Top Stories
ప్రధాన వార్తలు
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా? అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటూ మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని టీడీపీ వారు భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూసే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్తను బహిరంగంగా, పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది.గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు. వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీ వారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక.. ఇప్పుడు తనకు ఏమీ కాదులే.. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది.ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. ఆ ప్రకారం ఇప్పుడు మర్డర్లు చేసినవారికి మంత్రి హోదా ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఏపీలో పోలీసు యంత్రాంగం ఎంత అసర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా? అనేది తెలియచేస్తుంది.తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట. అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్సీపీ ది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు.ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే, ఆ పార్టీవారు వైఎస్సార్సీపీ వారిని కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం, ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా? లేక రైతులు అంటారా? టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పాతిక మందికిపైగా హత్యకు గురయ్యారు. 1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవలు, హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది. అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా, ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం.బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది. గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో, ఏమో చూడాలి. తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వారిని కొట్టామని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయారు. సుమారు 500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేకపోవడం. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది.టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గత ప్రభుత్వ టైమ్లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్సీపీ వారిని మెడలు పిసికాలని, కొట్టాలని.. ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇందిరాగాంధీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటే, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు.రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఏపీలో అరాచకాలపై పార్లమెంట్లో గళమెత్తాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘వినుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్… వైన్షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. కాలిన బైక్.. వైఎస్సార్సీపీ వాళ్లది, దీనికి సంబంధించిన కేసు కూడా నమోదయ్యింది. దాన్ని ట్విస్ట్ చేసి… నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మా కొడుకు ఏం తప్పుచేశాడని రషీద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వైఎస్ జగన్ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయిదీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారుఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉందిలోకేష్ పుట్టినరోజున హతుడు ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపించిన ఫొటోలు హంతకుడి ఫొటోలను తల్లిదండ్రులు చూపారుస్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారుతన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్రెడ్డిపై దాడులు చేశారుటీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్చేసి దాడులు చేశారుమాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారుతప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి15 సంవత్సరాలగా వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఉందిచంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కలేరుజరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయిరాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలిచంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలిపోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదురేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారుబుధవారం నాడు నిరసన తెలుపుతాంరాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాంఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలిజరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందిఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్మెంట్లను కోరాను.ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు:అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా?ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదుప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలిఅన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలిరాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచికాదుప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయిబుధవారం ధర్నా అయిన తర్వాత లోక్సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలిపార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలిఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్ జగన్ ఆదేశంఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈకార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశంగత ఎన్నికల్లో మనం 86శాతం సీట్లను గెలిచాంఅయినా ఇలాంటి ఘటనలు జరగలేదువైఎస్సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాందాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదుప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాంప్రజలిచ్చిన వాగ్దానాల అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశందీనిపై ఎవ్వరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశంఅందుకే దగ్గరుండి వీటిని ప్రోత్సహిస్తున్నారుపార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యంఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యతఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలికార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలిరాష్ట్రంలో వైయస్సార్సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారువారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందిమన పోరాటం ద్వారా గట్టి ఒత్తిడి తీసుకురావాలి
గవర్నర్ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్ వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో మాధవన్ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్ నుంచి మాధవన్ మళ్లీ తన సాధారణ లుక్కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..? 400కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్డీఆర్బిట్ వెహిహికిల్(యూఎస్డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..?అసలు ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్ఎస్ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఐఎస్ఎస్ ఏంటి.. ఎందుకు..?అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్లు 1998 నుంచి 2011వరకు శ్రమించి ఐఎస్ఎస్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీనే ఐఎస్ఎస్ కమిషన్ అయింది. అప్పటినుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్ఎస్ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్ఎస్ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్ రీసెర్చ్లో 24 ఏళ్లుగా ఐఎస్ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.డీ కమిషన్ చేయడం ఎందుకు..?ఐఎస్ఎస్ నింగిలో పనిచేయడం ప్రారంభించి 2030నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్ఎస్ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్ఎస్లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్ఎస్ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయాలని నిర్ణయించారు.ఎలా కూలుస్తారు..?ఐఎస్ఎస్ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్డీఆర్బిట్ వాహనాన్ని నాసా వాడనుంది. 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్ వెహికిల్ నింగిలోకి వెళ్లి ఐఎస్ఎస్తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్ ఐలాండ్లలో పడేలా చేస్తారు. డీఆర్బిట్ వెహిహికల్ ఎలా పనిచేస్తుంది..సాధారణంగా ఐఎస్ఎస్కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్ కాప్స్యూల్స్తో పోలిస్తే డీఆర్బిట్ వెహికిల్ యూఎస్డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్ ఉంటుంది. డీ ఆర్బిట్ వెహికిల్ ఐఎస్ఎస్ డీ కమిషన్కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్ఎస్ డీ ఆర్బిట్ అవనుందనగా యూఎస్డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దీంతో ఐఎస్ఎస్ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.ఐఎస్ఎస్ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? ఐఎస్ఎస్ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్ అమెరికాకు లేదు. ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్ స్టేషన్లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్ కంపెనీల స్పేస్ స్టేషన్లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్ వెహికిల్ను వాడి ఐఎస్ఎస్ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్ బీ కూడా నాసాకు ఉండటం విశేషం.
