12 మంది వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం దేవస్థానంలో కలకలం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో 12 మంది వ్రత పురోహితులను ఈఓ కె. నాగేశ్వరరావు మంగళవారం సస్పెండ్ చేశారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించకపోవడం, వి«ధులకు గైర్హాజరవడం వంటి అభియోగాలపై ఈ చర్య తీసుకున్నారు. దేవస్థానంలో ప్రతి పురోహితుడు విధిగా కట్టు, బొట్టు, శిఖ ధరించాలని 2 నెలల క్రితం ఈఓ ఆదేశించారు. కొంతమంది వ్రత పురోహితులు దీనిని పాటించడంలేదు. దీంతో అన్ని వ్రత మండపాలకూ ఈఓ మంగళవారం తిరిగి ఆ పురోహితులను గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా రు. సస్పెండైన పురోహితులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.