Nalgonda District News
-
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
మిర్యాలగూడ : ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ధాన్యం క్వింటాకు రూ.2800 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, గాదె పద్మమ్మ, తిరుపతి రామ్మూర్తి, సత్యనారాయణరావు, పిల్లుట్ల సైదులు, మల్లయ్య, రమేష్, రామకృష్ణ, రమేష్, నగేష్ పాల్గొన్నారు. -
రైతు భరోసాకు నిరీక్షణ
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్కు సంబంధించిన రైతుభరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. రైతు భరోసాను ప్రతి సీజన్లో ఎకరానికి రూ.7500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కమిటీల పేరతో కాలయాపన చేసి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఇవ్వలేదు. ఇక, యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తామని చెప్పి జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధుల జమచేయడం ప్రారంభించింది. దశల వారీగా డబ్బులు ఖాతాల్లో జమ చేసింది. మూడు విడుతలు కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,694 మంది రైతుల (మూడెకరాలలోపు) ఖాతాల్లో మొత్తం రూ.202,48,72,111 ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. 5,60,810 మంది పాస్బుక్కులు ఉన్న రైతులు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,60,801 మంది పట్టాదార్ పాస్బుక్కులు కలిగిన రైతులు ఉన్నారు. వారందరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు పేరుతో రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు ఖాతాల్లో జమయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును రైతు భరోసాగా పేరును మార్చి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే సాగుకు యోగ్యం కాని భూములు 12,040 ఎకరాలను గుర్తించి మిగిలిన భూములకు రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు మూడెకరాలలోపు భూమి ఉన్న 2,76,694 మందికి మాత్రమే రైతుభరోసా నిధులు జమచేసింది. మూడెకరాలకుపైగా ఉన్న సుమారు 3.30 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పుడు ఇస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఫ రెండు నెలలైనా మూడు ఎకరాలలోపు రైతులకే అందని సొమ్ము ఫ ఆందోళనలో మూడెకరాల పైన భూమి ఉన్న రైతులు ఫ సీజన్ ముగిసినా ఎప్పుడిస్తారోనని ఎదురుచూపులు మూడు దశలలో రైతు భరోసా జమ ఇలా... విడత రైతులు జమైన డబ్బు(రూ.లలో) మొదటి 35,568 46,93,19,160 రెండవ 1,55,232 88,42,80,319 మూడవ 85,894 67,12,72,632 మొత్తం 2,76,694 202,48,72,111 -
30న హుజూర్నగర్కు సీఎం రేవంత్ రెడ్డి
సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి హుజూర్నగర్ : ఈనెల 30న ఉగాది పర్వదినం నాడు హుజూర్నగర్లో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● 30న సాయంత్ర 5 గంటలకు సీఎం హైదరాబాద్లోని బేగంపేట నుంచి బయలుదేరుతారు. ● 5.45 గంటలకు హుజూర్నగర్ శివారులోని రామస్వామి గుట్ట వద్ద హెలిపాడ్లో దిగి అక్కడ నిర్మాణంలో ఉన్న 2వేల సింగల్ బెడ్రూం ఇళ్ల మోడల్ కాలనీని పరిశీలిస్తారు. ● అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హుజూర్నగర్ పట్టణంలోని బహిరంగ సభా ప్రాంగణం సమీపంలోగల హెలిపాడ్లో 6.15 గంటలకు సీఎం దిగుతారు. ● 6.15 గంటలనుంచి 7.30 గంటల వరకు సభా వేదికపై నుంచి సీఎం రేవంత్రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ● తదుపరి ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడతారు. ● రాత్రి 7.30 గంటలకు సీఎం హుజూర్నగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరుతారు ● రాత్రి 9.45కి హైదరాబాద్కు చేరుకుంటారు. -
అందరి నోట.. రాజగోపాల్రెడ్డి మాట!
ఇంటి వద్దకే తలంబ్రాలు భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను ఇంటివద్దకే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.- 8లోబుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న వార్త మంగళవారం అందరి నోటా వినిపించింది. శాసనసభ హాలు, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్రెడ్డి వర్గీయుల్లో ఉంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్రెడ్డి మంగళవారం మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్రెడ్డికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. న్యూస్రీల్ -
పారితోషికం పైసలేవి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేలో విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఇంత వరకు పారితోషికంఅందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆ డబ్బులను ఇవ్వగా, నల్లగొండలో ఇప్పటివరకు అందకపోవడంతో విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. నవంబర్లోనే పూర్తయినా.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే చేపట్టింది. జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 868 గ్రామ పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) టీచర్లు, అధ్యాపకులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంఆర్సీ సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. సర్వే పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులను సూపర్వైజర్లుగా, మండల ప్రత్యేక అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి ఈ సర్వే చేయించారు. గత ఏడాది నవంబరు 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఇలా ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 150 ఇళ్ల వరకు సర్వే చేశారు. ఆ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారి నేతృత్వంలో ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేశారు. బ్యాంకు ఖాతాల వివరాలు ఎప్పుడో ఇచ్చినా.. సర్వే విధుల్లో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల బ్యాంకు ఖాతాల వివరాలను అప్పట్లోనే అందజేశారు. సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్కు రూ.10 వేలు, సూపర్వైజర్కు రూ.12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారం నమోదు చేసినందుకు రూ.25 చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 490 మంది సూపర్వైజర్లు, 4,060 మంది ఎన్యుమరేటర్లు, 4,012 మంది ఆపరేటర్లు ఈ విధులను నిర్వరించారు. ఆ సర్వే పూర్తయి నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ కులగణన సర్వే చేసి నాలుగు నెలలు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఫ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందని డబ్బులు ఫ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఎదురుచూపు పారితోషికం వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన సర్వేను చేయించింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే పూర్తయి నాలుగు నెలలు గడిచిపోయింది. జిల్లాలో విధులు నిర్వర్తించిన వారికి ఇంతవరకు గౌరవ వేతనం చెల్లించలేదు. పక్కనున్న సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో చెల్లించారు. ఇక్కడే ఎందుకు చెల్లించడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వెంటనే ఆ డబ్బులను విడుదల చేయాలి. – పెరుమాళ్ల వెంకటేశం, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పోలీస్ ఆడిటోరియంలో ఇఫ్తార్ విందు
నల్లగొండ టూటౌన్ : రంజాన్ మాసం సందర్భంగా జిల్లా పోలీస్ ఆడిటోరియంలో మంగళవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొని ముస్లింలకు తెలిపి మాట్లాడారు. ముస్లిం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎంతో భక్తితో నెలరోజుల పాటు ఉపవాసాలు చేస్తారన్నారని పేర్కొన్నారు. అనంతరం వారు ముస్లింలకు బిర్యానీ వడ్డించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, లక్ష్మినారాయణ, శ్రీనివాసులు, జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కదలిక
నకిరేకల్ : రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని జిల్లా పోలీసు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులు కొలిక్కి తెచ్చారు. బంధువుల పిల్లలకు ఎక్కవ మార్కుల వచ్చేలా చేయడం కోసమే ఇదాంతా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాక్షి వరస కథనాలతో పాటు.. మంగళవారం సాక్షిలో ‘ప్రశ్నపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఎంత?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంతో.. జిల్లా పోలీస్ శాఖ లీకేజీ వ్యవహరాన్ని బట్టబయలు చేసింది. మంగళవారం నల్లగొండలో డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీపై వ్యవహారంపై నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా విచారణ కొనసాగుతోందని ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో అనే అంశాలను వెల్లడించారు. ఫ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన యంత్రాంగంఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీజిరాక్స్ సెంటర్లకు నోటీసులు.. నకిరేకల్ తహసీల్దార్ ఆదేశాల మేరకు స్థానిక సీఐ రాజశేఖర్ పట్టణంలోని జిరాక్స్ సెంటర్లకు నోటీస్లు జారీ చేశారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జిరాక్స్ సెంటర్లు బంద్ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన జిరాక్స్ సెంటర్లపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక పట్ట ణంలో నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ నిఘా పెంచారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. -
కృత్రిమ మేధతో నాణ్యమైన విద్య
నల్లగొండ: కృత్రిమ మేధ సాయంతో నాణ్యమైన విద్యను అందుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని చందనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కృత్రిమ మేధ ల్యాబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి సామర్థ్యం మదింపు చేసి వారి స్థాయికి తగిన విధంగా తెలుగు, ఆంగ్ల పదాలు, వాక్యాలు, గణిత సమస్యలను సాధించడంలో ఏఐ సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఆర్.రామచంద్రయ్య, హెచ్ఎం ఎం.రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. బోధనా సిబ్బందికి ఇంటర్వ్యూలునల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిన బోధనా సిబ్బంది నియామకానికి మంగళవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్ పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు 15 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను మెడికల్ కళాశాల వెబ్సైట్లో ఉంచుతామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ వినీలారాణి, డాక్టర్ మాతృ పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలినల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంఎస్ఎంఈ సంస్థ ప్రతినిధి జె.కోటేశ్వర్రావు సూచించారు. మంగళవారం ఎంజీయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యార్థులు నలుగురికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో ఉండేలా ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అరుణప్రియ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.32,28,760నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కానుకల హుండీలను మంగళవారం లెక్కించారు. 41 రోజుల్లో రూ.32,28,760 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్కుమార్ తెలిపారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్బాల్ జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్ : నెల్లూరు జిల్లా సింహపురి విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 30న నిర్వహించనున్న జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొనే మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మహిళా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఎంజీయూ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన అక్షయ, రవళి, రేష్మా, శ్రావణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్కుమార్, ప్రొఫెసర్ సోమలింగం, మురళి, శ్రీనివాస్రెడ్డి, శ్యాంసుందర్, నాగిరెడ్డి, పృథ్వీరాజ్, అజయ్ పాల్గొన్నారు. -
భార్య మందలించిందని మనస్తాపంతో..
● అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన భర్తమిర్యాలగూడ టౌన్: మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామానికి చెందిన పర్వతం రమణ నిత్యం మద్యం తాగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో.. మద్యం ఎందుకు తాగి వచ్చావు అంటూ భార్య యశోద నిలదీసింది. దీంతో మనస్తాపానికి గురైన రమణ అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రమణ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య యశోద ఈ నెల 21వ తేదీన మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిపెద్దఅడిశర్లపల్లి: భూతగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నేతాల సత్తయ్య(48) ఈ నెల 11వ తేదీన భూతగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యగుర్రంపోడు: ఆర్థిక ఇబ్బందులతో గడ్డిమందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. వద్దిరెడ్డిగూడేనికి చెందిన మేకల నాగిరెడ్డి(39) తనకున్న 9ఎకరాల భూమిలో బత్తాయి తోటతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నాగిరెడ్డి ఆదివారం పొలం వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య మేకల సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
తెలంగాణ కళాకారులతో దొడ్డి కొమురయ్య సినిమా
హుజూర్నగర్: తెలంగాణలోని అన్ని జిల్లాల కళాకారులతో దొడ్డి కొమురయ్య జీవిత చర్రితపై సినిమా నిర్మిస్తున్నట్లు సినీ దర్శకుడు సేనాపతి అన్నారు. సోమవారం హుజూర్నగర్ వచ్చిన ఆయన స్థానిక కళాకారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గొప్ప చరిత్ర కలిగిన దొడ్డి కొమరయ్య జీవితాన్ని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కళాకారులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కళాకారులు ఎస్. శ్రీనివాస్, జి. దీప, కె. బాబు, డి. శ్రీనివాస్, నరసింహచారి, బి. గోవిందరావు, కె. రవి, పి. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు, డి. బాబురావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట టౌన్ సీఐ వీరరాఘవులు విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సూర్యాపేట టౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది కలిసి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట పట్టణానికి చెందిన దాసరి సిద్దార్ధ, మహ్మద్ ఉమర్ బైక్పై ఒక కిలో 200 గ్రాముల గంజాయితో కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పార్ట్టైం జాబ్ పేరుతో మోసం● డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు భువనగిరి: పార్ట్టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన గోసాల శ్యామల్రావు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి వలస వచ్చాడు. ప్రస్తుతం సూపర్వైజర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న పార్ట్టైం జాబ్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఒక లింక్ ఓపెన్ చేశాడు. అందులో తన వివరాలను నమోదు చేశాడు. తర్వాత తన ఫోన్లోని వాట్సాప్కు వచ్చిన వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాందించవచ్చని చెప్పి కొన్ని టాస్క్లు ఇచ్చారు. టాస్క్లో భాగంగా వారు పంపిన వెబ్సైట్లో డబ్బులు డిపాజిట్ చేస్తే 30శాతం లాభం వస్తుందని చెప్పారు. దీంతో శ్యామల్రావు మొదట రూ.1000 డిపాజిట్ చేయగా.. రూ.1500 రిటర్న్స్ వచ్చాయి. ఈవిధంగా ఈ నెల 18వ తేదీ నాటికి రూ.1,92,000 డిపాజిట్ చేశాడు. తర్వాత డబ్బులు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. -
కిరాణా షాపు యజమానికి టోకరా
నకిరేకల్: సరుకులు కొనేందుకు కిరాణ దుకాణం వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి షాపు యాజమాని ఫోన్ తీసుకుని ఫోన్ పే ద్వారా రూ.90వేలు ట్రాన్స్ఫర్ చేసుకుని పరారయ్యాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో మంచుకొండ రాధాకిషన్ నిర్వహిస్తున్న కిరాణ షాప్కు ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి వచ్చారు. తనకు కావల్సిన సరుకుల లిస్ట్ను షాపు యాజమాని మంచుకొండ రాధాకిషన్కు ఇచ్చాడు. షాపు యాజమాని సరుకులు కట్టే పనిలో నిమగ్నం కాగా.. ఇంటికి ఫోన్ చేసి ఇంకా ఏమైనా సరుకులు కావాలా అని అడుగుతానని సదరు వ్యక్తి రాధాకిషన్ ఫోన్ అడిగాడు. దీంతో రాధాకిషన్ తన ఫోన్ను సదరు వ్యక్తికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి మూడు సార్లు రూ.90వేలు ఫోన్ పే ద్వారా వేరే నంబర్కి డబ్బులు పంపే ప్రయత్నం చేశాడు. పాస్వర్డ్ తెలియకపోవడంతో మూడు సార్లు ట్రాన్శాక్షన్ ఫెయిల్ అని పడింది. నాల్గోసారి సరైన పాస్వర్డ్ నమోదు చేయడంతో రూ.90 వేలు రేష్మాదేవి పేరుతో ఉన్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ను షాపు యాజమాని రాధాకిషన్కు ఇచ్చి.. నేను చికెన్ తెచ్చుకుని వస్తా సరుకులు కట్టి బిల్ చేసి పెట్టండని అక్కడ నుంచి ఉడాయించాడు. సదరు వ్యక్తి అరగంట అయినా రాకపోవడంతో రాధాకిషన్ తన భార్య లక్ష్మికి విషయం చెప్పాడు. అనుమానం వచ్చి రాధాకిషన్ ఫోన్ను అతడి భార్య చెక్ చేయగా.. రూ.90 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి రాధాకిషన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును సైబర్ క్రైంకు బదిలీ చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైం వారు కేసు విచారణ చేస్తున్నారు. సరుకుల కొనేందుకు వచ్చి ఫోన్ పే ద్వారా రూ.90వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి -
టెన్త్ పరీక్షకు 158 మంది గైర్హాజరు
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 158 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం జరిగిన ఆంగ్లం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,679 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,521 మంది హాజరయ్యారు. 158 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 28న రైతు సత్యాగ్రహంనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ఈ నెల 28న రైతు సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం వెంకట్రెడ్డి, గుడుగుంట్ల సాయన్నగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐకేపీ కేంద్రాలు ప్రారంభించడంతో పాటు దొడ్డు ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, ఎండిన పొలాలకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సత్యగ్రహం చేపడుతున్నట్లు తెలిపారు. సాగర్ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందంనాగార్జునసాగర్ : సాగర్ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సోమవారం కాయకల్ప బృందం పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా, ఏరియా ఆస్పత్రులను ఈ బృందం ఏటా పరిశీలిస్తుంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, ఆస్పత్రి నిర్వహణ, పరిసరాలు, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించి నివేదికలను ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తుంది. నివేదికల ఆధారంగా ప్రమాణాలు పాటిస్తూ వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రులను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తారు. అందులో భాగంగా కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక బృందం సాగర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి పరిశీలించింది. వీరితో పాటు స్థానిక కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నెల్వలపల్లి హెచ్ఎం సస్పెన్షన్చింతపల్లి : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోసాధ్యాయుడిని విధుల తొలగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతపల్లి మండల పరిధిలోని నెల్వలపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వేణుగోపాలు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళా ఉపాధ్యాయులను మానసిక వేధించడం, పాఠశాల నిబంధనలు పాటించకపోవడం, రికార్డులు సరిగా నిర్వహించడం లేదు. దీనిపై మండల విద్యాధికారి అంజయ్య అధికారులకు నివేదిక అందజేయడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. క్షయ రహిత జిల్లాగా మారుద్దాంనల్లగొండ టౌన్ : క్షయ రహిత జిల్లా కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీపై ప్రజల్లో విరివిగా అవగాహన కలిగించాలన్నారు. టీబీ లక్షణాలుంటే జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్లో పరీక్షలు చేయించుకుని సక్రమంగా మందులను వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. అనంతరం జిల్లా క్షయ నివారణ కేంద్రం రివర్నిమ్స్ ఆస్పత్రి సంయుక్తంగా జిల్లాస్థాయిలో విద్యార్థులు నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వాణిశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ దామెర యాదయ్య, డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, కేస రవి, అరుంధతి, బ్లెస్సీ, ఇస్తార్, రవిప్రసాద్, హరికృష్ణ, రమేష్, రాఘవేందర్రెడ్డి, నాగిల్ల మురళి, కళ్యాణ చక్రవర్తి, నర్సింగ్ కాలేజి విద్యార్థినులు పాల్గొన్నారు. -
తెలంగాణ కళాకారులతో దొడ్డి కొమురయ్య సినిమా
హుజూర్నగర్: తెలంగాణలోని అన్ని జిల్లాల కళాకారులతో దొడ్డి కొమురయ్య జీవిత చర్రితపై సినిమా నిర్మిస్తున్నట్లు సినీ దర్శకుడు సేనాపతి అన్నారు. సోమవారం హుజూర్నగర్ వచ్చిన ఆయన స్థానిక కళాకారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గొప్ప చరిత్ర కలిగిన దొడ్డి కొమరయ్య జీవితాన్ని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కళాకారులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కళాకారులు ఎస్. శ్రీనివాస్, జి. దీప, కె. బాబు, డి. శ్రీనివాస్, నరసింహచారి, బి. గోవిందరావు, కె. రవి, పి. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు, డి. బాబురావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట టౌన్ సీఐ వీరరాఘవులు విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సూర్యాపేట టౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది కలిసి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట పట్టణానికి చెందిన దాసరి సిద్దార్ధ, మహ్మద్ ఉమర్ బైక్పై ఒక కిలో 200 గ్రాముల గంజాయితో కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పార్ట్టైం జాబ్ పేరుతో మోసం● డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు భువనగిరి: పార్ట్టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన గోసాల శ్యామల్రావు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి వలస వచ్చాడు. ప్రస్తుతం సూపర్వైజర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న పార్ట్టైం జాబ్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఒక లింక్ ఓపెన్ చేశాడు. అందులో తన వివరాలను నమోదు చేశాడు. తర్వాత తన ఫోన్లోని వాట్సాప్కు వచ్చిన వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాందించవచ్చని చెప్పి కొన్ని టాస్క్లు ఇచ్చారు. టాస్క్లో భాగంగా వారు పంపిన వెబ్సైట్లో డబ్బులు డిపాజిట్ చేస్తే 30శాతం లాభం వస్తుందని చెప్పారు. దీంతో శ్యామల్రావు మొదట రూ.1000 డిపాజిట్ చేయగా.. రూ.1500 రిటర్న్స్ వచ్చాయి. ఈవిధంగా ఈ నెల 18వ తేదీ నాటికి రూ.1,92,000 డిపాజిట్ చేశాడు. తర్వాత డబ్బులు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. -
ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి
రామగిరి(నల్లగొండ): ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జి.అంజిరెడ్డి అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో సోమవారం జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అతిగా సెల్ఫోన్లు వినియోగిస్తూ తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పులు లేకుండా, భావం చెడకుండా ఒక వాఖ్య రాయలేని స్థితిలో నేటి విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీయూ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రేఖ మాట్లాడుతూ ఆడ్ ఆన్ కోర్సుల్లో భాగంగా కత్రిమ మేధను చేర్చాలని సూచించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. ఎన్జీ కాలేజీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తన గురువు డాక్టర్ వీరయ్య పేరున ఏటా గోల్డ్ మెడల్ ఇస్తారని ప్రకటించారు. అలాగే మరో రెండు బంగారు గోల్డ్ మెడల్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన డాక్టర్ అంతటి శ్రీనివాస్, వెంకట్రెడ్డిని అభినందిచారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియలిస్ట్ శ్రీధర్రెడ్డి ఎస్జీ కళాశాలకు కంప్యూటర్లు అందజేస్తానన్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో అమలయ్యే పలు కీలక నిర్ణయాలను తీసుకున్న ఈ సమావేశంలో అకడమిక్ కౌన్సిల్ చైర్మన్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, అధ్యాపకులు మునిస్వామి, భట్టు కిరీటం, వెల్దండి శ్రీధర్, అనిల్ బొజ్జ, జ్యోత్స్న, శివరాణి, సావిత్రి పాల్గొన్నారు. -
చక్రయ్యను అల్లుళ్లే అంతమొందించారు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక.. మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు. బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. మామ ఆధిపత్యం భరించలేక హత్యకు పథకం రచించిన మూడో అల్లుడు సహకరించిన ముగ్గురు కుమార్తెలు, మరో ఇద్దరు అల్లుళ్లు 13మంది నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాం ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్ను ఎస్పీ అభినందించారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేవించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే.. ఎందుకు కాలేదో ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దర్తీ ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ పథకం కింద తిరుమలగిరి సాగర్ మండలం, రంగుండ్ల తండాలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తండాలో జల్ జీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 10 మీటర్ల లోతున వాన నీటి కట్టడాలను చేపట్టాలని సూచించారు. గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు, 10 హెచ్పీ సోలార్ పంప్, పబ్లిక్ టాప్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రంగుండ్లలో చేపట్టే పనులు ఇతర తండాలకు మోడల్గా నిలవాలని సూచించారు. 52 గిరిజన తండాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
టాటా ఏస్ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు
కొండమల్లేపల్లి: టాటా ఏస్ వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం జోగ్యతండా వద్ద సోమవారం జరిగింది. పెద్దఅడిశర్లపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కొండమల్లేపల్లి మండలం జోగ్యతండా సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లి వైపు కుక్కర్లు, మిక్సీలు తదితర సామగ్రితో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్ మల్లేష్ కాలు విరగడంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానికులు దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. హత్య కేసులో నిందితుడికి పదేళ్లు జైలుశిక్ష భువనగిరి: భార్యాభర్తను హత్య కేసిన కేసులో నిందితుడికి పదేళ్లు జైలుశిక్ష, రూ.20వలే జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జయరాజు సోమవారం తీర్పు వెలువరించారు. భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల బస్వయ్య గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023 అక్టోబర్ 13వ తేదీన బస్వయ్య తన ఇంటి వద్ద ఉన్న గొర్రెల దొడ్డి నుంచి గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్వయ్య ఇంటి పక్కనే ఉంటున్న రాసాల రాజమల్లు తన ఇంటి ముందు నుంచి గొర్రెలను తోలుకపోవడం వల్ల దుమ్ము లేచి ఇబ్బందులు పడుతున్నామని బస్వయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి రాజమల్లు అక్కడే ఉన్న పారతో బస్వయ్య తలపై కొట్టాడు. అదే సమయంలో అడ్డుగా వచ్చిన బస్వయ్య భార్య తిరుపతమ్మ తలపై కూడా కొట్టాడు. దీంతో బస్వయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. తిరుపతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతుడి అల్లుడు గంగనమోని శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ సత్యనారాయణ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును విచారణలో భాగంగా జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించి రాజమల్లుకు పదేళ్లు జైలు, రూ.20వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. దీంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కబోతోంది. మంత్రివర్గ విస్తరణపై సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. ఇందులో రాజగోపాల్రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో రాజగోపాల్రెడ్డి ఉన్నారు. అయితే, వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు కూడా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే, రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నందున బాలు నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి పదవులు ఉండగా, మూడో మంత్రి పదవి రాజగోపాల్రెడ్డికి దక్కనుంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫ ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి ఫ బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్ ఫ ఢిల్లీ చర్చల్లో దాదాపుగా ఖరారు -
నిందితులకు శిక్ష పడితేనే ప్రజలకు నమ్మకం
నల్లగొండ : ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడితేనే.. ప్రజలకు పోలీస్శాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు తీసుకుని పనిచేయాలన్నారు. కేసు తుదిదశలో సాక్షులు, నిందితులు, బాధితులను సమయానికి కోర్టులో హాజరుపరిచేలా చూసుకోవాలన్నారు. సంవత్సరకాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో ఒకరికి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు విధించడం అభినందనీయమన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రాసిక్యూటర్లను, కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు శివరాంరెడ్డి, డీఎస్పీ రాజశేఖరరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, వెంకటేశ్వర్లు, జవహర్లాల్, రంజిత్కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనునాయక్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరణ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాదితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్శాఖను మరింత చేరువ చేయాలని, స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరంగా వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నల్లగొండ
ఇఫ్తార్ 6–34 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 4–54 (బుధవారం ఉశ్రీశ్రీ)అల్లుళ్లే అంతమొందించారు గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించారుసొంత అల్లుళ్లు. 7- 8లోమంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025లక్ష్యం సాధించే వరకు.. లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. దాన్ని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. - 8లో -
ప్రశ్నపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఎంత?