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘క్రౌడ్స్ట్రయిక్’ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. అనేక కంపెనీలు, విమానాశ్రయాలను తాకిన భారీ ఐటీ అంతరాయం కారణంగా క్రౌడ్స్ట్రయిక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.యూఎస్లో ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్లో దాని విలువలో ఐదవ వంతును కోల్పోయాయి. అనధికారిక ట్రేడింగ్లో 21% తగ్గాయి. ఫలితంగా క్రౌడ్స్ట్రయిక్ వాల్యుయేషన్లో దాదాపు 16 బిలియన్ డాలర్ల (రూ.1.34 లక్షల కోట్లు) నష్టానికి దారి తీస్తుంది.మైక్రోసాఫ్ట్ విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని క్రౌడ్స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు.
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ-టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తలను సానియా తండ్రి ఖండిస్తూ ఓ క్లారిటీ ఇచ్చినప్పటకి.. ఎదో ఒక చోట వీరిద్దరూ పెళ్లి ప్రస్తావన వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మహ్మద్ షమీ స్పందించాడు. ఇటీవలే శుభంకర్ మిశ్రా అనే యూట్యూబర్కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురుంచి వస్తున్న పుకార్లపై షమీని శుభంకర్ మిశ్రా ప్రశ్నించాడు."ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సానియాతో నా పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలి. మీ సరదా కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు చేస్తుంది సరైనది కాదు. ఆ మధ్య కాలంలో నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అవే మీమ్ప్ కనిపించేవి. మీమ్లు అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. అంతే తప్ప అబద్దాలను ప్రచారం చేయడానికి కాదు. ట్రోలర్స్, మీమర్స్కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.దయచేసి వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఒకరి వ్యక్తిగత జీవితాన్నిఇంకొకరితో ముడివేస్తూ వారిని బజారుకి లాగవద్దు. మీకు దమ్ము ఉంటే ఇలాంటి పోస్టులను గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కాకుండా నిజమైన అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయండి.అప్పుడు నేను ఏమి సమాధానం చెప్పాలో అదే చెబుతా. దయచేసి ఎటువంటి వికృత చేష్ఠలు మానుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నంచండి. మీ వంతు ప్రజలకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడే మీరు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించగలరు" అని షమీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కాగా షమీ ఇప్పటికే తన భార్య హసిన్ జహాన్కు విడాకులు ఇవ్వగా.. సానియా కూడా తన భర్త షోయబ్ మాలిక్తో విడిపోయింది.
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో చోటు చేసుకుంది.వివరాలు.. కేరళకు చెందిన నాలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత వారిలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయింది.Four members of a #Malayali family died in a fire accident at their residence in Abbasiya, #Kuwait. The deceased are Mathew Muzhakkal, his wife Lini Abraham, and their children Isaac and Irene, all hailing from Thiruvalla, #Kerala.The fire broke out in the second-floor… pic.twitter.com/AAa8K7jZqz— South First (@TheSouthfirst) July 20, 2024మృతి చెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరు కేరళలో అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వారు కేరళ వచ్చి.. శుక్రవామరే అక్కడివెళ్లారు. అంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కుటుంబం మొత్తం మృతి చెందటంపై తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కనీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఇంట్లోని ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువును పీల్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక.. గతనెల ఓ అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా.. 45 మంది భారతీయులేనని అధికారలు గుర్తించారు. ఇందులో కేరళ, తళమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది.
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.
