్యూఓ జరీనాబేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ శశికాంత్, సీడీపీఓలు ప్రభాకర్, శోభారాణి, ఎంపీడీఓ విజయ్కుమార్, డీటీ కిశోర్, ఎంఈఓ ఉషారాణి ఉన్నారు. -
చికెన్ అమ్మకాలు నిలిపివేయండి : కలెక్టర్
మదనాపురం: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొన్నూరు సమీపంలో ఉన్న ఓ పౌల్ట్రీఫాంలో అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడిన నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి పౌల్ట్రీఫాంను పరిశీలించారు. కోళ్లు ఎలా మృత్యువాత పడ్డాయనే విషయంపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సంబంధిత కోళ్ల ఫారం యజమానితో ఆరా తీశారు. ఇటీవల బయటకు ఏమైనా కోళ్లు అమ్మారా అని ప్రశ్నించగా.. ఎవరికి అమ్మలేదని, చనిపోయిన వాటన్నింటినీ ఫాం సమీపంలోనే పూడ్చివేసినట్లు యజమాని బదులిచ్చారు. సమీపంలో ఉన్న చికెన్ దుకాణాలను తెరవనీయొద్దని, ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండోవర్ చేసి.. చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఆదేశించారు. సమీపంలో ఉన్న పౌల్ట్రీఫారాలను సైతం పశుసంవర్ధక శాఖ అధికారులు సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. ఏదైనా ఫాంలో కోళ్లకు అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే.. స్టాక్ బయటికి వెళ్లకుండా ఆపివేయాలని ఆదేశించారు. మృత్యువాత పడిన కోళ్ల శాంపిల్స్ వీబీఆర్ఐకి పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయని చెప్పారు. అనంతరం గ్రామంలో చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్, ఎంపీడీఓ ప్రసన్న కుమారి తదితరులు ఉన్నారు. -
పిన్నంచర్లలో వైరస్ కలకలం
ఆత్మకూర్: బర్డ్ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. మండలంలోని పిన్నంచర్ల గ్రామంలో పౌల్ట్రీ రైతు దామోదర్ ఫాంలో వెయ్యికిపైగా కోళ్లు మృతిచెందాయి. గురువారం జరిగిన ఈ ఘటనతో పౌల్ట్రీ యజమానులు ఉలిక్కి పడ్డారు. రైతు దామోదర్ తనఫాంలో 4 వేలకుపైగా కోళ్లు పెంచుతుండగా మూడురోజుల వ్యవధిలోనే వెయ్యికిపైగా కోళ్లు మృతి చెందాయని వాపోయాడు. ఈ విషయాన్ని పశు సంవర్ధశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గురువారం సందర్శించి మృతిచెందిన కోళ్లను పరిశీలించారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పాతి పెట్టారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి రమేష్ మాట్లాడుతూ గురువారం 450కి పైగా కోళ్లు మృతిచెందాయన్నారు. మృతిచెందిన కోళ్లను పరిశీలించి ఉన్నతాధికారులతోపాటు మహబూబ్నగర్ ఏడీడీఎల్ ల్యాబ్ డాక్టర్ కరుణశ్రీకి సమాచారం ఇచ్చామన్నారు. ఇక్కడ కోళ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తామన్నారు. ఏ వైరస్తో చనిపోయాయనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని, వైరస్ వ్యాపించకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట పశు సంవర్ధక శాఖ జేవీఓ నిర్మల, ఏఎస్లు నాగరాజు, మహిమూద్ తదితరులున్నారు. రూ.లక్షల్లో నష్టం.. పౌల్ట్రీ పరిశ్రమపైనే ఆధారపడి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్లను పెంచుతున్నామని యజమాని దామోదర్ తెలిపారు. మాయదారి వైరస్ వచ్చి 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు పెరిగిన కోళ్లు చనిపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని కోరారు. పౌల్ట్రీఫాంలో వెయ్యి కోళ్లు మృతి -
రైలు ఢీకొని యువకుడి మృతి
గద్వాల క్రైం/ మదనాపురం: గుర్తు తెలియని రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున వనపర్తి రోడ్, శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ మధ్య 167 కిలోమీటర్ దగ్గర గుర్తుతెలియని యువకుడు(31) రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే ఫోన్ నం.83412 52529ను సంప్రదించాలని కోరారు. కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య గోపాల్పేట: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రేవల్లి మండలం కొంకలపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మల్లయ్య వివరాల మేరకు.. కొంకలపల్లికి చెందిన కల్మూరి శివలీల (38), బంగారయ్య భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన శివలీల.. తెల్లవారుజామున తమ వ్యవసాయ పొలంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. గొంతు కోసుకున్న యువకుడు మహమ్మదాబాద్: కుటుంబ తగాదాలతో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహమ్మదాబాద్ మండలం చౌదర్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చౌదర్పల్లికి చెందిన ఖాసీం కుటుంబ తగాదాలతో మనస్తాపానికి గురై బ్లెడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. అడవి జంతువు దాడిలో గేదె మృతి ధన్వాడ: మండలంలోని హనుమాన్పల్లి శివారు ని కపిలగుట్టలో పొలం వద్ద కట్టేసిన గేదైపె బుధవారం రాత్రి అడవి జంతు దాడి చేయడంతో మృతిచెందిందని బాధిత రైతు వెంకట్రెడ్డి తెలిపారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయగా వారు వచ్చి పరిశీలించారు. దాడి చేసిన జంతువు ఏది అనేది నిర్ధారించేందుకు సమయం పడుతుందని అటవీ శాఖ అధికారి పద్మారావు చెప్పారు. దూడపై చిరుత దాడి నారాయణపేట రూరల్: మండలంలోని ఎక్లాస్పూర్ శివారులో ఓ లేగదూడపై చిరుత దాడికి పాల్పడింది. గురువారం వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు లేగదూడ మృతదేహాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇ వ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగుజాడ లు ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సమీపంలోని గుట్టల నుంచి చిరుత వచ్చి దూడపై దాడికి చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో గురువారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు చేరింది. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడయ కాల్వ ద్వారా 160 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. మైనర్లతో వెట్టిచాకిరీ నేరం ఉప్పునుంతల: మండలంలోని ఫిరట్వానిపల్లిలో బాల కార్మికుడితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న పెంటయ్య, శ్రీనివాసులుపై తహసీల్దార్ సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లికి చెందిన బాలుడితో రెండున్నరేళ్లుగా పని చేయించుకుంటున్నారు. ఈ విషయంపై ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఈనెల 18న తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ ఫిరట్వానిపల్లికి వెళ్లి పంచనామా నిర్వహించి అనంతరం ఆ బాలుడిని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్కు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
కోళ్ల దాణా పరిశ్రమ తనిఖీ
భూత్పూర్: అమిస్తాపూర్ సమీపంలోని నోవెల్టెక్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను జిల్లా పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి మధుసూదన్గౌడ్, జేడీ మమత, తహసీల్దార్ జయలక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వనపర్తి జిల్లాలోని ఓ కోళ్ల ఫాంలో కోళ్లు బర్డ్ఫ్లూ వ్యాధితో మృతిచెందగా.. వాటికి ఇక్కడి నుంచే దాణ సరఫరా చేస్తున్నారు. దీంతో మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్లు మధుసూదన్గౌడ్ తెలిపారు. దాణాను శాంపిల్స్ సేకరించామని, పరిశ్రమకు వచ్చే వాహనాలకు ప్రతిరోజు శానిటేషన్ చేయాలని పరిశ్రమ సిబ్బందికి సూచించామని చెప్పారు. పూర్తి నివేదికను కలెక్టర్ అందజేస్తామని పేర్కొన్నారు. వారి వెంట మండల పశువైద్యాధికారి మధుసూదన్, ఆర్ఐలు వెంకటేష్, బాలసుబ్రమణ్యం ఉన్నారు. -
టమాటాలో సస్యరక్షణ చర్యలు
అలంపూర్: టమాటా పంట సాగు చేసిన రైతులు సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. జిల్లాలో ఉన్న అనుకూల పరిస్థితుల్లో రైతులు టమాట పంట సాగు చేశారు. టమాటాలో ఆకు తొలుచు పురుగు ఆశించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పురుగు ఆశిస్తే పంట యొక్క ఆకులను పూర్తిగా తిని వేస్తుంది. ఆకులనే కాకుండా మొగ్గలు, కాయలకు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. దీని వలన 50 నుంచి 100 శాతం వరకు నష్టం జరగవచ్చని తెలిపారు. దీనిని ఆకు తొలుచు పురుగు లేదా పినివామ్ అంటారని పేర్కొన్నారు. దీని శాసీ్త్రయ నామం టూట అబ్బలూట్. ఇది అమెరికా ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం మన ప్రాంతాల్లో ఈ పురుగును గుర్తించినట్లు చెప్పారు. నష్టపరిచే విధానం.. రెక్కల పురుగు 7 నుంచి 8 మిల్లీ మీటర్ల పొడవు ఉండి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. తల్లి పురుగులు లేత ఆకుల కింద, తొడిమల కింద సుమారు 200 గుడ్ల వరకు పెడుతుంది. వీటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు లేత ఆకులపై వంకర టింకర సొరంగాలు చేసి ఆకుపచ్చని పదార్థాన్ని తినివేస్తాయి. దీని వలన కణాలు తెల్లబారిపోతాయి. ఈ పురుగు లేత ఆకు కాండం, మొగ్గలు, పచ్చి కాయలపై రంధ్రాలు చేసి ఆశించడంతో కాయ కుళ్లు వాసన వస్తుంది. ఈ పురుగులు తక్కువ సమయంలో ఎక్కువ పునరుత్పత్తి జరిగి అధిక సంఖ్యలో ఉండటంతో అధిక నష్టం జరుగుతుంది. నివారణ ఇలా.. పురుగు లార్వాలు ఆకుల లోపల ఉండటంతో రసాయన మందులతో నివారించడం చాలా కష్టం. సమగ్ర సస్యరక్షణ చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. ● ప్రతిసారి ఒకే పొలంలో టమాటా పంటను సాగు చేయరాదు. ● పంట చుట్టూ కంచె పంటగా జొన్న, మొక్కజొన్న నాలుగు సాళ్లు నాటితే వాటిపై ఈ పురుగులు చేరుతాయి. దీంతో కొంత వరకు పురుగులను నివారించవచ్చు. ● పొలం వెంబడి, గట్ల వెంట ఉమ్మెత్త మొక్కలు లేకుండా చూడాలి. లేకపోతే ఈ మొక్కలు పురుగులకు అతిథ్యం ఇస్తాయి. లింగాకర్షక బుట్టలు మగ పురుగులను ఆకర్షించే లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఎనిమిది అమర్చుకుంటే మగ పురుగులను నియంత్రించవచ్చు. ఎందుకంటే మగ పురుగులు లేకపోతే సంతానోత్పత్తి వృద్ధికాక పురుగు మనుగడ సాధించలేదు. రసాయన పద్ధతులు ఈ పురుగులకు రసాయనాలకు ఎక్కువగా తట్టుకొనే శక్తి ఉంటుంది. ఎక్కువ సార్లు ఒకే రసాయనం వాడకుండా సూచించిన మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. సైనోసాడ్ 0.3 మి.లీ, కొరాజెన్ 0.3 మి.లీ, డెల్టా మెత్రిన్ 0.5 మి.లీ, ప్రాఫినోఫాస్ 1.5 మి.లీ, వేప నునె 5 మి.లీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 1.5 గ్రాములను లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. పసుపు రంగు అట్టలకు జిగురు ఏ పురుగునైనా ఆకర్షించే గుణం పసుపు రంగు అట్టలకు అధికంగా ఉంటుంది. పసుపు రంగు అట్టలకు గ్రీసు, జిగురు పట్టించి పొలంలో కర్రలకు కడితే రెక్కల పురుగుల వాటికి అతుక్కొని చనిపోతాయి. -
అభయారణ్యంలో శివ శరణు ఘోష
అచ్చంపేట: మహాశివుడి శరణు ఘోషతో నల్లమల ప్రతిధ్వనిస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమఃఓం.. అంటూ శివస్వాములు, భక్తులు మార్మోగిస్తున్నారు. శివదీక్ష చేపట్టిన స్వాములతో పాటు భక్తులు చాలా మంది శ్రీశైలం క్షేత్రానికి కాలినకడన తరలివెళ్తున్నారు. నల్లమల దారి పొడువునా శివనామస్మరణ మార్మోగుతోంది. భక్తులకు అడుగడుగునా దాతలు తమకు తోచిన సాయం చేస్తూ.. అండగా నిలుస్తున్నారు. విడిది కేంద్రాలు, అన్నదానాలు, నీళ్ల ప్యాకెట్లు వితరణ చేయడంతో పాటు ప్రథమ చికిత్స అందిస్తూ తమలోని సేవాగుణం చాటుకుంటున్నారు. రాత్రివేళ అధికంగా.. వివిధ ప్రాంతాల్లో మండల, అర్ధమండల దీక్ష చేపట్టిన శివస్వాములు చాలా మంది కాలినడకన శ్రీశైలం చేరుకొని మహా శివరాత్రి రోజున దీక్షను విరమిస్తారు. అయితే దారిలోనే నిత్యం ఉదయం, సాయంత్రం పవిత్ర స్నానాలు ఆచరించి.. శివాలయాల్లో లింగార్చన, బిల్వార్చనలతో పూజలు చేస్తూ రుద్రనమక చమకాలతో కై లాసనాథుడిని కొలుస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుండటంతో రాత్రివేళ నడుచుకుంటూ వెళ్లేందుకు మక్కువ చూపుతున్నారు. విడిది కేంద్రాలు.. పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకువచ్చి షామియానాలు, భోజనం, మంచినీటి సౌకర్యాలతో పాటు అల్ఫాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం, మన్ననూర్, ఫర్హాబాద్, వటువర్లపల్లి, రాసమల్లబావి, దోమలపెంటల వద్ద దాతలు విడిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. అచ్చంపేట ● శ్రీశైలం నల్లమల అభయారణ్యం మార్గంలో ప్రతి ఏటా 20కి పైగా అన్నదాన కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే మన్ననూర్ తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఉంది. వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. సూచనలు పాటించాలి.. పాదయాత్రగా వచ్చే శివస్వాములు, భక్తులకు అటవీ, పోలీసు శాఖలు ప్రత్యేక సూచనలు చేస్తోంది. నల్లమలలో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ప్రత్యేక ఆంక్షలు విధిస్తోంది. అమ్రాబాద్ అభయారణ్యంతో పాటు రక్షిత ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అడవి జంతువుల నుంచి స్వాములకు ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రక్షణ కల్పిస్తున్నారు. ● శివస్వాములు, భక్తులు అడ్డదారుల్లో వెళ్లరాదు. నిర్దేశిత ప్రాంతాలు, రోడ్డు వెంట మాత్రమే ప్రయాణించాలి. అటవీ మార్గంలోని కాలిబాటలో వెళ్లరాదు. ● రోడ్డకు మధ్యలో నడవకూడదు. రోడ్డుకు ఎమడవైపు నుంచి నడవాలి. ● రోడ్డుపై విశ్రాంతి తీసుకోకూడదు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విరామ ప్రాంతాల్లో మాత్రమే సేద తీరేందుకు అనుమతి ఉంటుంది. అక్కడ తాగునీటి వసతి కూడా కల్పించారు. ● అటవీ ప్రాంతంలో వంటలు వండటం, నిప్పు రాజేయడం నిషేధం. నిబంధనలు ఉల్లఘించి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వారిపై అటవీశాఖ చర్యలు తీసుకుంటుంది. ● ఘాట్రోడ్డు మలుపుల వద్ద సూచనలను పాటించాలి. ● ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు అడవిలో వేయరాదు. ● రాత్రివేళ పాదయాత్ర చేసే శివస్వాములు టార్చిలైట్ లేదా ముందు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రహదారి సూచనగా తెల్లగుడ్డ కట్టాలి. ● అడవి మధ్య మార్గంలో కోతులతో జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహార పదార్థాలు కోతులకు వేయరాదు. ● భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అమ్రాబాద్ సీఐ (87126 57739), ఈగలపెంట ఎస్ఐ (87126 57741) నంబర్లను సంప్రదించాలి. శ్రీశైల క్షేత్రానికి శివస్వాముల పాదయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ప్రధాన రహదారి రోడ్డు మార్గంలో వెళ్లాలి.. శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న స్వాములు, భక్తులు రోడ్డు ప్రమాదంలో వెళ్లడం సురక్షితం. అడవి మార్గంలో జంతువుల నుంచి ప్రమాదం ఉంటుంది. ధారా బేష్ క్యాంపు, రాసమల్లబావి వద్ద భక్తులకు తాగునీటి వసతి కల్పిస్తున్నాం. 14 మంది సిబ్బందితో చెత్త సేకరిస్తున్నాం. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త, కవర్లు తీయిస్తాం. మా సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ -
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
నాగర్కర్నూల్ క్రైం: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తెలకపల్లి మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన శేఖర్, శ్రీనివాసులు బుధవారం ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వెళ్తుండగా తాడూరు మండలం గుంతకోడూరు వద్ద అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రిలో ఉంచగా బాధిత కుటుంబ సభ్యులతోపాటు సగర సంఘం నాయకులు జనరల్ ఆస్పత్రి వద్దకు చేరుకుని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో 3 గంటలపాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సీఐ కనకయ్యగౌడ్ అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొల్లబాబు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు గౌరక్క సత్యం, విజయలక్ష్మి, అల్లం రాముడు, నర్సింహ్మ, చిలుక పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహాప్రభో.. పరిహారం పెంచండి
జడ్చర్ల: ‘పచ్చని పంటలు పండే భూములు త్యాగం చేశాం. తాత ముత్తాల కాలం నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను సైతం వీడి ఊళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వమే తమ త్యాగాలకు సరైన గుర్తింపునివ్వడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు కేవలం రూ.5.50 లక్షల నుంచి రూ.6.50 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంది. కనీసంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీనైనా పెంచి తమకు న్యాయం చేయాలని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు మొర పెట్టుకున్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం ఉదండాపూర్లో నిర్వాసితుల సమస్యలపై బహిరంగసభను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ నవీన్కుమార్, సబ్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నర్సింగరావు, తదితరులు సభకు హాజరయ్యారు. ఒక్కొక్కరుగా నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ భూములకు ఇచ్చిన పరిహారం ఫలహారానికి కూడా చాలలేదని, బయటి మార్కెట్లో ఉన్న ధరలతో పోలిస్తే తమకు అందింది నామమాత్రమే అన్నారు. ఆర్అండ్ఆర్ పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలని, 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పరిధిలో ప్రైవేట్ భూములలో ప్లాట్లు కొనుగోలు చేసి కట్టుకున్న వారికి కూడా పరిహారం అందించాలని, గ్రామ కంఠం వరకే ఉన్న నిబంధనలు తొలగించాలని కోరారు. గ్రామ బహిరంగసభలోఉదండాపూర్ నిర్వాసితుల మొర బాధితులకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అవసరమైతే పదవీ త్యాగానికై నా సిద్ధం దీక్ష విరమించేందుకు నిర్వాసితుల ససేమిరా -
వలస వెళ్లిన వారికి పరిహారం ఇవ్వాలి
బతుకు దెరువు కోసం కొందరు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారికి సంబంధించి రేషన్, ఓటర్, ఆధార్ కార్డులు ఉదండాపూర్లోనే ఉన్నాయి. వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తించేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మొదటి సర్వే అనంతరం పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడ బిడ్డలకు సైతం ప్యాకేజీ ఇవ్వాలి. అనర్హులను గుర్తించి అర్హులకు న్యాయం చేయాలి. – శివకుమార్, నిర్వాసితుడు, ఉదండాపూర్ న్యాయం చేయాలి అర్హత కలిగిన నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని కొందరు అక్రమంగా దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. 132 సర్వే నంబర్లో భూ పరిహారానికి సంబంధించి అక్రమాలు జరిగాయి. రీసర్వే చేసి అసలైన నిర్వాసితులకు న్యాయం చేయాలి. – బ్రహ్మం, నిర్వాసితుడు ఇప్పటికే ఆలస్యమైంది.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పెంచి త్వరగా అందజేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి బయటి మార్కెట్లో ధరలకు వ్యత్యాసం తీవ్రంగా ఉంది. భూ పరిహారం ఫలాహారంగా అయిపోయింది. ప్యాకేజీతో పాటు మా ఇళ్లు, ఖాళీ స్థలాల పరిహారాన్ని ఒకేసారి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. – వడ్ల సత్యనారాయణ చారి, నిర్వాసితుడు ● -
మండలాల వారీగా పనుల మంజూరు ఇలా..
మండలం రోడ్డు నిధులు పనులు (రూ.లక్షల్లో) మహబూబ్నగర్ 14 60 హన్వాడ 13 60 అడ్డాకుల 14 53.50 భూత్పూర్ 13 59 మూసాపేట 14 62 కౌకుంట్ల 12 60 సీసీకుంట 18 66 దేవరకద్ర 14 68.50 మండలం రోడ్డు నిధులు పనులు (రూ.లక్షల్లో) మిడ్జిల్ 16 60 రాజాపూర్ 11 69.20 జడ్చర్ల 11 55 బాలానగర్ 22 66 నవాబ్పేట 12 65.50 గండేడ్ 19 68 మహమ్మదాబాద్ 11 66 కోయిలకొండ 9 63 -
ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం
స్టేషన్ మహబూబ్నగర్: ప్రతి పాఠశాలలో మౌలిక వసతలు కల్పిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికై న పాఠశాలల్లో మరమ్మతులు చేయడం, రంగులు వేయడం, విద్యుత్ సౌకర్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టిన వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.1.30కోట్ల చెక్కులను పాఠశాలల కమిటీ చైర్మన్లకు గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో చాలా పాఠశాలల్లో పనులను చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలను సందర్శించినప్పుడు అ క్కడ ఉన్న అనేక సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని అన్నారు. అత్యవసరమైన వాటికి విద్యా నిధి నుంచి, ఎస్టీఎఫ్ నిధులను ఉపయోగించి పరి ష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో చదివే విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టంకర, కొత్త పేట పాఠశాలల్లో ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు డబుల్ డెస్క్ బెంచీలు అందించామని గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. ప్ర భుత్వ పాఠశాలల ఆస్తుల రక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూ చించారు. త్వరలో ప్రతి పాఠశాలలో సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు మహేందర్, శ్రీనివాస్యాదవ్, మాధవరెడ్డి, సుధాకర్రెడ్డి, రాంచంద్ర య్య, తులసిరామ్నాయక్, సిరిగిరి మురళీధర్, ఆంజనేయులు, ప్రతాప్రెడ్డి, గోపాల్ పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
పాలమూరు: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి అనేది శిక్ష పడే నేరాలు అని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరిపై ఎన్ఏఎస్సీ ఏర్పాటు చేసిన పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులు, మహిళలు, పిల్లలు మానవ అక్రమ రవాణా చేస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 143(2నుంచి 6) వరకు, అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం సెక్షన్ 3 నుంచి 9 ప్రకారం శిక్ష అర్హులని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. శాంతివనాన్ని సందర్శించిన న్యాయమూర్తి జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఉన్న శాంతివనం అనాథ శరణాలయాన్ని న్యాయమూర్తి డి.ఇందిర సందర్శించారు. శాంతివనంలో పిల్లలకు అందుతున్న భోజన వసతి, నీరు సదుపాయం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మానసిక వికలాంగులైన విద్యార్థులతో న్యాయమూర్తి ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం నల్లా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్తో పాటు బాలల సంరక్షణ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. -
రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ ధర రూ.7వేలు దాటింది. ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే మొదటి సారి అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యార్డుకు 2,662 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్కు గరిష్టంగా రూ.7,019, కనిష్టంగా రూ.4,322 లభించింది. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,300, ఆముదా లు రూ.5,560, జొన్నలు రూ.3,751, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,195, కనిష్టంగా రూ.5,820, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,929, మినుములు రూ.7,879 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,802 గా ఒకే ధర లభించింది. -
మేధో సంపత్తి హక్కులతో ప్రయోజనం: పీయూ వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాలకు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు ఉండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్రావు ముంజం, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ రాజ్కుమార్, మధు, అర్జున్కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ హ్యాండ్బాల్ ఎంపికలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన ప్రణయ్, జాన్పాల్, తన్వీర్, శివకుమార్, నరేష్ పవర్, జయప్రకాష్, నాగరాజు, డోకూరు శ్రీధర్, రామకృష్ణ, గౌస్, రాహుల్, గాంధీ.. మొత్తం 12 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరు ఈ నెలాఖరులో తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో జరగనున్న సౌత్జోన్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పీయూ రిజిస్ట్రార్ చెన్నప్ప ఎంపికై న విద్యార్థులను అభినందించి.. పీయూకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, సత్యభాస్కర్ పాల్గొన్నారు. మీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి ● ఎంపీ బండి సంజయ్కుఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సూచన జడ్చర్ల: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని, ముందుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు జారకుండా చూసుకోండి అని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఉదండాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు అధ్యక్ష పదవిని కోల్పోయిన బండి సంజయ్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరు అని ఎదురు ప్రశ్నించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించేందుకు పోరాడాలని హితవు పలికారు. పక్క రాష్ట్రం ఏపీలో బీజేపీ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా నిధులు తెచ్చుకుంటుంటే 8 మంది ఎంపీలు ఉండి ఇక్కడేమో చోద్యం చూస్తున్నారని, కేంద్రంతో నిధుల కోసం కొట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీటీంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, సీఎం రేవంత్రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి ఉంటే మీకేం ఇబ్బంది అన్నారు. బీజేపీ ధ్యాసంతా ప్రభుత్వాలు కూల్చడంపైనే ఉందని మండిపడ్డారు. రాజధాని నడిబొడ్డున ఓ హోటల్లో తాము నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని స్పష్టం చేశారు. -
నేడు ‘పేట’కు సీఎం రేవంత్
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ● సీఎం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్కు భూమి పూజ చేస్తారు. 1.35 గంటల నుంచి 2 గంటల వరకు రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్టియర్ అకాడమిక్ బ్లాక్ల ప్రారంభించనున్నారు. వీటితో పాటు ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లు, వివిధ గ్రామాల్లో రూ.500కోట్లకుపైగా నిధులతో నిర్మించనున్న రోడ్లు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.10గంటలకు బహిరంగసభలో పాల్గొని, మాట్లాడుతారు. పర్యవేక్షించిన అధికారుల బృందం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
ఉపాధి హామీలో సీసీ రోడ్లు మంజూరు
మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరం 2024–25కు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 223 సీసీ రోడ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10.022 కోట్లు మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లో పనులను గుర్తించి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టేలా పరిపాలనా అనుమతులిచ్చింది. సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసిన జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్(డీసీసీ) అధికారులు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేసి బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించారు. రోడ్ల నిర్మాణాలు నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేంద్రిబోయి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ● జిల్లాలో అత్యధికంగా దేవరకద్ర నియోజకవర్గంలో 85 సీసీరోడ్ల నిర్మాణానికి రూ.3.695 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 27 సీసీరోడ్ల నిర్మాణానికి రూ.1.20 కోట్లు, జడ్చర్లలో 72 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.157 కోట్లు, పరిగి నియోజకవర్గం పరిధిలోని గండేడ్, మహమ్మదాబాద్ మండలాల్లో 30 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.34 కోట్లు, నారాయణపేట నియోజక వర్గం పరిధిలోని కోయిలకొండ మండలంలో 9 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.63 లక్షలు మంజూరయ్యాయి. ● ఉపాధి హామీ చట్టం ప్రకారం నిర్ధిష్టమైన ప్రణాళికతో జిల్లాను యూనిట్గా తీసుకొని మొత్తం ఖర్చులో 60 శాతం కూలీలకు, 40 శాతం సామగ్రి కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చుకనుగుణంగా పనులను చేపట్టేలా జిల్లాస్థాయిలో డీసీసీ అధికారుల పర్యవేక్షణలో సీసీ రోడ్డు పనులు చేపడుతారు. జిల్లాలో 223 రోడ్ల నిర్మాణానికి రూ.10కోట్లు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు మార్చి నెలాఖరు లోగా పూర్తి చేసేలా చర్యలు -
