మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 29 మంది ఎంపిక
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): డీఆర్డీఏ ఆధ్వర్యంలో నంది టైర్స్, ట్యూబ్స్ కంపనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం గురువారం స్థానిక ఈజీ ఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో ఇంటర్వూ్యలు నిర్వహించారు. 124 మంది హాజ రుకాగా ఇందులో 29 మంది ఎంపికయ్యారు. వారికి కంపనీ ప్రతినిధులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాబ్స్ జేడీఎం దివాకర్, ఫయాజ్, బాల్రాజు, శిరీషా, జ్యోతి పాల్గొన్నారు.