సినీ ఫ్యాన్స్కు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మూవీ టికెట్స్, ఓటీటీలపై పన్ను
భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్.. మహిళ మృతి
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఆర్.నారాయణ మూర్తికి కేటీఆర్ ఫోన్
ఎక్స్లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్ అభినందనలు
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?
గవర్నర్ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్పై ఫిర్యాదు
థేమ్స్ నదిలా మూసీ డెవలప్మెంట్: సీఎం రేవంత్
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
తాడిపత్రిలో హై టెన్షన్
ఏపీలో అరాచకాలపై పార్లమెంట్లో గళమెత్తాలి: వైఎస్ జగన్
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?: ఎంపీ మిథున్రెడ్డి
సినీ ఫ్యాన్స్కు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మూవీ టికెట్స్, ఓటీటీలపై పన్ను
భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్.. మహిళ మృతి
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఆర్.నారాయణ మూర్తికి కేటీఆర్ ఫోన్
ఎక్స్లో 10 కోట్ల ఫాలోవర్లు.. మోదీకి మస్క్ అభినందనలు
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?
గవర్నర్ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్పై ఫిర్యాదు
థేమ్స్ నదిలా మూసీ డెవలప్మెంట్: సీఎం రేవంత్
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
తాడిపత్రిలో హై టెన్షన్
ఏపీలో అరాచకాలపై పార్లమెంట్లో గళమెత్తాలి: వైఎస్ జగన్
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం ... రూ.1.34 లక్షల కోట్ల నష్టం!
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?: ఎంపీ మిథున్రెడ్డి
సినిమా
శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్గా నటిస్తున్న ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)
‘గురువాయూర్ అంబలనడియాల్’ మూవీ రివ్యూ
పెళ్ళైతే ఓ కిక్కు, అదే పెళ్ళవ్వాలంటే పెద్ద చిక్కు అన్న భావంతో అల్లుకున్న హాస్యభరిత చిత్రం గురువాయూర్ అంబలనడియాల్. పృధ్విరాజ్, బసిల్ జోసెఫ్, నిఖిల్ విమల్ వంటి భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా మళయాళ మాతృక అయినా తెలుగు డబ్బింగ్ తో హాట్ స్టార్ లో చూడవచ్చు. ఓ సున్నితమైన పాయింట్ తో ఆద్యంతం వినోదభరితం ఈ సినిమా. కథా పరంగా దుబాయ్ లో ఉంటున్న విను రామచంద్రన్ కు కేరళ లో ఓ సంబంధం కుదురుతుంది. అది కూడా గురువాయుర్ టెంపుల్ లో పెళ్ళి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. ఎక్కడైనా పెళ్ళి కుదిరితే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఇష్టపడి మాట్లాడుకుంటారు. కాని ఈ కథలో పెళ్ళికూతురి అన్నతో పెళ్ళికొడుకు ప్రేమగా ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇక్కడ పెళ్ళికూతురు అన్న ఆనందన్ పాత్రలో పృధ్విరాజ్ పోషించారు. పెళ్ళి కోసం ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన విను రామచంద్రన్ పెళ్ళి కూతురి అన్నను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు.అయితే సదరు అన్న గారి భార్య ఈ పెళ్ళికొడుకు మొదట ప్రేమించిన అమ్మాయని తెలుస్తుంది. ఆ షాక్ తిన్న పెళ్ళికొడుకు కి ఏ విధమైన సమస్యలు ఎదుర్కున్నాడు, ఈ విషయం తెలిసిన పెళ్ళికొడుకు అన్న ఎలా స్పందించాడు, అసలు ఆ పెళ్ళి అయిందా లేదా అన్నది హాట్ స్టార్ ఓటిటి లోనే చూడాలి. వీకెండ్ కి ఓ మంచి కాలక్షేపభరితమైన సినిమా గురువాయూర్ అంబలనడియాల్. గో వాచ్ ఇట్.-ఇంటూరు హరికృష్ణ
సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్
సూపర్స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అతడి ఫ్యామిలీ కూడా గుర్తొస్తుంది. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్-సితార కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. గౌతమ్ పెద్దగా కనిపించడు గానీ సితారకి మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా అందరూ విషెస్ చెబుతున్నారు. కానీ పేరెంట్స్ మహేశ్-నమ్రత కాస్త ప్రత్యేకంగా చెప్పారు.(ఇదీ చదవండి: మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్తో కలిసి!)మహేశ్ కూతురు సితార తాజాగా 12వ వసంతంలోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలోనే తండ్రి మహేశ్ బాబు హార్ట్ఫుల్గా విషెస్ చెప్పాడు. క్యూట్ ఫొటో పోస్ట్ చేసి.. 'హ్యాపీ 12 మై లిటిల్ వన్ సితార. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్ డ్ సన్ షైన్' అని మహేశ్ బాబు రాసుకొచ్చాడు.తల్లి నమ్రత కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది సితార ఫొటోలని కలిపి ఓ వీడియోగా చేసి మరీ కూతురికి పుట్టినరోజు విషెస్ చెప్పింది. 'హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ట్రావెల్ కంపానియన్. ఎన్నో దేశాలు, మర్చిపోలేని గుర్తులు. నీ వల్ల ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ ఆల్వేజ్' అని నమ్రత తన ప్రేమని అక్షరాలుగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రి కొత్త సినిమా ఎలా ఉందంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh)