తన పట్టుదల వలనే పనులు ప్రారంభం: ఎమ్మెల్యే
నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన, ఎవరూ అడగకపోయినా ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశానని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. గత పాలనలో రూపాయి ఇవ్వకున్నా మభ్యపెట్టి మోసం చేశారని తాను అలా కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను నిర్వాసితుల తరఫున పాదయాత్ర చేసి పోరాడినట్లు గుర్తు చేశారు.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని తీసుకొచ్చి సమస్యలను వివరించామని, అవార్డు పాస్ అయిన తండాలకు రూ.42 కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలలో జమ చేశామన్నారు. మరో రూ.71 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అవార్డు పాస్ అయిన ఆరు మాసాలలో పరిహారాన్ని అందజేస్తామన్నారు. అదనంగా రూ.170కోట్లు పరిహా రం ఇస్తే నిర్వాసితులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. అసలు రిజర్వాయర్ లోకిరేవు దగ్గర రావాల్సి ఉందని, కానీ రాజకీయ పలుకుబడితో దానిని ఉదండాపూర్కు మారిస్తే ఎందుకు ప్రశ్నించ లేదన్నారు. ఇటీవల తన సహచర ఎమ్మెల్యేలతో సమావేశమైంది కూడా నిర్వాసితులకు న్యాయం చేసేందుకే అని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పార్టీని, పదవిని త్యాగం చేసి పోరాడతానన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, కర్వెన రిజర్వాయర్ వరకే పనులను పరిమితం చేద్దామని ప్రభుత్వం భావించిందని, తన పట్టుదల వలనే పనులు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు. సీఎం రేంవత్రెడ్డి తమకు అనుకూలంగా ఉన్నారని, న్యాయపరమైన సమస్యలు రాకుండా పరిహారం పెంపునకు కృషి చేస్తామన్నారు. -
నేడు పీయూలో హ్యాండ్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమిళనాడు పెరియార్ యూనివర్సిటీలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: మండల కేంద్రంలోని మార్కెట్లో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. దాదాపు 2 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. మార్కెట్ వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటాల్ గరిష్టంగా రూ.3 వేలు, కనిష్టంగా రూ.2 వేల ధర పలికింది. గత వారంతో పోల్చితే రూ.200 వరకు ధర పెరిగింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.1,000 వరకు అమ్మకాలు సాగించారు. మధ్యాహ్నం జరిగిన ఈ టెండర్లలో కందుల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,711, కనిష్టంగా రూ.6,688 ధరలు లభించాయి. ఆముదాలు క్వింటాల్ రూ.5,771 ధర పలికింది. -
ఉత్సాహంగా శోభాయాత్ర
స్టేషన్ మహబూబ్నగర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాత్రి హిందూవాహిని ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో భారీస్థాయిలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండమీదిపల్లిలోని శివాజీ మహారాజ్ విగ్రహం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వన్టౌన్, రాంమందిర్ చౌరస్తా, క్లాక్టవర్, అశోక్టాకీస్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, న్యూటౌన్ మీదుగా శెట్టి కాంప్లెక్స్ వరకు నిర్వహించారు. యువత, ప్రజలు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ చూపిన బాటలో మనమందరం నడుద్దామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏపీ మిథున్రెడ్డి, ఆర్ఎస్ఎస్ విభాగ్ అధ్యక్షుడు వేంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, కార్యదర్శి నలిగేశి లక్ష్మినారాయణ, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు వసంతం వెంకటేశ్, రెబ్బ విఘ్నేష్, శ్రీనివాస్, గురురాజ్, అభిలాష్, కుమార్, సంపత్, రామకృష్ణ పాల్గొన్నారు. -
క్యూలైన్లలో నిలబడిన గర్భిణులు
పాలమూరు: ఎంసీహెచ్ భవనంలో గర్భిణులను క్యూలైన్లలో నిలబెట్టారు. ఇది గమనించిన రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్, మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం ఆర్వీ కర్ణనన్ ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జనరల్ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. గర్భిణులను క్యూలైన్లో గంటల తరబడి నిలబెట్టడం సరికాదని, కొత్తగా చికిత్స కోసం వచ్చిన వారికి మాత్రమే ఓపీ తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఓపీ తీసుకొని రెండు, మూడుసార్లు వైద్యురాలితో చికిత్స తీసుకున్న వారికి ఓపీ లేకుండా నేరుగా వైద్యుడి దగ్గరకు పంపించాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కొనసాగుతున్న కంటి పరీక్షల విధానాన్ని ఆయన పరిశీలించారు. కేజీబీవీ, గురుకుల విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ తనిఖీ చేస్తూ స్టాక్ వివరాలు, డ్రగ్స్ సరఫరా విధానాన్ని తనిఖీ చేశారు. మూడో రోజు కంటి పరీక్షలకు 302 మంది విద్యార్థులు హాజరు కాగా వారందరికీ కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు 919 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. 912మంది విద్యార్థులు అద్దాలు ఇవ్వనున్నామని, ఏడుగురికి సర్జరీకి రెఫర్ చేశారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత్, డీఐఓ పద్మజా, తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి అధికారులపై కమిషనర్ ఆగ్రహం కొత్తగా వచ్చిన వారికి మాత్రమే ఓపీ ఇవ్వండి రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్ -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
● ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా అన్ని శాఖలు కృషి చేయాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పాలమూరు: చిన్నచిన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ఉత్తమమని.. వచ్చేనెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గత డిసెంబర్లో నిర్వహించిన లోక్ అదాలత్లో 14,705 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. మార్చి 8న నిర్వహించే లోక్అదాలత్లో ఇంకా ఎక్కువ స్థాయిలో కేసులు రాజీ అయ్యే విధంగా సంబంధిత శాఖలు కృషి చేయాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం మహబూబ్నగర్ కోర్టులో ఐదు బెంచీలు, జడ్చర్ల కోర్టులో ఒక బెంచీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2,029 మంది కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. లోక్అదాలత్లో రాజీ అయితే మళ్లీ అప్పీల్ పోవడానికి లేదని.. ఫీజులు సైతం తిరిగి చెల్లిస్తారని తెలిపారు. ఫ్రీ లిటిగేషన్ కేసులు, క్రిమినల్, విద్యుత్, భూ పంచాయితీ, రోడ్డు ప్రమాద కేసులు, వివాహం కేసులు, బ్యాంకు, సివిల్, క్రిమినల్, ఎంవీఐ యాక్ట్, డ్రంకన్ డ్రైవ్, చెక్కు బౌన్స్ ఇలా రాజీ కావడానికి అవకాశం ఉన్న ప్రతి కేసును లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తి ఇందిర తదితరులు ఉన్నారు. నేడు, రేపు రాష్ట్ర ఫుడ్కమిషన్ బృందం పర్యటన పాలమూరు: జిల్లాలో 20, 21వ తేదీల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం పర్యటిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి జడ్చర్లలో పర్యటించి రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే 21వ తేదీ శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఉంటుందని తెలిపారు. మన్యంకొండ హుండీ లెక్కింపు ● రూ.32.39 లక్షల ఆదాయం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను లెక్కించగా.. రూ. 32,39,301 ఆదాయం వచ్చింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ముగిసింది. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, దేవాదాయశా ఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాలకమండలి సభ్యు లు వెంకటాచారి, శ్రావణ్కుమార్, మంజుల, సుధ, ఐడీబీఐ మేనేజర్ రాజవర్దన్రెడ్డి, సత్య సాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు బి.శాంతికుమార్ అన్నారు. వికారాబాద్లో గురువారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ టోర్నీలో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లు బుధవారం బయలుదేరాయి. ఈ సందర్భంగా మెయిన్ స్టేడియంలో జిల్లా జట్లను అభినందించిన శాంతికుమార్ మాట్లాడుతూ టోర్నీలో సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని అన్నారు. జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు దామోదర్రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి పాపారాయుడు, గణేష్ పాల్గొన్నారు. -
అవినీతిమయం చేశారు..
రాజాపూర్లో నడుస్తున్న ఓ ప్రైవేటు స్కూల్కు ఎలాంటి అనుమతులు లేకుండా టెన్త్ వరకు నడిపిస్తున్నారు. వేరే పాఠశాల తరఫున పరీక్ష రాయిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఓ కార్పొరేట్ విద్యా సంస్థపై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం రూ.2 లక్షలు ఫైన్ వేశారు. వారితో అధికారులు కుమ్మక్కు కావడంతో ఆ ఫైన్ చెల్లించలేదు. కొందరు విద్యాశాఖను అనినీతిమయం చేశారు. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి డిప్యూటేషన్లు రద్దు చేయాలి.. కొందరు స్వార్థం కోసం డిప్యూటేషన్లు తీసుకుని బదిలీ అయిన వారిని వెంటనే తొలగించాలని గతంలో యూటీఎఫ్ ఆద్వర్యంలో పలుసార్లు డీఈఓకు విన్నవించాం. ప్రతిసారి ఎంఈఓలకు చెప్పామని, కొంత మంది వెనక్కి పంపించామని చెబుతున్నారే గానీ వెనక్కి పంపించినట్లు దాఖలాలు లేవు. వెంటనే అనవసర బదిలీలు చేసిన వారిని వెనక్కి పంపించి విద్యార్థులకు అవసరం ఉన్న చోటకు సర్దుబాటు చేయాలి. – వెంకటేష్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తీరు మార్చుకోవాలి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రోజుల తరబడి ఫైల్స్ను పెండింగ్లో పెడుతున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలి. అనధికారికంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – సంతోష్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు విచారణ చేస్తాం.. ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో పలువురు సిబ్బంది వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. పాఠశాలలకు అనుమతుల విషయంలో పూర్తి పారదర్శకంగా పరిశీలించి అనుమతులు ఇస్తాం. అధికారుల ఆదేశాల మేరకు అనవసర డిప్యూటేషన్లను రద్దు చేయాలని ఎంఈఓలకు సూచించాం. ఒక్క ఉపాధ్యాయురాలికే ఎందుకు మెమో ఇచ్చారనే విషయం ఎంఈఓకే తెలియాలి. – ప్రవీణ్కుమార్, డీఈఓ ● -
జీసీడీఓ తొలగింపుపై విచారణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ రాజాపూర్: కేజీబీవీ జీసీడీఓ రాధను బాధ్యతల నుంచి తొలగించటంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బుధవారం ‘సాక్షి’లో ‘కేజీబీవీ జీసీడీఓపై వేటు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖాధికారులు సైతం స్పందించారు. డీఈఓ ప్రవీణ్కుమార్తో పాటు, జీసీడీఓ నుంచి వివరాలు సేకరించారు. ఆమె నియామకం, తొలగింపునకు గల కారణాలు, రాజాపూర్లో విచారణ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈక్రమంలో రాజాపూర్ కేజీబీవీలో ఆర్జేడీ విజయలక్ష్మి సైతం విచారణ చేపట్టి విద్యార్థినులకు కలిగిన ఇబ్బందులు, అధ్యాపకులు, ఎస్ఓ మధ్య ఉన్న మనస్పర్థలు తదితర అంశాలంపై విచారణ చేపట్టారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. వారికి వడ్డించే భోజనాన్ని పరిశీలించి కలిసి భోజనం చేశారు. విద్యార్థినులను ఒత్తిడికి గురిచేయవద్దని, వారికి నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో మరోసారి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే కఠినచర్యలు హెచ్చరించారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎంఈఓ సుధాకర్ను ఆదేశించారు. . డీఈఓను కలిసిన వివిధ సంఘాల నాయకులు డీఈఓ ప్రవీణ్కుమార్ను బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగేంధర్గౌడ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్తో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు కలిశారు. జీసీడీఓను తొల గించేందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు. బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆమెను తొలగించేందుకు ఎవరి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన డీఈఓ.. రాజాపూర్లో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని, జీసీడీఓ రాధను కొనసాగించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని, అందుకు ఒక్కరోజు సమయం ఇవ్వాలని ఆయా సంఘాల నాయకులను కోరినట్లు సమాచారం. డీఈఓ, జీసీడీఓతో వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు రాజాపూర్ కేజీబీవీలో విచారణ చేపట్టిన ఆర్జేడీ విజయలక్ష్మి -
మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాశ్ మృతి
స్టేషన్ మహబూబ్న గర్: మహబూబ్నగర్ మున్సిపల్ మా జీ చైర్మన్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ము త్యాల ప్రకాశ్ (77) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన పలు పదవులను అధిరోహించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రకాశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేశారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందారు. మహబూబ్నగర్ సూపర్బజార్ చైర్మన్, రీజినల్ ఫిలిం సెన్సార్ బోర్డుమెంబర్గా, జెడ్ఆర్యూసీసీ సభ్యుడిగా పని చేశారు. 1999–2004 వరకు మున్సిపల్ చైర్మన్గా, 2005–2012 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2012లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చే రారు. ఆయన ప్రకాశ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడులో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా, స మాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపే శారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎమడ కాల్వల ద్వారా 130 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
