ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరు మృతి
బత్తలపల్లి(అనంతపురం జిల్లా):
బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు మదనపల్లి నుంచి గుంతకల్లు వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నాగరాజు(35), మస్తాన్(37) ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ దుర్ఘటనలో బోయ శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.