'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.కథేంటి?చెఫ్గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఎలా ఉందంటే?వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లేతోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్లో ప్రధాన పాత్రధారులు ఇద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ)
క్రీడలు
సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్ షమీ
టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ-టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తలను సానియా తండ్రి ఖండిస్తూ ఓ క్లారిటీ ఇచ్చినప్పటకి.. ఎదో ఒక చోట వీరిద్దరూ పెళ్లి ప్రస్తావన వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మహ్మద్ షమీ స్పందించాడు. ఇటీవలే శుభంకర్ మిశ్రా అనే యూట్యూబర్కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురుంచి వస్తున్న పుకార్లపై షమీని శుభంకర్ మిశ్రా ప్రశ్నించాడు."ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సానియాతో నా పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలి. మీ సరదా కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు చేస్తుంది సరైనది కాదు. ఆ మధ్య కాలంలో నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అవే మీమ్ప్ కనిపించేవి. మీమ్లు అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. అంతే తప్ప అబద్దాలను ప్రచారం చేయడానికి కాదు. ట్రోలర్స్, మీమర్స్కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.దయచేసి వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఒకరి వ్యక్తిగత జీవితాన్నిఇంకొకరితో ముడివేస్తూ వారిని బజారుకి లాగవద్దు. మీకు దమ్ము ఉంటే ఇలాంటి పోస్టులను గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కాకుండా నిజమైన అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయండి.అప్పుడు నేను ఏమి సమాధానం చెప్పాలో అదే చెబుతా. దయచేసి ఎటువంటి వికృత చేష్ఠలు మానుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నంచండి. మీ వంతు ప్రజలకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడే మీరు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించగలరు" అని షమీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కాగా షమీ ఇప్పటికే తన భార్య హసిన్ జహాన్కు విడాకులు ఇవ్వగా.. సానియా కూడా తన భర్త షోయబ్ మాలిక్తో విడిపోయింది.
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్: భజ్జీ ఫైర్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్కు అదరి పోయే కౌంటరిచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్పై హర్భజన్ మండిపడ్డాడు.ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహ్మద్ రిజ్వాన్లలో ఎవరు బెటర్ అన్న పోల్ను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైరయ్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భయ్యా అతడికి ఎవరైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్ను అడిగినా అతడు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనినే నంబర్ వన్. వికెట్ల వెనక ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్లో భజ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్లో ధోని కంటూ ఒక ప్రత్యేకస్ధానముంది.భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024
ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. ఇప్పుడు నాపై మరింత బాధ్యత ఉంది: సూర్యకుమార్