మహిళలు.. శక్తికి ప్రతి రూపం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘మీరు శక్తికి ప్రతిరూపం.. మీరే మహబూబ్నగర్ రోల్ మోడల్స్..’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ‘మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాలు’లో భాగంగా బీకేరెడ్డి కాలనీలో ఎమ్మెల్యే సొంత నిధులతో మహిళలకు వివిధ కోర్సులలో మూడు నెలల పాటు ఇచ్చే వృత్తి నైపుణ్య శిక్షణ (మొదటి బ్యాచ్)ను 224 మంది పూర్తి చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మంచి ఆలోచన, సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. స్థానిక మహిళలలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకే మూడు నెలల క్రితం ఈ శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. త్వరలోనే ఎంసెట్ కోసం మరి కొందరికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ముఖ్యంగా మహిళలు బాగుంటేనే కుటుంబంతో పాటు సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. మహబూబ్నగర్లో ప్రతిభకు కొదవలేదని అందుకు నిదర్శనం తమరేనని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 8న మయూరి బ్రాండ్ను విస్తరించనున్నామన్నారు. స్వయం ఉపాధి కింద బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎదగాలనే ఆకాంక్ష ఉండాలి: కలెక్టర్ కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ జీవితంలో ఎదగాలనే ఆశ.. ఆకాంక్ష మహిళలలో నిండుగా ఉండాలన్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారు సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. తాము ఎంచుకున్న, నేర్చుకున్న కోర్సు పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ముందుకు సాగిపోవాలన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరూ నిజం చేయాలన్నారు. జీవితంలో సొంత కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోలీసుశాఖ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కాగా, మహిళలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ముఖ్య అతిథులు జ్ఞాపికలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీప్రసన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాఘవేందర్, శ్రీనివాస్యాదవ్, నాయకులు గుండా మనోహర్, రాజుగౌడ్, ఖాజాపాషా, అంజద్, పోతన్పల్లి మోహన్రెడ్డి, ప్రవీణ్కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఎల్డీఎం కల్వ భాస్కర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సెట్విన్ అధికారి విజయ్కుమార్ పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న 224 మంది -
అభివృద్ధే చరిత్రలో నిలిచిపోతుంది
పెద్దరేవల్లిలో చత్రపతి శివాజి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ అరుణ ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి తదితరులు. రాజాపూర్(బాలానగర్): ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ చేసిన అభివృద్ధే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లిలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చత్రపతి శివాజీకి ఆయన తల్లి ధైర్యాన్ని నూరిపోసిందన్నారు. యువతకు ఆయన పెద్దస్ఫూర్తి అన్నారు. పాలమూరు జిల్లా కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు సీఎం వెనుకబడ్డ జిల్లాపై దృష్టి సారించాలన్నారు. ఉదండపూర్ రైతులు భూములు, ఇళ్లు కోల్పోయారని వారికి పరిహారం అందించాలని కోరారు. పార్టీలు పక్కనపెట్టి సమష్టి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. శివాజీ విగ్రహాన్ని చూస్తే యువతలో స్ఫూర్తి రావాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు నష్టపోయిన ఉదండపూర్ వాసులకు అండగా ఉంటాన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆదిరమణారెడ్డి, సాధువెంకట్రెడ్డి, యాదయ్యగౌడ్, తిరుపతి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, సాహితీరెడ్డి, లింగారెడ్డి, నందీశ్వర్, శ్రీనివాస్నాయక్, కోటజనార్దన్, మహేందర్రెడ్డి, వెంకట్ బాలవర్దన్గౌడ్, లక్ష్మికాంత్, శివ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ సమష్టి కృషితోనే అభివృద్ధి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పెద్దరేవల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ -
ఉదండాపూర్ నిర్వాసితుల ఆందోళన
జడ్చర్ల టౌన్: పాలమూరు ప్రాజెక్టులోని ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు, రైతుల పోరాటం రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. పది రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్న వారు బుధవారం పదుల సంఖ్యలో కావేరమ్మపేట వద్ద ఉన్న ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. వినూత్నంగా నిరసన చేపట్టాలని నిర్ణయించి భిక్షాటన చేయాలని భావించారు. విషయం తెలుసుకున్న సీఐ కమలాకర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. అనుమతి లేదని.. గురువారం ఆర్డీఓ ఉదండాపూర్ గ్రామానికి వచ్చి మాట్లాడతారని చెప్పారు. అప్పటికీ అంగీకారం కుదరకుంటే అప్పుడు అనుమతిస్తామని నచ్చజెప్పారు. ఈ సమయంలో కాసేపు సీఐ, నిర్వాసితుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు ఆత్మహత్యాయత్నం.. భిక్షాటనకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని పోలీసులు తేల్చిచెప్పడంతో మల్లయ్య అనే రైతు వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకోగా గుర్తించిన పోలీసులు వెంటనే అతడిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా భిక్షాటన చేస్తామని నిర్వాసితులు పోలీసులతో వాదనకు దిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో జడ్చర్ల పోలీస్స్టేషన్ వరకు ర్యాలీకి అనుమతించారు. నిర్వాసితులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అతిథిగృహం నుంచి స్టేషన్ వరకు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో భిక్షాటన చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించినా వారు వినలేదు. గురువారం భిక్షాటన చేసి తీరుతామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. భిక్షాటనకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు -
అమ్మవారి షిడే ప్రత్యేకం
పోలేపల్లి ఎల్లమ్మ అంటే దశాబ్దాల నుంచి ప్రత్యేకత సంతరించుకుంది. జాతరలో ఇక్కడ అమ్మవారి షిడే ప్రత్యేకం. గతంలో జాతరలో సిడేకు ఒక జోగు మహిళను కట్టి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించేవారు. పదేళ్లుగా తోట్టెనె కట్టి అందులో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి ప్రదక్షిణ చేయిస్తున్నారు. ిషిడే, రథం ఏళ్ల కిందటి కావటంతో శిథిలావస్థకు చేరాయని భావించిన దాతలు రూ.10లక్షలతో అమ్మవారి సిడే , రూ.14 లక్షలతో రథాన్ని ఆలయానికి అందజేశారు. ఈ ఎడాది బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగిస్తున్నట్లు ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి తెలిపారు. 22వ తేదీన తేరు, 23న రథోత్సవం, 23న ప్రత్యేక పూజలు, 24న గ్రామంలో పల్లకీ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. -
ఏం జరుగుతోంది?
విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు ● గత డీఈఓ ఏసీబీకి చిక్కినా మారని తీరు ● ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల జారీలో చేతివాటం ● లంచం ఇస్తే కాని ముందుకు కదలని ఫైల్స్ ● సమగ్ర విచారణ జరిపించాలని డీఆర్ఓకు విద్యార్థి సంఘాల ఫిర్యాదు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు సిబ్బంది ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. మండల స్థాయిల్లో అధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. ఐదు నెలల క్రితం ఓ టీచర్ ప్రమోషన్ విషయంలో సాక్షాత్తు అప్పటి డీఈఓ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు వివిధ స్థాయిల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ.. యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లంచాలకు అలవాటు పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఆర్ఓ రవికి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు, ఇతర ఫైల్స్ విషయంలో డీఈఓ ప్రవీణ్కుమార్ను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణకు డీఆర్ఓ ఆదేశించినట్లు తెలిసింది. అయితే డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ మొదలు.. కిందిస్థాయి అధికారుల వరకు డబ్బులు ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నేరుగా వెళ్తే పని జరగడం లేదని.. మధ్యవర్తుల ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయని విమర్శలున్నాయి. జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. తనిఖీలకు వెళ్లే అధికారులకు కొంత మొత్తం అప్పగిస్తే ఆ పాఠశాలల జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ● జిల్లాలోని ఓ పాఠశాల అప్గ్రేడేషన్ కోసం యాజమాన్యం ఎంఈఓకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట ఆఫ్లైన్ పద్ధతిలో డీఈఓ కార్యాలయానికి ఫైల్ పంపించేందుకు డబ్బులు తీసుకున్నారని.. తర్వాత దాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పటికీ ఆ పాఠశాలకు అనుమతి రాలేదు. ●● జిల్లాకేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలో ఓ పాఠశాలకు 2024 జీఓ ప్రకారం పేరు మార్చేందుకు అవకాశం లేదు. కానీ యాజమాన్యం పేరు మార్చి.. పాత పాఠశాల పేరు మీదే అనుమతులు ఉన్నట్లు కొనసాగిస్తున్నారు. ● జిల్లాకేంద్రంలోని ఓ పాఠశాలను న్యూటౌన్ నుంచి శేషాద్రినగర్కు మార్చారు. అయినా పాఠశాల భవనం పేరు మీదే అనుమతులు ఉ న్నట్లు తెలుస్తోంది. ఎవరైనా అడిగితే అనుమతి కోసం దరఖాస్తు చేశామని.. ఫైల్ ప్రాసెస్లో ఉందని యాజమాన్యం బుకాయిస్తోంది. ● జిల్లాలోని కోశెట్టపల్లిలోని ఓ పాఠశాల యాజమాన్యం తమకు తెలుసని.. వసతులు లేకపోయినా ఆగమేఘాల మీద పాఠశాలకు 1 నుంచి 7వ తరగతి వరకు ఓ అధికారి అనుమతులు ఇప్పించారని ఆరోపణలున్నాయి. ● జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, రాజాపూర్, అడ్డాకుల, దేవరకద్ర తదితర మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా 30కి పైగా ప్రీప్రైమరీ, ప్లేస్కూల్స్ పేరుతో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని పాఠశాలలకు మిక్స్డ్ ఆక్యూపెన్సీ ఉన్నప్పటికీ అనుమతులు ఇచ్చారు. ● ఇటీవల నిర్మాణం పూర్తయిన ఓ పాఠశాలకు ఫైర్సేఫ్టీ లేకపోయినా.. సర్టిఫికెట్ తీసుకువచ్చారు. ఇక్కడి అధికారులు నేరుగా ఉన్నతాధికారుల అనుమతుల కోసం ఫైల్ను పంపించారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. మచ్చుకు కొన్ని.. -
సర్వే చేసి అనర్హులను ఏరేస్తాం : ఎమ్మెల్యే
ఉదండాపూర్ గ్రామంలో తప్పనిసరిగా సర్వే చేసి అందులో అనర్హులుంటే ఏరి వేసి నిజమైన నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పుర పరిధిలోని పాతబజార్లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉదండాపూర్లో సర్వే జరిగితే తమ దొంగతనం బయటపడుతుందని బీఆర్ఎస్ నాయకులే అడ్డుకుంటున్నారని విమర్శించారు. వల్లూరులో 1,005 మంది రైతులు ఉన్నట్లుగా రికార్డు ఉందని.. సర్వే చేపట్టగా అర్హులు కేవలం 574 మంది మాత్రమే ఉన్నట్లు తేలిందని వివరించారు. మిగిలిన వారంతా బీఆర్ఎస్ నాయకులు చేర్చిన బోగస్ లబ్ధిదారులన్నారు. అదేవిధంగా ఉదండాపూర్లోనూ సర్వే చేపడితే వారి బాగోతాలు బయటపడతాయనే భయంతో అడ్డుకుంటున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేపడతామని తెలిపారు. సర్వే జరిగితే అవార్డు పాసవుతుందని.. ఆరునెలల్లోగా పరిహారం చేతికందుతుందని వివరించారు. తను ఎమ్మెల్యే అయ్యాక తండావాసులకు రూ.41 కోట్లు విడుదల చేయించానని.. మరో రూ.71 కోట్లు కలెక్టర్ ఖాతాలో చేసినట్లు చెప్పారు. తనది రైతు పక్షపాతమని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లిందని, త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాగర్కర్నూల్ క్రైం: కుటుంబకలహాల వల్ల మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గగ్గలపల్లి గ్రామానికి చెందిన రాజుకు భార్యతో కుటుంబకలహాలు చోటుచేసుకున్నాయి. మనస్థాపానికి గురై జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరకొని రాజును పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నాకి పాల్పడిన రాజు జేబులో సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా కుటుంబకలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. బస్టాండులో అనాథ వృద్ధుడు మృతి బిజినేపల్లి: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వట్టెం గ్రామానికి చెందిన అనాథ వృద్ధుడు గోవింద్ (65) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. బిజినేపల్లి రెండో ఎస్ఐ రాజశేఖర్ మృతదేహాన్ని గుర్తించి నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడికి కుటుంబ సభ్యులు లేకపోవడంతో భోజనం లేక అనారోగ్యంతో చనిపోయినట్లు పలువురు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య వీపనగండ్ల: కుటుంబ కలహాల వల్ల ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాణి వివరాల ప్రకారం.. మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన రాచాల శ్రీనివాస్గౌడ్ (50) కొన్ని నెలలుగా భార్య, పిల్లలతో మహబూబ్నగర్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. తమ సమీప బంధువు చనిపోవడంతో వారు ఇటీవల బొల్లారం గ్రామానికి వచ్చారు. బుధవారం ఉదయం కుటుంబంలో నెలకొన్న ఆస్తి పంపకాల విషయంలో ఆవేశానికి గురైన శ్రీనివాస్గౌడ్ తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడు.. అడ్డాకుల: మండల కేంద్రం శివారులో ఎస్ఎస్వీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ ఎం.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్కు చెందిన వినిత్ అడ్డాకుల సమీపంలోని ఎస్ఎస్వీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతని మేనమామ లఖాన్(51) ఇక్కడే పని చేసేందుకు కొన్నాళ్ల క్రితం వచ్చాడు. అతనిని పనికి పెట్టుకోకపోవడంతో మేనల్లుడి వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన లఖాన్ బుధవారం కార్మికులందరు పనిలోకి వెళ్లిన తర్వాత క్వార్టర్స్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కార్మికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మేనల్లుడు వినిత్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి తిమ్మాజిపేట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం.. భూత్పూర్ మండలం భట్టుపల్లితండాకు చెందిన సంధ్య(22)ను, తిమ్మాజిపేట మండలం గొరిట తండాకు చెందిన పాత్లావత్ జగన్కు ఇచ్చి 2023 మేలో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడు. మంగళవారం రాత్రి కూతురు చనిపోయిందని, జడ్చర్ల ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తల్లికి సమాచారం అందించారు. సంధ్యకు భర్త, 11నెలల కూతురు ఉంది. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని హత్య చేశారని తల్లి అంజమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అతివేగానికి రెండు నిండు ప్రాణాలు బలి