బాధితురాలా? నిందితురాలా? ఇన్ని లోపాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టకుండా ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ బాలిక ఝాన్సీలక్ష్మిని డిబార్ చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. ప్రతిభావంతులైన పిల్లలు కూడా పదో తరగతి పరీక్షలు అంటేనే భయపడతారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చాక ఎలా రాయాలన్న ఆందోళనలోనే ఉంటారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి రాయితో కొడతానని బెదిరించి ప్రశ్నపత్రం ఫొటో తీసుకుంటే అందుకు బాలిక సహకరించినట్టా? విద్యార్థిని నుంచి ఫొటో తీసుకొని వెళ్లి, జవాబులను మళ్లీ ఆమెకు తెచ్చి ఇచ్చారా? ఈ విషయం విద్యాశాఖ అధికారులే చెప్పాలి. ఆ బాలిక బాధితురాలా? నిందితురాలా? అన్నది తేల్చాల్సి ఉంది. ఇవేమీ చెప్పకుండా, అసలు భద్రతాలోపం, పర్యవేక్షణ వైఫల్యాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టకుండా, ఆ బాలికను డిబార్ చేయడంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకు (సోమవారం) మండల విద్యాధికారి ఈ సంఘటనపై ప్రకటన జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఫ విద్యా, పోలీసు, రెవెన్యూ శాఖల వైఫల్యమే కారణమా! ఫ ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ బాలిక డిబార్ ఫ మరి.. బయటి వ్యక్తి పరీక్ష కేంద్రంలోని రావడానికి కారణమైన వారిపై చర్యలేవీ? ఫ అనుమానాలకు తావిస్తోన్న అధికారుల తీరు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పదో తరగతి తెలుగు పేపరు–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి అసలు బాధ్యులు ఎవరు? ఎవరిని బలి చేశారన్న చర్చ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈనెల 21వ తేదీన ఉదయం లీకై న తెలుగు ప్రశ్నపత్రం శాలిగౌరారంలో యువకుల వాట్సాప్లలో సర్క్యూలేట్ అయ్యేంత వరకు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, భద్రతా వైఫల్యమే ప్రశ్నపత్రం లీకేజీకి కారణమనే చర్చ సాగుతోంది. పైగా ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేయడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. గోడ దూకి ఎలా వచ్చాడు? సాధారణంగానే టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో 144 సెక్షన్ను విధిస్తారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ఇది అమల్లో ఉంటుంది. ఆ సమయంలో బయటి వ్యక్తి ఒకరు పాఠశాల ప్రహరిగోడ దూకి ఆవరణలోని వచ్చారంటే భద్రత వైఫల్యమే కారణమనే చర్చ సాగుతోంది. అంతేకాదు సదరు వ్యక్తి తరగతి గది వరకు వచ్చి మరీ కిటికీలోనుంచి విద్యార్థిని ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లాడంటే లోపం ఎక్కడుందన్న విషయాన్ని విచారణలో పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్థానిక పోలీసులు ఈ పరీక్షలకు సీరియస్గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒకరిద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తుకు ఉంచినట్లుగా తెలుస్తోంది. భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలం అయ్యారని, ఆ విషయాన్ని పక్కన పెట్టి విచారణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు భద్రత పటిష్టంగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిరాక్స్ కేంద్రాలు ఎలా తెరిచారు? పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్తో ఫొటో తీయగా, అందులోని ప్రశ్నలకు అనుగుణంగా ఒకే పేపరులో వచ్చేలా జవాబులను సిద్ధం చేసి స్థానికంగా జిరాక్స్ తీశారు. పరీక్షలు సమయంలో అంతటా జిరాక్స్ సెంటర్లను మూసేస్తారు. కానీ నకిరేకల్, శాలిగౌరారంలో జిరాక్స్ కేంద్రాలు ఎలా తెరిచి ఉంచారు? దానికి బాధ్యులు ఎవరన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నకిరేకల్ : ‘పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలో నాకు ఏ పాపం తెలియదు.. నన్న డిబార్ చేశారు. నాకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలి. లేకుంటే నాకు చావే శరణ్యం’ అని పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి తన ఆవేదన వెలిబుచ్చిది. నకిరేకల్లో ఈ నెల 21 పదో తరగతి తెలుగు పేపర్ లీకై .. ప్రశ్నపత్రం వాట్సప్లలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రమేయం ఉందంటూ.. అధికారులు విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థినిని మిగతా పరీక్షలకు అనుమతించడం లేదు. దీంతో ఆమె సోమవారం తన తల్లిదండ్రుల వెంకన్న, శోభతో కలిసి విలేకరుల ముందు తన గోడును వెల్లబోసుకుంది. తాను నకిరేకల్లోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానని, తాను క్లాస్లో టాపర్నని చెప్పింది. తీరా పది పరీక్షలు రాస్తున్న తరుణంలో ఎవరో ఆకతాయిలు తాను పరీక్ష రాస్తున్న గది వద్దకు తనను బెదిరించి ప్రశ్నపత్రం ఫొటోలు తీసుకున్నారని చెప్పింది. పేపర్ చూపించకుంటే రాయితో కొడతామని బెదిరించారని, ఆ సమయంలో భయపడి ప్రశ్నపత్రం చూపించానని, తన పక్కన ఉన్న విద్యార్థులు కూడా ఏం కాదులే చూపించు అన్నారని పేర్కొంది. పేపర్ ఫొటో తీసేందుకు సహకరించాననే ఆరోపణలతో తనను అధికారులు డీబార్ చేశారని చెప్పింది. ‘నా డిబార్ను రద్దు చేయండి.. నన్ను ఏ సెంటర్లోనైనా కూర్చోబెట్టి పరీక్ష రాయించినా.. రాస్తాను. ఎవరో చేసిన దానికి నన్ను బలిచేశారు. దయచేసి నాకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వండి’ అని ఝాన్సీలక్ష్మి వేడుకుంది. పరీక్షలకు అనుమతివ్వకపోతే చావే శరణ్యమని కన్నీటిపర్యంతమైంది. జిల్లా విద్యాధికారులు, పోలీసులు మానవత్వంతో కనికరించి తనకు అవకాశం ఇవ్వాలని కోరింది. నన్ను అన్యాయంగా డిబార్ చేశారుఫ పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి ఫ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి -
లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు
కోదాడ: లక్ష్యాన్ని నిర్ధేశించుకొని.. దానిని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ నారు హరవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్–2లో తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన కోదాడకు చెందిన హరవర్ధన్రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే.. అక్కడ పుట్టి.. ఇక్కడ పెరిగామా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కంభం. మా నాన్న నారు రవణారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించేవారు. ప్రాథమిక విద్య ఖమ్మంలో, ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాను. తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో ఇంజనీరింగ్(సీఎస్సీ) పూర్తిచేశాను. ప్రస్తుతం మా నాన్న కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. మా నాన్నే నాకు స్ఫూర్తి..మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మా నాన్న కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఎన్ఐటీలో క్యాంపస్ ప్లేస్మెంట్కు కూడా ప్రయత్నించలేదు. తొలి ప్రయత్నంలోనే విజయం2021 నుంచి గ్రూప్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ముందు సివిల్స్ కోసం ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఆ సమయంలోనే గ్రూప్–1, గ్రూప్ – 2 నోటిఫికేషన్లు రావడంతో సివిల్స్ వదిలేసి గ్రూప్స్కు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. మొదట ఈ రెండింటికి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత కేవలం గ్రూప్–2 పైనే పూర్తిగా దృష్టి సారించాను. రోజుకు 10 గంటలు చదివి తొలి ప్రయత్నంలోనే టాపర్గా నిలిచాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాపోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఒక యుద్ధంలాంటిది. యుద్దంలో ఆయుధాలు ఎంత ముఖ్యమో పోటీ పరీక్షలకు ప్రమాణిక పుస్తకాలు అంత ముఖ్యం. దీంతో పాటు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇండియన్ హిస్టరీ కోసం నిధి సింఘానియా పుస్తకం, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వి. ప్రశాశ్ పుస్తకం, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదివాను. కరెంట్ అఫైర్స్ కోసం కాంపిటీటివ్ వెబ్సైట్స్తో పాటు దినపత్రికలను చదివాను. ఓపిక ఉంటేనే విజయం సొంతంపోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఓపిక ఉండాలి. పరీక్షలు సుదీర్ఘకాలం సాగవచ్చు లేదా వాయిదా పడవచ్చు. ఇలాంటి సమయంలో సమన్వయం కోల్పోవద్దు. ఆశాజనకంగా ప్రయత్నించాలి. ఒకేసారి ఎక్కువ పరీక్షలకు సిద్ధమవ్వకుండా ఒకే పరీక్షపై దృష్టి పెట్టాలి. దానిని సాధించిన తర్వాత ఇతర పరీక్షల వైపు వెళ్లవచ్చు. గ్రూప్–1, సివిల్స్కు సన్నద్ధమవుతా..ప్రస్తుత మార్కులతో డిప్యూటీ తహసీల్దార్ లేదా రాష్ట్ర సచివాలయంలో ఏఎస్ఓ ఉద్యోగాన్ని ఎంచుకుంటాను. దీనిలో శక్తి వంచన లేకుండా సేవలందిస్తాను. భవిష్యత్తులో గ్రూప్–1, సివిల్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తాను. పోటీ పరీక్షలకు ఓపికతో సన్నద్ధమవ్వాలి గ్రూప్–2 స్టేట్ టాపర్ హరవర్ధన్రెడ్డి -
యూజీసీ మార్గదర్శకాలను రద్దు చేయాలి
రామగిరి(నల్లగొండ) : యూజీసీ – 2025 మార్గదర్శకాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అనిల్ అబ్రహం డిమాండ్ చేశారు. ఎంఫిల్, పీహెచ్డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం ఎన్జీ కళాశాల ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్కు పీహెచ్డీ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. నూతన విద్యా విధానం–2020పై నిష్ణాతులైన ప్రొఫెసర్లను చర్చకు ఆహ్వానించి విధి విధానాలను ఖరారు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, డాక్టర్ అనిల్ బొజ్జ, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పరంగి రవికుమార్, డాక్టర్ అంతటి శ్రీనివాస్, సీఓఈ బత్తిని నాగరాజు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అధ్యాపకులు ముని స్వామీ, కిరీటం, శ్రీధర్, సుధాకర్, మల్లేశం, జ్యోత్స్న, భాగ్యలక్ష్మి, శంకర్ తదితరులున్నారు. -
లయన్స్ క్లబ్ గవర్నర్గా రేపాల మదన్మోహన్
నల్లగొండ : ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్గా రేపాల మదన్మోహన్, డిస్ట్రిక్ట్–1 వైస్ గవర్నర్గా కేవీ ప్రసాద్, డిస్ట్రిక్ట్–2 వైస్ గవర్నర్గా కోడె సతీష్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం నల్లగొండలో జిల్లా గవర్నర్ ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన లయన్స్ క్లబ్ వార్షికోత్సవంలో వీరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని సమాజ సేవే పరమావదిగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దీపక్ బట్టాచార్య, రాజిరెడ్డి, నరేందర్రెడ్డి, తీగల మోహన్రావు, గోలి అమరేందర్రెడ్డి, బీమయ్య, శివప్రసాద్, కేవీ.ప్రసాద్, కోటేశ్వర్రావు, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఉగాది పర్వదినాన సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించే సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభా ప్రాంగణ ఏర్పాటుకు మంత్రి జిల్లా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా అధికారులలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఇరిగేషన్ సీఈ రమేష్బాబు, ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐ చరమందరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, నాయకులు యరగాని నాగన్న, సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్, కోతి సంపత్రెడ్డి, శివరాంయాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
నేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం నల్లగొండకు రానున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 9.30 గంటలకు ఆర్జాలబావిలో, 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. రైతు సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలంచింతపల్లి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ విమర్శించారు. ఆదివారం చింతపల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా 15వ మహాసభలో ఆమె మాట్లాడారు. భూమి, భుక్తి, రైతు సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నడిపిన చరిత్ర తెలంగాణ రైతు సంఘానికి ఉందన్నారు. దేశంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎండీ.మోహినుద్దీన్, కార్యదర్శి గిరిజ రామచంద్రయ్య, సుదర్శన్రెడ్డి, పోలె వెంకటయ్య, ఉజ్జిని అంజల్రావు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేదనడం సరికాదునల్లగొండ : ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయం తేల్చకుండా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదనడం సరికాదని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పీఆర్సీ గడువు ముగిసిందని, పీఆర్సీ రిపోర్టు వెంటనే తీసుకుని అమలు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7.57 శాతం కేటాయించడం సరికాదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్గా మార్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, ఉపాధ్యక్షుడు పి.ఏడుకొండలు, ఎం.పుష్పలత, ఎన్.గోపి, ఎం.నాగయ్య, టి.వెంకటేశ్వర్లు, జగతి, రాహెల్కుమారి, అంజయ్య, ఖుర్షిద్మియా పాల్గొన్నారు. ఫ్లెక్సీ మెటీరియల్పై పన్నులు రద్దుచేయాలినల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ మెటీరియల్పై వేసిన పన్నులను రద్దు చేయాలని ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్రెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లెక్సీ, ప్రింటింగ్ యజమానులను కాపాడాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు చిలుకూరి జగన్నాథ్ మాట్లాడుతూ రెండు రోజులుగా షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రింటింగ్ రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో కల్లూరి నగేష్గౌడ్, రామగిరి వెంకన్న, సురేష్, చంద్రశేఖర్, సిరాజుద్దీన్, శ్రీధర్, హరీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు రూ.13.31 కోట్లు
నల్లగొండ టూటౌన్: నీలగిరి పట్టణంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పట్టణంలో 96 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 300 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. 2024– 25కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను రూ.1.43 కోట్ల 15 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను రూ.6.20 కోట్ల 15 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లించని కారణంగా పాత బకాయిలతో కలిసి మొత్తం రూ.13 కోట్ల32లక్షల 38 వేలు ఉంది. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపు కోసం ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా ఇతర వాటికి దుబారా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నోటీసులు జారీ చేసిన అధికారులు మార్చి 31 నాటికి పట్టణంలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టడంతో బకాయిదారుల జాబితా తయారు చేసి నోటీసులు అందజేశారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న 96 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 300 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా సకాలంలో ఆస్తి పన్ను చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధరుసుం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం పట్టించుకోకుండా సంబంధిత శాఖల అధికారులు వ్యవహిస్తుండడంతో ఆయా శాఖలకు సైతం భారం అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది సైతం గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొంది. బకాయిలపై కలెక్టర్ దృష్టి సారిస్తేనే వసూలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ నీలగిరి పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు ఫ నోటీసులు జారీ చేసిన మున్సిపల్ యంత్రాంగం ఆస్తి పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బకాయి లేకుండా వెంటనే ఆస్తి పన్ను చెల్లించాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా వారికి అపరాధ రుసుం పడదు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
హుజూర్నగర్, పాలకవీడు: ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా వద్ద నిర్వహించిన కందూరు కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం స్థానిక డక్కన్ సిమెంట్ పరిశ్రమ అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వెంకట్రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ, డిండి, నెల్లికల్లు, నాగార్జునసాగర్ ఎడుమ కాల్వ, ఏఎంఆర్కు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. ఇటీవలే గంధమల్ల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలో దాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని ప్రజాపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. రోడ్ల అభివృద్ధిలో నంబర్ వన్గా ఉంచుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిరోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్గా ఉంచుతామని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో రైల్వే బ్రిడ్జ్లు, రూ.140 కోట్లతో దామరచర్ల వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర మంత్రి అనుమతి ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం పదేళ్లు పెండింగ్లో ఉంచిందని, మేము అధికారంలోకి రాగానే పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. దేవాదుల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. దక్షిణ తెలంగాణలో 36 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ 32 గెలిచిందని..ప్రజలు మావైపు ఉన్నారనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇవన్నీ తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయని వారు పన్నెండు నెలలకే కొంపలు మునిగినట్లు మామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అన్ని రోడ్లు బీటీగా మారుస్తామని, ఏప్రిల్ రెండవ వారంలో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. జాతీయ రహదారులను సైతం విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు. తొలుత హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయక్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భూక్యాగోపాల్, మాళోతు మోతీలాల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజా పాలనతో విప్లవాత్మక మార్పులు ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ జాన్పహాడ్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష ఫ హుజూర్నగర్లో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన -
మూల్యాంకనంలో నిబంధనలకు పాతర!
నల్లగొండ : ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో బోర్డు నిబంధనలకు అధికారులు పాతర వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లను కాదని జూనియర్లకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిసింది. పేపర్ వాల్యుయేషన్లో జూనియర్ కళాశాలల అధ్యాపకులకే బాధ్యతలు అప్పగిస్తూ గురుకుల, మోడల్ అధ్యాపకులు సీనియర్లు ఉన్నా.. వారికి అవకాశం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని.. తాగు నీటిని కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు బాధ్యతలు నల్లగొండలోని కోమడిరెడ్డి ప్రతీక్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి వాల్యువేషన్ పూర్తికాగా.. ఆదివారం నుంచి రెండో విడతను ప్రారంభించారు. అయితే అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. వారిపై చీప్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు ఎక్స్పర్ట్లతోపాటు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల బాధ్యతలు ఉంటాయి. అయితే బోర్డు నిబంధనల ప్రకారం అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ (ఏసీఓ) బాధ్యతలు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇవ్వాలి. కానీ ఇక్కడ జూనియర్ లెక్చరర్లకు అప్పగించారు. ఆయా విషయంలో అనుభవం ఉన్నవారినే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లుగా నియమించాలి.. కానీ 25 ఏళ్ల సీనియర్లను కాదని.. జూనియర్ లెక్చరర్లకే ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. చీఫ్ ఎగ్జామినర్ల నియామకంలోనూ అదే తీరుగా వ్యవహరించారని అధ్యాపకులు పేర్కొంటున్నారు. కొరవడిన మౌలిక సదుపాయాలు.. నల్లగొండలోని మూల్యాంకనం కేంద్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. తాగునీరు లేకపోగా కనీసం రూమ్లు శుభ్రంగా ఉంచడం లేదని, టాయ్లెట్లు కూడా సక్రమంగా లేవని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఫ జూనియర్లకు అందలం.. సీనియర్లకు మొండి చేయి ఫ ప్రిన్సిపాళ్లకు ఇవ్వాల్సిన ఏసీఓ పోస్టులు జూనియర్లకు అప్పగింత ఫ సబ్జెక్టు ఎక్స్పర్ట్ బాధ్యతలు కూడా జూనియర్లకే.. ఫ కేంద్రంలో కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అధ్యాపకుల ఆవేదన నిబంధనలు పాటిస్తున్నాం మూల్యాకనంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారమే విధులు కేటాయించాం. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రిన్సిపాళ్లు రాకపోవడంతోనే జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించాం. మూల్యాంకనంలో ప్రభుత్వ, ఇటీవల రెగ్యులర్ అయిన లెక్చరర్లకే అవకాశం మొదట ఇస్తున్నాం. ఆ తర్వాత మోడల్ స్కూల్, గురుకుల అధ్యాపకులకు ఇస్తాం. చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు ఎక్స్పర్ట్ల విషయంలో సీనియర్లు లేనప్పుడే జూనియర్లకు అవకాశం ఇస్తున్నాం. మూల్యాంకన కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. మూ ల్యాంకనానికి అవకాశం రాని కొందరు అధ్యాపకులే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. – దస్రూనాయక్, డీఐఈఓ -
సైనికదళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు
నల్లగొండ : భారత సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్గా చేరవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలను www.joi nindianarmy.nic.in వెబ్సైట్లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు. మానసిక దివ్యాంగులకు అండగా న్యాయ వ్యవస్థ రామగిరి (నల్లగొండ) : మానసిక దివ్యాంగులకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల్లగొండలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానసిక దివ్యాంగుల హక్కుల రక్షణకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానసిక దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. వారి హక్కులను న్యాయస్థానాల ద్వారా కాపాడుతామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిరిగిరి వెంకట్రెడ్డి, గిరి లింగయ్యగౌడ్, నిమ్మల బీమార్జున్రెడ్డి, లెనిన్బాబు, ప్రసాద్, శివరామకృష్ణ, వెంకటరెడ్డి, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్మేళానల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం కార్తీకేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ జాబ్మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 200 మంది విద్యార్థినులు హాజరయ్యారు. యాపిల్ సంస్థలో విడిభాగాలను సమకూర్చే ఉద్యోగాలకు విద్యార్థినులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.17,200 వేతనం, ఉచిత హాస్టల్, క్యాంపస్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, టీఎస్ కేసి కోఆర్డినేటర్ రాంరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్, ఆయేషా, ప్లేస్మెంట్ నిర్వాహకులు కెఎన్డి.మూర్తి, రేణుక పాల్గొన్నారు. భూగర్భ జలశాఖను సంప్రదించాలినార్కట్పల్లి : బోర్లు వేయాలనుకునే వారు ముందుగా భూగర్భ జలశాఖను సంప్రదిస్తే బోరువెల్ పాయింట్ కోసం శాసీ్త్రయంగా సర్వే చేస్తుందని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి కె.రేవత్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శనివారం నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో గల రైతువేదిక వద్ద జిల్లా భూగర్భ శాఖ–ప్రతిభ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ‘భూగర్భ జలాల సంరక్షణ–నీటి వినియోగం’పై ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి అనంతరెడ్డి, మండల ప్రత్యేకాధి కారి చరితారెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, ఎంపీడీఓ ఉమేష్, ఏఓ గౌతమ్, శ్వేత, మానస, రజని, కుమార్, లక్ష్మయ్య, రాకేష్రెడ్డి, జావెద్, నర్సింహ, మహేష్, యాదగిరి ఉన్నారు. -
నకిరేకల్లో పోలీస్ పహారా నడుమ పరీక్షలు
నకిరేకల్: పేపర్ లీకేజీతో సమస్యత్మకంగా మారిన నకిరేకల్ పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ పహారా నడుమ శనివారం పరీక్షలు జరిగాయి. పట్టణంలోని నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు పహారా కాశారు. ప్రత్యేకించి శుక్రవారం ప్రశ్నపత్రం లీకేజీ అయిన ఎస్సీ గురుకుల సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్గా నకిరేకల్ మండలం మంగళపల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వీరారెడ్డి, డిపార్ట్మెంటల్ అధికారిగా కట్టంగూరు మండలం మునుకుంట్ల జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం షమీదాబేగంను నియమించారు. ఈ కేంద్రంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్, నల్లగొండ ఎంఈఓ అరుంధతి మకాం వేసి పర్యవేక్షించారు. నకిరేకల్ తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య పరీక్ష కేంద్రాలను సందర్శించారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు సురేష్, లచ్చిరెడ్డి సిబ్బందితో గస్తీ నిర్వహించారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 747 మంది విద్యార్థులకు గాను 745 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. షోకాజ్ నోటీసులు జారీ.. నకిరేకల్లో గురుకల పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్న పోతులు గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్రెడ్డిని శుక్రవారమే విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ శనివారం వారికి జిల్లా విద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పేపర్ లీక్ అయిన గది ఇన్విజిలేటర్గా ఉన్న ఇదే గురుకుల పాఠశాలలో టీజీటీ సుధారాణిని శుక్రవారమే సస్పెండ్ చేశారు. -
పరీక్షలు సజావుగా నిర్వహించాలి
హాలియా : పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం హాలియా పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆమె ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలతో పాటు కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని పేర్కొన్నారు. వారి వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐ జనార్దన్గౌడ్, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎస్ఐ సతీష్రెడ్డి ఉన్నారు. 39 మంది గైర్హాజరు నల్లగొండ : పదో తరగతి పరీక్షల రెండోరోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన పరీక్షకు మొత్తం 18,553 మంది విద్యార్థులకుగాను, 18,514 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఫ్లై ఓవర్లు నిర్మించాలని పాదయాత్ర
మిర్యాలగూడ : అద్దంకి– నార్కట్పల్లి రహదారిపై మిర్యాలగూడ బైపాస్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బైపాస్లోని వై జంక్షన్ వద్ద నుంచి నందిపాడు చౌరస్తా మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వై జంక్షన్, నందిపాడు చౌరస్తా, రవీంద్రనగర్ క్రాస్రోడ్డు, చింతపల్లి బైపాస్, ఈదులగూడ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని ఆరు నెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారని, కానీ ఇంతవరకు పనులను మొదలు పెట్టలేదన్నారు. వెంటనే పనులు ప్రారంభించకుంటే నిరాహార దీక్షలు చేపతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, గాదె పద్మ, రవినాయక్, గౌతంరెడ్డి, మంగారెడ్డి తదితరులున్నారు. -
సౌర విద్యుత్ అవగాహన సదస్సు గందరగోళం
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న పీఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ పథకంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం గందరగళంగా మారింది. ఈ పథకం కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం నిర్వహించే సదస్సును నల్లగొండలోని విద్యుత్ ఎస్ఈ చాంబర్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ అధికారులతో పాటు నెడ్క్యాప్ అధికారి, లీడ్ బ్యాంకు అధికారులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ చాంబర్ సరిపోక.. అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. పైగా విద్యుత్ శాఖ ఎస్ఈ కూడా ఈ సమావేశానికి రాలేదు. అవగాహన సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో కూడా పెట్టకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేది లేక అధికారులు సమావేశాన్ని రద్దు చేసి సాయంత్రం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ సోలార్ ప్లాంట్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు అనువజ్ఞులైన అధికారులు కూడా లేరు. దీంతో సదస్సును నామమాత్రంగా ముగించారంటూ రైతులు, నాయకులు ఆరోపించారు. పథకంపై అవగాహన కల్పించలేనప్పుడు సమావేశం పెట్టడం దేనికంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, నెడ్ క్యాప్ అధికారి పాండురంగారావు పాల్గొన్నారు. -
బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూస్తాం
చిట్యాల: బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. చిట్యాల మండలం ఏపూరు పరిధిలోని వీఎస్ఆర్ కోళ్ల ఫారాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆనంతరం గుండ్రాంపల్లి గ్రామంలోని పశు వైద్యాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఏపూరు వీఎస్ఆర్ కోళ్ల ఫారాల్లో బర్డ్ఫ్లూ రావటంతో సుమారు రెండు లక్షల కోళ్లను నిర్మూలించనున్నట్లు తెలిపారు. మిగిలి ఉన్న కోళ్ల దాణా కాల్చివేయటంతో పాటు కోళ్లఫారాలను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని యజమానులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. బర్డ్ఫ్లూ నిర్ధారణకుగాను డివిజన్కు ఒక ప్రత్యేక పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేసి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తున్నామన్నారు. బర్డ్ఫ్లూ సోకని చికెన్ను ఎలాంటి అనుమానాలు లేకుండా తీసుకోవచ్చునని సూచించారు. సమావేశంలో చిట్యాల, ఉరుమడ్ల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్ పాల్గొన్నారు. -
మహిళలకే పనిముట్లు
మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణలబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాము.. 2018 నుంచి వ్యవసాయ యాంత్రికరణ పథకం నిలిచిపోయింది. దీంతో రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పఽథకాన్ని పునరుద్ధరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ పరికరాల కోసం మహిళా రైతుల నుంచి తీవ్ర పోటీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారుల ఎంపిక వ్యవసాయ శాఖ అధికారులకు కత్తిమీది సాములా మారనుంది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులను గుర్తించి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఫ ఈ నెలాఖరు వరకు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు ఫ నియోజకవర్గాల వారీగా యూనిట్లు, నిధుల కేటాయింపు ఫ 50 శాతం రాయితీపై అందజేత నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటిని 50 శాతం రాయితీలో మహిళా రైతులకు మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించడంతో పాటు ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్వవసాయ శాఖ అన్ని నియోజకవర్గాల వారీగా పరికరాలను, నిధులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతిలో కేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా పరికరాలు, నిధుల ఇలా.. (రూ.లక్షల్లో..) నియోజకవర్గం పరికరాలు నిధులు నాగార్జునసాగర్ 138 31.70 దేవరకొండ 134 30.05 మిర్యాలగూడ 139 27.83 మునుగోడు 119 22.44 నకిరేకల్ 129 29.35 నల్లగొండ 140 36.83 తుంగతుర్తి (శాలిగౌరారం) 21 3.16 మొత్తం 820 181.36లబ్ధిదారులను ఎంపిక చేస్తాం వ్యవసాయ యాంత్రికరణ పరికరాల గ్రౌండింగ్ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నియోజక వర్గాల వారీగా పరికరాలతో పాటు నిధుల కేటాయింపు పూర్తి చేశాం. త్వరలో మహిళా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పరికరాల గ్రౌండింగ్ చేస్తాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ● -
ప్రత్యేక ప్రజావాణి దరఖాస్తులపై శ్రద్ధ చూపాలి