టీ20ల్లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న సస్పెన్స్కు తెరపడింది. భారత టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. జూలై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్తో భారత కెప్టెన్గా సూర్యకుమార్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని మరి సూర్యకు భారత జట్టు పగ్గాలు బీసీసీఐ అప్పగించింది. ఇక కెప్టెన్గా ఎంపికయ్యాక తొలిసారి సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని, మద్దతుగా నిలుస్తున్న అభిమానులందరికి సూర్య ధన్యవాదాలు తెలిపాడు."మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడని. నాకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజుల నుంచి అంత కలగానే ఉంది. దేశం కోసం ఆడటం ఎల్లప్పుడూ నా దృష్టిలో ప్రత్యేకమే. భారత జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఫీలింగ్ వేరు. మాటల్లో వర్ణించలేని ఓ అనుభూతి. కొత్త పాత్రను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. నాపై ఇక నుంచి చాలా బాధ్యత ఉంటుంది. ఎప్పటిలాగే ఇక ముందు కూడా మీ నుంచి నాకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆ దేవుని దయకూడా నాపై ఉందంటూ సూర్య సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
మేజర్ లీగ్ క్రికెట్-2024లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీకి హెడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్లో భాగంగా శనివారం ఉదయం టెక్సాస్ సూపర్ కింగ్స్తో మ్యాచ్లో హెడ్ విధ్వంసం సృష్టించాడు.సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్ నుంచే సూపర్ కింగ్స్ బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 2 సిక్స్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో హెడ్తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(57), ఓబుస్ పియెనార్(33) పరుగులతో రాణించారు.అసలేంటి ఈ మేజర్ లీగ్ క్రికెట్?తమ దేశంలో క్రికెట్ను అభివృద్ది చేసేందుకు అమెరికా క్రికెట్ ఆసోయేషిన్ ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించింది. తొట్ట తొలి సీజన్ గతేడాది జూలై 13 నుంచి 30 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ రెండో సీజన్. మొత్తం ఈ క్రికెట్ లీగ్లో ఆరు జట్లు పాల్గోంటున్నాయి.ఇందులో సీటెల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో ఎంఐ న్యూయర్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంజైలు ఐపీఎల్ యాజమాన్యంకు సంబంధించినవే గమనార్హం.
బిజినెస్
క్యూ1లో విప్రో ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు. 12,000 మందికి చాన్స్ ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది. షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది.
పెన్షన్ ఫండ్స్కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లలో లిస్ట్ కాని స్టార్టప్లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్ఫోలియో బిజినెస్కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
RBI: బ్యాంకింగ్లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్అండ్వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు.
ఫ్యామిలీ
హాయిగా నిద్రపోతున్నారా?
చిన్న పిల్లలకి నిద్ర చాలా ముఖ్యం. సుఖమైన నిద్ర వారి ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాదు.. వారిలో రోగనిరోధక శక్తిని, మేధాశక్తిని పెంచుతుంది. ⇒నిద్రకు ఒక సమయాన్ని కేటాయించడం మంచిది. ఇది వాళ్ళ స్లీప్ సైకిల్ని క్రమబద్ధపరచడమే కాకుండా పిల్లల్ని మరింత శక్తిమంతంగా తయారు చేస్తుంది. వేళకు పడుకోవడం.. లేవడం అందరికీ అవసరమే. ⇒సుఖ నిద్రకు ప్రతిరోజూ చేసే క్రమానుసార పనులు ఎంతగానో దోహదపడతాయి. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పెంపుదలకు దోహదపడుతుంది.⇒పడుకునే ముందు స్నానం చేయడం, పళ్లు తోముకోవడం, నైట్ డ్రెస్ వేసుకోవడం, కథలు వింటూనో, చెబుతూనో నిద్ర΄ోవడం.. పిల్లలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, వారికి బంధాల పట్ల గౌరవ మర్యాదలు పెరగడానికీ ఉపకరిస్తుంది. ⇒పరిపూర్ణ నిద్రకి, పడకగదికి అవినాభావ సంబంధం ఉంది. పరిశుభ్రమైన పడకగది ఆరోగ్యమైన నిద్రతో పాటు అన్నిరకాల అనారోగ్యాలనూ దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ గాడ్జెట్స్ను, టివీ వంటి వాటిని పడకగదిలో లేకుండా చేయడం ద్వారా మగతనిద్రను దూరం చేయవచ్చు. ⇒పడుకునే ముందు జంక్ ఫుడ్ తినడం, కాఫీ తాగడం నిద్రాభంగం కలిగిస్తుంది. వీలైనంత వరకూ రాత్రి భోజనంలో పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం, పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే తినడం మంచిది.
పిల్లలకు బహుమతిగా ఇచ్చినా తిరిగి తీసుకోవచ్చు...