తాడూరు: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు గేట్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గురుస్వామి వివరాల మేరకు.. తెలకపల్లి మండలం అనంతసాగర్కు చెందిన అతినారపు శేఖర్ (31), శ్రీనివాసులు (42) బంధువులు. వీరిద్దరు హైదరాబాద్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం నాగర్కర్నూల్లో జరిగిన ఓ శుభకార్యంలో వారు పాల్గొని తిరిగి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్కు బయల్దేరారు. గుంతకోడూరు గేట్ సమీపంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి వీరి బైక్ను ఢీకొట్టి రోడ్డు పక్కనున్న మొక్కజొన్న పంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. శేఖర్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన తెలకపల్లి మండలం కార్వంగకు చెందిన రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ను ఢీకొట్టిన కారు ఇద్దరు యువకుల దుర్మరణం తాడూరు మండలం గుంతకోడూరు గేట్ సమీపంలో ఘటన -
ఇల్లు మా పేరిట రిజిస్ట్రేషన్ చేయించండి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆ వృద్ధ తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానం.. వీరిలో ఐదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు చేసిన వారు చివరికి తమకున్న స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు గతంలో బ్యాంకు రుణం వస్తుందని భావించి మూడో కొడుకుకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కొన్నాళ్లకు అతను తన అక్కకు బదిలీ చేయగా.. ఆ వృద్ధులను ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ గోడును బుధవారం నగర వయోవృద్ధుల సంక్షేమ కమిటీ ఎదుట వెళ్లబోసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన లక్ష్మమ్మ (65), సామర్ల రంగయ్య (70) దంపతులకు స్థానికంగా 133 గజాల స్థలం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం తమకున్న అందులో మూడో కుమారుడు దత్తు బ్యాంకు ఉద్యోగి కావడంతో రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకునేందుకు అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఇటీవల కుటుంబసభ్యుల సమ్మతి లేకుండానే తన అక్క వితంతువు తిరుపతమ్మ (స్టాఫ్నర్స్)కు మార్పిడి చేయించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలనను మాత్రం ఎవరూ సరిగ్గా చూడటం లేదు. చివరకు ఇంటి మేడపైన ఉన్న సింగిల్ బెడ్రూంలో దివ్యాంగుడైన చివరి కుమారుడు రాజు వద్ద ఉంటున్నారు. ఈయనతో పాటు భార్యాపిల్లలు, వృద్ధ దంపతులకు ఏమాత్రం గదులు సరిపోక అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే వరండాలో చుట్టూ డే రాలు వేసుకుని నివసిస్తున్నారు. ఇప్పటికై నా ఈ ఇంటిని తమ పేరిట మార్పిడి చేయించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అధికారులకు విన్నవించారు. స్పందించిన నగర వయోవృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ డి.మహేశ్వర్రెడ్డి, కమిటీ కన్వీనర్ సీడీపీఓ రాధిక, వన్టౌన్ సీఐ ఎం.అప్పయ్య, డా.మహమ్మద్ అస్గర్ అలీ, జి.నాగభూషణం, కె.జయప్రద సమా వేశమయ్యారు. ఈకేసుకు సంబంధించిన కుటుంబసభ్యులందరినీ పిలిపించి పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈనెల 23వ తేదీ వరకు తమకు గడువు ఇవ్వాలని, తమ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఒక అంగీకారానికి వస్తామని అధికారులకు కుటుంబసభ్యులు తెలిపారు. ● మమ్మల్ని కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు ● వయోవృద్ధుల సంక్షేమ కమిటీకి తల్లిదండ్రుల వేడుకోలు -
భక్తుల పాలిట కల్పవల్లి.. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి
కోస్గి: భక్తుల పాలిట కల్పవల్లిగా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బాసిల్లుతోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి స్వయంభూగా వెలిశారు. రాష్ట్రంలో మేడారం తర్వాత అంతటి ఆదరణ ఉన్నది పోలెపల్లి జాతర మాత్రమే. మినీ మేడారంగా ఈ జాతర ప్రసిద్ధికెక్కింది. గురువారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు అమ్మవారి జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటుగా పొరు గు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు సూరత్, అహ్మదాబాద్ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, పాలకవర్గం సభ్యులు తెలిపారు. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి అన్ని శాఖలతో అధికారులతో సమావేశం నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. హెలీప్యాడ్ సిద్ధం మిని మేడారంగా పేరొందిన పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు 21వ తేదీన జరిగే షిడే ఉత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి హాజరై అమ్మవారి దర్శింకుంటున్నారు. ఇప్పటికే రెండు వరుసల రోడ్లు పూర్తిచేశారు. సీఎం రాక కోసం హెలీప్యాడ్ సిద్ధం చేశారు. ప్రత్యేక బస్సులు.. పోలేపల్లి ఎల్లమ్మ జాతరకు భక్తులు ఆధిక సంఖ్యలో వస్తుండటంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా నారాయణపేట, కోస్గి, తాండూర్, పరిగి డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేయనుంది. ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులకు దేవస్థాన కమిటీ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తుంది. మినీ మేడారంగా పోలేపల్లి జాతర స్వయంభూగా ఎల్లమ్మ అమ్మవారు నేటి నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు 21న షిడేకు రానున్న సీఎం రేవంత్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్, ఎస్పీ -
నమ్మించి.. మోసం చేశారు
మిడ్జిల్: ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్న తమను సంప్రదించండి అంటూ సోషల్ మీడియా ప్రకటనలు వెల్లువలా కనిపిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కొందరు వీరిని నమ్మి మోసపోతుంటారు. ఇలాంటే సైబర్ మోసానికి గురైన ఘటన బుధవారం మిడ్జిల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు తండ్రి జంగయ్య గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇన్స్టాలో హర్షసాయి ఐడీతో ఉన్న గ్రూప్లో సహాయం కావాలని ఆంజనేయులు కోరాడు. ఇది గమనించిన కేటుగాళ్లు హర్షసాయి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, రూ.4లక్షలు సహాయం చేస్తామని ఆంజనేయులును నమ్మించారు. డాక్యుమెంట్ చార్జి, ఆఫీస్ బ్యాక్ ఎండ్ చార్జి ఉంటాయని మీరు డబ్బులు పంపితే వెంటనే సహాయం అందుతుందని తెలిపారు. నిజమేనని నమ్మిన బాధితుడు ఆంజనేయులు వారిచ్చిన నంబర్లకు మంగళవారం సాయంత్రం ఫోన్పే ద్వారా ఐదు విడుతల్లో రూ.22,500 పంపించాడు. సహాయం కావాలని బాధితుడు పదేపదే ఫోన్ చేయగా బుధవారం ఉదయం కేటుగాళ్లు రూ.5,500 తిరిగి పంపించారు. తర్వాత వారు ఇచ్చిన ఫోన్ నంబర్లు స్విచాఫ్ అయ్యాయి. మోసపోయానని భావించిన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. సైబర్ కేటుగాళ్ల వలకుచిక్కుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు -
నేడు పీయూలో హ్యాండ్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమిళనాడు పెరియార్ యూనివర్సిటీలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: మండల కేంద్రంలోని మార్కెట్లో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. దాదాపు 2 వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. మార్కెట్ వ్యాపారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటాల్ గరిష్టంగా రూ.3 వేలు, కనిష్టంగా రూ.2 వేల ధర పలికింది. గత వారంతో పోల్చితే రూ.200 వరకు ధర పెరిగింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.1,000 వరకు అమ్మకాలు సాగించారు. మధ్యాహ్నం జరిగిన ఈ టెండర్లలో కందుల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,711, కనిష్టంగా రూ.6,688 ధరలు లభించాయి. ఆముదాలు క్వింటాల్ రూ.5,771 ధర పలికింది. -
మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాశ్ మృతి
స్టేషన్ మహబూబ్న గర్: మహబూబ్నగర్ మున్సిపల్ మా జీ చైర్మన్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ము త్యాల ప్రకాశ్ (77) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన పలు పదవులను అధిరోహించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రకాశ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేశారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందారు. మహబూబ్నగర్ సూపర్బజార్ చైర్మన్, రీజినల్ ఫిలిం సెన్సార్ బోర్డుమెంబర్గా, జెడ్ఆర్యూసీసీ సభ్యుడిగా పని చేశారు. 1999–2004 వరకు మున్సిపల్ చైర్మన్గా, 2005–2012 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2012లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చే రారు. ఆయన ప్రకాశ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడులో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా, స మాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపే శారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎమడ కాల్వల ద్వారా 130 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ : వ్యక్తి మృతి
శాంతినగర్: ట్రాక్టర్ను మోటార్ సైకిల్ ఢీ కొట్టిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వడ్డేపల్లి మండలం జూలెకల్ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జూలెకల్ శివారులో ట్రాక్టర్లో డీజిల్ అయిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ వెళ్లాడు. ఈ క్రమంలో శాంతినగర్ నుంచి అయిజ వైపు మోటార్సైకిల్పై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి(50) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
మోకాళ్లపై నడుస్తూ శ్రీశైలానికి యాత్ర
దోమలపెంట: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన శివమాలధారుడు 63 ఏళ్ల బాలనాగయ్య మోకాళ్లపై నడుస్తూ శ్రీశైలానికి బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక అయ్యప్ప ఆలయంలో సేద తీరుతుండగా గ్రామస్తులు పలువురు ఆయనతో మాట్లాడగా వివరాలు వెల్లడించారు. నాలుగేళ్ల కిందట శివమాల ధరించి మోకాళ్లపై నడుస్తూ శ్రీశైలానికి బయలుదేరానని.. ఉమామహేశ్వరం కమాన్ వద్దకు చేరుకోగానే అస్వస్థతకు గురికావడంతో యాత్ర ముగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడటంలో ఈ నెల 10న తిరిగి ఉమామహేశ్వరం కమాన్ నుంచి యాత్ర ప్రారంభించినట్లు వివరించారు. ఆయన వెంట ఇద్దరు కుమారులు, శివదీక్షలో ఉన్న మరో నలుగురు ఉన్నట్లు చెప్పారు. -
కేజీబీవీ జీసీడీఓపై వేటు
● విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ ఉత్తర్వులు ● రిపోర్టు అనుకూలంగా ఇవ్వనందుకేతొలగించారని ఆరోపణలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) జీసీడీఓ(గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్)పై వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ ప్రవీణ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఓ పాఠశాలలో విచారణకు సంబంధించి అనుకూలంగా రిపోర్టు ఇవ్వనందుకే జీసీడీఓను తొలగించారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల రాజాపూర్ కేజీబీవీలో ఎస్ఓ విద్యార్థినులకు సరిగా గుడ్లు, అరటి పండ్లు ఇవ్వడం లేదని, విద్యార్థినులను పాఠశాలలో చేర్చుకునే విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు జీబీవీ వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో డీఈఓ విచారణకు ఆదేశించారు. రాజాపూర్ ఎంఈఓ, కేజీబీవీ జీసీడీఓ రాధ సైతం విచారణకు వెళ్లి రిపోర్టును సమర్పించారు. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అనుకున్న క్రమంలో కేజీబీవీ జీసీడీఓ రాధను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. విద్యాశాఖ అధికారుల తీరుపై యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్తో పాటు పలువురు సంఘం నాయకులు డీఈఓను కలిశారు. వారు మాట్లాడుతూ ఇలాంటి పరిణామాలు బాధాకరమని, సంబంధం లేకుండా ఒక అధికారిణి తొలగించడం సరికాదని విమర్శించారు. ఎవరికి మేలు చేసేందుకు తొలగించారని, గతంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని తీసుకువచ్చేందుకు అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. జీసీడీఓగా నియమించేందుకు అర్హత లేకుంటే మొదట విధుల్లోకి తీసుకోకుండా ఉండాల్సిందని, ఇప్పుడు అర్ధాంతరంగా తొలగిస్తే సంబంధిత అధికారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, ఈ అంశాన్ని పరిశీలించాలన్నారు. తమకు అనుకూలంగా రిపోర్టు రాయనందుకే కొందరు కుట్రలు పన్ని జీసీడీఓ తొలగించారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేదు కేజీబీవీ జీసీడీఓ రాధను విధుల నుంచి తొలగింపునకు, రాజాపూర్ కేజీబీవీ విచారణకు ఎలాంటి సంబంధం లేదు. రెండు నెలల క్రితమే తొలగించేందుకు ప్రతిపాదనలు పంపించాం. జీసీడీఓగా నియామకం చేసే క్రమంలో ఆమె ఎలాంటి అర్హత లేదు. అందుకే తొలగించాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, -
కూలీలు, సాగుదారులు
87.6%కూలీలు సాగుదారులు92.2%86.9%88.2%33.9 %27.3 %81.1%25.9 %22.3 %20.8 %వనపర్తిజో.గద్వాలనారాయణపేటనాగర్కర్నూల్మహబూబ్నగర్ -
అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉపాధి, పరిశ్రమలు కరువు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్నగర్లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి. పశుసంపదలో మేటి.. పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్కర్నూల్లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు జిల్లాలు గద్వాల, పేటలో 50 శాతంలోపే.. తలసరి ఆదాయంలోనూ అంతంత మాత్రమే మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి జనాభా సాంద్రతలో.. (ప్రతి చదరపు కిలోమీటర్కు) -
ధర ఎలా ఉంటుందో తెలియదు..