నల్లగొండ : వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్కు 74 మంది దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది జిల్లా అధికారులు, ఆర్డీఓలు దరఖాస్తుపై స్పెషల్ గ్రీవెన్స్ అని రాస్తే త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయన్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ పాల్గొన్నారు. పరిహారం పెంచేలా చూడండి మాకు నలుగురు కొడుకులు. ప్రతి నెలా ఒకొక్కరు రూ.2500 చొప్పున 10 వేలు కొడుకులు ఇస్తున్నారు. చిన్న కొడుకు చనిపోయాడు. ఇప్పుడు రూ.7500 వస్తున్నాయి. అయితే పెద్ద కొడుకు టీచర్ అయినా ప్రతి నెల ఆలస్యంగా ఇస్తున్నాడు. కెనడాలో ఉండే కొడుకు, హైదరాబాద్లో ఉండే కొడుకు సమయానికి పంపిస్తున్నారు. కానీ ఆ రూ.7500 మా మందులకే సరిపోవడం లేదు. ఒకొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున ఇప్పించాలి. – కేసాని లింగారెడ్డి–పద్మ, కొడతాలపల్లి, త్రిపురారం మండలం నా బిడ్డ భూమి తీసుకుంది.. పట్టించుకోవడం లేదు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 7 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. నా కొడుకులే 7 ఎకరాల భూమిని నా బిడ్డకు అమ్మారు. 23 కుంటల భూమిని నా పేరున ఉంచారు. నన్ను చూసుకుంటానని చెప్పి ఆ 23 కుంటల భూమిని కూడా నా కూతురే పట్టా చేయించుకుంది. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అడిగితే తిడుతోంది. కొడుకుల వద్దకు పోతే భూమి బిడ్డకు ఇచ్చావు అని పట్టించుకోవడం లేదు. – లింగయ్య, చిన్నకాపర్తి, చిట్యాల మండలంపింఛన్ ఇప్పించండి నేను దివ్యాంగుడిని. మా అమ్మ కూడా మానసిక దివ్యాంగురాలు. నాన్న లేడు. అమ్మకు గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. ప్రస్తుతం ఆగిపోయింది. దాంతో మాకు కుటుంబం గడవడం కష్టంగా ఉంది. మా అమ్మకు పింఛన్ ఇప్పించాలి. – సాలోజు నాగయ్య, తడకమళ్ల, మిర్యాలగూడ మండలం ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నాంపల్లి : గ్రామాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రాత్రి వేళ రోగులకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానిక కస్తూరిభా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. డైనింగ్ హల్, వంట గదులను పరిశీలించారు. హస్టల్, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ దేవ్సింగ్, ఎంపీడీఓ శ్రీనివాసశర్మ, వైద్యులు భవాని, తరుణ్, ఎంపీఓ ఝాన్సీ, సూపర్వైజర్ అంజలి ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీపై ప్రచారం చేస్తాం నల్లగొండ : ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం డిస్కౌంట్పై మరోసారి ప్రచారం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు లే అవుట్ డెవలపర్స్తో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 1002 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారని, వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చామన్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 31వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీపీఓ వెంకయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
టెన్త్ పరీక్షలకు 40 మంది గైర్హాజరు
నల్లగొండ : పదో తరగతి పరీక్ష శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 18,511 మంది విద్యార్థులకుగాను 18,471 మంది పరీక్షకు హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ, గుర్రంపోడు తదితర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి పరీక్షకు హాజరైన విద్యార్థులు, ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు. ఫ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చెత్త వేయకుండా.. కొత్త ఆలోచన
రోడ్ల వెంట చెత్త వేసే ప్రాంతాల్లో.. మొక్కలు, ముగ్గులు నల్లగొండ టూటౌన్ : రోడ్ల వెంట ఎక్కడపడితే చెత్త వేయకుండా నీలగిరి మున్సిపల్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. చెత్త వేస్తున్న రోడ్లను గుర్తించిన మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగులు అక్కడ మొక్కలు నాటి నీళ్లు పోసి వాటిని పెంచుతున్నారు. మొక్కల చుట్టూ టైర్లు అమర్చడం, అక్కడ ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దడంతో చెత్త వేయకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. కాలనీల్లోనూ మొక్కలు నాటడం మేలు.. నీలగిరి పట్టణ పరిధిలోని కొన్ని కాలనీల్లో చెత్తను రోడ్ల వెంట, జనవాసాల మధ్య వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలోని అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడకూడా మొక్కలు నాటి వాటి చుట్టూ టైర్లు పెట్టి ముగ్గులు వేయడం ద్వారా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా చైతన్యం అయి అక్కడ చెత్త వేయడానికి ఎవరూ సాహసించరు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ విధానానికి శ్రీకారం చుట్టాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న మిస్వరల్డ్ పోటీదారులు
ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. ఫ మే 12న నాగార్జునసాగర్కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రానున్న ప్రపంచ సుందరీమణులు ఫ ఇక్కడి ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికవిజయ విహార్లో విడిది ప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న యాదగిరి క్షేత్రంలో క్రిస్టినా పిస్కోవా మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. ఆధ్యాత్మిక నగరికి.. -
టెన్త్ ప్రశ్నపత్రం లీక్పై గోప్యంగా విచారణ
నకిరేకల్, శాలిగౌరారం : పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకై ంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్పేపర్లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్లో వచ్చేవిధంగా జిరాక్స్లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. టెన్త్ తెలుగు పేపర్ లీకై న విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు. మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తహశీసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్కు చేరుకొని నకిరేకల్లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లోనుంచి రిలీవ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. 45 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులు బయటకు.. పరీక్ష సమయం 12.30 గంటలకు ముగిసినప్పటికీ అధికారులు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై విచారణ జరుపడంతో 1.15 గంటలకు విద్యార్థులను బయటికి పంపారు. లీకై న పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లో క్షుణ్ణంగా విచారణ జరిపారు. వాట్సప్లో లీకై న పేపర్ సీరియల్ నెంబర్ను, మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లను సరి చూశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన తర్వాతా ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. -
జీజీహెచ్లో వార్డుల తనిఖీ
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని వార్డులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను పలుకరించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగుల అభిప్రాయాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్పై ఉద్యోగులకు అవగాహననల్లగొండ : పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన ఉద్యోగులకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వీస్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు అన్ని రూల్స్ తెలుసుకుని ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ బి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, నాయకులు కె.నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవామూర్తులకు నిత్యకల్యాణంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
కలెక్టరేట్ ఎదుట వీఓఏల ధర్నా
నల్లగొండ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.20 వేల వేతనం అమలు చేయాలని వీఓఏల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చిలుముల దుర్గయ్య, సులోచన, పోలె సత్యనారాయణ, కె.చంద్రకళ, మంగమ్మ, సువర్ణ, నగేష్, సురేష్, సైదమ్మ, పుష్పలత, పాపయ్య, లక్ష్మి, నాగమణి పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్కు 10మంది ఎంపిక
రామగిరి(నల్లగొండ): స్థానిక ఎన్జీ కళాశాలలో చేపట్టిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి పాల్గొనగా.. న్యాయమూర్తులుగా పర్యావరణ వేత్త సురేష్ గుప్త, సామాజిక వేత్త దుచ్చర్ల సత్యనారాయణ, రిటైర్డ్ లెక్చరర్ విజయ్ కుమార్, నెహ్రూ యువకేంద్రం జిల్లా యువ అధికారి ప్రవీణ్ సింగ్ శిరీష వ్యవహరించారు. తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఎన్ిసీసీ కేర్ టేకర్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు . -
లాంగెస్ట్ రోడ్ నెట్వర్క్లో రెండో స్థానంలో నల్లగొండ
రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉండగా, రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్లు ఉంది. నల్లగొండలో 7,766.92 కిలోమీటర్లు ఉంది. కీలకమైన రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో నల్లగొండను ఒకటిగా తీసుకుంది. లతీఫ్ సాహెబ్ గుట్ట – బ్రహ్మంగారిమఠం, శివాలయం వరకు రూ.140 ఘాట్ రోడ్డును నిర్మించబోతోంది. రూ.236 కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ నుంచి నార్కట్పల్లి అద్దంకి హైవేకు లింక్ చేస్తూ సీసీరోడ్డు వేస్తోంది. -
సమస్యల పరిష్కారమే ఎజెండా
నల్లగొండ టౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సీపీఐ జాతీయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంను గురువారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్రెడ్డి, పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, వీరస్వామి, వెంకటేశ్వర్లు, నర్సింహ, వెంకటేశ్వర్లు, రామచంద్రం, శ్రీనివాస్, ధనుంజయ, అక్బర్, యాదగిరి, ఎల్వీ యాదవ్, యాదయ్య, పంకజ్యాదవ్ పాల్గొన్నారు. -
ఎగుమతుల్లో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
ప్రజల కోసం కలిసి పనిచేద్దాం
నల్లగొండ టౌన్: కమ్యూనిస్టులు పదవుల కోసం గాక ప్రజల కోసం పోరాడతారని అలాంటి వారితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై న సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డితో కలిసి గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సత్యంను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లు నిరంతరం ప్రజల కోసం పని చేసిన సత్యంను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం మంచి నిర్ణయమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి పని చేద్దామన్నారు. కార్యక్రమంలో పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, శ్రవణ్కుమార్, వీరస్వామి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
పరిశ్రమల ద్వారా యాదాద్రికి రూ.5598 కోట్ల పెట్టుబడులు
టీఎస్ ఐపాస్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పరిశ్రమలు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలువగా, నల్లగొండ 12వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 23వ స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 1032 పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.5598 కోట్ల పెట్టుబడులు రాగా, 34,876 మందికి ఉపాధి లభించింది. నల్లగొండ జిల్లాలో 693 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.4344 కోట్ల పెట్టుబడులు రాగా, 17,220 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 330 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.5207 కోట్ల పెట్టుబడులు లభించగా, 10,439 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఒక్క సంవత్సరంలోనే..2024–25 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి జిల్లాలో 93 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా రూ.222 కోట్ల పెట్టుబడులు వచ్చి 1666 మందికి ఉపాది లభించింది. నల్లగొండలో 56 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.955 కోట్ల పెట్టుబడులు రాగా, 2053 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 26 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.67 కోట్లు రాగా, 516 మందికి ఉపాధి లభించింది. విద్యుత్ కనెక్షన్లలో టాప్ -
మూల్యాంకనం తేదీలో మార్పు
నల్లగొండ: ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ గురువారం తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు కోటేశ్వర్రావు గురువారం తెలిపారు. విద్యార్థులు telanga naepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్తో సీడింగ్ చేయించుకోవాలని సూచించారు. బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలను విస్మరించారు నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలను విస్మరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అంకెలు కేటాయించారే తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం లేదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ, సాగునీటి, గ్రామీణ పట్టణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జున అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, మల్లేష్, శ్రీశైలం, ప్రభావతి, లక్ష్మీనారాయణ, హశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 25న ఇంటర్వ్యూలు నల్లగొండ: నల్లగొండ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య, వ్యాయామ విద్య బోధించేందుకు ఎంపీఈడీ, దృశ్యకళలు, ప్రదర్శన కళలు బోధించేందుకు ఎంపీఏ/ఎంఎఫ్ఎ/బీఎఫ్ఎ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఫొటోతో నల్లగొండ డైట్ కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 99499 93723 నంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన మర్రిగూడ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాయకల్ప పీర్ అసెస్మెంట్ స్టేట్ టీం సభ్యులు గురువారం మర్రిగూడ సీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. టీం సభ్యురాలు డాక్టర్ స్వప్నరాథోడ్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్సీలో మరికొంత మంది వైద్యులు, సిబ్బంది అవసరం ఉందని వారిని నియమిస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీం సభ్యులు మంజుల, సమీనా, సూపరింటెండెంట్ శంకర్నాయక్, గణేష్, పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలునల్లగొండ: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కెమిస్ట్రీ– 2, కామర్స్– 2 పరీక్షకు సంబంధించి జిల్లాలో మొత్తం 12,894 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,504 మంది హాజరయ్యారు. 390 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. -
నల్లగొండ
ఇఫ్తార్ 6–32 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్ 4–57 (శనివారం ఉశ్రీశ్రీ)చోరీ ముఠా అరెస్ట్ వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ తీగలను చోరీ చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. Iసాగర్ డ్యాం సందర్శించిన సీఈ సాగర్ డ్యాం ఎడమ వైపున అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా చీఫ్ ఇంజనీర్ అజయ్కుమార్ సందర్శించారు. శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025- IIలో -
కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు
సూర్యాపేటటౌన్ : ‘కేసీఆర్.. పార్టీ పెట్టి సునామీ సృష్టించారు... కేసీఆరే లేకపోతే తెలంగాణ లేదు.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి ఆ పదవులే రాకపోయేవి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరో వైపు చంద్రబాబు లాంటి వారి సవాళ్ల మధ్య కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్లు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేయించుకొని తింటున్నాడని విమర్శించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని తరలిరావాలని కోరారు. ఈ సభ చూస్తే కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత వెంటనే సభ్యత్వ నమోదుతోపాటు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా పిలుచుకుందామని అన్నారు. దేశానికి కేసీఆరే దిక్సూచి: జగదీష్రెడ్డి దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 27న జరిగే వరంగల్ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. అంతకు ముందు జనగామ క్రాస్రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు కేటీఆర్కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారు ఫ బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం ఫ ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతుండు ఫ సూర్యాపేట సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
నల్లగొండ: పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తిరిగి ఏప్రిల్ 4వ తేదీన ముగియనున్నాయి. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 18,825 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు 5 నిమిషాల సడలింపు అవకాశం కల్పించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఈఓ భిక్షపతి తెలిపారు.ఫ పరీక్ష రాయనున్న 18,825 మంది -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ శాఖ సూచనల మేరకు ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారులు, ఆర్అండ్బీ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ.. మిషన్ ఆధార్ పేరున రహదారుల దగ్గర్లో ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన పోలీస్, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. -
రైతులు మెట్ట పంటలు వేయాలి
చిట్యాల : తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి ఇచ్చే మెట్ట పంటలు, పండ్లు తోటలు, కూరగాయాల సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. చిట్యాల మున్సిపాలిటీ శివారులోని రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయాలు, మామిడి, పుచ్చకాయల సాగును పరిశీలించారు. కూరగాయాలు, పుచ్చకాయల సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలు, నీటి వాడకం, దిగుబడి, ఖర్చులు, ఆదాయం, మార్కెటింగ్ వివరాలను ఆమె రైతు సత్తిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి నీటితో సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నట్లు రైతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని రైతులు సూక్ష్మసేద్యం, బింధు సేద్యం ద్వారా పంటలను సాగుచేసి ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. వచ్చే వానాకాలం వరికి ప్రత్యామ్నాయ పంటలను పండించేందుకు రైతులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. కుంటల్లో నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పోతరాజు కుంట, చౌటకుంటలో పూడిక తీసి నీటి నిల్వలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ శ్రవణ్కుమార్, ఉద్యానవన శాఖాధికారి అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ఎంపీడీఓ ఎస్పీ.జయలక్ష్మి, డీటీ విజయ, ఏఓలు గిరిబాబు, శ్రీను, హార్టికల్చర్ అధికారి శ్వేత, ఏఈఓలు కృష్ణకుమారి, మనిషా, వాసుదేవరెడ్డి, ఏపీఓ శ్రీలత, రైతులు యాస సంజీవరెడ్డి, లింగారెడ్డి, శ్యాంప్రసాద్రెడ్డి, జిట్ట బొదయ్య, అజిత్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నల్లగొండ
ఇఫ్తార్ 6–33 (గురువారం సాశ్రీశ్రీ) సహర్ 4–58 (శుక్రవారం ఉశ్రీశ్రీ)రైతాంగాన్ని కాపాడాలి కృష్ణాలో నీటిలో హక్కులను సాధించి మన రైతాంగాన్ని కాపాడాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి కోరారు. - IIలోIస్ఫూర్తిదాయకం నీ ఘనత భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ వ్యోమగామిగా సాధించిన విజయాలు యువతకు ఆదర్శం.- IVలోగురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025 -
సాగునీటికి పెద్దపీట
ప్రాజెక్టులకు రూ.1600 కోట్లు కేటాయింపు ఫ గతేడాది కంటే ఈ బడ్జెట్లో నిధులు ఎక్కువే.. ఫ కొనసాగనున్న ఎస్ఎల్బీసీ, ముందుకు సాగనున్న డిండి ఫ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునీకరణకు నిధులు ఫ నాగార్జునసాగర్ డ్యాం పెండింగ్ పనులకు మోక్షం ఫ ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా కేటాయించని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో గతేడాది కంటే కాస్త ఎక్కువ నిధులే కేటాయించింది. ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. నాగార్జునసాగర్ కింద పలు పెండింగ్ పనులు, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులకు మోక్షం లభించే అవకాశం ఉంది. మొత్తంగా నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్దు కింద రూ.1600 కోట్లు (1599.90) కేటాయించింది. సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్–2, మూసీ ప్రాజెక్టు కింద పలు పనులకు గతేడాదిలాగే నిధులను ఇచ్చిన ప్రభుత్వం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులను చూపించలేదు. బస్వాపూర్, గంధమల్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. బూనాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు ఇటీవల అనుమతి ఇచ్చిన రూ.266.65 కోట్లను వినియోగిస్తామని బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ఆశలు జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును పెంచడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్లో ఇటీవల ప్రమాదం చోటు చేసుకోవడం.. ఇప్పటికీ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ బడ్జెట్లో ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ కింద నిధుల కేటాయింపు పెంపుతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కొనసాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు గతే ఏడాది రూ.800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.900 కోట్లను (899.90) కేటాయించింది. ఇందులో ప్రధాన కాలువల కోసం రూ. 578.81 కోట్లు కేటాయించగా, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.201.19 కోట్లు, పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్) కోసం రూ.120 కోట్లు కేటాయించింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించేందుకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క బడ్జెట్లో ప్రసంగంలో పేర్కొన్నారు. దానిద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు, 107 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీటిని అందిస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు ఏఎఆర్పీలో భాగం అయినందున దీనికింద చేయాల్సిన కాలువల పనులకు కూడా ఈ నిధులనే వినియోగించే అవకాశం ఉంది. జీతాలకే రూ.35 కోట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీకి గతేడాదిలో వేతనాల కోసమే ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్శిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. వివిధ పనులను చేపట్టేందుకు, కొత్త కోర్సులన ప్రవేశపెట్టేందుకు, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు, భవనాల నిర్మాణం, మౌలికసదుపాల కల్పన తదితర పనులకు రూ.309 కోట్లు కావాలని యూనివర్సిటీ ప్రతిపాదించినా పైసా ఇవ్వలేదు. ఇక నాగార్జునసాగర్లో బుద్ధుని వారసత్వ ప్రాంతీయ మ్యూజియం ఏర్పాటు కోసం రూ.1.15 కోట్లు కేటాయించింది. అలాగే బుద్ధవనం ప్రాజెక్టుకు రూ.3 కోట్లు కేటాయించింది.నాగార్జునసాగర్కు పెరిగిన నిధులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. అయితే నాగార్జునసాగర్ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. -
105 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు
ఫ హాజరుకానున్న 18,525 మంది విద్యార్థులు ఫ జవాబులు రాసేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన 24 పేజీల బుక్లెట్ ఫ పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ భద్రత ‘సాక్షి’తో డీఈఓ భిక్షపతి నల్లగొండ : ‘పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీన జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశాం. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కన్వర్జేషన్ మీటింగ్ నిర్వహించి పరీక్ష కేంద్ర వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’ అని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 144 సెక్షన్ అమలు పదో తరగతి పరీక్షలు జిల్లాలో 18,825 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 18666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 105 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తాం. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పేపర్లు మాత్రం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం.. పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తాం. సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించాం. బుక్లెట్పై క్యూఆర్ కోడ్.. పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు జవాబులు రాసేందుకు గతంలో మెయిన్ ఆన్సర్ షీట్, అడిషనల్ షీట్లు ఇచ్చేవారు. ఈసారి వాటి స్థానంలో 24 పేజీల బుక్లెట్ అందిస్తున్నాం. ఆ బుక్లెట్పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. 986 మంది ఇన్విజిలేటర్లు జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, ఆరు ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. అందులో విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉంటారు. చీఫ్ సూపరింటెండెంట్లు 105 మంది, డిపార్టుమెంట్ అధికారులు 105 మంది ఉంటారు. సిట్టింగ్ స్క్యాడ్గా 13 మందిని ఏర్పాటు చేశాం. 13 సీ సెంటర్లు.. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతంలో ట్రెజరీ ఆఫీస్, పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్ లేని వాటిని సీ సెంటర్లుగా గుర్తించాం. ఈ పరీక్ష కేంద్రాలవారు ఇతర సెంటర్వారు ప్రశ్నపత్రాలు పెట్టే పోస్టాఫీస్ల్లోనే వారి పేపర్లను ఉంచుతారు. అక్కడ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష పూర్తయిన తర్వాత అదే పోస్టాఫీస్లో అప్పజెప్పాలి. కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలకు పేపర్లు తీసుకురావడంతోపాటు తిరిగి పోస్టాఫీస్లకు తీసుకెళ్లాలి. ప్రతి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశ్నపత్రాలను ఆ సీసీ కెమెరాల ముందే ఓపెన్ చేస్తాం. ప్రతి పరీక్ష కేంద్రంలో ఎంఈఓ, ఎస్ఐ ఫోన్ నంబర్లను రాసి ఉంచాం. డీఈఓ ఆఫీస్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశాం. 45 నిమిషాల ముందుగానే కేంద్రంలోకి.. విద్యార్థులు హాల్ టికెట్ తీసుకున్న తర్వాత పరీక్షకు ముందు రోజే సెంటర్కు వెళ్లి చూసుకోవాలి. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందునుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తాం. హాల్టికెట్, పెన్ను, పెన్సిల్, పరీక్ష ప్యాడ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. దివ్యాంగులు, చేతులు పనిచేయనివారు పరీక్షలు రాసేందుకు స్క్రైబ్లుగా.. 9వ తరగతి విద్యార్థులను ఏర్పాటు చేస్తాం. -
బ్లాక్ స్పాట్స్లో సర్వీస్ రోడ్లు నిర్మించాలి
నకిరేకల్, కట్టంగూర్ : హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. నకిరేకల్లోని పద్మానగర్ జంక్షన్ వద్ద, కట్టంగూర్లో నల్లగొండ క్రాస్ రోడ్డు, కురుమర్తి క్రాస్ రోడ్డును బుధవారం ఆయన చౌదరి కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ మూడు చోట్ల సర్వీస్ రోడ్లు లేక ప్రజలు రాంగ్రూట్లో ప్రయాణించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించాలని, హైవేపై అన్ని జంక్షన్ల వద్ద హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అమర్చాలని ఆదేశించారు. రాత్రి వేళ్ల రహదారిపై వాహనాలు నిలిపి ఉండకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్, హైవే రెసిండింట్ ఇంజనీర్లు కిషన్రావు, జోగేంద్ర, చౌదరి కంపెనీ మేనేజర్ నాగకృష్ణ, రాంకుమార్, సంజీవచౌదరి, పోలిశెటి అంజయ్య తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ -
ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి
పెద్దవూర: పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీఓ) ఎస్పీ రాజ్కుమార్ అన్నారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంతోపాటు పులిచర్ల ఎస్టీ వసతి గృహాల విద్యార్థులు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పెద్దవూర ఆశ్రమ పాఠశాలలో మోటివేషనల్, కెరీర్ గైడెన్స్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆ యన మాట్లాడారు. పదో తరగతి పూర్తయ్యాక ఏఏ కోర్సులు ఉంటాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. విద్యార్థుల ఆసక్తులు, అవసరాలు, సామర్థ్యాలు, అర్హతలను అనుసరించి భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డీవీ. నాయక్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డీ.బాలోజీ, వార్డెన్లు బాలకృష్ణ, శ్రీను, సుధాకర్, ఆర్పీలు రాంరెడ్డి, కృష్ణ, సురేందర్, ఉపాధ్యాయులు సంధ్యా, షాహీన్బేగం, శ్రీనునాయక్, రామయ్య, సైదులు, శాంతి పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో చెక్పోస్టులు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇతర రాష్ట్రాల ధాన్యం తీసుకువచ్చి జిల్లాలో విక్రయించకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. అలాగే ఇంటర్నల్ చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్దతు ధర, ధాన్యం సేకరణపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. గత వానాకాలం సీజన్లో గుర్తించిన లోపాలను ఇప్పుడు సరిచేసుకోవాలన్నారు. ఏదేని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు లేదా నిర్లక్ష్యం వహించినట్లు తెలిస్తే ఆ సెంటర్ను రద్దు చేస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ పాకెట్లతోపాటు, మందులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్ ఎంట్రీ చేయాలని, ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే రైతుల నుంచి పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తీసుకోవాలన్నారు. తేమ 17 శాతానికి మించకుండా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
చందంపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం చందంపేట మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం చందంపేట కేజీబీవీని సందర్శించి తన పేరు ఏమిటని, తాను ఎవరినని విద్యార్థులను అడిగారు. కలెక్టర్ అని విద్యార్థులు బదులివ్వడంతో ఎలా తెలుసుంటూ ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ 8, 9 తరగతుల విద్యార్థులకు గణితం బోధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వంట గదిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. పాఠశాలలో ఏఎన్ఎం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎస్ఓ కవిత.. కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో త్వరలోనే ఏఎన్ఎం నియమిస్తామన్నారు. తదుపరి చందంపేట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి గర్భిణులు, బాలింతలతో కాసేపు మాట్లాడారు. ఓ గర్భిణి 9 నెలల గర్భస్రావం కావడంపై స్పందించిన కలెక్టర్.. గర్భాధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆకుకూరల ప్రాధాన్యతను తెలియజేశారు. మారుమూల విధి నిర్వహణలో నిబద్ధత చూపడం పట్ల తహసీల్దార్ శ్రీనివాస్ను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ లక్ష్మి, మెడికల్ ఆఫీసర్ చందులాల్, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, సీడీపీఓ చంద్రకళ, ఎస్ఐ సతీష్, అంగన్వాడీ సూపర్వైజర్ సత్యకుమారి, అధికారులు తదితరులు ఉన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ధాన్యం సేకరణకు సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్–ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాలుకు రూ.2320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాలుకు రూ.2300గా కనీస మద్దతు ధర ప్రకటించాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 5,14,030 ఎకరాల్లో వరి సాగు జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు 5,14,030 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తద్వారా 12,14,449 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 11,26,021 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. మార్కెట్కు వచ్చే ధాన్యంలో మిల్లర్లు 5,68,152 మెట్రిక్ టన్నులు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ 5,57,869 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని 146 రైస్ మిల్లుల్లో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సన్నాలు క్వింటాలుకు రూ.500 బోనస్ సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్కు ఈ సీజన్లో 4,42,141 మెట్రిక్ టన్నుల గ్రేడ్–ఏ (సన్న ధాన్యం) వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేశారు. అందులో సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు 81,933 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. దానికి మాత్రమే ప్రభుత్వం బోనస్ అందించనుంది. ప్రైవేటు మిల్లర్లు కొనుగోలు చేసే సన్న ధాన్యానికి బోనస్ వర్తించదని అధికారులు పేర్కొన్నారు. 375 కొనుగోలు కేంద్రాలు ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 172, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 179, రైతు పరస్పర సహకార సంఘాల ఆధ్వర్యంలో 24 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం కేంద్రాల్లో 304 సాధారణ రకం (దొడ్డు ధాన్యం), 71 కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేయనున్నారు. మార్కెట్కు వచ్చే ధాన్యం ఆధారంగా అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచుతారు. ఫ గ్రేడ్ ఏ రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ఫ సన్న ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఫ జిల్లాలో 12,14,449 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఫ కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం ఫ నెలాఖరుకు కేంద్రాలు ప్రారంభంసమస్యలుంటే 9963407064కు ఫోన్ చేయండి ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు గ్రీవెన్స్ సెల్ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. 9963407064 నంబర్కు ఫోన్ చేసి వారి సమస్యలను తెలియజేయవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో 14,117 టార్పాలిన్లు, 200 క్యాలిపర్లు, 253 తూకం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
బడ్జెట్లో మనకు ఎంత?
నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి ఏ మేరకు నిధులు వస్తాయో బుధవారం తేలనుంది. నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టబోయే బడ్జెట్పై జిల్లా ప్రజలు ఆశతో ఉన్నారు. 3.11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ఆశలు నెలకొన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తీసుకునేందుకు ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1800 కోట్లతో దానికి సంబంధించిన పనులను చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు డిండి కింద నిర్మిస్తున్న ఏడు రిజర్వాయర్లకు, కాలువలకు నిధుల అవసరం ఉంది. గత బడ్జెట్లో వాటికి రూ.300 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో వాటికి అధిక కేటాయింపులు ఉంటాయని రైతులు భావిస్తున్నారు. ఏఎంఆర్పీ లైనింగ్కు.. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు (ఏఎమ్మార్పీ) పరిధిలోని కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. సాగునీటిపారుదల శాఖ కూడా దాదాపు రూ. 400 కోట్లతో ప్రధాన కాలువ లైనింగ్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతినడంతోపాటు కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ లేకుండాపోయింది. కాలువలు కంపచెట్లతో నిండిపోయి చివరి ఆయకట్టు నీరందని పరిస్థితి నెలకొంది. అలాగే బ్రాహ్మణవెల్లెంల కాలువల పూర్తికి, నాగార్జునసాగర్ పెండింగ్ పనులకు, పాత ఎత్తిపోతల పథకాలకు నిధుల అవసరం ఉంది. కాళేశ్వరం, మూసీ కాల్వలకు.. యాదాద్రి జిల్లాల్లో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.200 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల ఆధునికీకరణకు నిధులన ఇస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్లో ఈ మేరకు వస్తాయనేది తేలనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న గందమళ్ల రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులపై ఆశలు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్ రెండోదశ చివరి ఆయకట్టు భూములకు నీరందించేందుకు కాల్వల అధునీకరణకు చర్యలు చేపడుతుందా? లేదా? తేలనుంది. వీటితోపాటు ఆస్పత్రుల అప్గ్రెడేషన్, జూనియర్, డిగ్రీ కాలేజీల మంజూరు వంటి అంశాలపై జిల్లా ప్రజలు డిమాండ్లు ఉన్నాయి. యూనివర్సిటీకి నిధులు వచ్చేనా? మహత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి ఈసారైనా అధిక మొత్తంలో ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందా? లేదా చూడాలి. గత ఏడాది కేవలం నిర్వహణ పద్దు కింద రూ.34.08 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈసారి రూ.309 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఏమేరకు బడ్జెట్ కేటాయిస్తుందో బుధవారం తేలనుంది.ఫ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కేనా.. ఫ డిండి, ఏఎమ్మార్పీ, మూసీ కాలువలకు నిధులు వచ్చేనా.. ఫ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశాభావం ఫ టన్నెల్ పనులపై స్పష్టత వచ్చే అవకాశం టన్నెల్ పనులపై.. జిల్లాలో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్ఎల్బీసీ సొరంగమార్గం ప్రాజెక్టు పనులపై ఈ బడ్జెట్లో కొంత స్పష్టత రానుంది. ఇటీవల టన్నెల్ ఇన్లెట్ 14వ కిలోమీటర్ వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను కొనసాగిస్తుందా? లేదా అన్నది తేలనుంది. గత బడ్జెట్లో మాత్రం ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రూ.798 కోట్లు కేటాయించింది. గ్రీన్ చానల్ ద్వారా నిధులను ఇచ్చి పూర్తి చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి, రీడిజైన్ వంటి అంశాలపై స్పష్టత వస్తుందని సాగునీటి శాఖ అధికారులు భావిస్తున్నారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నకిరేకల్ : స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ స్థాయిలో ఏజెంట్లను నియమించుకుని సంసిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నకిరేకల్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయా పార్టీల నాయకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ స్టేషన్ల ఓటర్ జాబితాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1 వరకు ఆయా పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాలు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జమురుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ యశ్వంత్, సీనియర్ అసిస్టెంట్ అరవింద్, రాజు, వివిధ పార్టీల నాయకులు యాతాకుల అంజయ్య, పన్నాల రాఘవరెడ్డి, యల్లపురెడ్డి సైదిరెడ్డి, రాచకొండ వెంకట్గౌడ్, పల్స శ్రీను, కె.రవి, శ్రీను పాల్గొన్నారు. ఆర్థిక వ్యూహాలతోనే సమాజ పురోభివృద్ధిమిర్యాలగూడ : విద్యతోనే కాకుండా ఆర్థిక వ్యూహాలతో సమాజ పురోభివృద్ధి సాధించగలమని గుల్బర్గా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వాసుదేవ్ సెడెం అన్నారు. మిర్యాలగూడలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా చివరి రోజైన మంగళవారం ప్రిన్సిపాల్ ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెమినార్ ద్వారా కొత్త ఆర్థిక సూత్రాలు, ఆలోచనలను సమర్థవంతంగా ఆవిష్కరించగలిగామన్నారు. ఆర్థిక సూత్రాలపై సవాళ్లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై లోతైనా చర్చలు జరిపామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్నాసాగర్, రాపోలు భాస్కర్, డాక్టర్ నరేష్, కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలినల్లగొండ: ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులకు శాసనసభలో ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీలో బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. అన్ని మండల కేంద్రాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి బాణాసంచా కాల్చాలన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులతోపాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు
సాక్షి, యాదాద్రి : తిరుమల తిరుపతి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలి(వైటీడీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరిగుట్ట ఆలయానికి పాలక మండలిని 18 మందితో ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టిన బిల్లులో వెల్లడించారు. పాలకమండలి పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీత భత్యాలు ఉండవు. టీఏ, డీఏ ఇస్తారు. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు చేసిన ప్రకటన మేరకు యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయిలో పాలకమండలి ఏర్పాటుకు చట్ట సవరణ కోసం బిల్లును శాసనసభలో పెట్టారు. చైర్మన్ తోపాటు, వివిధ అనుభవజ్ఞులైన, అంకితభావం కలిగిన ట్రస్టీలను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం ఆలయ చైర్మన్తో పాటు 18 మంది సభ్యులు ఉంటారు. ఫౌండర్ ట్రస్టీతోపాటు ఒక ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులతోపాటు మరో నలుగురు సభ్యులను నియమిస్తారు. పాలక మండలిలో ఒకరు వంశపారంపర్య ధర్మకర్త కాగా మిగతా 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. టీటీడీ బోర్డు మాదిరిగా వైటీడీ బోర్డుకు ఐఏఎస్ అధికారి ఈఓగా ఉంటారు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం చేస్తుంది. టీటీడీబోర్డు తరహాలో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించవచ్చు. టెంపుల్ సిటీకి స్వయం ప్రతిపత్తి యాదగిరిగుట్ట ఆలయానికి 1,241 ఎకరాల భూమి ఉంది. బిల్లు తరువాత ఈ ప్రాంతం అంతా కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన టెంపుల్ సిటీగా మారుతుంది. ఇందులో దేవాలయ ప్రాంతం ప్రత్యేక టౌన్ షిప్గా మారనుంది. నూతనంగా ఏర్పాటయ్యే టెంపుల్ సిటీలో భిక్షాటన నిషేధం. మద్యం అమ్మకాలు, జంతువధ కూడా నిషేధిస్తారు. లైసెన్స్లు లేని వ్యాపారాలు చేయవద్దు. ఫ శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి ఫ 18 మంది సభ్యుల నియామకం ఫ పాలక మండలికి రెండేళ్ల పదవీ కాలం ఫ శాశ్వత సభ్యునిగా ఫౌండర్ ట్రస్టీ -
పల్లెకో.. పోలీస్ అధికారి
నల్లగొండ : నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కొత్త ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమించారు. వారంతా మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆయా గ్రామాలకు నియమించిన పోలీస్ అధికారులు రోజూ క్రమం తప్పకుండా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు నేరస్తులపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. తద్వార గ్రామాల్లో నేరాలు తగ్గుముఖం పడతాయనేది పోలీస్ యంత్రాంగం ఉద్దేశం. ప్రజలతో మమేకం కావాలి : ఎస్పీ ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ పోలీస్ అధికారుల నియామకం, వారి విధులపై సూచనలు చేశారు. ప్రతి గ్రామ పోలీస్ అధికారి క్రమం తప్పకుండా ఆయా గ్రామానికి వెళ్లాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు అధికారులకు తెలియజేసి.. వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ మంచి సంబంధాలు కలిగి ఉండి గ్రామంలో నేరస్తులు, వారి కదలికలను, గ్రామానికి కొత్తగా వచ్చే అనుమానితుల యొక్క సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. తద్వారా గ్రామాల్లో నేరాలు నిరోధించగలుగుతామని పేర్కొన్నారు. గ్రామాల్లో మధ్యవర్తులు, పెద్ద మనుషుల ప్రభావంపై దృష్టి పెట్టాలన్నారు. ఫిర్యాదుదారులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పైఅధికారిని కలిసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఫ గ్రామ పోలీస్ అధికారుల నియామకం ఫ నేరాలు తగ్గించడమే ధ్యేయం ఫ ప్రజా సమస్యలపై కూడా దృిష్టి సారించాలని ఎస్పీ ఆదేశం -
కుష్టువ్యాధి నిర్మూలనే లక్ష్యం
మచ్చలు ఉంటే చూపించుకోవాలి శరీరంపై ఎక్కడైన మచ్చలు ఉంటే సర్వేకు వచ్చిన సిబ్బందికి చూపించాలి. లెప్రసి లక్షణాలు ఉంటే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. సర్వేకు వచ్చిన వారికి సహకరించి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ నల్లగొండ టౌన్ : కుష్టు వ్యాధిని సమాజం నుంచి పూర్తిస్థాయిలో పారదోలాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటా లెప్రసి కేస్ డిటెన్షన్ క్యాంపెయన్ (ఎల్సీడీసీ) చేపట్టింది. 2017 నుంచి సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించే ఈ సర్వేను సోమవారం జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఈ నెల 30వ తేదీ వరకు సర్వేను పూర్తి చేయనున్నారు. సర్వే కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 1,466 బృందాలను ఏర్పాటు చేసింది. పట్టణంలో అయితే రోజు 50 నుంచి 60 ఇళ్లను ఆశ వర్కర్లు సర్వే చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే 20 నుంచి 30 ఇళ్లలో సర్వే నిర్వహిస్తారు. సర్వేను మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ప్రోగ్రాం అధికారులతో పాటు ఏఎన్ఎంలు పర్యవేక్షించనున్నారు. పూర్తి శరీరం పరిశీలన సర్వేలో భాగంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి పూర్తి శరీరాన్ని పరిశీలించి ఎర్ర మచ్చలు, స్పర్శలేని మచ్చలు, నరాల బలహీనత ఉందా లేదా చేతులు కాళ్ల వేళ్లు, తిమ్మిర్లు, బొగ్గలు వాటన్నింటిని ఆశా వర్కర్లు పరిశీలిస్తారు. వారిలో ఏవైనా కుష్టు వ్యాధి లక్షణాలు ఉంటే మెడికల్ ఆఫీసర్ రెఫర్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్ పరీక్షించి కుష్టు లక్షణాలు ఉంటే వారిని బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపి ఎండీటీ) పద్ధతిన జిల్లా కేంద్రంలోని లెప్రసీ సెంటర్ ద్వారా చికిత్స అందించనున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా.. కుష్టు వ్యాధి (లెప్రసి)అనేది మైక్రో బ్యాక్టిరియన్ లెప్రో అనే బ్యాక్టిరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా నరాలు, చర్మం, ముక్కుద్వారం ఎగువ శ్వాస నాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని గోదుమ రంగు, స్పర్శ లేని తిమ్మిరి మచ్చలు ఉంటే కుష్టు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. ఫ ఇంటింటా ఎల్సీడీసీ సర్వే ఫ సర్వేలో 1466 బృందాలు -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని.. అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. పంట మార్పిడిపై జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ సీజన్కు ముందే ఆయా డివిజన్ల వారీగా రైతు సదస్సులను నిర్వహించాలన్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం తర్వాత యూనిఫాం ఇచ్చేందుకుగాను జిల్లా విద్యా, గ్రామీణాభివృద్ధి శాఖలు ముందే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించారు. బిహార్ రాష్ట్రంలో ‘మఖాన’ పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారని, మన రైతులు ఈ పంటను సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ మఖాన పంట సాగు పద్ధతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీటిని ఎవరైనా ఇతర అవసరాలకు వాడితే.. జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నల్లగొండ
ఇఫ్తార్ 6–32 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 5–00 (బుధవారం ఉశ్రీశ్రీ)ఇఫ్తార్ విందులకు నిధులు రంజాన్ ఇఫ్తార్ విందుల నిర్వహణకు ఉమ్మడి జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం రూ.39లక్షలు విడుదల చేసింది. 7ఇస్రో పిలుస్తోంది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నుంచి ఇస్రో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.- 8లోమంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025 -
పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 35 మంది అర్జిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. 675 మంది గైర్హాజరునల్లగొండ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 675 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఫస్టియర్ పిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 15,316 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 14,641 మంది హాజరయ్యారు. 675 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఈఓనల్లగొండ : మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి నల్లగొండ టూటౌన్: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలు నివారించి రైతుల పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని, వరి కోతలు మొదలైనందున ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్రెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గుండా నవీన్ రెడ్డి, సాయన్న గౌడ్, మాలె వెంకట్రెడ్డి, పాదూరి వెంకట్రెడ్డి, పిండి పాపిరెడ్డి, జవ్వాది సత్యనారాయణ, రవి ఉన్నారు. శివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : శివకేశవులకు నిలయమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చనలు, ముఖమండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవల, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూలు చేపట్టారు. -
రేషన్.. పరేషాన్!
17వ తేదీ వచ్చినా పేదలకు అందని బియ్యం 95,961 మెట్రిక్ టన్నులు పెండింగ్ 2023–24 యాసంగికి సంబంధించి 3,601 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఏడాది గడిచినా ఇంకా ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక 2024–25 వానాకాలనికి సంబంధించి 92,362 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. వానాకాలం సీజన్ ముగిసింది. యాసంగి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. అయినా ఇంకా బియ్యం ఇవ్వకపోవడం వల్లే పేదలకు సకాలంలో రేషన్ పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోనే అత్యధికంగా వరిసాగు చేస్తూ, ధాన్యం భాండాగారంగా ఉన్న నల్లగొండలోనే పేదలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. ప్రతి నెలా పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసే రేషన్ బియ్యం ఈనెలలో చాలా మండలాల్లో లబ్ధిదారులకు ఇప్పటికీ పంపిణీ కాలేదు. దీంతో పేదలకు అన్నం మెతుకులు కరువయ్యాయి. అధికారులు అలసత్వం కారణంగా పేదలకు రేషన్ ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. గడువు ముగిసినా పేదలకు అందని బియ్యం 994 రేషన్ షాపుల ద్వారా పంపిణీ జిల్లాలో 4,66,061 రేషన్ కార్డులు ఉన్నాయి. 994 రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30వ తేదీలోగా గోదాముల నుంచి రేషన్షాపులకు బియ్యం చేరుకోవాలి. తదుపరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపు ద్వారా పేదలకు బియ్యం పంపిణీ చేస్తారు. అయితే ఈనెల 17వ తేదీ వచ్చినా ఇంతవరకు జిల్లాలో అనేక మంది పేదలకు బియ్యం అందలేదు. కొందరు డీలర్లు పట్టుబట్టి కొంత మేర తెప్పించుకొని అదీ కొంత మందికే పంపిణీ చేశారు. ఎమిమిది స్టాక్ పాయింట్ల నుంచి సరఫరా జిల్లాలో ఎమిమిది రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ల నుంచి 33 మండలాల్లోని గ్రామాలకు రేషన్ సరఫరా చేస్తారు. ఇప్పటి వరకు దేవరకొండ, నిడమనూరులో కొన్ని షాపులకు, మిర్యాలగూడలో దాదాపు సగం షాపులకు, నకిరేకల్లో 50 షాపులకు, నల్లగొండలో 8 షాపులకు, నార్కట్పల్లిలో 21 షాపులకు, నాంపల్లిలో 14 షాపులకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. గోదాముల్లో బియ్యం నిల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) స్టేజీ–1 గోదాములతో పాటు స్టేజీ–2 గోదాముల్లో కూడా పీడీఎస్కు సంబంధించిన బియ్యం నిల్వలు లేవు. వాస్తవంగా ఒక నెలకు సంబంధించిన బియ్యం ముందుగానే అధికారులు తెప్పించి పెట్టుకోవాలి. జిల్లాలో అధికారుల సమన్వయ లోపంతో బియ్యం గోదాములకు చేరలేదు. ఫ గోదాముల నుంచి కొన్నిచోట్ల రేషన్ దుకాణాలకు కూడా చేరలే ఫ సీఎంఆర్ సేకరణలో అధికారుల అలసత్వమే కారణం ఫ అర్ధాకలితో అలమటిస్తున్న పేదలు ఈ ఫొటోలోని మహిళ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన అనిమల్ల పార్వతమ్మ. ఆమెకు ఇద్దరు కూతుర్లు. భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆమె కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన అంత్యోదయ కార్డు కింద నెలకు 35 కిలోల బియ్యం వస్తాయి. వాటితోనే నెలంతా భోజనం. ఈ నెలలో ఇంతవరకు బియ్యం రాలేదు. దీంతో వారం రోజులుగా పక్కింటి వారి నుంచి బియ్యం బదులు తెచ్చుకుంటోంది. ఆమె మాత్రమే కాదు జిల్లాలోని అనేక పేదలదీ ఇదే పరిస్థితి. సీఎంఆర్ సేకరణలో విఫలం జిల్లాలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో ప్రతిసారి అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వానికి మాత్రం ఆలస్యంగా సీఎంఆర్ పెడుతున్నారు. మిల్లర్లు, అధికారుల కుమ్మక్కుతో ఈ తతంగం నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా మిల్లర్లు ఆలస్యంగానే సీఎంఆర్ ఇస్తారు. కానీ.. ఏనాడూ గోదాముల్లో బియ్యం ఖాళీ అయిన పరిస్థితి లేదు. ఈసారి మాత్రం అధికారుల ముందు చూపు లేకపోవడం, మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రస్తుతం గోదాములు ఖాళీ అయ్యాయి. -
రాష్ట్ర ఆర్థిక స్థితి యువతపై ఆధారపడి ఉంది
మిర్యాలగూడ : రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేయాలంటే యువత తమ బాధ్యత గుర్తెరిగి నడుచుకోవాలని, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ నిర్ణేతలు యువతేనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ ఇ.పురుషోత్తం అన్నారు. మిర్యాలగూడలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్.ఉపేందర్ అధ్యక్షతన ‘గ్రోత్ పొటెన్షియాలిటిస్ ఇన్ తెలంగాణ స్టేట్– ప్రొస్పాక్టస్ అండ్ ఛాలెంజ్’ అనే అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముత్యంరెడ్డి ఆర్థిక విధానాల్లో సోషలిజం, మార్కెట్ ఎకానమీ మధ్య వ్యత్యాసం, వాటి ప్రయోజనాలు, మౌలిక భేదాలు, సామాజిక సామాన్య అభివృద్ధిపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ప్రజలు బీదలుగా మారడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. నేటి తెలంగాణ యువత ప్రతి విషయంలో అనాసక్తత కనబరిచి, నిర్వీర్య స్థితిలోకి వెళ్తోందన్నారు. ఇదే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజారుస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్స్ ముత్యంరెడ్డి, కోటేశ్వర్రావు, పున్నయ్య, ఇంద్రకాంత్, ఎస్.రాములు, డాక్టర్ నరేష్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు కష్టపడి చదవాలి
నల్లగొండ : లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి పరీక్షలను సవాల్గా తీసుకొని రాయాలన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండింటిని చేయాలని సూచించారు. పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
దర్వేశిపురం ఆలయం వద్ద నేడు వేలం
కనగల్ : మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద నేడు టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తలనీలాల సేకరణకు రూ.3,00,000, వాహనాలకు బొట్టు పెట్టుకునే హక్కులకు రూ.2,00,000, కొబ్బరి చిప్పల సేకరణకు రూ.10,00,000, చీరెలు–వడిబియ్యం సేకరణకు రూ.1,00,000 ఏదైనా జాతీయ బ్యాంకులో ఏపీజీవీబీ నల్లగొండ రామగిరి బ్రాంచిలో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలంలో పాల్గొనాలని సూచించారు. నేడు, రేపు జాతీయ సెమినార్మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమ, మంగళవారాల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘గ్రోత్ పొటెన్షియాలిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాస్పెక్ట్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై వక్తలు ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో తెలంగాణ హైయ్యర్ ఎడ్యుకేషనల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం, ప్రొఫెసర్లు జి.యాదగిరి, ఎం.రాములు, ముత్యంరెడ్డి, ఇంద్రకాంత్, పున్నయ్య, కొప్పుల అంజిరెడ్డి, వాసుదేవశర్మ ప్రసంగించనున్నారు. చివరి రోజున ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ బి.సుధాకర్రెడ్డి సందేశంతో సెమినార్ ముగియనుంది. పాఠశాలలో యోగా శిక్షణ ఇవ్వాలి రామగిరి (నల్లగొండ) : ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ (టీవైటీసీసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రవికిషోర్ కోరారు. ఆదివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి యోగా టీచర్ల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థి దశ నుంచే యోగా అలవాటయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. అందుకోసం ప్రతి పాఠశాలలో యోగా శిక్షకులను నియమించాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని నియమించారు. చైర్మన్గా కోలా సైదులు, గౌరవ అధ్యక్షుడిగా పోలిశెట్టి లక్ష్మయ్య, అధ్యక్షుడిగా చాడ పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శివ, సెక్రటరీలుగా బొడ్డుపల్లి సైదులు, దుబ్బ సైదయ్య, ఉపాధ్యక్షులుగా వేల్పుల సుధాకర్, కొందుటి రాచయ్య, సిలివేరు సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నల్లెడ సుదర్శన్రెడ్డి, గట్టుపల్లి సుష్మ, తూర్పునూరు సంధ్య, కోశాధికారిగా సింగు రామ్బాబు, సహాయ కోశాధికారిగా బిసు కరుణాకర్, గోరంట్ల శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కోట్ల సైదులు, పున్న వెంకటేశ్వర్లు, తాడోజు పిచ్చయ్య, కట్ట మమత, జెట్టి శ్రీవాణిని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని యోగా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రసాద్, నవీన్, యాదయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి దేవరకొండ : పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేలు పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుకొచ్చిన ప్రధానమంత్రి పసల్బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సుధాకర్, కేతావత్ లాలునాయక్, కర్నాటి సురేష్, రాములు, ఏటి కృష్ణ, వెంకటేష్, నర్సింహ, వెంకటేష్, గుండాల అంజయ్య, భాస్కర్, సహదేవ్, రవి తదితరులు ఉన్నారు -
సాగు, తాగునీటి సమస్య రావొద్దు
నల్లగొండ : జిల్లాలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నల్లగొండలోని కలెక్టరేట్లో ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, తాగు, సాగునీరు, విద్యుత్ సరపరాలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని.. పానగల్ ఉదయ సముద్రాన్ని నీటితో నింపాలని సూచించారు. వరి పంట కోత దశలో ఉందని ఒక్క ఎకరం కూడా ఎండకుండా నీటిని విడుదల చేయాలన్నారు. గతం కంటే ఈ సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు పెరిగిందని దాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. వ్యవసాయ మంత్రితో ఫోన్లో మాట్లాడిన కోమటిరెడ్డి... జిల్లాలో వ్యవసాయ క్లస్టర్లు, ఏఈఓ పోస్టులు జిల్లాలో తక్కువగా ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే మంత్రి కోమటిరెడ్డి అక్కడ నుంచే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి నల్లగొండ జిల్లాకు 80 ఏఈఓ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. అందుకు మంత్రి సమ్మతించారు. మఖానా, ఆముదం సాగు చేస్తా జిల్లాలో మఖానా పంట సాగుకు ఐదు ప్రాంతాలను ఎంపిక చేశామని అందుకు సంబంధించి అధ్యయనానికి శాస్త్రవేత్తలు, అధికారులను బిహార్కు పంపామని కలెక్టర్ తెలుపగా స్పందించిన మంత్రి తన సొంత గ్రామమైన బ్రాహ్మణవెల్లెంలలోని తన భూమిలో ఎకరం మఖానా పంట, మరో ఎకరం ఆముదం సాగు చేస్తానని చెప్పారు. ఆయా పంటలకు సంబంధించి తమ సూచనలు ఇవ్వాలని అక్కడే ఉన్న నార్కట్పల్లి ఏఓను కోరారు. వినతులు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి అక్కడికక్కడే కొన్ని పరిష్కరించారు. కొన్ని కలెక్టర్కు చెప్పి.. సంబంధిత అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఇలా త్రిపాఠి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ఎకరం పంట కూడా ఎండకుండా చూడాలి ఫ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు కలగొద్దు ఫ వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాం
తుంగతుర్తి అభివృద్ధికి కృషి తుంగతుర్తి తన స్వస్థలమని, ఈ ప్రాంతాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తుంగతుర్తికి ఎస్సారెస్పీ ఫేజ్–2, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామనానరు. అంతేకాకుండా తుంగతుర్తికి గోదావరి, మూసీ నదుల నీటిని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభలో మంత్రలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొర్రె పిల్లలు, గొంగళ్లు, డప్పులను బహూకరించి సన్మానించారు. ఈ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేషం, లక్ష్మీకాంత్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్రావు టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, కడియం పరమేశ్వర్, గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్, గిరిధర్రెడ్డి, చింతకుంట్ల వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి: ఎస్సీ రిజర్వేషన్ శాతం పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026లో నిర్వహించనున్న జనాభా లెక్కల ప్రకారం కచ్చితంగా పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్స్ పార్టీ కృతజ్ఞత సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. మొదటి బిల్లు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, రెండో బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్, మూడో బిల్లు ఎస్సీల్లోని 15శాతం రిజర్వేషన్లను 59 ఎస్సీ ఉపకులాలకు పంచేలా ఉపకోటా నిర్ణయిస్తామన్నారు. ఈనెల 17న ఎస్సీ ఉప వర్గీకరణ బిల్లుపై, 18న బీసీ రిజర్వేషన్, కుల సర్వే అంశంపై ప్రభుత్వం చర్చలు జరపనుందన్నారు. నా నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, న్యాయమూర్తి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ను నియమించడం ఇందుకు నిదర్శనమని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ కమిషన్ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తోందని తెలిపారు. 1931 తర్వాత తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి కుల ఆధారితంగా సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించిందని వివరించారు. ఫ జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఫ రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ తుంగతుర్తిలో కాంగ్రెస్ కృతజ్ఞత బహిరంగ సభ ఫ హాజరైన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల తదితరులు -
కాంగ్రెస్ ప్రభుత్వానిది మొద్దు నిద్ర
చిట్యాల : భూగర్భ జలాలు తగ్గిపోయి వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తల్లడిల్లుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో ఎండుతున్న వరి చేలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చిరుమర్తి మాట్లాడుతూ ఎండిపోతున్న పంటలను కొందరు రైతులు పశువులకు మేపుతుండగా, మరికొందరు వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ.50వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డిపై అసెంబ్లీలో సస్పెన్షన్ విధించడం తగదని చిరుమర్తి అన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి
నల్లగొండ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాం వద్ద భద్రతను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రతినెల ఈవీఎం గోదాం తనిఖీలో భాగంగా శనివారం ఆమె రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. వారి సమక్షంలోనే ఈవీఎం గోదాం సీల్ తీసి లోపల భద్రపరిచిన ఈవీఎంలను తనిఖీ చేశారు. ఆమె వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి ఉన్నారు. ఇందిరమ్మ ఇంటి నమూనా ఆవిష్కరణ నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లపై పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఆత్మకూరు(ఎం): ఆర్టీసీ అద్దె బస్సు బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో శనివారం జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన శ్యామల రమేష్(34) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తాడు. అతడి భార్య కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. శనివారం రమేష్ బైక్పై ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి వస్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపురం ఎక్స్ రోడ్డు వద్ద రాయిగిరి–మోత్కూరు రోడ్డు వైపు మళ్లుతుండగా.. హైదరాబాద్–2 డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మరిపెడ బంగ్లాకు వెళ్తూ బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్. కృష్ణయ్య తెలిపారు. -
డీసీసీ పదవికి డిమాండ్!
