ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్టణం: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. ఒడిశా నుంచి నేరుగా కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉన్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ద్రోణి ఫలితంగా శని, ఆదివారాల్లో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.