ఉల్లి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడం లేదు. ధర బాగా వస్తుందని మార్కెట్కు తెస్తే ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఒక్కోసారి కూళ్లు, రవాణా ఖర్చులు కూడా చేతికందని పరిస్థితి. వారం వారం ఉల్లి అమ్మకాలు ఉండటంతో ధరలను వ్యాపారులు వేలంలో నిర్ణయిస్తారు. – రాములు, ఉల్లి రైతు, పోతన్పల్లి ఈ నెలలో ధర లేదు.. నవంబర్ చివరిలో ఉల్లిగడ్డను మార్కెట్క తీసుకెళితే క్వింటాకు రూ.2,600 ధర వచ్చింది. నెల రోజుల తర్వాత తీసుకెళ్లిన ఉల్లికి రూ.4,800 ధర పలికింది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంది. దిగుబడులు పెరిగితే ధరలు పడిపోతాయి.. తగ్గితే ధరలు పెరుగుతున్నాయి. – గోపాల్, ఉల్లి రైతు, పల్లెగడ్డ రైతుకు నష్టం లేకుండా చూడాలి.. ఉల్లి ధరలు ఒడి దుడుకులకు గురవుతుంటాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పెరిగితే ఇక్కడ ధరలు తగ్గుతాయి. దిగుబడులు లేకుంటే ధరలు పెరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారు. కనీస ధరలు నిర్ణయించడంతో పాటు ఉల్లి రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి నష్టాలు రాకుండా చూడాలి. – సాంబశివుడు, టీయూసీఐ నాయకుడు ● -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చెందిన సందె వెంకట్రాములు మక్తల్లో శ్రీనిధి అనే సొసైటీని ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి ప్రతినెలా కిస్తుల ప్రకారం డబ్బులు కట్టిస్తున్నారు. అయితే సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్స్టేషన్లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. అయితే సందె వెంకట్రాములు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్స్టేషన్కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం ఓ కేసు విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
‘నక్ష’తో వివాదాలకు చెక్
జడ్చర్ల టౌన్: ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు నక్ష ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేషనల్ జియో నాలెడ్జ్ బేస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యబిటేషన్స్ (నక్ష) కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ)లో భాగంగా ‘నక్ష’ను చేపట్టారన్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ, పురపాలక శాఖల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల పూర్తి వివరాలన్నీ జియో స్పేషియల్ సాంకేతికతో సేకరించటంతోపాటు రెవెన్యూ రికార్డులను ఆధునికీకరించి పక్కాగా నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల, కొడంగల్ పట్టణాలు ఉన్నాయని, ఇక్కడ ఏడాది పాటు పైలెట్ ప్రాజెక్టు అమలు చేశాక వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు,చేర్పులు చేసిన అనంతరం దశలవారీగా మిగతాపట్టణాల్లో అమలు చేస్తారన్నారు. సర్వే చేసిన తరువాత అభ్యంతరాలు స్వీకరించి నక్ష వెబ్సైట్లో నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సర్వేలో పాలుపంచుకొని క్షేత్రస్థాయిలో సర్వేకు వచ్చినపుడు అన్ని వివరాలు తెలపాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు మాట్లాడుతూ ఆస్తులపై గొడవలు ఎక్కువగా ఉంటాయని, నక్ష సర్వేతో వీటికి పరిష్కారం లభిస్తుందన్నారు. ఇంటి యజమాని పేరు, ఆస్తిపన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబరు ప్లాన్, నల్లా కనెక్షన్ వంటి సమస్త వివరాలతో సర్వే చేస్తారన్నార. పారదర్శకంగా ఆస్తిపన్ను ముదింపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ సర్వే పూర్తయితే ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవటానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్లు రమేష్, శశికిరణ్, నాయకులు రాంమోహన్, జన్నులక్ష్మణ్లు సందేహాలను వెలిబుచ్చారు. సర్వేలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు వారికి వివరించారు. అంతకుముందు కలెక్టర్ విజయేందిర బోయి డ్రోన్ను ఎగురవేసి లాంఛనంగా సర్వేను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, డీటీసీపి అదనపు డైరెక్టర్ రమేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్రావు, మున్సిపల్కమీషనర్ లక్ష్మారెడ్డి, తహశీల్దార్ నర్సింగ్రావు, వైస్చైర్పర్సన్ పాలాది సారిక, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. పక్కాగా రెవెన్యూ రికార్డుల నిర్వహణ కలెక్టర్ విజయేందిర బోయి జడ్చర్లలో నక్ష సర్వే ప్రారంభం -
ఒడిదుడుకుల ఉల్లి
దేవరకద్ర: ఉల్లి రైతు ఆటుపోటులను ఎదుర్కొనక తప్పడం లేదు. ఒక నెలలో తక్కువ ధర పలికితే మరో నెలలో చుక్కలనంటుతుంది. దిగుబడి పెరిగినప్పుడు రూ.వందల్లోకి.. తగ్గితే రూ.వేలల్లో ధరలు పలుకుతాయి. జిల్లాలో దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ఉల్లి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రతి బుధవారం ఇక్కడ ఉల్లి వేలం నిర్వహిస్తారు. స్థానిక వ్యాపారులతో పాటు ఇతర మార్కెట్ల వ్యాపారులు, లైసెన్సులు లేని చిరు వ్యాపారులు కూడా వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. దీంతో ఉల్లి వ్యాపారం ప్రతి వారం జోరుగా సాగుతుంది. వ్యాపారులు కూడా ఆ ఒక్క రోజు ఉల్లి విక్రయాలకే ప్రాధాన్యం ఇస్తారు. నిలకడ లేని ధరలు.. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి దిగుబడులు పెరిగితే హైదరాబాద్ మార్కెట్లో ధర పడిపోతుంది. దిగుబడులు తగ్గితే ధరలు ౖపైపెకి ఎగబాకుతాయి. దీంతో దేవరకద్ర మార్కెట్లో కూడా ధరలు వారం వారం మారుతుంటాయి. ఓ సీజన్లో ధరలు ఆకాశాన్ని అంటితే.. మరో సీజన్లో ధరలు పాతాళానికి పడిపోతాయి. ● దేవరకద్ర మార్కెట్ చరిత్రలోనే 2020లో రికార్డు ధర నమోదైంది. ఆ ఏడాది అక్టోబర్ 28న జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా ధర రూ.8,200, కనిష్టంగా రూ.7,000 ధర పలికింది. చిరు వ్యాపారులు అదే నెలలో కిలో రూ.100గా విక్రయించారు. ● 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరిలో క్వింటా ఉల్లి ధరలు గరిష్టంగా రూ.3,800, కనిష్టంగా రూ.3,200గా నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా రూ.2,500కు దిగి వచ్చింది. యాసంగి సీజన్లో అధిక దిగుబడి రావడంతో రూ.1,200కు పడిపోయింది. ఏడాది చివరి వరకు రూ.2,800 నుంచి రూ.1,800 వరకు ధరలు పలికాయి. ● 2022 రూ.1,200 నుంచి రూ.4,000 వరకు పలికాయి. 2023లో జనవరి నుంచి మార్చి వరకు క్వింటా ఉల్లి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ధరలు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.1,600 నుంచి రూ. 2,800 వరకు.. సెప్టెంబర్, అక్టోబర్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధర పలికాయి. నవంబర్లో గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,600గా నమోదయ్యాయి. డిసెంబర్ చివరి వరకు రూ.2 వేల నుంచి రూ.3,600 వరకు నమోదయ్యాయి. ● 2024 జనవరిలో దిగుబడి బాగా పెరగడంతో ధరలు బాగా పడిపోయాయి. ప్రారంభంలో క్వింటా రూ.1,000 నుంచి రూ.1,600 వరకు ఉండగా ఫిబ్రవరి నుంచి మే వరకు కనిష్టంగా రూ.900, గరిష్టంగా రూ.1,300 ధరలు వచ్చాయి. మే చివరలో రూ.2,800కి, జూన్లో రూ.2,500 నుంచి రూ.3,100 వరకు పలికాయి. జూలై, ఆగస్టులో రూ.3,650 నుంచి రూ.4,300.. సెప్టెంబర్లో గరిష్టంగా రూ.5,600 వరకు ధర వచ్చింది. అక్టోబర్లో కొత్త ఉల్లి రాకతో రూ.2400 నుంచి రూ.3,100 వరకు పడిపోయాయి. నవంబర్లో మళ్లీ పుంజుకొని గరిష్టంగా రూ.4,550, కనిష్టంగా రూ.2,600 పలికాయి. డిసెంబర్ ప్రారంభంలో రూ.4,750.. రెండో వారంలో రూ.5,100 ధర లభించింది. ● ఇక ఈ ఏడాది జనవరి నుండి ఉల్లి ధరలు అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ప్రారంభంలో గరిష్టంగా రూ.4,100 వరకు ఉండగా కనిష్టంగా రూ.2,000 వరకు ధర వచ్చింది. ఈ నెలలో గరిష్ట ధర రూ. 2,800, కనిష్ట ధర రూ.1,800 వరకు పలికాయి. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడం వల్ల ఉల్లి దిగుబడులు మార్కెట్కు ఎక్కువగా రావడంతో ధరలు తగ్గు ముఖం పట్టాయి. ప్రతి ఏటా తగ్గుతూ పెరుగుతున్న ధరలు 2020లో రికార్డు ధర రూ.8,200 నమోదు ప్రస్తుతం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతున్న ధర -
నిరంతరంగా పర్యవేక్షించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఎక్కడా తాగు, సాగు నీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ నిర్వహించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే, సత్వరమే పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, డిమాండ్పై ఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో రోజుకు సరాసరి విద్యుత్ వినియోగం 7.16 ఎంయూ ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజుకు సరాసరి వినియోగం 7.98ఎంయూగా ఉందన్నారు. జిల్లాలో క్రిటికల్ ఓవర్ లోడెడ్ సబ్స్టేషన్ ఒకటి, 13 కేవీ ఫీడర్లు 4, 11 కేవీ ఫీడర్లు 2, ఆరు పవర్ ట్రాన్స్ఫార్మర్ల పనులు ప్రగతిలో ఉన్నాయని, ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. 258 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు. 94407 68923, 94910 61101 నంబర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నాలుగు అత్యవసర విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాచీన కళలను ప్రోత్సహించాలి స్టేషన్ మహబూబ్నగర్: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తేదీన జిల్లాకేంద్రం సింహగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎదుట జనతా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణం నాటక ప్రదర్శన, సామూహిక లింగాష్టక, బిల్వాష్టక పారాయణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి వీటికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాచీన కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జనతా సేవా సమితి ప్రతినిధులు నారాయణ, జనార్దన్ గురుస్వామి, వి.దుర్వాసరాజు, సుధాకరాచారి, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హోటళ్లలో తనిఖీలు పాలమూరు: జిల్లా కేంద్రంలో ఫుడ్సేఫ్టీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంగళవారం నగరంలోని న్యూటౌన్లో ఉన్న పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఓ టీ పాయింట్లో చాయపత్తి, బిస్కెట్ల శాంపిల్స్, ఓ హోటల్లో వెజిటబుల్ బిర్యానీ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఓ మార్ట్కు సంబంధించి పలు రకాల తినుబండారాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. అలాగే పరిశుభ్రంగా లేని హోటళ్లకు నోటీసులు అంటించారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్కుమార్, శిక్షణ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, కరుణాకర్ పాల్గొన్నారు. -
మహిళ బలవన్మరణం
బల్మూర్: మండల కేంద్రంలో మంగళవారం పురుగుమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొప్పెల్లి సాలమ్మ (50) సోమవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగింది. గుర్తించిన ఇరుగు పొరుగు వారు వెంటనే చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమాదేవి తెలిపారు. ఉరేసుకొని వృద్ధురాలు.. వనపర్తి రూరల్: పట్టణంలోని పీర్లగుట్టకు చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాలు.. పీర్ల గుట్టకు చెందిన పల్ల సుబ్బమ్మ (58) పదేళ్ల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది. ఇటీవలే ఆమె ఊపిరితిత్తులు కూడా పాడైపోయాయి. మానసికంగా కృంగిపోయి జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంటి కిటికీకి చీరతో ఉరేసుకొంది. ఉదయం కుమారుడు వచ్చి చూడగా కిటికీకి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు వెంకటేష్ మంగళవారం పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. హత్య చేయాలనే కుట్రలో వ్యక్తి రిమాండ్ మహబూబ్నగర్ క్రైం: కుటుంబ కలహాల కారణంగా పథకం ప్రకారం కిరాణ దుకాణంలో ఉన్న వ్యక్తిని హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి తగలపెట్టి పారిపోయిన వ్యక్తిని వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వన్టౌన్ సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని హాబీబ్నగర్కు చెందిన అబ్దుల్ సమ్మద్, రామయ్యబౌళికి చెందిన షేక్ ఖలీద్ ఇద్దరూ బంధువులు. కొన్ని రోజుల నుంచి రెండు కుటుంబాల మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జనవరి 8న రాత్రి అబ్దుల్ సమ్మద్ కిరాణ దుకాణంలో ఉన్న సమయంలో షేక్ ఖలీద్ తనను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్తో అక్కడికి పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. అబ్దుల్ సమ్మద్తో పాటు దుకాణంపై ఆ పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు..షేక్ ఖలీద్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్లో భాగంగా జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం కొత్తకోట రూరల్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆదృశ్యమైన ఘటన పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యుగంధర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు పానుగంటి అలివేల, పెద్ద నాగయ్య కుమార్తె మరియను పదేళ్ల క్రితం వనపర్తి మండలంలోని అంజనగిరికి చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి చందు(8), మణి (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. రామకృష్ణ మూడు నెలల క్రితం మృతి చెందాడు. మరియ పిల్లలతో కలిసి తల్లి అలివేల వద్ద పామిరెడ్డిపల్లిలో ఉంటుంది. ఈనెల 13న మరియ ఇంటి నుంచి పిల్లలతో కలిసి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల దగ్గర వెతికినా సమాచారం లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మహిళపై దాడి: కేసు నమోదు పాన్గల్: మహిళపై రాయితో దాడిచేసి గాయపర్చిన ఘటనపై మంగళవారం కేసు నమోదైనట్లు హెచ్సీ ప్రసాద్ తెలిపారు. వివరాలు.. మండలంలోని దావాత్ఖాన్పల్లికి చెందిన జంబులమ్మ మంగళవారం తన ఇంటి సమీపంలో కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఇదే గ్రామానికి చెందిన సహదేవుడు రా యితో మహిళపై దాడిచేశాడు. దీంతో మహిళకు కుడికాలు, మోకాలు కింది భాగంలో బలమైన రక్తగాయమైంది. గతంలో ఇదేవ్యక్తి బాధి త మహిళ ఇంటి తలుపులు తోసిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనపై మహిళ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు సహదేవుడుపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ తెలిపారు. -
సల్లంగా చూడమ్మ.. జములమ్మ
గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ప్రజల ఇంటి ఇలవేల్పుగా విరాజిల్లుతున్న జములమ్మ క్షేత్రం మంగళవారం భక్తజనసంద్రంగా మారింది. తెల్లవారుజామున 4.30 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. నడిగడ్డతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. అమ్మవారికి కోళ్లు, మేకపోతులు బలిచ్చి.. నైవేద్యాలు సమర్పించారు. సల్లంగా చూడమ్మ.. జములమ్మ తల్లి అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పాలకవర్గ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిక్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుశ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి గంటా కవిత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందించారు. -
ఘనంగా ముగిసిన పద్యనాటక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో దేవాలయం ఆవరణలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలు మంగళవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు శ్రీరాజరాజేశ్వరి భజన మండలి (మహబూబ్నగర్), శ్రీరామాంజనేయ భజన మండలి (బొక్కలోనిపల్లి) బృందాలు భజనలు ఆలపించారు. పుట్టోజు చంద్రమౌళి బృందం అన్నమయ్య సంకీర్తనాలహరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్య మండలి కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. పద్య నాటక ప్రదర్శనల విజయవంతానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, సూపరింటెండెంట్ నిత్యానందం, శ్రీమిత్ర కళా నాట్య మండలి ఉపాధ్యక్షులు ఎన్.నర్సింలుతోపాటు భాస్కరాచారి, రాంచంద్రయ్య, కురుమూర్తి, ఆంజనేయులు, మాసన్న, పాండురంగాచారి, నారాయణ, రాము తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్ వ్యభిచారం !