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై నేతల నజర్పార్టీ అధికారంలోకి రావడంతో పోటీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో డీసీసీ పదవులకు పోటీ ఏర్పడింది. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పదవీ కాలం ముగియగానే పటేల్ రమేష్రెడ్డిని అధ్యక్షుడిని చేయాలని అనుకున్నారు. అయితే దామోదర్రెడ్డి వర్గానికి, రమేష్రెడ్డికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వెంకన్ననే కొనసాగిస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ కుమార్రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరడంతో అప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అండెం సంజీవరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నల్లగొండ జిల్లాలో మాత్రం శంకర్నాయక్ జిల్లా అధ్యక్షుడిగా బొంతు వెంకటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే కొత్త డీసీసీ అధ్యక్ష నియామకాలు ఇప్పుడున్న సామాజిక సమీకరణాల ఆధారంగానే ఉంటాయా? ఏమైనా మార్పులు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఫ శంకర్నాయక్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మరొకరికి ఛాన్స్ ఫ రేసులో పలువురు సీనియర్ నేతలు ఫ కార్పొరేషన్ పదవి ఇవ్వలేనివారికి డీసీసీతో సరిపెట్టే వ్యూహంలో పీసీసీ ఫ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ సమీకరణలపై దృష్టి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులపై పీసీసీ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత డీసీసీ అధ్యక్షుల మార్పులతోపాటు, పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ పదవులను ఇవ్వలేని వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఇచ్చి సరిపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రెండు మూడేళ్లకోసారి డీసీసీ కార్యవర్గం మార్పు చేయాల్సి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాలు కుదరక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం నల్లగొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ కోటాలో డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. మధ్యలో సూర్యాపేట జిల్లాలో మార్పులు చేయాలని భావించినప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల దాని జోలికి పోలేదు. వెంకన్నకు రైతు కమిషన్ సభ్యుడిగా ఇవ్వడం, తాజాగా నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆశావహుల దృష్టి డీసీసీ అధ్యక్ష పదవులపై పడింది. -
చందంపేటకు.. డిండి జలాలు
సాగు విస్తీర్ణం పెరుగుతుంది చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని చాలా మంది రైతులు బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతుల పొలాలకు నీరు అందించడానికి సర్వే చేశారని తెలిసింది. ప్రభుత్వం కూడా నిధులు మంజూరుచేసి కాల్వలు నిర్మిస్తే ఈ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఇన్నాళ్లూ బోరు నీళ్లు, వర్షాలపైనే ఆధారపడి సాగు చేసినం. ఈ కాల్వలు నిర్మాణం చేపడితే.. ఇక్కడి రైతులకు ఢోకా ఉండదు. – జెల్లెల వెంకటయ్య, రైతు, చందంపేట చందంపేట : వర్షాలపైనే ఆధారపడి పంటలు సాగు చేసే ఉమ్మడి చందంపేట మండలానికి కాల్వ ద్వారా సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. డిండి నుంచి కాల్వ ద్వారా సుమారు 18వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వే పనులు పూర్తి చేసింది. సుమారు రూ.400 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపడితే ఈ ప్రాంతం సస్యశామలం కానుంది. రూ.1.30 కోట్లతో సర్వే.. ఉమ్మడి చందంపేట మండలంలోని భూములకు డిండి ప్రాజెక్టు నుంచి నీరు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నారాయణరెడ్డి (ఎన్ఆర్)సంస్థ ద్వారా రూ.1.30 కోట్లతో సర్వే చేపట్టింది. డిండి మండలంలోని ఎర్రారం నుంచి 17.5కిలోమీటర్ల దూరం ఉన్న ఉమ్మడి చందంపేట మండలానికి కాల్వ ఉంది. దాని ద్వారా మండలంలోని భూములకు నీరు అందించేందుకు నిర్మించాల్సి ఉన్న మైనర్, సబ్ మైనర్ కాల్వలను సర్వే చేసింది. కెనాల్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల మేర మైనర్, సబ్మైనర్ కాలువలు నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఈ సర్వే గ్రాఫ్ వివరాలను పొందుపర్చడానికి మూడు నెలల సమయం పడుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పనులు చేపట్టిన అధికారులు సర్వే డిజైన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. సర్వే పనులు పూర్తయిన తర్వాత కాలువల నిర్మాణానికి సుమారు రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైన నిధులు విడుదల చేస్తే చందంపేట మండల రైతాంగానికి మంచి రోజులు వస్తాయి. ఫ రూ.400 కోట్లతో మెనర్, సబ్ మైనర్ కాల్వల నిర్మాణానికి సిద్ధమైన ప్రతిపాదనలు ఫ ఇప్పటికే పూర్తయిన సర్వే ఫ 18వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక -
ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దురుసు ప్రవర్తన
రామగిరి(నల్లగొండ): ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆర్టీసీ డ్రైవర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆర్టీసీ బస్ భవన్ అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాలు.. నల్లగొండలో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న మాచన రఘునందన్ శనివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వచ్చేందుకు గాను ఎల్బీనగర్లో నాన్స్టాప్ బస్సు(టీఎస్ 07 జెడ్ 4038) ఎక్కారు. ఆ బస్సును హయత్నగర్లో డ్రైవర్ ఆపాడు. అయితే బస్సు హయత్నగర్లో ఆగదు అని తనకు కంట్రోలర్ చెప్పిన విషయాన్ని బస్సు డ్రైవర్కు రఘునందన్ గుర్తుచేశారు. దీంతో డ్రైవర్ తనతో దురుసుగా, అమర్యాదగా మాట్లాడాడని మాచన రఘునందన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన నల్లగొండ ఆర్టీసీ ఆర్ఎంకు, డీఎంకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనికి ఆర్టీసీ బస్ భవన్ అధికారులు ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శనివారం వినియోగదారుల హక్కుల దినోత్సవం రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు విచారణకు ఆదేశం -
ఎమ్మెల్యే జగదీష్రెడ్డిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలి
భువనగిరి: సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడారు. జగదీష్రెడ్డిపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వెంటనే ఎమ్మెల్యేపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా కన్వీనర్ కోల్పుల అమరేందర్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నాయకులు బీరు మల్లయ్య, లక్ష్మీనారాయణ, రాజేందర్రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, మల్లికార్జున్, ఇట్టబోయిన గోపాల్, తుమ్మల పాండు, సుభాష్, శంకర్, చిరంజీవి, సురేష్, జంగయ్య, ఇస్మాయిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం పేరుతో మోసం
త్రిపురారం: రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ఇద్దరిని త్రిపురారం మండలం డొంకతండావాసులు శనివారం పట్టుకున్నారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన దుర్గారావు, కాశిదాసు గ్రామాల్లో రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని కొత్త బస్తాల్లో నింపి సన్న బియ్యం పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం వారిద్దరు స్కూటీపై త్రిపురారం మండలం డొంకతండాకు వచ్చి సన్న బియ్యం అంటూ రేషన్ బియ్యం అమ్ముతుండగా.. తండాకు చెందిన ధనావత్ దర్జీ అర క్వింటా బియ్యం రూ.2వేలకు కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న మరికొందరు తండావాసులు దర్జీ ఇంటి వద్దకు వచ్చి బియ్యం కొనేందుకు బేరం ఆడుతూ.. బస్తాల్లో బియ్యాన్ని పరిశీలించగా అవి రేషన్ బియ్యంగా గుర్తించారు. దీంతో దుర్గారావు, కాశిదాసును నిలదీయగా వారు పారిపోయేందుకు యత్నించారు. వారిని తండావాసులు వెంబడించి దామరచర్ల మండలం మోదుగులతండా వద్ద పట్టుకొని డొంకతండాకు తీసుకొచ్చారు. గతంలోనూ వారు ఇదే తరహాలో బియ్యం అమ్మి మోసం చేసినట్లు తేలింది. నిందితుల నుంచి బియ్యం, స్కూటీని తండావాసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని పట్టుకున్న డొంకతండా వాసులు -
ఎన్నికల సంఘానికి పార్టీలు సహకరించాలి
నల్లగొండ : పారదర్శక, స్వచ్ఛమైన ఫొటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా చేపట్టే మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సహకరించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఆయా పార్టీల నేతలో తన చాంబార్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బూత్స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో నాయకులు అశోక్, పిచ్చయ్య, లింగస్వామి, నర్సిరెడ్డి, రజీవుద్దీన్, హన్సి, ఆర్డీఓ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం
నల్లగొండ : పోలీస్ శాఖకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. పోలీస్ శాఖ అంటే నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగమని ఒత్తిడిని జయించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడాయన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత డ్రగ్స్ బారినపడి తమ జీవితాన్ని, భవిష్యత్ను నాశనం చేసుకుంటోందని.. యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలిక వసతులతోపాటు డీఎస్సీ నూతన కార్యాలయం, క్వార్టర్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో నల్లగొండలో మత ఘరర్షనలు జరిగేవని.. ఇప్పుడు అలాంటివి ఎక్కడా లేవని ప్రశాంతంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం రంజాన్ మాసం జరుగుతోందని.. అందరూ సోదరభావంతో మెలిగి నల్లగొండను రోల్ మోడల్గా తయారు చేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్రీడల్లో వచ్చే అనుభవాలు నిత్యం ఉద్యోగ నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎస్సీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మూడు రోజులు పాటు నిర్వహించిన క్రీడల్లో సుమారు 800 మంది ఉద్యోగులు పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమేష్, కొలను శివరాంరెడ్డి, రాజశేఖర్రాజు, సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఫ క్రీడాపోటీలు పోలీసులకు ఉపయోగం ఫ డీఎస్పీ కార్యాలయం, పోలీసులకు క్వార్టర్ల నిర్మాణానికి కృషి ఫ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపులో మంత్రి కోమటిరెడ్డి -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి రిమాండ్
చౌటుప్పల్ రూరల్: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని చౌటుప్పల్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని బాలాపూర్లోని ఎర్రకుంటకు చెందిన ఎండీ ఇమ్రానుద్దీన్, సంతోష్నగర్లోని హమీద్నగర్కు చెందిన అబ్దుల్ ఆసిఫ్, సంతోష్నగర్లోని కలేందర్నగర్కు మోసిన్ఖాన్, చాంద్రాయణగుట్టలోని ఆసిజ్బాబానగర్కు చెందిన ఎండీ అమీర్, సంతోష్నగర్లోని భువన్నగర్కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పంతంగి టోల్ప్లాజా వద్ద వారి కార్లను ఆపి తనిఖీ చేయగా రూ.7లక్షల విలువైన గంజాయి దొరికింది. అమీర్పై పాతబస్తీలోని పలు పోలీస్ స్టేషనల్లో గంజాయి కేసులు ఉన్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి 22 కేజీల గంజాయి, 5 సెల్ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐ కె. యాదగిరి, పోలీస్ సిబ్బందిని ఏసీపీ మధుసూదన్రెడ్డి అభినందించారు. 22 కిలోల గంజాయి, రెండు కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
కేతేపల్లి: మినీ వాహనంలో అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం కేతేపల్లి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వికాస్కుమార్, మితిలేష్ రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ వాహనంలో హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల జంక్షన్ వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వీరి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న బియ్యం రేషన్ బియ్యం అని గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
కోదాడలో పశు ఔషధ బ్యాంకు
కోదాడ రూరల్ : సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంకు ఏర్పాటైంది. ఇక్కడ పని చేస్తున్న పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య రైతులకు మేలు చేయాలనే వినూత్న ఆలోచనతో దాతల సహకారంతో పశు ఔషధ బ్యాంకు ఏర్పాటుకు నాంది పలికారు. గేదెలు, జీవాలను ఆరుబయట మేతను మేపేందుకు గతంలో మాదిరిగా బీడు భూములు, ఖాళీ స్థలాలు లేకపోవడంతో వాటికి కావాలిసిన పోషకాలతో కూడిన మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో గేదెలు, జీవాలు ఈనిన తర్వాత ఎదకు రావాల్సిన సమయానికి రావడం లేదు. గేదె నెలరోజులు ఆలస్యంగా కడితే రైతు దాదాపుగా రూ.10వేలను నష్టపోతున్నాడు. రైతులు ఆ విధంగా నష్టపోవద్దని గేదెలు సకాలంలో సూడికట్టాలంటే వాటికి మినరల్ మిక్చర్, కాల్షియం వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పేద రైతులకు వాటిని కొనుగోలు చేసేంత స్థోమత ఉంటలేదు. దీంతో డాక్టర్ పెంటయ్య పశు ఔషధ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆ ఔషధ బ్యాంకు ద్వారా పాడి రైతులకు పలు రకాల న్యూట్రిషిన్ మందులతో పాటు వ్యాధుల నివారణ మందులను కూడా ఇస్తున్నారు. ఇందులో కొన్ని మందులు ఉచితంగా, మరికొన్ని అతి తక్కువ ధరలకే అందజేస్తున్నారు. దాతల సహకారంతో...పాడి రైతులకు ఎక్కువగా ఉపయోగపడే మినరల్ మిక్చర్(ఖనిజ లవణ మిశ్రమం), కాల్షియం టానిక్లు అందజేసేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. అమెరికాలో పశువైద్యాధికారిగా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డి రూ.50వేలు విరాళం ఇవ్వగా ఆ నగదు రివాల్వింగ్ ఫండ్ కింద జమ చేశారు. దానితో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్శిటీ నుంచి 2 టన్నుల మినరల్ మిక్చర్ను కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో కెజీ రూ.250 అమ్ముతుండగా వైద్యశాలకు గేదెలను తీసుకొచ్చిన పాడి రైతులకు కెజీని కేవలం రూ.50కే విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు పాడి పశువులకు ఉచితంగా, తక్కువ ధరకే మందుల పంపిణీ డాక్టర్ పెంటయ్య చొరవతో ముందుకొస్తున్న దాతలు ఇప్పటి వరకు 600 మంది రైతులకు పశువుల మందులు పంపిణీపాడి రైతులకు మేలు చేసేందుకు పశు ఔషధ బ్యాంకు పాడిపశువుల, జీవాల పెంపకందారులకు అతి తక్కువ ధరలకే మందులను అందజేసేందుకు దాతల సహకారంతో గత ఏడాది అక్టోబర్లో పశుఔషధ బ్యాంకు ఏర్పాటు చేశాం. గేదెలకు ఎంతో ఉపయోగపడే మినరల్ మిక్చర్ను తక్కువ ధరకే అందజేస్తున్నాం. న్యూట్రిషన్ మందులతో పాటు రోగనిరోధక మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నాం. ఇప్పటి వరకు 600 మంది రైతులకు పలు రకాల మందులను అందజేశాం. – డాక్టర్ పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్, కోదాడ ప్రాంతీయ పశువైద్యాశాల వైద్యాధికారి ఇక కోదాడ మండలంలోని కాపుగల్లుకు చెందిన మరో దాత ముత్తవరపు పూర్ణచందర్రావు 500లీటర్ల కాల్షియం టానిక్ను విరాళంగా ఇవ్వగా లీటరు రూ.1000 ఉండే టానిక్ను ఉచితంగా ఇస్తున్నారు. అదే విధంగా లీటరు రూ.1000 ఉండే లివర్ టానిక్ కూడా రైతులకు ఉచితంగా ఇస్తున్నామని డాక్టర్ పెంటయ్య తెలిపారు. వీటితో మరికొందరు దాతలు రూ.5 వేల నుంచి రూ.20వేలకు వరకు నగదు రూపంలో విరాళం ఇచ్చారు. వాటితో గేదెలు, జీవాలు, కోళ్లకు కావాల్సిన పలు రకాల నట్టలమందు, ఐరన్టానిక్, పేల మందు, టానిక్ పౌడర్, యాంటి బయాటిక్, జీర్ణ సంబంధిత వంటి వ్యాధులకు సంబంధించిన మందులను స్టాక్ ఉన్నంత మేరకు ఉచితంగా అందజేస్తున్నారు. దాతలు మరింత మంది ముందుకొస్తే వారు అందజేసే నగదును రివాల్వింగ్ ఫండ్ కింద ఏర్పాటు చేసి మరింత మంది రైతులకు ఉచితంగా అందజేయడానికి వీలుంటుందని డాక్టర్ పెంటయ్య అంటున్నారు. -
బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్
హుజూర్నగర్: బంగారం షాపుల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శనివారం సీఐ చరమంద రాజు వెల్ల డించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చింతలచెర్వు ప్రశాంత్, చింతలచెర్వు అక్షిత్కుమార్, నల ్ల గొండ పట్టణానికి చెందిన షేక్ వాజిద్, షేక్ ఇర్ఫాన్ ముఠాగా ఏర్పడ్డారు. దురలవాట్లకు బానిసై, తేలికగా డబ్బులు సంపాదించాలానే ఉద్దేశంతో గూగుల్లో ఎస్ఐల ఫొటోలు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫొటోలను ట్రూకాలర్, వాట్సాప్లో డీపీలుగా పెట్టుకొని బంగారం షాపు యాజమానుల వివరాలు సేకరించారు. బంగారం షాపుల యజమానులకు ఫోన్ చేసి తాము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ‘మేము కొంతమంది దొంగలను పట్టుకున్నాం.. వారు దొంగిలించిన బంగారం మీ బంగారం షాపులో అమ్మారు.. ఆ బంగారం మీ నుంచి రికవరీ చేయాలి లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించేవారు. ఈ విధంగా బంగారు షాపుల యజమానుల నుండి డబ్బులు ఫోన్ పే చేయించుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన చింతలచెర్వు ప్రశాంత్ తిరుమలగిరికి చెందిన శివకుమార్ అనే జ్యువెలరీ షాపు యజమానికి ఫోన్ చేసి ‘నేను రాజాంపేట్ ఎస్ఐని మాట్లాడుతున్నా.. నువ్వు దొంగల వద్ద బంగారం కొన్నావు.. నీ పైన కేసు కాకుండా ఉండాలంటే రూ.లక్ష ఫోన్ పే చెయ్యమని చెప్పాడు’. దీంతో శివకుమార్ భయపడి రూ.52 వేలు ఫోన్ పే ద్వారా పంపాడు. అదేవిధంగా ఈ నెల 8న హుజూర్నగర్లోని శ్రీనిధి జ్యువెలరీ షాపు యజమాని తుడిమల్ల నవీన్కుమార్కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అతడు భయపడి వారు చెప్పిన ఫోన్ పే నంబర్కు రూ.10 వేలు పంపారు. అనంతరం నవీన్కుమార్కు అనుమానం వచ్చి హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం ఎస్ఐ ముత్తయ్య తన సిబ్బందితో గోపాలపురం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ప్రశాంత్, అక్షిత్కుమార్, వాజిద్, ఇర్ఫాన్ రెండు మోటార్ సైకిళ్లపై కోదాడ వైపు అనుమానాస్పదంగా వెళ్తుండగా.. పట్టుకుని విచారించగా వారు చేసిన నేరాలను అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్ఫోన్లు, రూ.24,900 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. 2 మోటారు సైకిళ్లు, 4 సెల్ఫోన్లు, రూ.24,900 నగదు స్వాధీనం -
టాటా ఏస్ వాహనం దగ్ధం
కట్టంగూర్: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా టాటా ఏస్ వాహనం దగ్ధమైంది. ఈ ఘటన కట్టంగూర్ మండలం కల్మెర గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం శివారులో శనివారం జరిగింది. కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో గేదెను తీసుకొచ్చేందుకు కట్టంగూర్ నుంచి టాటా ఏస్ వాహనంలో ఏనుగు కృష్ణ తన స్నేహితుడితో కలిసి బయల్దేరారు. మార్గమధ్యలో కల్మెర గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయపురం శివారులోకి వెళ్లగానే ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి టాటా ఏస్ వాహనంలో మంటలు లేచాయి. మంటలు గమనించిన కృష్ణ వెంటనే వాహనాన్ని నిలిపివేయగా.. అతడితో పాటు అతడి స్నేహితుడు వాహనం నుంచి కిందకు దిగారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.8లక్షలు నష్టం వాటిల్లినట్లు వాహన యజమాని కృష్ణ తెలిపాడు. -
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
శాలిగౌరారం: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మండలంలోని ఇటుకులపహాడ్, వల్లాల గ్రామపంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంలలో శుక్రవారం వారు పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీఆర్ఆర్ నిధులు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీరాజ్ శాఖకు చెందిన 5 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపడమే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు 10 సంవత్సరాలు రోడ్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కార్యక్రమంలో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, వైస్చైర్మన్ నరిగె నర్సింహ, సింగిల్విండో చైర్మన్ తాళ్లూరి మురళి, నూక కిరణ్కుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ కొండయ్య, ఏఈ భరత్చంద్ర, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు అల్లి సైదులు, షేక్ ఇంతియాజ్, చైతన్యరెడ్డి, ఫయాజ్, రామచంద్రయ్య, అవిలయ్య, నరేశ్, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ -
నూతన కార్యవర్గం ఎన్నిక
చిట్యాల: చిట్యాల–మునుగోడు రూట్ ప్యాసింజర్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బత్తుల జనార్దన్గౌడ్, ఉపాధ్యక్షుడిగా పామనగుళ్ల బుచ్చిరాములు, కోశాధికారిగా దొడ్డి శ్యామ్, కార్యదర్శిగా బత్తుల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా భగవంతు, ప్రచార కార్యదర్శిగా రామ్, కార్యవర్గ సభ్యులుగా చిర్రగోని నర్సింహ, జోగు లింగస్వామి, బైరు భిక్షం, గంజి శేఖర్, జక్కల వెంకన్నలు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరికశాలిగౌరారం: మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని వెంకన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి వెంకన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయితగోని వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చన బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్లో చేరినవారిలో జోలం నరేందర్, నరేశ్, రామలింగయ్య, జంగిలి సైదులు, నవీన్, నరేశ్, రెడ్డిపోయిన విజయేందర్, మట్టిపల్లి లింగస్వామి ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కట్ట వెంకట్రెడ్డి, భూపతి ఉపేందర్, రాగి దావీద్ పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలితిప్పర్తి : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం రాత్రి తిప్పర్తి మండల కేంద్రంలోని గౌతమ్ హైస్కూల్లో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం పలువురు విద్యార్థులకు డీఈఓ మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో గౌతమ్ గ్రూప్ చైర్మన్ రమేష్రెడ్డి, ఎంఈఓ నర్సింహనాయక్, ప్రిన్సిపాల్ అజాజ్, ఉపాధ్యాయులు భిక్షమాచారి, ఫయాజ్, కవిత, అస్ర, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి రథోత్సవంమర్రిగూడ : మండలంలోని శివన్నగూడ గ్రామ శివారులో శ్రీ నీలకంఠ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భగా స్వామివారం రథోత్సవం నిర్వహించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ రాపోలు గిరి, ఎంపీడీఓ మునయ్య, నాయకులు వెన్నమనేని రవీందర్రావు, మేతరి యాదయ్య, చిట్యాల రంగారెడ్డి, జంగిలి రవి, మాదగోని శ్రీనివాస్, బండి హన్మంతు, మహేష్, గ్యార వెంకటేష్, ఊరిపక్క మహేందర్, వల్లపు భాస్కర్, సిలువేరు యాదయ్య పాల్గొన్నారు. నేడు శ్రీ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవంచిట్యాల: పట్టణంలోని శ్రీకనకదుర్గ ఆలయ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, అమ్మవారికి క్షీరాభిషేకం, గణపతి పూజ, స్వస్తివాచనం, మంటపారాధన, అనంతరం వార్షిక మహోత్సవ ప్రత్యేక పూజలు, దుర్గా హోమం నిర్వహిస్తారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ తెలిపారు. -
వేణుగోపాలస్వామి కల్యాణం
కనగల్: మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా జరిగింది. కనగల్తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఒడి బియ్యం పోసి కానుకలు సమర్పించుకున్నారు. కల్యాణానికి ఆలయ ధర్మకర్తలు అక్కెనపల్లి తిరుమల్నాథ్, డాక్టర్ శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, శ్రీనివాస్ చక్రవర్తి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచులు నర్సింగ్ సునీత కృష్ణయ్యగౌడ్, నర్సింగ్ లలితశ్రీనివాస్గౌడ్, చిట్ల లింగయ్యగౌడ్, పందుల గోపాల్, వేముల పుష్పలత నరహరి, కనగల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నర్సింగ్ లక్ష్మయ్యగౌడ్, నాయకులు నర్సింగ్ మురళిరాధిక, బెజవాడ శ్రీహరి, మట్టపల్లి వెంకన్న, ఒట్టె శంకర్, నర్సింగ్ లలిత, మన్మథ, నర్సింగ్ మధు, రాయల శ్రవణ్, నక్కల అశోక్, నర్సింగ్ వెంకన్న, ఓరుగంటి శంకరయ్య, దత్తయ్య ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
జగదీష్రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి
నకిరేకల్ : సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డిని శాసన సభ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ నకిరేకల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నలగాటి ప్రసన్నరాజ్ మాట్లాడుతూ జగదీష్రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు యల్లపురెడ్డి సైదిరెడ్డి, ఏడుకొండలు, చెరుకు వెంకటాద్రి, బొడ్డు వెంకన్న, రమేష్, మేకల దేవయ్య, జెరిపోతుల అంజయ్య, చౌగోని శంకర్, వంటెపాక సుందర్, గిద్దె అంజయ్య, మండలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం సరికాదు మునుగోడు: ప్రజల సమస్యలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సరైంది కాదని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ మందుల సత్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరు కాకుండా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మునుగోడులో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పగిళ్ల సతీష్, ఈద శరత్బాబు, మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్రెడ్డి, మాదరబోయిన పరమేష్, బోయ లింగస్వామి, యడవల్లి సురేష్, దోటి కరుణాకర్, ఐతగోని విజయ్గౌడ్, సింగం సైదులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ మేధతో బోధన
నేటి నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు 20 నిమిషాల వ్యవధిలో.. ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థులను ఆకట్టుకునేలా ఏఐ బోధన అందిస్తారు. ఎంపిక చేసిన 3 నుంచి 5 తరగతుల విద్యార్థులను అయిదుగురికి ఒక బ్యాచ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. ఆ విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా, లేదా అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో బోధిస్తుంది. అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తుంది. ఇలా ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు, గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి ఆయా విద్యార్థులపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. 10 మండలాల్లో 14 పాఠశాలలు ఎంపిక చదువులో వెనుకబడిన 3,4,5 తరగతుల పిల్లలకు.. ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం చర్యలు ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తి నల్లగొండ: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–కృత్రిమ మేధ) హవా నడుస్తోంది. ఈ అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం సాయంతో ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టారు. ఆయా జిల్లాల్లో మెరుగైన ఫలి తాలు రావడంతో ఇదే విధానాన్ని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఏఐ బోధనపై శిక్షణ ఏఐ బోధనకు ప్రతి జిల్లాలోనూ కొన్ని పాఠశాలలను గుర్తించి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో బోధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయ అధికారులకు ఈనెల 11న రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కాగా జిల్లా కేంద్రంలో ఈనెల 12న సంబంధిత ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాల ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఏఐ బోధనపై శిక్షణ కూడా ఇచ్చారు. ఎంపికై న పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభంకానుంది. మెరుగైన సామర్థ్యాల సాధనకు.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మౌలిక భాష, సంఖ్యా జ్ఞానం అభ్యసనతోపాటు గణితంలో చతుర్విద ప్రక్రియల్లోనూ ఆశించిన స్థాయి సామర్థ్యాలు సాధించకపోవడంతో విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారు. పలు రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ సాయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్థ్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా బోధించేందుకు జిల్లాలో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ బోధన ఎంతో ఉపయోగపడుతుంది. – భిక్షపతి, డీఈఓ -
బీఆర్ఎస్ గొంతు నొక్కుతున్న ప్రభుత్వం
మిర్యాలగూడ : అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో మోసిన్అలీ, చిట్టిబాబునాయక్, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, పాలుట్ల బాబయ్య, ధనావత్ బాలాజీనాయక్, చిర్ర మల్లయ్యయాదవ్, మగ్ధూంపాషా, సాధినేని శ్రీనివాస్, షోయబ్, వజ్రం, మాజీద్, మల్లేష్గౌడ్, రాములుగౌడ్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
తూకాల్లో.. తేడాలు!
