narsipatnam mla
-
సస్పెన్స్ లవ్ స్టోరీ
హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం మొదలైంది. ఈ చిత్రంతో చిరుమామిళ్ల కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ ఇచ్చారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ–‘‘నేను ఇదివరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుంది. నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్రైమ్, సస్పెన్స్, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అన్నారు చిరుమామిళ్ల కృష్ణ. -
‘వైఎస్ జగన్కు రుణపడి ఉంటాను’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్రెడ్డికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు. ‘‘ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను వైజాగ్లో ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టీవీలో రిజల్ట్స్ చూస్తున్నాం. ఎందుకంటే నా తమ్ముడు ఉమా శంకర్ గణేష్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఫలితాలు ఎంతో టఫ్గా ఉంటాయని ఊహించిన మాకు వార్ వన్ సైడ్ అయ్యేసరికి మతిపోయింది. ఏపీ ప్రజలందరూ సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుని జగన్నే ఎన్నుకుందాం అని కూడబలుక్కొని ఓట్లు వేసినట్లు అనిపించింది. ఇన్ని కోట్లమంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్నవిషయం కాదు. హ్యాట్సాఫ్ టు జగన్ మోహన్రెడ్డిగారు. జగన్ మోహన్రెడ్డిగారు చేసింది ఒకరోజు ఎలక్షన్ కాదు. పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా, శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహం నింపుతూ, రాజన్న ఎత్తున్న తల్వార్ పట్టుకుని పదేళ్ల పాటు రణరంగంలో నిల్చున్న యోధుడు జగన్. విజయం సాధించిన తర్వాత ఆయన మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయగర్వం లేదు. ప్రశాంతంగా ఉన్నాడు. రాజన్న కుమారుడు అనిపించుకున్నాడు. వై.ఎస్.జగన్ ఒక వారియర్. దైవ నిర్ణయం, ప్రజానిర్ణయం వల్ల ఈ విజయం వచ్చిందని ఆయన తన మాటల్లో చెప్పాడు. కానీ ప్రజానిర్ణయం దైవనిర్ణయం కంటే గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. కాని ప్రజలు తలుచుకుంటే దేవుడ్ని మార్చగలరు. ప్రజలంతా సమైక్యంగా జగన్గారికి మొక్కేశారు. నా తమ్ముడికి జగన్గారంటే ప్రాణం. ఆయన ఫొటో చూసినా, వీడియో చూసినా ఎగై్జట్ అవుతాడు. ఓ సూపర్స్టార్లా చూస్తాడు. వాడు అలా ఎందుకు చూస్తాడో నాకిప్పుడు అర్థమవుతోంది. గత ఎన్నికలలో నా తమ్ముడు ఓడిపోయినా, భుజం తట్టి, చేయి పట్టుకుని మళ్లీ యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని వాడికి అందించిన జగన్ మోహన్రెడ్డిగారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. నేను రాజకీయాలలో లేను. కానీ నాకు పోరాట యోధులంటే ఇష్టం. నా దృష్టిలో జగన్ అంటే ఒక లయన్ కింగ్ -
గంటాకు స్నేహ'పాత్రుడ్ని'
శత్రువులను మిత్రులుగా... మిత్రులను శత్రువులుగా మార్చే మహత్తు ఒక్క కాలానికే ఉంది. అందుకే శాశ్వత శత్రుత్వం, కానీ శాశ్వత మిత్రత్వం కానీ ఉండదని అంటారు.విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యనపాత్రుడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికి సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోకి తీసుకున్నారు. దాంతో ఆ ఇద్దరి నేతల మధ్య గొడవలు సద్దుమణిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం తన చిరకాల ప్రత్యర్థి గంటా శ్రీనివారావుతో కలసి పని చేస్తాంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించేశారు. దాంతో గతంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒక్కరు దుమ్మొత్తి పోసుకున్న సంగతి గుర్తు చేసుకుంటూ ఇరు నాయకుల అనుచరగణం చెవులు కొరుక్కుంటున్నారు. అసలు కథలోకి వద్దాం ...టీడీపీ స్థాపించిన నాటి నుంచి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే కొనసాగారు. నర్సీపట్నం నుంచి పలుమార్లు అసెంబ్లీకి, ఒక్కసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖకు వలస వచ్చారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్లో కాంట్రాక్ట్ పనులు చేపట్టి అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదగారు. 1999లో గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. అదే సంవత్సరం అనకాపల్లి నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) స్థాపించారు. దాంతో టీడీపీకి గుడ్ చెప్పి గంటా పీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిరంజీవి కొన్ని షరతులతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దాంతో గంటా వారి స్టార్ గణగణమంటు మోగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ఓడరేవులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల శాఖను గంటా నిర్వహించారు. కాగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మళ్లీ గంటా గాలి టీడీపీ వైపు మళ్లీంది. అందుకోసం గంటా తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. టీడీపీలో చేరేందుకు గంటాకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. అంతలో గంటా పార్టీలోకి తీసుకోవడానికి వీలేదంటూ అయ్యన్నపాత్రడు సైంధవుడిలా బాబు కాళ్లకు అడ్డుపడ్డారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదలి వెళ్లిన వారిని... మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ అయ్యన్నపాత్రుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును నిలదీశాడు. గంటా పార్టీలోకి వస్తే తాను పార్టీకి నీళ్లు వదలాల్సి ఉంటుందంటూ చంద్రబాబును అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి అయ్యన్నపాత్రుడ్ని సముదాయించారు. అయినా అయ్యన్నపాత్రుడు మెత్తబడలేదు. సరికద ఎన్నికలు... ఎన్నికల ఫలితాల తర్వాత కూడా గంటా అంటే అయ్యన్నపాత్రుడు తోకతొక్కిన తాచులా అంత ఎత్తు లేచేవాడు. అయితే చంద్రబాబు తన కేబినెట్లోకి గంటాను మాత్రమే తీసుకుంటాడని తనను తీసుకోరని అయ్యన్నపాత్రుడు ఒకానొక దశలో నిరాశకు లోనయ్యారు. అయితే చంద్రబాబు కేబినెట్లో గంటాతోపాటు తనకు చోటు దక్కడంతో అయ్యన్నపాత్రుడు తెగ ఖుషీ అయిపోయాడు. దాంతో రాష్ట్రాభివృద్ధికి గంటాతో కలసి పనిచేస్తాంటూ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. -
రేపు వైఎస్సార్సీపీలోకి నర్సీపట్నం ఎమ్మెల్యే