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో కొత్త ట్రెండ్ వ్యభిచారం కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. ఈ వ్యవహారమంతా వాట్సాప్లో డీల్చేసి చివరి తంతు అద్దె ఇళ్లలో పూర్తి చేస్తున్నారు. పాలమూరుతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న జడ్చర్ల, భూత్పూర్లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల పోలీసుల కన్నుసన్నల్లో.. మరికొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. కొందరు ఈ వృత్తిని జీవనోపాధి కోసం చేస్తుండగా.. మరికొందరిని డబ్బు ఆశజూపి ఈ రొంపులోకి దింపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా.. ఎవరికి అనుమానం రాకుండా నివాస గృహాలనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో ఈ కేంద్రాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ వేదికగా ఈ వ్యాపారం నడిపిస్తూ సెల్ఫోన్లోనే బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. కొందరు గృహిణులను సైతం ప్రలోభాలకు గురిచేసే ఈ రొంపిలోకి లాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పచ్చటి కుటుంబాలు నాశనమవుతున్నాయి. హైవే వెంట.. పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్తో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న రాయికల్, అడ్డాకుల టోల్ప్లాజా సమీపం, కావేరమ్మపేట, దివిటిపల్లి వంతెనతో పాటు మరికొన్ని చోట్ల ఈ దందా బాగానే సాగుతున్నట్లు సమాచారం. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు కొందరు ఉండగా.. విలాసవంతమైన జీవితం కోసం మరికొందరు వృత్తిలోకి దిగుతున్నారు. జిల్లాకేంద్రంలో రోజు పదులసంఖ్యలో ఇళ్లు, హోటళ్ల గదులతో పాటు చిన్న చిన్న లాడ్జీల్లో ఈ దందా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తనిఖీలు నిర్వహిస్తున్నాం.. పట్టణంలో వ్యభిచారం, గంజాయి, పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యభిచారం జరుగుతుందని అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాం. కేంద్రాలు కొనసాగుతున్న ట్లు పోలీసులకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్రూం ప్రాంతంలో కార్డెన్సెర్చ్ నిర్వహించాం. వ్యభిచారం నిర్వహించే వారిపై కేసులు నమోదు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహబూబ్నగర్ వాట్సాప్ వేదికగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణకు వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్లో మహిళల ఫొటోలను విటులకు పంపడం.. వాటిని చూసి నచ్చితే డీల్కు సిద్ధమవుతున్నారు. సెల్ఫోన్లో మాట్లాడే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో.. జిల్లాకేంద్ర సమీపంలోని రాజీవ్ స్వగృహ, హౌజింగ్బోర్డు, శ్రీరామకాలని, బైపాస్, శ్రీనివాసాకాలని, వేంకటేశ్వరకాలని, హబీబ్నగర్, రాజీవ్ గృహకల్ప, అశోక్ టాకీస్ ఏరియా, పాత బస్టాండ్తో పాటు పలు కాలనీల్లోని ఇళ్లల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. చుట్టుపక్కల ఇళ్లవారికి అనుమానం రాకుండా బంధువులంటూ పరిచయం చేస్తున్నారు. చాలా వరకు సొంత ఇళ్లలోనే ఈ దందా నడిపిస్తుండగా కొందరు అద్దె ఇళ్లలో కొనసాగిస్తున్నారు. యువతులను సైతం.. కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలోకి దించుతున్నారు. హైదరాబాద్తో పాటు పల్లెల నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశజూపి ఈ రంగంలోకి దించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మధ్యవర్తులే విపరీతంగా సంపాదిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని రూరల్, టూటౌన్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు కొనసాగుతున్నాయి. పోలీసులకు సమాచారం ఉన్నా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ వేదికగా జోరుగా దందా నివాస గృహాలే అడ్డాలుగా..! జిల్లాకేంద్రంతో పాటు జాతీయ రహదారి వెంట -
నిరంతర సాధనతోనే విజయం
కొత్తకోట రూరల్: నిరంతర సాధనతోనే విజయం సిద్ధిస్తుందని, ప్రణాళిక, పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య అన్నారు. మంగళవారం ఉద్యాన అధికారులుగా ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. గతేడాది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉద్యాన అధికారుల ఎంపిక పరీక్షలో కళాశాలకు చెందిన పదిమంది పూర్వ విద్యార్థులు ఉత్తీర్ణులై వివిధ జిల్లాల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. మొత్తం 21 పోస్టుల్లో కళాశాలకు చెందిన పదిమంది ఉన్నారని.. ముగ్గురు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారులుగా బాధ్యతలు చేపట్టిన మహేశ్, వినాయక రుద్ర, శివతేజ, వెంకటరమణను ఆయనతో పాటు అధ్యాపకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా. షహనాజ్, డా. పూర్ణిమమిశ్రా, డా. శంకరస్వామి, డా. శ్రీనివాస్, నవ్య, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు -
బీసీ కులగణన రీ సర్వే పకడ్బందీగా జరపాలి
స్టేషన్ మహబూబ్నగర్: బీసీ కులగణన రీ సర్వేను పకడ్బందీగా జరపాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం సమాజ్ కార్యాలయంలో బీసీ కులగణన నివేదికపై జరిగిన రౌండ్టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1931, 2025 సంవత్సరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గతంలో 1931 బ్రిటీష్ ప్రభుత్వం జరిగిన కులగణన, ఇప్పుడు మళ్లీ 2025లో చేసిన కులగణన చరిత్రలో నిలిచిపోయే సంవత్సరమని అన్నారు. ఈ సమగ్ర కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించడం, అగ్రవర్ణాలను ఎక్కువ చూసి చూసించడంలో అంతర్యమేమిటో బీసీ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని, ఇది ఎంతో కాలం నిలవదని, రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా బీసీలకు వ్యతిరేకంగా ముందుకు వెళితే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. బిహార్ రాష్ట్రంలో కులగణన చేస్తే 26 సార్లు అక్కడి సీఎం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్సాగర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనఓటు మనకే వేసుకుందాం అనే నినాదంతో ముందుకెళ్లి అత్యధికంగా బీసీలు గెలవాలని, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీలో ఉండాలని కోరారు. సమావేశంలో బీసీ నాయకుడు బాబుగౌడ్, బీసీ సమాజ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, ఆయా బీసీ సంఘాల ప్రతినిధులు సతీష్యాదవ్, శ్రీనివాసులు, పాండురంగ యాదవ్, సారంగి లక్ష్మికాంత్, బుగ్గన్న, అశ్విని సత్యం, వెంకటనారాయణ, శ్రీనివాస్గౌడ్, దుర్గేష్, బి.శేఖర్, తాయప్ప, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు -
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
మహమ్మదాబాద్: రైతులను ఎవరైనా అనవసరమైన మందులు అంటగడుతూ ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి నరేందర్ అన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గులికలు కొంటేనే యూరియా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. ఈ మేరకు ఆయన మండలంలోని నంచర్లగేట్, మహమ్మదాబాద్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి అమ్మకాలపై ఆరాతీశారు. అనుమతి లేకుండా అమ్ముతున్న ఎరువులు, పెస్టిసైడ్స్ దుకాణాల వివరాలను తెలుసుకున్నారు. నకిలీ ఎరువులు, గులికలు, రసాయనాలు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంచర్లగేట్లోని శ్రీలక్ష్మీనర్సింహ ఫర్టిలైజర్ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్ముతున్నందున మెమో జారీ చేశారు. రామన్పాడులో 1,020 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని, ఎన్టీఆర్ కాల్వకు 31 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 155 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
కనులపండువగా తిక్కవీరేశ్వరస్వామి రథోత్సవం
అయిజ: మండల కేంద్రంలో వెలసిన తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం అర్థరాత్రి భక్తులు తిక్కవీరేశ్వరస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. రథాన్ని పూలమాలలు, మావిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాణసంచా కాల్పులతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా కుంభం కాగుతెచ్చి రథం చుట్టూ పొలిచల్లి స్వామివారి రథాన్ని కదిలించారు. పెద్ద ఆంజనేయస్వామి ఆలయంవరకు భక్తులు రథం లాగారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. రథోత్సవంలో యువత పలకల కోలాటం, కట్టెల కోలాటం ఆడారు. నందికోళ్ల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున రథంను యథాస్థానానికి చేర్చారు. రథోత్సవంకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ కాంతులతో ఆలయ ప్రాంగణం మొక్కులు తీర్చుకున్న భక్తులు అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు -
ముగ్గురు రోహింగ్యాల అరెస్టు, రిమాండ్
జడ్చర్ల టౌన్: దేశంలోకి అక్రమంగా చొరబడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం నర్సింగ్తండాలో అయూబ్ ఫాంహౌజ్లో పనిచేస్తున్న ముగ్గురు రోహింగ్యాలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం జడ్చర్ల పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. మయన్మార్ దేశానికి చెందిన నూర్ మహమ్మద్ 2012లో మయన్మార్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడి బాలాపూర్లో నివసించేవారన్నారు. అక్కడి నుంచి బావమరిది ద్వారా నకిలీ పాస్పోర్టు, వీసా సృష్టించుకుని 2016లో సౌదీ అరేబియాకు వెళ్లి టైలరింగ్ పనులు చేస్తూ 2022లో తిరిగి భారత్కు వచ్చాడన్నారు. ఈ ఏడాది మళ్లీ దుబాయికి వీసా తీసుకుని నెలరోజుల పాటు వెళ్లి అక్టోబర్లో వచ్చి తిరిగి బాలాపూర్లో నివాసం ఉంటున్నారన్నారు. బాలాపూర్లోనే నివాసం ఉంటున్న రిజ్వానా అనే రోహింగ్యాను పెళ్లి చేసుకున్నాడని, తర్వాత ఏజెంట్ సహాయంతో త్రిపుర బార్డర్ ద్వారా బంగ్లాదేశ్లోని కాక్స్ బజారుకు వెళ్లి ఏడాదిపాటు నివాసం ఉన్నారన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్లోనే ఉన్న మహమ్మద్ అరోబ్ అహ్మద్, సుమయ దంపతులను భారత్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశచూపి వారి నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత నూర్ మహమ్మద్ భార్య రిజ్వానాతో కలిసి అరోబ్ అహ్మద్, సుమయలను తీసుకుని ధర్మానగర్, త్రిపుర బార్డర్ ద్వారా రాత్రివేళ భారత్లోకి చొరబడి తెల్లవారే సరికి అగర్తలా చేరుకుని సికింద్రాబాద్కు రైలు ద్వారా వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన అయూబ్ ఫాంహౌజ్ నర్సింగ్తండాలో ఉండటంతో అక్కడ పనికి చేరారని తెలిపారు. నలుగురు ఫాంహౌజ్లోనే ఉంటూ పదిరోజుల క్రితం ఏజెంట్ ద్వారా నూర్ తన భార్య రిజ్వానాను బంగ్లాదేశ్కి పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నలుగురు రోహింగ్యాలు ఉన్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానందగౌడ్ ఫాంహౌజ్కు వెళ్లి పరిశీలించగా ముగ్గురిని గుర్తించి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్కు పంపిస్తామని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న రిజ్వానాను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. కాగా రిజ్వానా ఫేక్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ను చార్మినార్ వద్ద తీసుకున్నట్లు తెలుస్తుందని, అందుకు సహకరించిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. భారత్లోకి చొరబడేందుకు, నకిలీ పాస్పోర్టు, వీసాలు సంపాదించేందుకు సహకరించిన వారిని సైతం విచారిస్తామన్నారు. స్థానికంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. జిల్లాలో ఉన్న ఫాంహౌజ్లు, హోటళ్లు, అన్నింటిపైనా నిఘా ఉంచి అనుమానాస్పదంగా ఉండే వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వివరాలు వెల్లడించిన మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు -
డాక్టర్ రామలక్ష్మణ్కు ఏషియన్ స్పోర్ట్స్ లీడర్షిప్ అవార్డు
మహబూబ్నగర్ క్రీడలు: ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన కాన్ఫరెన్స్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాయామ సంచాలకులు డాక్టర్ జె.రామలక్ష్మయ్య ఏషియన్ స్పోర్ట్స్ లీడర్ అవార్డు అందుకున్నారు. రామలక్ష్మయ్య మహేంద్రహిల్స్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యాయామ సంచాలకుడిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో పలు పురస్కారాలు అందుకున్నారు. 2016– 17లో నాగర్కర్నూల్ జిల్లా ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్గా, 2019లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్గా, 2024లో ఆరెంజ్ వరల్డ్ రికార్డు అవార్డు అందుకున్నారు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 2017 నుంచి 2024 వరకు స్పోర్ట్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ సందర్భంగా రామలక్ష్మయ్య మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ క్రీడా విభాగం, కోచ్లకు అంకితం చేస్తున్నానని తెలిపారు. వారి అంకితభావంతోనే అనేక మంది యువ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచే అవకాశం పొందారన్నారు. అవార్డు ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్లో మరింత మంది యువ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు. -
పిచ్చి కుక్కల స్వైరవిహారం
కోస్గి: మూడు రోజలుగా పట్టణంలోని పలు కాలనీల్లో పిచ్చి కుక్కలు సంచరిస్తూ దాడులు చేయడంతో పలువురు స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఏకంగా రెండు పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నాపెద్ద తేడా లేకుండా ఏకంగా 22 మందిపై దాడి చేసి గాయపరిచాయి. వీరిలో చిన్నారులు, మహిళలు సైతం ఉన్నారు. మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనలు.. శుక్ర, శనివారం ఎస్సీ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియాల్లో పిచ్చి కుక్కలు ఉదయం నడక నుంచి వస్తున్న వారిపై దాడి చేయగా ఇద్దరికి కాళ్లకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం పట్టణంలోని ఎస్సీ కాలనీ, మామిళ్ల వీధి, బహర్పేట, ఆడికే వీధి, రామాలయం చౌరస్తాతో పాటు పలు చోట్ల రెండు పిచ్చి కుక్కలు పలువురిని గాయపరిచాయి. కొందరు యువకులు ఓ పిచ్చి కుక్కను వెంబడించి కొట్టి చంపగా.. మరోటి పరారైంది. గాయపడిన వారు ఒక్కొక్కరుగా స్థానిక ప్రభుత్వాస్పత్రికి క్యూ కట్టారు. కాలుపై కాటుతో తీవ్రంగా గాయపడటంతో మామిళ్ల నర్సమ్మతో పాటు మరో ముగ్గురిని పాలమూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో లింగంపల్లి కన్నప్ప, అనంతమ్మ, సాయమ్మ, నాగమణి, అనూశ్రీ, చెన్న బాలప్ప, శంకరమ్మ, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, అభిజ్ఞ, హన్మంతు, వెంకటమ్మ, బిచ్చమ్మ, సాయిచరణ్, ఆంజనేయులుతో పాటు పలువురు ఉన్నారు. కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 22 మందికి గాయాలు బాధితులకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స -