ఫ ఎలక్ట్రానిక్ కాంటాలోనూ అదే తీరు ఫ కాంటాలకు ఐస్కాంతం పెట్టి మోసం ఫ వినియోగదారులను మోసం చేస్తున్న కొందరు వ్యాపారులు ఫ అక్కడక్కడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తూనికలు కొలతల శాఖ ఫ నేడు జాతీయ వినియోదారుల దినోత్సవం 371 కేసులు నమోదు... ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేసి గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 371 కేసులు నమోదు చేశారు. తప్పుడు తూకాలకు సంబంధించి 96 కేసులు నమోదవగా, ప్యాకేజీలో తక్కువ తూకం, దానికి కంజూమర్ నెంబర్, తేదీ, ధర లేకపోవడం లాంటి కారణాలతో 243 కేసులు నమోదు అయ్యాయి. సకాలంలో వెరిఫికేషన్ చేయించుకోని పెట్రోల్ బంక్లపై 7 కేసులు, బంగారు దుకాణాలపై 25 కేసులు నమోదు చేశారు. కాగా వెరిఫికేషన్ ఫీజు ద్వారా రూ.81,13,572 లు రాగా, జరిమానాల ద్వారా రూ.35,11,000 జిల్లా తూనికలు కొలతల శాఖకు ఆదాయం సమకూరింది. నల్లగొండ టూటౌన్ : కూరగాయల నుంచి బంగారం వరకు తూకాల్లో మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. చూస్తే పది, ఇరవై గ్రాముల తేడా కనిపించినా ఇదే అతి పెద్ద మోసం అని లోతుగా పరిశీలిస్తే గానీ తెలియడం లేదు. సాధారణ కాంటాల నుంచి ఎలక్ట్రానిక్ కాంటాలకు మారినా వినియోగదారులను కొందరు వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. వినియోగదారులకు ఎక్కడా అనుమానం రాకుండా కాంటాల్లోనే సెట్ చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కూరగాయల్లో కిలోకు 20 గ్రాములు తేడా వస్తుండగా, మటన్ అయితే 100 గ్రాములు, చికెన్ 70 గ్రాములు, ఇతర కిరాణ సరుకులు సైతం కిలోకు వస్తువులను బట్టి 10 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తక్కువ వచ్చేలా కాంటాల్లోనే సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాంటాలపై వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడం ఒక కారణం. ఇక.. వ్యాపారులను ప్రశ్నిస్తే ఏమైనా అంటారేమోననే మొహమాటం మరో కారణం. దీంతో తూకంలో మోసాలపై వ్యాపారులను వినియోగదారులు ప్రశ్నించిన దాఖలాలు తక్కువగానే ఉంటున్నాయి. నల్లగొండ పట్టణంలో పాత బస్తీలో ని ఓ షాపులో 25 కిలోల బియ్యం బస్తాను ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి పరిశీలించగా 24.510 కిలోలు మాత్రమే ఉంది. 490 గ్రాములు తక్కువగా ఉంది. అదే విధంగా 26 కేజీల బియ్యం బస్తా తూకం వేయగా 25 కేజీల 630 గ్రాములు ఉంది. ఈ బస్తా కూడా 370 గ్రామాలు తేడా వచ్చింది. మరో బస్తా తూకం వేయబోగా దుకాణం యజమాని సదరు కాంటా సరిగా పని చేయడం లేదంటూ తూకం వేయకుండా అడ్డుకోవడం గమనార్హం. కేసుల వివరాలు.. తప్పుడు తూకాల కేసులు 96ప్యాకేజీల కేసులు 243వ్యాపారుల వంచన.. జిల్లా వ్యాప్తంగా ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్ కాంటా వినియోగిస్తున్నా దాని కింద ఎవరికీ కనిపించని విధంగా ఐస్కాంతం ఉపయోగిస్తుండడంతో కేటుగాళ్లు ఎవరికీ దొరకడం లేదు. కొన్ని దుకాణాల్లో రెండు కాంటాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చోట్ల వ్యాపారులైతే పెద్ద, చిన్న ఎలక్ట్రానిక్ కాంటాల లోపలనే తమకు అవసరమైన రీతిలో సెట్టింగ్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిపై 26 కిలోల తూకం వేస్తే అరకిలో నుంచి కిలోన్నర తూకం తక్కువగా వస్తున్నట్లు చర్చ జరుగుతుంది. బంగారు దుకాణాలపై 25 పెట్రోల్ బంక్లపై 07 నల్లగొండలోని కిరాణం షాపులో 5 కేజీల ఉల్లిగడ్డ కొనుగోలు చేసి దానిని మరో చోట కాంటా వేయగా 4 కేజీల 600 గ్రాములు మాత్రమే ఉంది. 400 గ్రాముల ఉల్లి గడ్డలు తక్కువగా వచ్చాయి. మరో దుకాణానికి వెళ్లి ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని తూకం వేయగా కాంటాలో 80 గ్రాములు అధికంగా చూపించింది. ఇవీ కొందరు వ్యాపారుల మాయజాలానికి నిదర్శనం. -
కోతకొచ్చిన వరిచేలు
నల్లగొండ అగ్రికల్చర్: యాసంగి సీజన్ వరి చేలు కోతకొచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆయకట్టు, నాన్ ఆయకట్టులో కోతులు ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 5,12,443 ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు. జిల్లాలో రైతులు ఈ సీజన్లో ముందస్తుగా వరి సాగు చేపట్టారు. దీంతో కోతలు కూడా ముందుగానే వస్తున్నాయి. ఆయకట్టు ప్రాంతంలోని రైతులు మిర్యాలగూడ సమీపంలోని మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. నాయ్ఆయకట్టులో రైతులు ధాన్యం ఆరబోసి ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మండలాల్లోనే వరిసాగు అత్యధికం.. మిర్యాలగూడ మండలంలో 41,672 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అలాగే నల్లగొండ మండలంలో 35,501, నిడమనూరు 35,443, కనగల్ 35,096, మాడుగులపల్లి 34,010, త్రిపురారం 28,861, తిప్పర్తి మండలంలో 28,396 ఎకరాల్లో వరిసాగైంది. సాగర్ ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడతోపాటు ఇతర మండలాల్లో ప్రస్తుతం వరిచేలు పలు దశల్లో ఉన్నాయి. కొన్ని ఇప్పుడే ఈనుతుండగా.. మరికొన్ని కోతకు సిద్ధమయ్యాయి. నాన్ ఆయట్టు పరిధిలోని అనేక మండలాల్లో యాబైశాతానికిపైగా చేలు ఎర్రబరాయి. ఆయా ప్రాంతాలోని చేతికొచ్చిన చేలను రైతులు కోతమిషన్లతో కోయిస్తున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా.. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్కు సంబంధించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరికోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నందున ఈ నెల 20 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో జిల్లా యంత్రాంగం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్, సహకార, డీసీఎంఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఫ ముందస్తుగా నాట్లువేసిన చోట ప్రారంభమైన కోతలు ఫ మరికొన్ని చోట్ల ఇప్పుడే ఈనుతున్న పొలాలు ఫ జిల్లాలో 5,12,443 ఎకరాల్లో వరిసాగు -
నేటి నుంచి ఒంటి పూట బడులు
నల్లగొండ : ఒంటిపూట బడులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1నుంచి 9వ తరగతి వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు. అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపిస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్తో పాటు అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలు ఒంటిపూట బడులు అమలు చేయాలని, విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. టెన్త్ పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మార్పులు పదో తరగతి పరీక్షలు ఈనెల 21నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఒంటి పూట బడుల వేళల్లో మార్పులు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం ఒంటి గంటకు పాఠశాలలకు చేరుకుని మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తరగతులకు హాజరవుతారు. ఫ ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు -
మూసీ కాల్వలకు నీటి నిలిపివేత
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. యాసంగిలో పంటల సాగుకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. అందులోభాగంగా మూడవ విడతగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు 22 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. గడువు సమయం ముగియడంతో శుక్రవారం కుడి, ఎడమ కాల్వలకు నీటిరి నిలిపివేశారు. ఐదు రోజుల విరామం తర్వాత ఈ నెల 20 తేదీ నుంచి నాలుగో విడత నీటిని విడుదల చేయనున్నారు. 645 అడుగుల గరిష్ట నీటమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 630.50 (1.46 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ అనర్థాలపై వినూత్న ప్రచారం వేములపల్లి : యువత డ్రగ్స్కు బానిసై తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూర్యాపేట జిల్లా గోరుంట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ శుక్రవారం ఆమనగల్లు జాతరలో యువతకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మద్యం, డ్రగ్స్ బారిన పడడం వల్ల పెడదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా సక్రమమైన మార్గంలో నడిచి మంచి పౌరులుగా ఉండాలన్నారు. నేత్రపర్వం.. ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఆండాళ్దేవికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హక్షమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు. -
పంట వ్యర్థాలను ఉపయోగించుకోవాలి
కట్టంగూర్: పంట వ్యర్ధాలతో బయోచర్ను ఉత్పత్తి చేసి వినియోగించుకుంటే పంట దిగుబడి పెరగడంతో పాటు మట్టిలో నాణ్యత పెరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో తపోవనం బయోచర్ ఫ్యాక్టరీలో పంటల వ్యర్థాలతో తయారుచేస్తున్న బయోచర్(జీవ బొగ్గు)ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయోచర్ గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆక్సిజన్ లేకుడా పత్తి కట్టెను, వరి గడ్డితో పాటు ఇతర పంట వ్యర్ధ్థాలను వేడి చేసి కట్టెలో సేంద్రీయ కర్బనం నిల్వ చేయడం ద్వారా బయోచర్ ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని పొలాల్లో ప్రస్తుతం 0.3 శాతం కంటే ఎక్కువ కర్బనం లేదన్నారు. బయోచర్ వాడకం వల్ల పొలంలో ఒక శాతం కర్బనం పెరిగి అధిక దిగుబడులు వస్తాయని, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. బయోచర్ సంస్థ వృథా వ్యర్ధ్థాలను సేకరించి ప్రాసెసింగ్ ద్వారా జీవ బొగ్గుగా మార్చి రైతులకు ఉచితంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పండ్లు, పూల మొక్కలను తక్కువ ధరలో రైతులకు, ప్రజలకు సరఫరా చేసేందుకు, నర్సరీ పెంచేందుకు స్థలాన్ని కేటాయించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి కలెక్టర్ను కోరగా అవసరమైన స్థలాన్ని చూడాలని తహసీల్దార్ ప్రసాద్ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్, జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వర్రావు, నల్లగొండ ఆర్డీఓ యారాల అశోక్రెడ్డి, తహసీల్దార్ గుగులోతు ప్రసాద్, కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ స్థాపకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ ఉన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం పెంచుకోవచ్చు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయాన్ని సృష్టించుకోవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రూ.50లక్షల చెక్కును అందజేయగా స్వయం సహాయక మహిళా సంఘాలు సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ శక్తి కేంద్రం ప్రతినిధి సుధాకర్, మహిళలు తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
గిరిజన రైతులకు నాబార్డు చేయూత
దేవరకొండ: నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. నాబార్డు మంజూరు చేస్తున్న నిధులతో గిరిజన రైతులు జలసంరక్షణ పనులతో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దేవరకొండ మండల పరిధిలోని ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాను ఐదేళ్ల కిత్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాబార్డు డబ్ల్యూడీఎఫ్ (వాటర్షెడ్ డెవలప్మెంట్ ఫండ్) ఆయా గ్రామాల్లో భూ అభివృద్ధి పనులు చేపట్టింది. తద్వారా ఇక్కడ ఏర్పాటైన వాటర్షెడ్ కమిటీలు రైతుల కోసం వివిధ పనులకు సబ్సిడీలు మంజూరు చేస్తూనే తండాల వాసుల ఉపాధి కల్పనకు కూడా బాటలు వేశాయి. నాలుగు గ్రామాల్లో చేపట్టిన పనులు.. ● నాబార్డు ఎంపిక చేసిన ధర్మతండా, సపావట్తండా, గొల్లపల్లి, వెంకట్తండాల్లో అర్హులైన రైతుల పొలాల్లో మొదటగా లోతట్టు ప్రాంతాల్లో నీరు వృథాగా పోకుండా రాతి కట్టడం, ఫాంపాండ్స్, సంకెన్ పిట్స్, వరద కట్టల నిర్మాణాలు చేపట్టారు. ● నీటి నిల్వలు తగ్గకుండా చూడడం, బోరు రీచార్జ్ కావడం వంటి జలసంరక్షణ పనులు చేశారు. ● ఈ నాలుగు తండాల్లోని 1,100 హెక్టార్ల భూములకు సంబంధించి అర్హులైన రైతులను ఎంపిక చేసి నాబార్డు సహకారంతో యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ(ఏఆర్డీఎస్) ఆధ్వర్యంలో స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్లు అందించారు. ● దొండ సాగుకు పందిళ్ల ఏర్పాటు, రైతుల పొలాలకు పైప్లైన్ వంటి పనులు చేపట్టి ప్రోత్సహించారు. ● నిధుల విషయంలో రైతుల వాటా 30శాతం ఉండగా నాబార్డు 70శాతం నిధులు మంజూరు చేసింది. ● మొత్తంగా ఐదేళ్లలో గిరిజన రైతుల పొలాల్లో అభివృద్ధి పనులకు నాబార్డు రూ.80లక్షలు మంజూరు చేసింది. దీంతో గిరిజనులు వివిధ పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తూ కొంతమేర ఆర్థిక స్వావలంబన సాధించారు. ఫ దేవరకొండ మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో డబ్ల్యూడీఎఫ్ నిధులతో భూ అభివృద్ధి పనులు ఫ ఏఆర్డీఎస్ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లు, పైప్లు, డ్రిప్లు అందజేత ఫ ఉపాధికి బాటలు వేస్తున్న వాటర్షెడ్ కమిటీలు -
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి
కోదాడరూరల్: బైక్పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం శాంతినగర్కు చెందిన తల్లోజు దుర్గాచారి(29) కోదాడ పట్టణంలోని హిందూజా కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా గురువారం బైక్పై కోదాడ నుంచి మేళ్లచెర్వు వెళ్తుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులో కాపుగల్లు క్రాస్రోడ్లో ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. దుర్గాచారికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జూదరుల అరెస్ట్అనంతగిరి: మండల పరిధిలోని ఖానాపురం శివారులో పేకాట ఆడుతున్న వారిని అనంతగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖానాపురం గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.1430 నగదు. రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 350 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో అక్రమంగా బ్లాసింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని 350 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారనే సమాచారంతో బ్లాస్టింగ్ చేసే ప్రదేశంలో అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్ఓటీ పోలీసులు వెలడించారు. అక్రమ బ్లాస్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. -
నల్లగొండ
ఇఫ్తార్ 6–31 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్ 5–02 (శనివారం ఉశ్రీశ్రీ)ఇసుక బజార్లు ఏర్పాటు ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ సుశీల్కుమార్ అన్నారు. 7- 8లోశుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025రైతులకు నాబార్డు చేయూత గిరిజన రైతులకు నాబార్డు అండగా నిలుస్తోంది. ఆ సంస్థ ఇస్తున్న నిధులతో రైతులు స్వావలంబన సాధిస్తున్నారు. - 8లో -
సాగు యాంత్రీకరణ.. పునరుద్ధ్దరణ
ఫ రూ. 1.81 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం ఫ నెలాఖరు వరకు యూనిట్ల గ్రౌండింగ్కు ఆదేశం ఫ హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం నల్లగొండ అగ్రికల్చర్: గత ప్రభుత్వ హయాంలో 2018 సంవత్సరంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలు ఇచ్చేందుకు జిల్లాకు 2024 సంవత్సరానికి గాను రూ.1,81,36,000 నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే పథకం అమలు కోసం విధివిధానాలు రూపొందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లాలకు పంపించారు. ఏడేళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రభుత్వం తిరిగి సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడానికి యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 820 యూనిట్లు అందించడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో పనిముట్ల పంపిణీకి జిల్లా వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలను ముమ్మరం చేసింది. నెలాఖరు వరకు గ్రౌండింగ్ యాత్రీకరణ పథకాన్ని పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంట్లోభాగంగా పాటుగా ఈనెలాఖరు వరకు కచ్చితంగా యూనిట్లను రైతులకు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి మండలాల వారీగా యూనిట్ల పంపిణీతో పాటు అర్హుల జాబితాను నివేదించేందుకు కసరత్తు ప్రారంభించారు. అనంతరం ఈనెల 31లోపు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేయనున్నారు మండలాల వారీగా పరికరాలు కేటాయిస్తాం నెలాఖరు వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ అనుమతితో మండలాల వారీగా పరికరాల సంఖ్యను కేటాయించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తాం. పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ -
ప్రతిరోజూ గ్లాకోమా పరీక్షలు నిర్వహిస్తాం: డీఎంహెచ్ఓ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లోని కంటి విభాగంలో ప్రతిరోజూ గ్లాకోమా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా గురువారం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లయిండ్ నెస్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 వరకు నిర్వహించనున్న వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. గ్లాకోమా పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ర్యాలీలో డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, కంటి విభాగం డాక్టర్లు సువర్ణ, మహేంద్ర, సాంబశివరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ నగేష్, డాక్టర్ కళ్యాణచక్రవర్తి, ఆర్తమాలజిస్టులు, మెడికల్ స్టాఫ్ జితేంద్ర, ప్రకాష్, కవిత, సరిత, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
మండలిలో మనది అగ్రస్థానం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్యాపరంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా ప్రత్యక్షంగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవారే. ఇక బీఆర్ఎస్ నుంచి ఎన్నికై న దాసోజు శ్రవణ్కు రాజకీయంగా నల్లగొండ జిల్లాతో పెద్దగా సంబంధం లేకపోయినా, పుట్టి పెరిగిందీ నల్లగొండ జిల్లా కేంద్రమే. దీంతో శాసన మండలిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరుకుంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్సీలు గురువారం ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఇదే మొదటిసారి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శ్రవణ్ కాకుండా ఆరుగురు ఎమ్మెల్సీలు శాసన మండలిలో జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంకెన కోటిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు కేతావత్ శంకర్నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్కుమార్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఈ స్థాయిలో ప్రాతినిథ్యం దక్కడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో గుత్తా సుఖేందర్రెడ్డి పదవీకాలం 2027 నవంబరు 21వ తేదీతో ముగియనుండగా, తీన్మార్ మల్లన్న పదవీకాలం అదే సంవత్సరం మార్చి 29వ తేదీతో ముగియనుంది. మంకెన కోటిరెడ్డి పదవీ కాలం 2028 జనవరి 4వ తేదీతో ముగియనుండగా, కేతావత్ శంకర్నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్కుమార్ పదవీ కాలం 2029 మార్చి 29వ తేదీన ముగియనుంది.ఫ శాసన మండలిలో ఉమ్మడి జిల్లాకు పెరిగిన ప్రాతినిథ్యం ఫ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు.. తాజాగా మరో ముగ్గురు ఎన్నిక ఫ పుట్టిన స్థలం పరంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ది కూడా ఇక్కడే ఫ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారికంగా ప్రకటన -
హోలి.. కావాలి ఆనందాల కేళి
రామగిరి(నల్లగొండ): హోలి పండుగ అనగానే అందరిలో ఉత్సాహం వస్తుంది. చిన్న నుంచి పెద్దల వరకు హుషారుగా రంగులు చల్లుకుంటారు. హోలి పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదాలకు తావులేకుండా ఆనందాలు నిండుతాయి. రసాయన రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిలో లభించే పదార్ధాలతో తయారుచేసిన రంగులను వినియోగించితే మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనిక రంగుల్లో అల్యూమినియం బ్రొమైడ్, లెడ్ ఆకై ్సడ్, మెర్క్యూరీ సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్ వంటివి ఉంటాయని, వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒకవేళ కంట్లో పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సహజ రంగులతో మేలు.. ప్రకృతిలో లభించే పువ్వులు, ఆకులతో రంగులను తయారు చేసుకుంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మోదుగు పువ్వు, గోగు పువ్వులను నీటిలో మరిగించడంతో రంగు ద్రావణంగా మారుతుంది. ఇలాంటివి చల్లుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జాగ్రత్తలు తప్పనిసరి హోలి పండుగ రోజు రంగులు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారు వాటిని తీసి హోలి ఆడాలి. కంట్లో రంగులు పడకుండా అద్దాలు వాడాలి. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి. ఒకవేళ కంట్లో రంగులు పడితే చల్లని నీటితో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కళ్లలో మంటగా అనిపిస్తే కంటి డాక్టర్ను సంప్రదించాలి. – డాక్టర్ తాటిపల్లి ప్రనూషరితేష్, కంటి వైద్యురాలు మాయిశ్చరైజర్ రుద్దుకోవాలి హోలి ఆడటానికి ముందు చర్మానికి మాయిశ్చరైజర్ వాడాలి. తద్వారా రసాయన రంగులు శరీరానికి అంటుకోవు. చర్మం మొత్తం కప్పిఉండేలా దుస్తులు ధరించాలి. పెదవులు, కళ్ల చుట్టూ పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఆర్గానిక్ రంగులు వాడితే ఉత్తమం. హోలి పూర్తయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మంపై ఇరిటేషన్ అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. – సీహెచ్. వెంకటకృష్ణ, చర్మవ్యాధి వైద్యుడు ఫ కళ్లలో, చర్మంపై రంగులు పడకుండా జాగ్రత్తలు వహించాలి ఫ రసాయనిక రంగులతో ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్య నిపుణులు ఫ సహజమైన రంగులు వాడితే మేలు అని సూచన -
జగదీష్రెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేయాలి
నల్లగొండ టూటౌన్: శాసనసభలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి గుంటకండ్ల జగదీష్రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కంచర్ల భూపాల్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులు ఉండవద్దనే ఉద్దేశంతోనే జగదీష్రెడ్డిని సభను సస్పెన్షన్ చేశారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి జెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల చేతిలో నుంచి దిష్టిబొమ్మ లాక్కుని పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, రేగట్టే మల్లీఖార్జున్రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మారగోని గణేష్, కరీంపాషా, గోవర్ధన్, బొమ్మరబోయిన నాగార్జున, యుగేంధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖేలో ఇండియా పోటీలకు అవకాశం కల్పించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖేలో ఇండియా, జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవికి ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. క్రీడా ప్రాంగణాల ప్రత్యక్ష పరిశీలన కోసం ఎంజీ యూనివర్సిటీని సందర్శించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్పోర్ట్స్ బోర్డ్ సభ్యులు ప్రొఫెసర్ సోమలింగం, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ రమావత్ మురళి తదితరులు ఉన్నారు. -
భూసారం కాపాడుకుంటేనే అధిక దిగుబడి
ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఫ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కిసాన్ మేళాత్రిపురారం: పంటల సాగులో రసాయన మందులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుందని, భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులతో సాధించవచ్చని త్రిపురారం మండలంలోని కంపాసాగర్లో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కేవీకేలో ఉమ్మడి జిల్లాలోని రైతులకు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. వరితో పాటు వివిధ రకాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు కేవీకే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని పోషకాలు మొక్కలకు సమపాలల్లో అందాలంటే సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలన్నారు. చీడపీడల నివారణకు అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పంట నష్టపోవాల్సి వస్తుందన్నారు. వరి పొలంలో యూరియాతో పాటు పొటాష్ వేసుకోవడం వల్ల చీడపీడలను తట్టుకునే శక్తి పెరుతుతుందన్నారు. ప్రస్తుతం వరి పైరులో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, సుడిదోమను గమనించామని శాస్త్రవేత్తల సలహాలతో పురుగు మందులు సకాలంలో పిచికారీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లింగయ్య, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, యంగ్ ప్రొఫెషనల్స్, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు మంత్రి హోలి శుభాకాంక్షలు
నల్లగొండ: జిల్లా ప్రజలు హోలి పండుగను సహజ సిద్ధమైన రంగులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. జిల్లా ప్రజలకు హోలి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు ఆమనగల్కు మంత్రి రాక మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్కు రానున్నారు. స్థానికంగా జరిగే శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన జాతరలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు చేస్తారు. రాత్రి 7 గంటలకు అమనగల్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళతారు. హెచ్ఎండీఏ పరిధిలోకి 14 గ్రామాలుమర్రిగూడ: మర్రిగూడ మండంలోని 14 రెవెన్యూ గ్రామాలు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోకి విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రీజినల్ రింగ్ రోడ్డులో ఆయా గ్రామాలు అంతర్భాంగా ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మండలంలోని దామెరభీమనపల్లి, బట్లపల్లి, ఇందూర్తి, ఖుదాబక్షపల్లి, కొండూరు, లెంకలపల్లి, మర్రిగూడ, మేటిచందాపురం, సరంపేట, తమ్మడపల్లి, వట్టిపల్లి, భట్లపల్లి, వెంకేపల్లి, యరగండ్లపల్లి గ్రామాలు ఉన్నాయి. కాగా తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని మండల అధికారులు అంటున్నారు. 19, 20 తేదీల్లో ‘వికసిత్ భారత్’రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 19, 20 తేదీల్లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం జరగనుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్జీ కళాశాలలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సిబ్బంది హరికిషన్, వీరస్వామి, శేఖర్, స్వప్న, వెంకట్రెడ్డి, శిరాణి, సావిత్రి, మల్లేశం, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన అవసరంకనగల్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. గురువారం కనగల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జీసీఈసీ(గర్ల్ చైల్డ్ ఇంప్రుమెంట్ క్లబ్) ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలు, అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ థామసయ్య, జీసీఈసీ కన్వీనర్ రాధిక పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలునల్లగొండ: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ మ్యాథ్స్–1బి, జువాలజీ–1, హిస్టరీ–1 పరీక్షలు జరిగాయి. వీటికి జిల్లావ్యాప్తంగా మొత్తం 13,772 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,171 మంది హాజరయ్యారు. 601 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ దస్రునాయక్ తెలిపారు. పశువైద్యశాల తనిఖీవేములపల్లి(మాడ్గులపల్లి): మాడ్గులపల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాలను గురువారం జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ.రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అయితే పశువైద్యశాలలో తహసీల్దార్ కార్యాలయం కూడా నిర్వహిస్తుండడంతో ఏర్పడుతున్న ఇబ్బందులు తెలపడంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పశువైద్యాధికారి వినయ్కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
మునుగోడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన జంగ సుజాత(42) తల్లి చీకటిమామిడి గ్రామంలో ఉంటుంది. తన తల్లికి జ్వరం వస్తుండడంతో బుధవారం సుజాత తన కుమారుడితో కలిసి బైక్పై తల్లిని మునుగోడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి చీకటిమామిడికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పత్తి మిల్లు వద్ద గేదెకు ఢీకొట్టి ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సుజాత తలకు తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యమిర్యాలగూడ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని శరణ్య గ్రీన్ హోమ్స్లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్ సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్ చక్రబోటి(44) గత కొద్ది రోజులుగా బెల్ కంపెనీ గెస్ట్ హౌజ్లో సర్వర్గా పని చేస్తున్నాడు. అప్పుల బాధతో మనస్తాపం చెంది గెస్ట్ హౌజ్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువకుడు అదృశ్యం.. కేసు నమోదు మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన బుర్రి వినయ్(23) ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్వగ్రామమైన దామరచర్ల మండలం తెట్టెకుంటలో, బంధువుల ఇళ్లలో కూడా లేకపోవడంతో అతడి భార్య బుర్రి టీనారాణి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి ఆచూకీ తెలిస్తే 87126 70189, 871267 15151 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిమిర్యాలగూడ టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడేనికి చెందిన మారేపల్లి సైదులు(60) బుధవారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ సమీపంలో గల ఫంక్షన్హాల్లో తన బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జడ్జర్ల–కోదాడ హైవేపై రోడ్డు దాటుతుండగా తుంగపాడు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్ సైదులును ఢీకొట్టింది. అతడికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సాయంతో స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమార్తె సట్టు నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైలు ఎక్కుతుండగా జారిపడిన ప్రయాణికుడుఫ రక్షించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిభువనగిరి: రైలు ఎక్కే క్రమంలో జారిపడిన వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది రక్షించారు. ఈ ఘటన బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో జరిగింది. భువనగిరి ఆర్పీఎఫ్ ఎస్ఐ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాజిరెడ్డి జగదీష్ అనే ప్రయాణికుడు నిజామాబాద్కు వెళ్లేందుకు బుధవారం రాత్రి భువనగిరి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నాడు. రాత్రి 8.22 గంటలకు తిరుపతి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు భువనగిరికి చేరుకుంది. రాత్రి 8.23 గంటలకు స్టేషన్ నుంచి రైలు కదలగా.. జగదీష్ రైలు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్ఫాం మధ్యలో జారిపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ బాలాజీ గమనించి జగదీష్ను బయటకు లాగాడు. దీంతో ఎటువంటి గాయాలు కాలేదు. -
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక బజార్లు ఏర్పాటు
శాలిగౌరారం: ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలకు అందించేందుకు మైనింగ్శాఖ ఆధ్వర్యంలో ఇసుక బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎంబీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్కుమార్ అన్నారు. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ నది నుంచి ఇసుక రవాణా, ఇసుక స్టాక్ పాయింట్, వేబ్రిడ్జిలను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులోని ఇసుకను నిర్ణీత సమయంలో వెలికితీసి స్టాక్ పాయింట్కు తరలించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఇసుక బజార్లకు ఇసుక రవాణా చేసే వాహనాలు ఇసుక స్టాక్పాయింట్ వద్ద వేచిచూడకుండా త్వరితగతిన లోడింగ్ జరిగేలా యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత రీచ్ నిర్వాహకులకు సూచించారు. ఇసుక వాహనాలను తూకం వేసే వేబ్రిడ్జిని పరిశీలించారు. వేబ్రిడ్జిలో ఏర్పడిన రిపేర్లను తక్షణమే సరిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చడాలని సిబ్బందికి సూచించారు. తూకం కోసం ఇసుక వాహనాలు వేచిచూడకుండా అదనంగా మరో వేబ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు ప్రభుత్వం హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో ఇసుక స్టాక్పాయింట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఆయా ఇసుక బజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఇసుక రీచ్ల నుంచి ఇసుక బజార్లకు ఇసుకను తరలించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుకను విక్రయించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మైనింగ్శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాకోబ్, అసిస్టెంట్ జియాలజిస్ట్ బాలు, సూపర్వైజర్ మహిపాల్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ సుశీల్కుమార్ -
తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఫ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. గురువారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రిపేరులో ఉన్న బోర్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, గ్రామాల్లో వంద శాతం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని చీకటిగూడెం గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ నాగలక్ష్మి, మిషన్ భగీరథ ఏఈఈ సాయికుమార్, ఏపీఓ ఉన్నారు. -
పోలీసులు క్రీడాస్ఫూర్తిని చాటాలి
నల్లగొండ: పోలీసులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2025 కార్యక్రమాన్ని గురువారం ఆమె.. ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ వృత్థి అంటేనే ఒత్తిడితో కూడుకున్నదని, ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులకు, సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కోసమే గేమ్స్తో పాటు పరేడ్, జిమ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. పోటీల్లో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లతోపాటు నల్లగొండ ఏఆర్ విభాగం జట్ల నుంచి సుమారు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, షాట్ఫుట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఎస్బీ డీఎస్పీ రమేష్, డీటీసీ డీఎస్పీ విఠల్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పట్టాలెక్కని పనులు!
