prashanth karthi
-
వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది: ప్రశాంత్ కార్తి
పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘పోతుగడ్డ’. ఈ సినిమాకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్గా పని చేసిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్లో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.కెమెరామెన్ రాహుల్ ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కావాలని అన్నారు. ఆ లుక్ కోసం ట్రై చేశాం. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను జుట్టు తీసేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఆఫర్ పోయినట్టే అనుకున్న టైంలో డైరెక్టర్ రక్ష నుంచి కాల్ వచ్చింది. నా ఒరిజినల్ లుక్ని చూసి బాగుంది.. ఇదే ఫైనల్ చేద్దామని అన్నారు. అలా నా లుక్ ఇందులో చాలా నేచురల్గా కనిపిస్తుంది.పోతుగడ్డ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. సినిమా ఆరంభం, ముగింపులో తన పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను. ఇక ఇందులో నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి వారు ప్రశంసించడం ఆనందంగా ఉంది.పోతుగడ్డ షూటింగ్ మొత్తం కూడా నైట్ టైంలోనే జరిగింది. అది కూడా పూర్తి చలికాలంలోనే షూటింగ్ చేశాం. అంతటి చలిలోనూ మా టీంకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా నిర్మాత అనుపమ గారు, మా దర్శకులు రక్ష గారు ఎంతో చక్కగా చూసుకున్నారు.టీం అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. ఆర్టిసుల్ని, టెక్నీషియన్లి మా నిర్మాత గారు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. టీంను ఆమె సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. శ్రవణ్ భరద్వాజ్ గారి పాటలు, మార్కస్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటోంది.పోతుగడ్డ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాలు ఉంటాయి. రాజకీయం చుట్టూ కథ తిరిగినా కూడా ఓ అందమైన ప్రేమ కథను ఇందులో చూపించారు. ఎక్కడా బోర్ కొట్టించుకుండా అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది.రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చేస్తున్నాను. దాని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి. -
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
‘అనంత’మూవీ రివ్యూ
టైటిల్: అనంత నటీనటులు: ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి, అనీష్ కురువెళ్ళ, గెడ్డం శ్రీనివాస్, లయ సింప్సన్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రినేత్ర క్రియేషన్స్ నిర్మాత : ప్రశాంత్ కార్తీ దర్శకత్వం: మదు బాబు తోకల సంగీతం: ఘంటశాల విశ్వనాథ్ విడుదల తేది: జూన్ 9, 2023 ‘అనంత’ కథేంటంటే.. రదేశ్(ప్రశాంత్ కార్తి) ఒక ప్రొఫెసర్. ప్రతి పదేళ్లకు ఒక్కసారి అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్లిపోతుంటాడు. అలా ప్రస్తుతం అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్తున్న క్రమంలో అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన సైటిస్టులు ప్రద్యుమ్న( అనీష్ కురువెళ్ళ), ధర్మా(గెడ్డం శ్రీనివాస్), శృతీ(రిత్తిక చక్రవర్తి) తదితరులు రదేశ్ ఇంటికి వస్తారు. అసలు ఈ యూనివర్సీటీ నుంచి ఎందుకు వెళ్తున్నావని రదేశ్ని ప్రశ్నించడంలో అసలు కథ ప్రారంభం అవుతుంది. రదేశ్ 15 వేల సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి. అతనికి మరణం ఉండడు.. వయసు పెరగదు. అతని వయసు గుర్తించేలోపు ఆ ప్రదేశం నుంచి వెళ్లి పోతుంటాడు.ఇదంతా ఆ సైంటిస్టులకు వివరిస్తాడు రదేశ్. అసలు రదేశ్ ఎవరు? నిజంగానే అతను 15 వేల సంవత్సరాల క్రితం పుట్టాడా? ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రద్యుమ్నకు రదేశ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే అనంత సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మధుబాల. ఈ విషయంలో దర్శకుడు కాస్త సఫలం అయ్యాడు. మరణం లేని పాత్ర అనేది మనం పురాణాల నేపథ్యంలో తెరకెక్కే సినిమాల్లోనే చూశాం. కానీ ఇక్కడ ఒక సాధారణ కథలో అలాంటి పాత్ర పరిచయం చేయడం ఇదే తొలిసారి. స్టార్ ట్రెక్ రచయిత జెరోం బిక్స్బీ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రొఫెసర్కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అతని సహచరులు తెలుసుకున్న కొన్నిఆసక్తి కర విషయాలు ప్రేక్షకులను ఆకట్టు కుంటాయి. అయితే వాటిని మాటల్లో కాకుండా విజువల్స్గా తెరపై చూపించి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేవి. ఫస్టాఫ్ మొత్తం సైంటిస్టులు ప్రశ్నలు అడగడం.. ప్రొఫెసర్ జవాబు చెప్పడం ఇలానే సాగుతుంది. ఈ క్రమంలో చరిత్ర గురించి హీరో చెప్పే కొన్ని విషయాలు ప్రేక్షకులకు జ్ఞానాన్ని అందిస్తాయి. ఆసక్తి రేపే కొన్ని అంశాలతో సెకండాఫ్ సాగుతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు ఆర్కే రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రొఫెసర్ రదేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.డాక్టర్ ప్రద్యుమ్న పాత్ర లో అనీష్ కురువెళ్ళ, ధర్మా గా గెడ్డం శ్రీనివాస్ లు తమ సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. శృతిగా రిత్తిక చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఘంటశాల విశ్వనాథ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సిద్దు సొంసెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.