పీయూలో రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో కొన్నేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న 14 మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులను అధికారులు తొలగించారు. మాజీ వీసీలు రాజారత్నం, లక్ష్మీకాంత్ రాథోడ్ హయాంలో రిటైర్డ్ అయిన పలువురిని సీనియార్టీ, సర్వీస్ నిమిత్తం నియమించారు. అయితే నియామక సమయంలో గత వీసీలకు అనుకూలంగా ఉన్న వారిని, తమకు కావాల్సిన వారిని అధిక వేతనాలు ఇచ్చి నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరు అడ్మినిస్ట్రేషన్ విభాగం, పీజీ కళాశాల, పరీక్షల విభాగం, అకౌంట్స్ విభాగాల్లో ఉద్యోగులుగా, మరికొందరు సింథటిక్ ట్రాక్, ఇంజినీరింగ్ విభాగంలో కన్సల్టెంట్లుగా పనిచేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.25 వవేల నుంచి రూ.60 వేలకు పైగా వేతనాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది వయోభారంతో ఇబ్బంది పడుతున్నా విధుల్లో కొనసాగించారు. అయితే ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా ఏడుగురు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన నియమించడంతో రిటైర్డ్ ఉద్యోగులను తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ● ఈ విషయమై వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ స్పందిస్తూ.. ఇటీవల ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లను నియమించడంతో గతంలో తాత్కాలిక పద్ధతిలో నియామకమైన రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వ నిబంధనల మేరకు తొలగించామని చెప్పారు. 61 ఏళ్లు దాటిన వారిని మాత్రమే తొలగించామని పేర్కొన్నారు. -
ఆవేశంలో బైక్ను తగలబెట్టిన వ్యక్తి
తెలకపల్లి: ఆవేశంల ఓవ్యక్తి తన బైక్ను తానే తగలబెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోలగుండంకి చెందిన చందు సోమవారం మధ్యాహ్నం తెలకపల్లిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు తన బైక్కు నిప్పంటించాడు. తన తల్లి నిరంజనమ్మ పేరుమీద ఉన్న రూ.1.29లక్షల రుణం మాఫీ అయింది. ఇంకా రూ.13వేలు బ్యాంక్లో అప్పు ఉంది. అవి చెల్లిస్తే కొత్తరుణాలు కానీ, పాస్బుక్కులు ఇస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. మళ్లీ రుణం కావాలని బ్యాంక్కు వచ్చినా ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంక్లోకి వెళ్లి అధికారులను పలకరించి చందు బ్యాంక్ నుంచి బయటకొచచ్చాడు. బ్యాంక్ బయటే బైక్కు పెట్రోల్పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో ఎవరూ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. బ్యాంక్ అధికారులనే మంటను ఆర్పినట్లు స్థానికులు తెలిపారు. ఇతని మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు చందును అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. -
దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి పరీక్షలు
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ (కేజీబీవీ, గురుకుల) పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు ప్రతి పాఠశాలలో పదేళ్ల నుంచి 19 ఏళ్ల వయసు కల్గిన బాల బాలికలకు కంటి స్క్రీనింగ్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కంటి విభాగంలో విద్యార్థులకు వైద్యలు కంటి పరీక్షలు ప్రారంభించారు. మార్చి 2 నాటికి జిల్లాలోని 2,272 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్, ఆగస్టులో విద్యార్థులకు స్క్రీనింగ్ చేసిన అద్దాలు పంపిణీ చేయలేదు. ఈ ఏడాది గతంలో స్క్రీనింగ్ పూర్తి చేసి గుర్తించిన విద్యార్థులు అందరికీ మళ్లీ స్క్రీనింగ్ చేసి అద్దాలు పంపిణీ చేయడంతోపాటు సర్జరీ అవసరమైన విద్యార్థులకు హైదరాబాద్లోని సరోజనిదేవి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించనున్నారు. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 287 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో మహబూబ్నగర్ పరిధిలో 184 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా వారిలో 181 మందికి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించగా మరో ముగ్గురికి సర్జరీ అవసరం కావడంతో సరోజనిదేవి ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక జడ్చర్లలో 103 మందికి కంటి పరీక్షలు చేయగా 99 మందికి అద్దాలు, నలుగురికి సర్జరీకి రెఫర్ చేయడం జరిగింది. ● దృష్టిలోపం ఉన్న విద్యార్థులు అందరికీ తప్పక కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేస్తామని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సకాలంలో గుర్తించిన లక్ష్యంతోపాటు కొత్త విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేయాలన్నారు. దృష్టిలోప సమస్య తీవ్రతను బట్టి అద్దాలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే సర్జరీలు అవసరమైన విద్యార్థులకు హైదరాబాద్లో చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఐవో పద్మజా, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్, దేవిదాస్, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
గుళికలు కొంటేనే యూరియా!
మహమ్మదాబాద్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఓవైపు పంటలకు అంతుచిక్కని తెగుళ్లతో పంటలను కాపాడుకోలేని దుస్థితి నెలకొనగా.. మరోవైపు ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్తే ఒకటి కొంటేనే మరొకరటి ఇస్తామని మెలిక పెట్టడం రైతులకు భారంగా మారుతోంది. మహమ్మదాబాద్ మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకుల తీరుతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. రూ.500 పైగా విలువజేసే పిల్లగుళికలు కొంటేనే యూరియా ఇస్తామని షరతులు పెడుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నంచర్లగేట్లోని ఎరువుల దుకాణానికి యూరియా కోసం వెళ్లిన ఓ రైతుకు ఈ పరిస్థితి ఎదురైంది. అయితే చేతిలో డబ్బు లేకపోవడంతో చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. నాసిరకం గుళికలు.. మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో నాసిరకం గుళికలు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వరిపైరుకు ఎన్ని గుళికలు చల్లినా మందులు పిచికారీ చేసినా తెగుళ్లు తగ్గడం లేదని వాపోతున్నారు. ఈవిషయమై మండల వ్యవసాయాధికారి నరేందర్ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకుల తీరుతో రైతుల అవస్థలు చెప్పింది కొనమంటున్నారు.. వరిచేను కలుపుతీసి యూరియా వేసేందుకు నంచర్ల గేట్లోని శ్రీలక్ష్మీ నర్సింహ ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లాను. దుకాణ యజమాని పిల్లగుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తానని తెలిపాడు. యూరియాను కూడా రూ. 280కి విక్రయించాల్సి ఉండగా.. రూ.310 వసూలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా ఎరువులు అమ్ముకుంటున్నారు. – శ్రీనివాస్, రైతు, కొంరెడ్డిపల్లి -
కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చిన్నంబావి: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) పదో తరగతి విద్యార్థి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపూర్ మండలంలోని రుక్కన్నలపల్లితండాకు చెందిన శ్రీలత(15) కేజీబీవీలో పదో తరగతి చదువుతుంది. సోమవారం ప్రతిజ్ఞ కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని సిబ్బంది గమనించారు. క్లాస్రూంలోకి వెళ్లి చూడగా బాలిక చేతిలో జ్వర మాత్రల స్లిప్ ఉంది. వెంటనే ఇన్చార్జి ఎస్ఓ ప్రశాంతికి సమాచారం అందించారు. హుటాహుటిన వీపనగండ్లలోని ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో విద్యార్థిని పరిస్థితి మెరుగుపడిందని సిబ్బంది తెలిపారు. అసలు బాలికకు అన్ని మాత్రలు ఎలా వచ్చాయని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలువురు విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మదనాపురం గేట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని రాకొండకు చెందిన పొట్టే పెద్ద పర్వతాలు (60) ద్విచక్ర వాహనంపై పెద్దూరు నుంచి తెలకపల్లికి వస్తుండగా.. మదనాపురం గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రెండు బైక్లు ఢీకొని మరొకరు.. మల్దకల్: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన సోమ వారం శేషంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నందికర్ కథనం మేరకు.. మద్దెలబండకు చెందిన కుర్వ ఈరన్న (38) వ్యవసాయ పనుల నిమిత్తం అయిజకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో అమరవాయికి చెందిన ఎరుకలి నర్సింహులు తన బైక్పై తాటికుంటకు వెళ్తుండగా మార్గమధ్యం శేషంపల్లి సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈర న్న అక్కడికక్కడే మృతిచెందగా, నర్సింహు లుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి అటు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈరన్నకు భార్య సవారమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. ఆరు తులాల బంగారం చోరీ అయిజ: పట్టపగలు ఆరు తులాల బంగారం చోరీకి గురైన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మేండికొండ గ్రామానికి చెందిన వీరేష్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్లో తనఖా పెట్టిన 6 తులాల బంగారాన్ని సోమవారం వెనక్కి తీసుకొని ఒక కవర్లో ఉంచి తన మోటార్ సైకిల్లోని ట్యాంక్ కవర్లో పెట్టాడు. అనంతరం ఫర్టిలైజర్కు సంబంధించిన అప్పు చెల్లించేందుకు షాపుకు ముందు బైక్ పెట్టి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూస్తే బంగారం కనపడలేదు. ఈవిషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎట్టకేలకు దొరికాడు
గద్వాలలో కలకలం.. నకిలీ సర్టిఫికెట్లతో ఏఈఓగా ఉద్యోగం పొందడమేగాక.. ఏకంగా ఐదేళ్లు విధులు నిర్వహించాడనే వార్త జిల్లాలో కలకలం రేపింది. ఇన్నేళ్లు పనిచేసినా ఉన్నతాధికారులు గుర్తించడంలో విఫలమయ్యారా.. లేక తెలిసే మనకెందుకులే అనే తరహాలో వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తేనే ఉన్నతాధికారుల ముసుగులో ఉన్న దోషులు బయటపడతారు. దీనికితోడు గద్వాల వ్యవసాయ శాఖ అధికారులపైనా పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతేడాది రైతుబంధు డబ్బులు పెద్దఎత్తున లేని రైతుల పేర్లతో నగదు కాజేసినట్లు బహిర్గతం కావడం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. తాజాగా నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. ఈ విషయాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ● నకిలీ సర్టిఫికెట్తో ఏఈఓ ఉద్యోగం ● ఐదేళ్లు గద్వాల వ్యవసాయ శాఖలో విధులు ● అర్హత సర్టిఫికెట్లపరిశీలనలో విషయం వెలుగులోకి.. ● గతేడాది చీటింగ్ కేసు నమోదు.. నాటి నుంచి అజ్ఞాతంలోనే ఏఈఓ ● తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు గద్వాల క్రైం: నకిలీ డిప్లొమా సర్టిఫికెట్తో ఏఈఓ ఉద్యోగం పొందడంతోపాటు.. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి 2012– 2015 వరకు ఉత్తరప్రదేశ్ గాజీపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా చదివినట్లు నకిలీ సర్టిఫికెట్ పొందాడు. 2017లో ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఏఈఓ (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ వ్యవసాయ అధికారి)గా ఉద్యోగం సాధించాడు. అనంతరం 2017 నుంచి 2023 వరకు జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఏఈఓగా ఐదేళ్లపాటు విధులు నిర్వహించాడు. వెలుగులోకి వచ్చిందిలా.. ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అర్హత సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయ గుర్తింపును పునఃపరిశీలన చేపట్టింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ విభాగం పలువురు ఉద్యోగుల అర్హత, ఎక్కడ చదివారు అనే విషయాలపై కూపీ లాగారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందినట్లు గుర్తించి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేశారు. దీంతో సంబంధిత అధికారులు మల్దకల్ మండలం క్లస్టర్గా అచ్చంపేటకు చెందిన వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో కొలువు పొందినట్లు నివేదిక ఆధారంగా 2024 మార్చిలో సదరు వ్యక్తిపై 417, 420, 465, 468, 471 సెక్షన్ల కింద పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎట్టకేలకు నమ్మదగిన సమాచారం మేరకు నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించి సోమవారం గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు నకిలీ సర్టిఫికెట్ల తయారీలో మిర్యాలగూడకు చెందిన పలువురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వారిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లేని విశ్వవిద్యాలయాల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వేలాది మందికి డిప్లొమా సర్టిఫికెట్లు అందించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఈ ముఠా సభ్యులు నకిలీ సర్టిఫికెట్లు అందజేసి ఉండవచ్చనే అనుమానం మేరకు పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ముఠా అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం నకిలీ సర్టిఫికెట్లతో ఓ వ్యక్తి గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందినట్లు గతేడాది రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాం. అయితే, నాటి నుంచి సదరు వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలో ఎంతమంది ఉన్నారు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. – శ్రీను సీఐ, గద్వాల