నిర్మాణానికి నోచని ఆర్యూబీ, ఆర్ఓబీలు ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మించాలని కోరిన ప్రాంతాలివే.. ● నల్లగొండ జిల్లా రాయినిగూడెం వద్ద, తిప్పర్తి సెక్షన్లోని ముకుందాపురం 56వ లెవల్ క్రాసింగ్వద్ద, ఎఫ్సీఐ గోదాం నుంచి పెద్దబండ నుంచి నామ్ రోడ్డులో 45వ లెవల్ క్రాసింగ్ వద్ద నిర్మించాలని కోరారు. ● రామన్నపేట – చిట్యాల సెక్షన్లోని, కి.మీ 0/4–6 వద్ద, చిట్యాల మున్సిపాలిటీ – కాటన్ రైస్ ఇండస్ట్రీస్ రోడ్లో, దామరచర్ల – వీర్లపాలెం రోడ్డులోని రోడ్డు 86వ క్రాసింగ్ వద్ద ఆర్ఓబీ లేదా ఆర్యూబీ నిర్మించాలని విన్నవించారు. ● త్రిపురారం – కుక్కడం రోడ్డులో, పగిడిపల్లి నుంచి నడికుడి విభాగంలోని పెద్దదేవులపల్లి వెళ్లే మార్గంలో 64వ క్రాసింగ్ వద్ద బ్రిడ్జి అవసరమని పేర్కొన్నారు. ● యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ – నాగారం రోడ్డులో, పగిడిపల్లి – భువనగిరి రోడ్డులోని రోడ్డులో, ముత్తిరెడ్డిగూడెంలో, అలేరు– పెంబర్తి రోడ్డులో, వలిగొండ – రామన్నపేట రోడ్డులో వీటిని నిర్మించాలని కోరారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జీలు (ఆర్వోబీ), రోడ్ అండ్ బ్రిడ్జీల (ఆర్యూబీ) నిర్మాణం ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమతం అవుతోంది. ఏటా కేంద్ర రైల్వే బడ్జెట్ కంటే ముందు, రైల్వే బోర్డు సమావేశాల సమయంలో జిల్లాలోని ఎంపీలు ప్రతిపాదనలు ఇవ్వడం, అవి అమలుకు నోచుకోకపోవడం ఆనవాయితీగా మారుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తూనే ఉంది. మరోవైపు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య ఈనెల 8వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను హైదరాబాద్లో కలిసి విన్నవించారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు ఆమోదం తెలుపాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ ప్రాజెక్టులపై ప్రత్యేక విజ్ఞప్తి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్ఓబీలు, ఆర్యూబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. జిల్లాలో పలు రైల్వే లెవెల్ క్రాసింగ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా రైల్వే నిధులతో ఆర్ఓబీలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ అందజేశారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసివేయడం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయని వివరించారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు లెవెల్ క్రాసింగ్ల స్థానంలో ఆర్ఓబీలు, ఆర్యూబీలు నిర్మించాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఆయా పనులకు మోక్షం లభిస్తుందా? ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. లేదా ఎప్పటిలాగే ప్రతిపాదనలకే పరిమితం అవుతాయా? వేచి చూడాల్సిందే. ప్రాజెక్టులకు నిధులు వచ్చేనా? మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ రూ.458.26 కోట్లతో మంజూరుచేసినా ఈసారి నిధులను బడ్జెట్లో కేటాయించలేదు. విష్ణుపురం–జాన్పహడ్ 11 కిలోమీటర్ల రైల్వే లైన్కు డబ్బులు ఇవ్వలేదు. నల్లగొండ– శ్రీరామ్పురం 123వ బాక్స్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను ఇవ్వలేదు. ఇక డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ పనులు సర్వేకే పరిమితమయ్యాయి. మిర్యాలగూడ, కోదాడ, నేరేడుచెర్ల, హుజూర్నగర్, రాజేశ్పురం, నేలకొండపల్లి ప్రాంతాల్లోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి ఎంతో ఉపయోగపడే ఈ లైన్ సర్వే పనులను కేంద్రం 2013–14 సంవత్సరంలో మంజూరు చేసింది. అయినా ఇంతవరకు ముందుకు సాగడం లేదు. మంత్రులు ఇటీవల కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన నేపథ్యంలో ఆయా పనులకు కేంద్రం నిధులను ఇస్తుందా? లేదా? చూడాల్సి ఉంది. ఫ డిమాండ్ల దశలోనే కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టులు ఫ అమలుకు నోచని జిల్లా ఎంపీల ప్రతిపాదనలు ఫ రైల్వే పనులపై కేంద్ర రైల్వే మంత్రికి ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వినతి -
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
నాగార్జునసాగర్ : ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేసేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు రూల్ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బిక్కి వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చిన ఆయన ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో సాగునీటిశాఖ అధికారులతో పాటు తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు ఫవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు విషయాలను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఇంజనీర్లు, షెడ్యూల్డ్ కులాల జిల్లా ఉప సంచాలకుడు వి.కోటేశ్వర్రావు, సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి వి.వెంకటకృష్ణ, జయపాల్ తదితరులు పాల్గొన్నారు. సబ్జైల్ను సందర్శించిన జైళ్ల శాఖ డీఐజీదేవరకొండ : దేవరకొండ సబ్జైల్ను బుధవారం హైదరాబాద్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ డాక్టర్ డి.శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా సబ్జైల్లో పరిసరాలను ఆయన పరిశీలించి జైలు అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సబ్జైల్ సందర్శనకు వచ్చిన డీఐజీకి జిల్లా సబ్జైల్స్ అధికారి, జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్, దేవరకొండ సబ్జైల్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ స్వాగతం పలికారు. వారి వెంట పలువురు సిబ్బంది ఉన్నారు. చండూరు మార్కెట్ కమిటీ నియామకంచండూరు : చండూరు వ్యవసాయ మార్కెట్కు నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. నూతన చైర్మన్గా దోటి నారాయణ (మునుగోడు), వైస్ చైర్మన్గా పోలు వెంకట్రెడ్డి (చండూరు) నియమితులయ్యారు. సభ్యులుగా భూతరాజు ఆంజనేయులు, తలారి నర్సింహ, మోదుగు బాల్రెడ్డి, లోడే రవి, మెగావత్ బిచ్యానాయక్, ఉప్పరబోయిన నర్సింహ, కుంభం చెన్నారెడ్డి, నలపరాజు రామలింగయ్య, బొమ్మరగోని మంగమ్మ, షేక్ఆహ్మద్, కర్నాటి నారాయణ, ఇడికూడ దామోదర్ను నియమించారు. నూతన కమిటీ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇంటర్ పరీక్షకు 368 మంది గైర్హాజరునల్లగొండ : ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షకు బుధవారం 368 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన సెకండియర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,511 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 13,143 మంది హాజరయ్యారు. 368 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. -
నల్లగొండ
ఇఫ్తార్ 6–31 (గురువారం సాశ్రీశ్రీ) సహర్ 5–03 (శుక్రవారం ఉశ్రీశ్రీ)దొంగల ముఠా అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 7ఎంజీయూ అభివృద్ధికి.. ఎంజీయూ అభివృద్ధికి రూ.309.65 కోట్లతో ప్రతిపాదనలు పంపామని వీసీ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. - 8లోగురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025 -
నైపుణ్య శిక్షణకు ప్రణాళిక రూపొందించాలి
నల్లగొండ : నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిద శాఖల ద్వారా నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్తో చేపట్టే కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రస్తుత ట్రెండ్, డిమాండ్ ప్రకారం అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్శాఖలో ఇష్టారాజ్యం
ఏళ్లతరబడి ఒకేచోట తిష్టవేసిన ఉద్యోగులు ఫ బినామీ పేర్లతో కాంట్రాక్టులు.. విధులకు ఎగనామం ఫ ఉన్నతాధికారులనే శాసించే స్థాయిలో వారి తీరు ఫ మిర్యాలగూడ డివిజన్ పరిధిలో వ్యవహారం మిర్యాలగూడ : విద్యుత్ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తూ.. బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేపడుతూ తమమాట వినని సిబ్బంది, అధికారులను బదిలీ చేయిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ వ్యవహారం మిర్యాలగూడ డివిజన్లో యథేచ్ఛగా సాగుతోంది. దీనికి ప్రత్యక్ష ఉధాహరణ మిర్యాలగూడ విద్యుత్ డీఈ కార్యాలయంలో అధికారిగా బాధ్యతలు స్వీకరించి వారెవరూ కనీసం ఏడాది కూడా పనిచేయకుండానే బదిలీపై వెళ్తున్నారు. తాజాగా ఆరు నెలలు కూడా గడవక ముందే డీఈ శ్రీనివాససుధీర్కుమార్ను ఉన్నతాధికారులు యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఇలాంటి పరిస్థితి మిర్యాలగూడ డివిజన్లోనే ఉంది. దీంతో విజిలెన్స్ అధికారులు ఈ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారుల బదిలీలు ఇలా.. 2022 మార్చిలో ఏసీబీ దాడులతో డీఈ మురళీధర్రెడ్డిపై వేటుపడింది. అదే సమయంలో దేవరకొండ డీఈ శ్రీనివాస్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా మూడు నెలలు పనిచేసిన తరువాత డీఈగా ఏ.వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన మిర్యాలగూడ మండల నివాసి కావడంతో ఏడాది వరకు పని చేశాక ఆయనను బదిలీ చేసి.. సిద్దిపేట నుంచి శ్రీనివాస్ బదిలీపై మిర్యాలగూడకు పంపారు. తిరిగి ఆయనను కూడా వారం రోజుల వ్యవధిలోనే కర్నూలుకు బదిలీ చేశారు. తర్వాత ఎస్.వెంకటేశ్వర్లు డీఈగా రాగా మూడు నెలలు పనిచేశాక నల్లగొండకు బదిలీ చేశారు. ఆ తర్వాత శ్రీనివాససుధీర్కుమార్కు డీఈగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెండు నెలల వ్యవధిలోనే ఆయనను తిరిగి వెనక్కి పంపి డీఈగా విద్యాసాగర్ను నియమించారు. రెండు నెలల తర్వాత విద్యాసాగర్ను బదిలీ చేసి శ్రీనివాససుధీర్కుమార్ను గతేడాది అక్టోబర్లో మిర్యాలగూడ డీఈగా నియమించారు. కనీసం ఆరు నెలలు గడవకముందే ఇటీవల బదిలీ చేశారు. కొత్త డీఈగా శ్రీనివాసచారిని నియమించారు. ఆయన బుధవారం విధుల్లో చేరారు. 25 ఏళ్లుగా సబ్ డివిజన్లోనే కొందరు విధులు.. ● మిర్యాలగూడ సబ్ డివిజన్లో పనిచేసే సిబ్బంది కొందరు 20 ఏళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నారు. ఉన్నతాధికారులను సైతం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ లైన్ ఇన్స్పెక్టర్ విద్యుత్శాఖలో హెల్పర్గా చేరి సహాయ లైన్మెన్, లైన్మెన్గా పనిచేసి ఇటీవల లైన్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది సబ్ డివిజన్లో పనిచేస్తున్నారు. ● స్థానికంగా నివాసం ఉంటున్న ఒకరు హెల్పర్గా పనిచేసి ఏఎల్ఎం, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ● విద్యుత్శాఖలో హెల్పర్గా విధుల్లో చేరిన ఇద్దరు సహాయ లైన్మెన్లుగా, లైన్మెన్లుగా, లైన్ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇంజనీర్లుగా ఒకేసబ్ డివిజన్లో 20 ఏండ్లుగా పనిచేస్తున్నారు. ● విద్యుత్ ఏఈ ఒకరు సబ్ డివిజన్లోనే 20 ఏండ్లకు పైగా విధులు నిర్వరిస్తున్నారు. బయోమెట్రిక్ అమలుకు సన్నాహాలు! రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్శాఖ ఉద్యోగ సంఘాలు.. ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలని ధర్నాలు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇలా సంఘాల వారే ధర్నా చేయడంతో విద్యుత్శాఖ పరువు బజారున పడుతుందని.. ఇక, దశలవారీగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
కొత్త సార్లు వస్తున్నారు
ఫ ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కొత్త లెక్చరర్లు ఫ తీరనున్న బోధన కష్టాలు నల్లగొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొత్త అధ్యాపకులు రానున్నారు. 13 సంవత్సరాలుగా పూర్తి స్థాయి అధ్యాపకులు లేక కళాశాలల్లో బోధన అంతంత మాత్రంగా సాగుతోంది. కొత్త అధ్యాపకుల నియామకం చేపట్టిన ప్రభుత్వం వారికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించింది. త్వరలోనే విధుల్లో చేరనున్నారు. పదోన్నతులతోనే సరి.. సంవత్సరాల తరబడి ప్రభుత్వం లెక్చరర్ల నియామకాలను చేపట్టలేదు. అయితే 2014, 2016, 2019, 2021లో పదోన్నతులు కల్పించారు. అయితే గత ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసింది. వీరితోపాటు కొందరు కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో బోధన సాగుతోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కొత్త నియామకాలు చేపట్టడంతో జిల్లాకు దాదాపు 40 నుంచి 50 మంది వరకు కొత్త అధ్యాపకులు రానున్నారు. దీంతో అధ్యాపకుల కొరత తీరనుంది. ప్రస్తుతం ఉన్న లెక్చరర్ల వివరాలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 13 ప్రస్తుతం రెగ్యులర్ లెక్చరర్లు 35 రెగ్యులరైజ్డ్ కాంట్రాక్టు లెక్చరర్లు 112 కాంట్రాక్టు లెక్చరర్లు 27 గెస్టు లెక్చరర్లు 54 -
ప్రణయ్ కేసు తీర్పు మార్పునకు నాంది కావాలి
రామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 10వ తేదీన ఒకరికి మరణశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్థంగా కోర్టులో సమర్పించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ పాత్ర కీలకం. ఈ కేసు విచారణ జరిగిన తీరును బుధవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. కేసు ఎందుకు వాదించాల్సి వచ్చింది? కేసు జరుగుతున్న సమయంలో సాక్ష్యాధారాలు ఎలా సేకరించారు? తదితర వివరాలను ఆయన వెల్లడించారు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్య జరిగింది. నిందితులపై కేసు నమోదు కావడం కోర్టులో హాజరు పరిచారు. నిందితులు బెయిల్పై విడుదల అయ్యారు. దీంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ వి.చంద్రశేఖర్ 2019డిసెంబర్ 2న ఈ కేసుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. అప్పటికే పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు తన కూతురు అమృతవర్షిణిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2020లో చార్జిషీట్ ఈ కేసులో 2020డిసెంబర్ 20న కోర్టు చార్జిషీట్ నమోదు అయింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తల్లి ప్రేమలత స్టేట్మెంట్, 20 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. కోవిడ్ తర్వాత కేసు విచారణలో కొంత జాప్యం జరిగింది. 2022జూలై 26న జడ్జి బి.తిరుపతి బాధ్యతలు తీసుకున్నాక నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. 2024 జూలైలో జడ్జిగా ఎన్.రోజారమణి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో కేసు విచారణ వేగంగా కొనసాగింది. కేసులో కోర్టుకు 102 మంది సాక్షుల పేర్లను సమర్పించగా 78 మంది సాక్షులను విచారించారు. 293 పేజీల డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాం. పరువు హత్యలు ఆగాలి.. ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలను, ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను కోర్టుకు సమర్పించా. 523 పేజీలతో కోర్టు తీర్పు ఇచ్చింది. డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను సమర్థంగా తిప్పికొట్టి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో నిందితులకు కఠినశిక్షలు పడ్డాయి. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అనేక డిబేట్లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. కుల హత్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు కనువిప్పునిస్తుంది. ఇప్పటికీ కుల పరమైన దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ తీర్పుతో ఆగాలి. ఫ ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థనతో స్పెషల్ పీపీగా నియమించారు ఫ ఈ కేసులో 472 పేజీల రాత పూర్వక వాదనలు కోర్టుకు సమర్పించా ఫ ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను అందజేశా ఫ కుట్రలన్నీ కోర్టులో నిరూపణయ్యాయి ‘సాక్షి’తో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ -
సివిల్ రైట్స్డే నిర్వహించాలి
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై దాడుల నివారణ, అంటరానితనంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ప్రతినెలా చివరి వారంలో సివిల్ రైట్స్ డేను నిర్వహించాని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయణతో కలిసి.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వారి భూముల సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులకు తెలిపిన వివరాలను సావధానంగా విని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. నియామకాలు, ప్రమోషన్ల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం మున్సిపల్ సిబ్బందిని మున్సిపాలిటీల్లో కాకుండా నాయకుల ఇళ్లలో పని చేయించడం ఏంటని చైర్మన్ వెంకటయ్య నల్లగొండ మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని కొందరు ఉద్యోగులే తన దృష్టికి తెచ్చారని.. ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కొందరు అభిమానులు తన ఫ్లెక్సీ పెడితే.. వెంటనే తీసివేయించారట.. ఏమైనా ఎన్నికల కోడ్ ఉందా అని కమిషనర్ను ప్రశ్నించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి వద్దకు దళితులు ఎవరైనా కేసులపై వెళ్తే.. అమర్యాదగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింద ఇలా చేయడం సరి కాదన్నారు. దీంతో డీఎస్పీ అలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు. స్పందించిన ఎస్పీ శరత్చంద్ర పవార్ డీఎస్పీ ముక్కుసూటిగా మాట్లాడతారని.. చైర్మన్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై భూముల సంబంధించిన కేసుల వివరాలను చైర్మన్కు వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల వివరాలను కమిషన్ చైర్మన్కు నివేదించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి కోటేశ్వర్రావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్కుమార్ ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాల అమలు వివరాలను కమిషన్కు వివరించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్ఓ అశోక్రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, ఏఎస్పీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఫ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఫ మున్సిపల్ సిబ్బంది చేత ఇళ్లలో పనిచేయించడం సరికాదు ఫ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
పథకాలు అందుతున్నాయా..
పెద్దవూర: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం నాగార్జునసాగర్ నుంచి కారులో హాలియా వైపు వెళ్తుండగా పెద్దవూర మండలంలోని కుంకుడుచెట్టుతండా వద్ద గిరిజన రైతులను చూసి ఆగారు. కారు దిగి వచ్చి రోడ్డు పక్కనే ఉన్న బస్టాప్లో కూర్చొని రైతులతో మాట్లాడారు. ఎలా ఉన్నారు.. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. అంతా బాగుందని, కానీ.. కుంకుడుచెట్టుతండా ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు సరిగా రావడం లేదని రైతులు చెప్పారు. ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీ–8, 9 కాలువలకు ఎక్కువ నీటిని విడుదల చేయిస్తానని, సాగర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరంలోనూ పంట ఎండిపోనివ్వనని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. తన దగ్గరికి వచ్చిన గిరిజనులందరిని పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం హాలియాకు వెళ్లిపోయారు. జానారెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, భగవాన్నాయక్ తదితరులు ఉన్నారు. బస్టాప్లో కూర్చుని రైతులను పలకరించిన మాజీ మంత్రి జానారెడ్డి -
అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు శ్రీస్వామి అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఆలయంలో ఉదయం శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 108 కలశాలతో.. ఈ నెల 1న స్వస్తి వాచనంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అంతకు ముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచార్యులకు, పారాయణీకులకు, అధికారులకు, సిబ్బందికి సన్మానించారు. నిత్యారాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాల సంకీర్తన గావించారు. ఫ యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు పలికిన అర్చకులు -
ఆరుగురు సీఐల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా మల్టీ జోన్–2లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా, నల్లగొండ ట్రాఫిక్ పీఎస్లో పనిచేసే రాజును చండూరు సీఐగా, పీసీఆర్ నల్లగొండలో పనిచేసే కె.శివశంకర్ను సూర్యాపేట జిల్లా కోదాడ సీఐగా, నాంపల్లి సీఐగా పనిచేస్తున్న అనంతుల నవీన్కుమార్ను హైదరాబాద్ సిటీ కమిషరేట్కు, చండూరు సీఐగా పని చేస్తున్న ఎ.వెంకటయ్యను, కోదాడ టౌన్ సీఐగా పని చేస్తున్న రాములును హైదరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేశారు. ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న నుంచి డిగ్రీ ఒకటవ సెమిస్టర్, మూడవ సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, 16 నుంచి ఐదవ సెమిస్టర్, 15 నుంచి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలోని సీబీఎస్సీ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి చివరి అవకాశం కల్పిస్తూ.. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల టైం టేబుల్, వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పెండింగ్ కేసులు క్లీయర్ చేయాలి : ఎస్పీనల్లగొండ : పెండింగ్ కేసులను వెంటవెంటనే క్లీయర్ చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలని సూచించారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి పెట్రోలింగ్ చేయాలన్నారు. పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీలు రమేష్, విఠల్రెడ్డి, శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, సైదా, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పరువు హత్యలు చేసేవారికి గుణపాఠంచిట్యాల : ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు పరువు హత్యలు చేసే వారికి తగిన గుణపాఠమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు, న్యాయస్థానాల కృషి ఫలితంగానే ప్రణయ్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష, యావజ్జీవ కారగార శిక్ష పడిందన్నారు. కులాంతర వివాహాలను ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, నాయకులు ఐతరాజు నర్సింహ, బొబ్బలి సుధాకర్రెడ్డి, ఐతరాజు యాదయ్య, మెట్టు నర్సింహ, పాలమాకుల అర్జున్, శేఖర్ పాల్గొన్నారు. -
సాగునీటికి ఇబ్బంది లేదు
నల్లగొండ : జిల్లాలో ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బంది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని పానగల్ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఇరిగేషన్, రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందడం లేదన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరత లేదన్నారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 1.5 టీఎంసీలగాను 0.86 టీఎంసీల నీటిని పంటలకు విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న 67,000 ఎకరాలకు వారబందీ పద్ధతిలో పంట కోతకొచ్చే వరకు నీరు ఇస్తామని తెలిపారు. చివరి ఆయకట%్టుకు నీరు అందేలా.. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. సాగు, తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. డి–40 కాల్వ పరిశీలన తిప్పర్తి : మండలంలోని యర్రగడ్డలగూడెం సమీపంలో డి–40 వద్ద గల ఎల్–11 కాల్వలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిప్పర్తి మండలంలోని ఎల్–11 కాలువ కింద ఉన్న మామిడాల, సర్వారం, ఇందుగుల, గోరెంకలపల్లి, గ్రామాలకు వారబంధీ ద్వారా నీరు వస్తుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఏఓ సన్నిరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీఓ జానయ్య, ఇరిగేషన్ అధికారులు శివరాంప్రసాద్, అనుపమ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బియ్యం అందక పేదల పస్తులు!
మిర్యాలగూడ : పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో ఆలస్యం అవుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇవ్వడం లేదు. పది రోజులుగా పేదలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నా బియ్యం లేవంటూ డీలర్లు సమాధానం చెబుతున్నారు. దీంతో రేషన్ బియ్యంతోనే కడపు నింపుకునే పేదలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. తెరుచుకోని రేషన్ దుకాణాలు బియ్యం లేక చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. గోదాముల నుంచి బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే గోదాముల్లోనే బియ్యం లేనవి.. బియ్యం కొరతకు అధికారులే కారణమని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా గోదాముల్లో ఉన్న బియ్యం ఇటీవల ఖమ్మం జిల్లాకు తరలించారని.. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంపిణీ చేసేందుకు బియ్యం లేవని పేర్కొంటున్నారు. దీంతో బియ్యం ఎప్పుడు వస్తాయో తెలియక డీలర్లు, ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 8 బియ్యం నిల్వల గోదాములు.. నల్లగొండ జిల్లాలో 997 రేషన్ దుకాణాలకు 8 బియ్యం గోదాముల నుంచి బియ్యం పంపిణీ జరుగుతుంది. మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దవూర, దేవరకొండ, నకిరేకల్, నిడమనూరు, చండూరు, నాంపల్లి మండలాల్లో మండల్ లెవ్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 6,750 మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు అందిస్తున్నారు. కానీ ఇప్పటివరకు 3వేల మెట్రిక్ టన్నుల బియ్యం కూడా సరఫరా కాలేదు. ఇంకా సగానికి పైగా దుకాణాలకు బియ్యం చేరలేదు. మిర్యాలగూడ గోదాం పరిధిలో మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం మండలాలు ఉన్నాయి. వీటి పరిదిలో 200 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో కొన్ని దుకాణాలకు బియ్యం సరఫరా చేశారు. మంగళవారం మూడు లారీల్లో 1,470 క్వింటాళ్ల బియ్యం రాగా.. వాటిని మిర్యాలగూడలో 8, మాడ్గులపల్లి 2 దుకాణాలకు బియ్యం అందించారు. ఇంకా 138 దుకాణాలకు బియ్యం అందాల్సి ఉంది. గడువుకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండడంతో బియ్యం ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఇవ్వాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. బియ్యం పంపిణీ గడువును పెంచితే తప్ప మరో మార్గం లేదని పేర్కొంటున్నారు. బియ్యం కొరత ఉంది ఈనెల రేషన్ షాపుల్లో బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆదేశానుసారం ఇతర జిల్లాల నుంచి బియ్యం తెప్పించి దుకాణాలకు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 50శాతం దుకాణాలకు బియ్యాన్ని అందించాం. మిగిలిన వాటికి కూడా త్వరలోనే అందిస్తాం. బియ్యం కొరత విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వర్రావు, డీఎం సివిల్ సప్లయ్ ఫ 12వ తేదీ వచ్చినా గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు చేరని బియ్యం ఫ షాపుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ -
జీజీహెచ్లో భద్రత ఏదీ!
ఆస్పత్రి ఆవరణలో సీసీ కెమెరాల తొలగింపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిఘా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆస్పత్రి ఆవరణ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం . ఇంతకుముందు ఉన్న కెమెరాలను మెడికల్ కళాశాల వారు తీసుకుపోయారు. –డాక్టర్ అరుణకుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. నిత్యం ఔట్ పేషంట్లు 1500 వరకు, ఇన్ పేషంట్లు 500 నుంచి 600 వరకు జీజీహెచ్కు వస్తుంటారు. దీనికితోడు జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసిన కేసులు వస్తుంటాయి. ఇంతమంది రోగులు వస్తున్న 800 పడకల ఈ ఆస్పత్రికి భద్రత లేకుండా పోయింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంతోపాటు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఐసీయూ, ఎమర్జెన్సీ, సర్జరీ, వెల్నెస్ సెంటర్, ఫోరెన్సిక్, పోస్టుమార్టం, తెలంగాణ హబ్ తదితర విభాగాలు జీజీహెచ్లో ఉన్నాయి. వీటన్నింటికి తగ్గట్టుగా సరైన సెక్యూరిటీ, అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కేవలం మాతాశిశు ఆరోగ్య కేంద్రంతోపాటు ఇతర వార్డుల్లో మాత్రమే 25 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుతో ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి. ఆస్పత్రి ఆవరణలో లేని సీసీ కెమెరాలు జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రికి నిత్యం వేల సంఖ్యలో రోగులతోపాటు వారి సహాయకులు, వైద్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, ఇతరులు వస్తుంటారు. ఆస్పత్రిలో భద్రత పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రధాన గేట్లు, ఇతర పరిసరాలను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాల అవసరం చాలా ఉంటుంది. కానీ జీజీహెచ్ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు జీజీహెచ్లో మెడికల్ కళాశాల ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆస్పత్రి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెడికల్ కళాశాల నూతన భవనంలోకి మారిన తరువాత.. ఆస్పత్రి ఆవరణతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 25 సీసీ కెమెరాలను కళాశాల అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది దీంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రతపై నిఘా లేకుండా పోయింది.ఫ రాత్రి వేళ రెచ్చిపోతున్న దొంగలు ఫ భద్రత లోపం కారణంగానే ఇటీవల బాలుడి కిడ్నాప్ ! ఫ వరుస ఘటనలతో భయాందోళనలో రోగులు సెల్ఫోన్లు, పర్సులు మాయం.. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆస్పత్రిలో రాత్రిపూట దొంగలు రెచ్చిపోతున్నారు. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్ఫోన్లు, పర్సులతోపాటు బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలను దొంగిలించిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రిలోని టన్నుల కొద్ది పాత ఇనుప సామగ్రి దొంగిలించారు. అదేవిధంగా ఆస్పత్రి ఆవరణలో ఎవరుపడితే వారు రాత్రిపూట నిద్రించడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇన్పేషంట్ల వరకు మాత్రమే నిఘా ఏర్పాటు చేసి ఆస్పత్రి ఆవరణలో ఉన్న వారిపై ఎలాంటి నిఘా ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నెల 4న బాలుడి కిడ్నాప్ సంఘటన నిఘా లోపం కారణంగానే జరిగిందని పేర్కొనవచ్చు. ఇకనైనా ఆస్పత్రి వర్గాలు స్పందించి జీజీహెచ్లో సరైన భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై దరఖాస్తుదారులకు వివరణ ఇవ్వాలని.. పరిష్కారం కాకపోతే.. ఎందుకు కావటం లేదో తెలియజేయాలన్నారు. ప్రజావాణికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన కేసుల పరిష్కారంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇన్చార్జి డీఆర్ఓ అశోక్రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలను నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి వేడుక నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు పాల్గొన్నారు. శ్రీచక్రతీర్థం.. మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు సాయంత్రం ప్రధానాలయంలో నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో దోఽషములు జరిగితే తొలగించేందుకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. శ్రీస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వేడుక దోపు మహోత్సవం.వీటిని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఫ తుది ఘట్టానికి చేరిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు -
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వేములపల్లి(మాడ్గులపల్లి) : మూసీ ఎడమకాల్వ పరిధిలోని ఆయకట్టులో పంటలు ఎండిపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలోని పాములపాడు గ్రామంలో ఎండిపోతున్న వరి పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు కింద మాడ్గులపల్లి, వేములపల్లి, తిప్పర్తి మండలాల రైతులు ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడులు పెట్టి సాగు చేశారని.. చివరి దశలో పంట ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చివరి భూములకు నీరందించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించిన సాగునీటిని అందించాలని, ఇప్పటికే ఎండిపోయిన పొలాలకు ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డబ్బికార్ మల్లేష్, పాదూరి గోవర్ధని, పాదూరి శశిధర్రెడ్డి, రొండి శ్రీనివాస్, పతాని శ్రీను, తంగెళ్ల నాగమణి, అయితగాని విష్ణు, చింతచెర్ల శ్రీను, పిండి వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి, అల్గుబెల్లి వెంకట్రెడ్డి, గంగయ్యరావు, వెంకట్రెడ్డి, పద్మ పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
నల్లగొండ
ఇఫ్తార్ 6–30 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 5–05 (బుధవారం ఉశ్రీశ్రీ)7మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025మార్కెటింగ్ వ్యవస్థాపకుడి అరెస్ట్ నాసిరకం వస్తువులను అమ్మి సొమ్ము చేసుకుంటున్న మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యవస్థాపకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. - 8లోనిరుద్యోగ యువతే టార్గెట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని పోలీసులు రిమాండ్కు తరలించారు. - 8లో -
నిరుద్యోగ యువతే టార్గెట్..
సూర్యాపేట టౌన్ : నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కె. నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. తాను డీఎస్పీ అని చెప్పుకుంటూ పలువురిని పరిచయం చేసుకొని అమాయకులైన నిరుద్యోగ యువతకు పోలీస్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టించాడు. కోదాడలో ఒక అమ్మాయికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ.36లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఏపీలోని మార్టూర్కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని, గురజాలకు చెందిన మరో వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు. కోదాడకు చెందిన అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీగ్రాండ్ హోటల్ వద్ద శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.18లక్షల నగదు, కారు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై గతలంలో పలు కేసులు ఉండగా.. 2022లో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చినట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ పీవీ రాఘవులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, పట్టణ సీఐ పీవీ రాఘవులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు -
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
మునుగోడు: గొర్రెలను మేపేందుకు వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం మునుగోడు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన చిరగోని బాలమ్మ(58) మునుగోడులో నివాసముంటున్న తన కుమారుడు వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తోంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొర్రెలను మేతకు తోలుకుని వెళ్తుండగా.. మునుగోడు మండల కేంద్రం శివారు కమ్మగూడెం సమీపంలోని చొల్లేడు రోడ్డులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమె ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుమారుడు చిరగోని లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం రామన్నపేట: అప్పుల బాధతో కౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సిరిపురం గ్రామానికి మోటె నర్సింహ(50) కొన్నేళ్లుగా గ్రామశివారులో పద్నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలంలో వరితో పాటు పత్తి సాగు చేశాడు. ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో సగానికి పైగా వరి పొలం ఎండిపోయింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ఆందోళన చెందసాగాడు. సోమవారం ఉదయం స్థానిక శివాలయానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం పొలం చూడడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పుల ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై పురుగులమందు తాగాడు. అనంతరం ఇంటికి తిరిగివచ్చి మంచంపై పడుకొని వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నర్సింహ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆరున్నరేళ్లకు.. అంతిమ తీర్పు
పకడ్బందీగా దర్యాప్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కేసులో 1600 పేజీల్లో చార్జిషీట్ ఫ కేసులో ప్రధాన పాత్రధారి అబ్దుల్బారి ఫ కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీ ఫ ఏ2 సుభాష్కుమార్ శర్మకు ఉరి.. మిగతా ఆరుగురికి జీవిత ఖైదురామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో ఆరున్నరేళ్లకు అంతిమ తీర్పు వచ్చింది. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కోర్టులో చార్జిషీటు సమర్పించారు. ఈ కేసులో ఏ1 తిరునగరు మారుతిరావు, ఏ2 సుభాష్కుమార్శర్మ, ఏ3 మహ్మద్ అజ్గర్అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్బారి, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాం నిందితులుగా ఉన్నారు. అందులో ఏ3 మహ్మద్ అజ్గర్అలీకి కరడుగట్టిన నేరచరిత్ర ఉంది. ఈ హత్యలో అజ్గర్అలీ, సుభాష్కుమార్ శర్మకు ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి అబ్దుల్బారీ. అబ్దుల్ బారీనే కరడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీని రంగంలోకి దింపాడు. గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో అజ్గర్ అలీ నిందితుడు. వీరిలో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్కుమార్ శర్మకు కోర్లు ఉరిశిక్ష.. మిగతా ఆరుగురు నిందితులకు జీవితఖైదు విధించింది. 102 మంది సాక్షుల విచారణ ఈ కేసులో మొత్తం చార్జిషీట్ను 1600 పేజీల్లో రూపొందించి నల్లగొండ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సమర్పించారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఏ స్థాయిలో ఉంది.. ఎవరెవరు ఏ విధంగా సహకరించారనే అంశాలను 63 పేజీల్లో పొందుపర్చారు. బిహార్కు చెందిన కిల్లర్ సుభాష్కుమార్శర్మతో డీల్ కుదిర్చింది ఎవరు..? అతడిని మిర్యాలగూడకు రప్పించి వసతులు సమకూర్చింది ఎవరు..? సుపారీలో ఎవరి వాటా ఎంత..? అతనికి ఏ విధంగా సహకరించారు..? హత్య అనంతరం సుపారీ కిల్లర్ ఎలా పారిపోయాడు..? ఎవరు సహకరించారు..? అనే కోణంలో విచారణ సాగింది. ప్రణయ్ హత్యను ప్రత్యక్ష, పరోక్షంగా చూసిన 102మంది సాక్షులను పోలీసులు విచారించి వారి వాంగ్మూలాన్ని చార్జిషీట్లో రికార్డు చేశారు. దీంతో పాటు ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ను సమకూర్చారు. ఇదీ దోషుల పాత్ర.. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృతవర్షిణికి 2018 జనవరి30 న ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహాన్ని అమృతవర్షిణి తండ్రి ఏ1 మారుతీరావు జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ప్రణయ్ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రణయ్ని చంపాలన్న విషయాన్ని తన మిత్రుడు, మిర్యాలగూడ మున్సిపల్ వార్డు కౌన్సిలర్, ఏ5 అయిన అబ్దుల్ కరీంకు చెప్పాడు. వారు ఇద్దరు చర్చించుకొని ఏ4 మహ్మద్ అబ్దుల్బారీని మారుతీరావుకు పరిచయం చేశాడు. ప్రణయ్ను హత్య చేసేందుకు మారుతీరావుకు మహ్మద్ అబ్దుల్బారి మధ్య రూ.కోటి సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్గా రూ.15 లక్షలు ఏ5 మహ్మద్ కరీం, మారుతీరావు కారు డ్రైవర్ ఏ7 సముద్రాల శివ ద్వారా అబ్దుల్ బారికి అప్పజెప్పాడు. డబ్బులు తీసుకున్న తర్వాత అబ్దుల్ బారి.. ప్రణయ్ను హత్య చేయాలని ఏ3 అజ్గర్అలీకి, అంతకు ముందు రాజమండ్రి జైల్లో పరిచయం ఉన్న ఏ2 శుభాష్కుమార్శర్మకు చెప్పాడు. వీరికి ఆటోడ్రైవర్ అయిన ఏ8 ఎంఏ.నిజాం సహకరించాడు. ముగ్గురూ కలిసి ప్రణయ్ను హత్య చేసేందుకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. 2018, సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చెకప్ కోసం ప్రణయ్, అమృతవర్షిణి, ప్రణయ్ తల్లి ప్రేమలత వెళ్లారు. ఇంటి వద్ద నుంచే ప్రణయ్ ప్రయాణించే కారును వారు అనుసరించారు. వారికంటే ముందుగానే సుభాష్కుమార్శర్మ, అజ్గర్ అలీ టూ వీలర్పై, ఆటో డ్రైవర్ ఎంఏ.నిజాం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చూపించుకుని ప్రణయ్, అమృత, ప్రేమలత తిరిగి వస్తున్న క్రమంలో సుభాష్కుమార్శర్మ కత్తితో ప్రణయ్పై దాడి చేశాడు. హత్య చేసిన తర్వాత సుభాష్కుమార్శర్మ, అజ్గర్అలీ, ఏంఏ నిజాం పారిపోయారు. ఆ తర్వాత ఏ1 మారుతీరావు, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్కు.. ఏ7 సముద్రాల శివ సూర్యాపేటలోని బావ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఈ హత్యలో ఏ6 శ్రవణ్కుమార్ నగదు సమకూర్చాడు. ప్రత్యక్షంగా హత్యకు పాల్పడిన ఏ2 శుభాష్కుమార్శర్మకు మరణశిక్ష విధించగా, మిగిలిన ఆరుగురికి జీవితఖైదు పడింది. -
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత
తిరుమలగిరి(నాగార్జునసాగర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులు సోమవారం విడుదల చేయగా.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మందడి నాగార్జునరెడ్డి, అల్లి కీర్తన ఉద్యోగాలకు అర్హత సాధించారు. మందడి నాగార్జునరెడ్డి 2006 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. 2011లో అసిస్టెంట్ ట్రైబేల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికై కొద్దికాలం పనిచేసిన తర్వాత అదే ఏడాదిలో విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్గా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యి 488 మార్కులతో అర్హత సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం..బోయగూడెం గ్రామానికే చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు దంపతుల కుమార్తె అల్లి కీర్తన మొదటి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాల్లో ఆమె జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై ంది. గ్రూప్–1 ఉద్యోగానికి 468.5 మార్కులతో అర్హత సాధించింది. గుండెపురి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న భూక్య సందీప్ 468.5 మార్కులతో గ్రూప్–1కు అర్హత సాధించారు. -
ప్రతీ గురువారం ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ : వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నల్లగొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు వారి సమస్యలను గురువారం నిర్వహించే ప్రజావాణిలో తమను కలిసి తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదలనల్లగొండ : 2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 331 మంది గైర్హాజరునల్లగొండ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లిష్ పేపర్–2కు సంబంధించి మొత్తం 13,136 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,805 మంది హాజరయ్యారు. 331 మంది గైర్హాజరయ్యారు. మూడు లిఫ్టులకు పరిపాలన ఆమోదంనల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫుల నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. నల్లగొండ నియోజకవర్గంలోని పొనుగోడు, బక్కతాయికుంట, నర్సింగ్బట్ల లిఫ్టుల నిర్మాణం చేపట్టనున్నారు. వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్లోని ఔట్పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్ను డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్నారంగ్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులను సమర్పించాలినల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో 2020–2021 నుంచి 2023–2024 విద్యా సంవత్సరం బీసీ, ఈబీసీ ఉపకార వేతనాలు, పీజు రీయింబర్మెంట్ మంజూరు కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు అందజేయకపోతే.. ఉపకార వేతనాల మంజూరు విషయంలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేయని బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ నెల 31లోగా ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పిల్లల ప్రవర్తనను గమనించాలి
నల్లగొండ టౌన్: పిల్లల ప్రవర్తనను గమనించాలి. చదువుతో పాటు వారు ఏమి చేస్తున్నారు... ఎక్కడికి వెళుతున్నారు.. ఎలాంటి స్నేహం చేస్తున్నారు అనే దాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. ఒకవేళ ప్రేమలో పడితే వారి కుటుంబ నేపథ్యం, వారి స్థితిగతులు తెలుసుకోవాలి. అన్ని సక్రమంగా ఉంటే పిల్లల అభిప్రాయాన్ని అంగీకరించాలి. లేకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కుటుంబ నేపథ్యమైతే ప్రేమ వివాహాలను అంగీకరించడంలో తప్పులేదు. – పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ -
కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ
తీర్పులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరు భేష్ ప్రణయ్ హత్య అనంతరం తండ్రి బాలస్వామి మిర్యాలగూడ వన్టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు కేసు వాదించేందుకు దర్శనం నరసింహను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రోసిక్యూటర్ బలమైన సాక్షాధారాలు సేకరించారు. నిందితుల ఫోన్కాల్ డేటా, లోకేషన్, సీసీ టీవి ఫుటేజీలను సేకరించి.. 472 పేజీల లిఖిత పూర్వక రిపోర్టును కోర్టుకు సమర్పించారు.● ఏ2 సుభాష్కుమార్శర్మకు మరణశిక్ష ● ఏ3 నుంచి ఏ8 వరకు ఆరుగురికి జీవితఖైదు ● తీర్పుకోసం భారీగా తరలివచ్చిన ప్రజాసంఘాల నాయకులు ● కన్నీటి పర్యంతమైన నిందితుల కుటుంబీకులు ● కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తురామగిరి(నల్లగొండ): సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నల్లగొండ కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు, రెండవ అదనపు జడ్జి ఎన్.రోజారమణి సోమవారం అంతిమ తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 2018న ప్రణయ్ హత్యకు గురికాగా.. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ విచారణ జరిపి హత్య కేసులో ప్రమేయం ఉన్న 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. నరసింహ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అనదపు జడ్జి ఎన్.రోజారమణి ఏ2 సుభాష్కుమార్శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా లేదా 4 నెలల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురు ఏ3 అజ్గర్అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు రూ.10 వేల జరిమాన లేదా 4 నెలల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు అమృవర్షిణి తండ్రి తిరునగరు మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా.. అజ్గర్అలీని అహ్మదాబాద్ సబర్మతి జైలుకు, శుభాష్కుమార్శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా తరలిన వచ్చిన ప్రజా సంఘాలు, ప్రజలు.. ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాన్య ప్రజలు నల్లగొండ కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచిచూశారు. నిందితుల కుటుంబాల కన్నీటి పర్యంతం.. హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి శిక్ష పడింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో తిరునగరు శ్రవణ్కుమార్ కూతురు శృతి బోరున విలపించింది. తన తండ్రికి ఎలాంటి నేరం చేయలేదని అయినప్పటికీ శిక్ష పడిందంటూ కన్నీరు పెట్టుకుంది. వీరితో పాటు మిగతా నిందితుల కుటుంబ సభ్యులు కూడా కోర్టు వద్ద, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అనంతరం వాహనంలో తరలిస్తున్న క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు ప్రాంగంలో పోలీసుల భారీ బందోబస్తు.. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో నల్లగొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, సిబ్బందిని, కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. -
పిల్లల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సూర్యాపేట: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రవర్తన, నడవడికను గమనిస్తూ.. తప్పడగులు వేస్తున్నారని తెలిస్తే దండించకుండా ఏది చేడు, ఏది మంచి అనే విషయాన్ని వారు గ్రహించే విధంగా అవగాహన కల్పించాలి. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారి గూర్చి పిల్లలకు వివరించాలి. పిల్లలతో స్నేహంగా మెలగాలి, పిల్లల సెల్ఫోన్ను గమనిస్తూ ఉండాలి. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అంశాలకు దూరంగా ఉంచాలి. పిల్లలు ఎప్పుడు బిజీగా ఉండే విధంగా చదువుతో పాటు వ్యాయామం, డ్యాన్స్, చిత్రలేఖనం వంటి వాటిని నేర్పించాలి. – బొల్లెద్దు వెంకటరత్నం, న్యాయవాది -
జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : తల్లిదండ్రులు పిల్ల ల ప్రేమను ప్రోత్సహించొద్దు. ముందుగా తమ పిల్లలను సక్రమంగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నా చంపడం, దాడులు చేయడం, కేసులపాలు కావడం మంచి పద్ధతి కాదు. ప్రతిష్టకు పోయి వారి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. సామరస్యంగా రెండు కుటుంబాలు కలిసి సమస్య పరిష్కరించుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వారిని సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేయాలి. వారి ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే గమనించి వారు సరైన రీతిలో ఉండేలా తల్లిదండ్రులు సూచనలు చేయాలి. – డాక్టర్ సుబ్బారావు, మానసిక వైద్య నిపుణుడు, నల్లగొండ -
పిల్లల కోరిక మన్నించి వివాహాలు చేయాలి
మిర్యాలగూడ: పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు వారి కోరికను మన్నించి పెళ్లిళ్లకు అనుమతించాలి. కులం, పరువు ప్రతిష్టలు అనే అహంకారంతో హత్యలకు పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తించించాలి. చట్ట ప్రకారం మేజర్లు అయితే పిల్లలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత సమాజం వైపు అడుగులు వేయాలి. పిల్లలు కూడా సినిమా, టీవీల ప్రభావంలో ఆకర్షణలకు లోనై అదే ప్రేమ అనుకొని తల్లిదండ్రులను శత్రువులుగా చూసే వైఖరిని మానుకోవాలి. తల్లిదండ్రులను ఒప్పించి పెద్దలను మెప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. – కస్తూరి ప్రభాకర్, సామాజికవేత్త, మిర్యాలగూడ -
విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని కల్గిఉండేలా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలి. హైస్కూల్ విద్య నుంచే తమ కుటంబ నేపథ్యం, వారి స్థాయిని పిల్లలకు తెలిసేలా చేయాలి. సమాజంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. లక్ష్యం మీదనే ఫోకస్ చేసేలా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడాలి. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించే వారు ఏవిధంగా సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉంటున్నారో వివరించాలి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. – తల్లమల్ల హుస్సేన్, పూర్వపు ప్రభుత్వ న్యాయవాది, సూర్యాపేట -
తొలితరం కవి రావిరాల బుచ్చయ్య మృతి
చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన తొలితరం కవి, రచయిత రావిరాల బుచ్చయ్య(75) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్లో మృతి చెందారు. ఆయన ఆర్టీసీ సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో విరసం ఆవిర్భావ సభ్యుడిగా, ఆ సంఘం నల్లగొండ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 1964లో ‘సిందు రామవ్వ’ నవలను, 1977లో ‘విముక్తి పథం’ అనే గ్రంథంతో పాటు అనేక కవితలు, కథలు, పలు రచనలు రాశారు. అంతేకాకుండా ఆయన టీవీ ఆర్టిస్టుగా, నాటకకర్తగా ఉన్నారు. ఆయన మృతి పట్ల సృజన సాహితి అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, కవులు, రచయితలు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, దర్శనం అంజయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, వట్టిమర్తి గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నర్రా లవేందర్రెడ్డి, బూరుగు రమేష్ సంతాపం తెలిపారు. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్యభూదాన్పోచంపల్లి: మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెం గ్రామానికి చెందిన బుగ్గ ప్రవీణ్ (25) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మృతుడి తల్లిదండ్రులు తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి వెళ్లారు. ప్రవీణ్ ఉదయం పొలంవద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఒంటరికి ఉన్న ప్రవీణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన అతడి అన్న ప్రభాకర్ ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రవీణ్ ఉరివేసుకుని కనిపించాడు. కాగా.. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికంది వచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యాదగిరి క్షేత్రంతో గరిమెళ్లకు అనుబంధంయాదగిరిగుట్ట: టీటీడీ ఆస్థాన సంగీత విధ్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుపతిలోని ఆయన నివాసంలో ఆదివారం మృతి చెందారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఇటీవల పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను తన బృందంతో ఆలపించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించారని పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను గుర్తు చేసుకున్నారు. అంతుచిక్కని వ్యాధితో గేదె మృతిభూదాన్పోచంపల్లి: మండలంలోని మామిళ్లగూడెం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో గేదెలు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం పర్సమోని అనసూయకు చెందిన గేదె తలను నేలకు బాదుకుని మృతి చెందింది. అంతేకాక పర్సమోని కమలమ్మ, బొడ్డు ఎల్లమ్మకు చెందిన గెదేలు సైతం వ్యాధిసోకి వింతగా ప్రవర్తిస్తున్నాయని బాధితులు తెలిపారు. గేదెలు తలను నేలకు గట్టిగా గుద్దుకొంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు. వారం రోజులుగా గడ్డిమేయడంలేదని, పగలు, రాత్రివేళల్లో నిద్రపోవడంలేదని చెబుతున్నారు. పశువైద్యాఽధికారులను సంప్రదించగా.. వారు మందులు ఇచ్చినా తగ్గడం లేదని వాపోయారు. ఇలా అంతుచిక్కని వ్యాధితో గేదెలు మృతి చెందుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. -
జనశక్తి సీనియర్ నేత కన్నుమూత
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో నివాసం ఉంటున్న సీనియర్ జనశక్తి రాష్ట్ర నాయకుడు చీటూరి సోమయ్య(85) అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన స్వగ్రామం జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధర్మాపురం. సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో సోమయ్య క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మృతదేహనికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అరుణోదయ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, టీపీసీసీ నేత దైద రవీందర్, బీసీపీ జిల్లా కార్యదర్శి గాజుల సుకన్య, ట్రస్మా రాష్ట్ర నేత కందాల పాపిరెడ్డి, జనశక్తి నేత కోమరయ్య, న్యూడెమోక్రసీ నేతలు ఇందురు సాగర్, అంబటి చిరంజీవి తదితరులున్నారు.