పిల్లలు ఎదిగేంతవరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డాక ఇంకా ఈ బరువు బాధ్యతలు ఎందుకు... ప్రశాంతంగా వారి వద్ద గడిపేద్దాంలే అని ఉన్న ఆస్తులను వారికే పంచేస్తారు.కానీ, ఆస్తులను పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తులను తీసుకొని, ఇంటినుంచి గెంటేస్తే.. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో తరచూ వృద్ధులకు సంబంధించి వచ్చిన వార్తల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటోంది. వృద్ధుల ఆస్తులకు సంబంధించి రక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయో... తెలుసుకుందాం.మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలోని జెండా బజారుకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఉన్న మూడెకరాల భూమిని కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని కూలగొట్టి తల్లికి గూడు లేకుండా చేశారు. ఆస్తి పంచుకునే ముందు కొడుకులు నెలకు ఒకరి చొప్పున అమ్మను సాకుతామని ఒప్పందం చేసుకున్నారు. తీరా ఆస్తి పంచిన తర్వాత అసలు అమ్మ విషయాన్నే గాలికి వదిలేశారు. దాంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారిలో దయగల తల్లి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని, ఎవరో ఒకళ్ల ఇంటి అరుగులపై తలదాచుకోవలసి వస్తోందా వృద్ధురాలు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్, ఆస్తిని తీసుకుని తల్లిని వదిలేసిన కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని ΄ోషించాలని, లేదంటే ఆమె పంచి ఇచ్చిన యావదాస్తిని తిరిగి తల్లికి చెందేటట్లుగా చేస్తామని వారిని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007లోని (సీనియర్ సిటిజన్స్ యాక్ట్) సెక్షన్ 23(1) తల్లిదండ్రుల ఆస్తిని రక్షిస్తుంది. మోసాన్ని నిరోధించి, ్రపాథమిక సౌకర్యాలను కోల్పోకుండా పరి రక్షిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా ఈ హక్కులపై సీనియర్ సిటిజన్స్కు అవగాహన అంతంత మాత్రమే. సీనియర్లు తమ ఆస్తిని పంచి ఇచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్ ద్వారా ఆస్తి బదిలీని రద్దు చేసుకునే ఆవకాశంఉంది. ఆస్తిని తిరిగి ΄పోందవచ్చు... తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచించే వయోవృద్ధులైన తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ డీడ్లో ఒక ఎక్స్ప్రెస్ షరతును చేర్చవచ్చు. ఆస్తిని బహుమతిగా తీసుకున్న పిల్లలు ఈ షరతును ఉల్లంఘిస్తే, ఆ బహుమతి చెల్లుబాటు కానిదిగా ప్రకటించి, తల్లిదండ్రులు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. తల్లిదండ్రులు ప్రేమ, ఆ΄్యాయతతో లేదా సేవలకు బదులుగా పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని సూచించవచ్చు. అయితే, అస్పష్టతకు తావు లేకుండా ఎక్స్ప్రెస్ షరతును చేర్చడం ఉత్తమం అని పేర్కొన్నాయి. ఇంటినుంచి తరిమివేయవచ్చుసీనియర్ సిటిజన్ల ఆస్తుల నుంచి పిల్లలు లేదా ఆస్తి తీసుకున్న బంధువులను తొలగించడానికి సుప్రీం కోర్టుతో సహా కోర్టులు అనుమతించాయి. చట్టబద్ధమైన వారసులమనే కారణంతో తల్లిదండ్రులను వేధిస్తే ఇంటినుంచి బయటకు పంపివేయవచ్చని కూడా ఆదేశించింది. ముఖ్యమైన గమనికలు⇒ ఆస్తిలో ఆర్థిక పెట్టుబడులు, కాపీరైట్లు, పేటెంట్లు, ఆభరణాలు, కళాఖండాలు మొదలైనవి ఉండచ్చు. ∙ఆస్తుల వివరాలతో΄ాటు బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, ఎమ్ఎఫ్లు, షేర్లు, ఎఫ్డీలు, బీమా పాలసీలు, లోన్లు.. మొదలైన వాటి జాబితా కోసం న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదింపు అవసరం. అందుకని వారి వివరాలను తీసుకోండి. వారసత్వం, ఆస్తుల ప్రణాళికలో కీలకమైన భాగం వీలునామాను రూపోందించడం. దాని చెల్లుబాటును నిర్ధారించడానికి కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి... ఆస్తులకు సంబంధించిన వివరాలు, కంపైల్ చేయాల్సిన సమాచారంలో ఇద్దరు సాక్షులను, ఒక ఎగ్జిక్యూటార్ని నియమించుకోవాలి. ⇒వీలునామాలో మీ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వారి పేర్లను విధిగా నమోదు చేయాలి. లేకుంటే తర్వాత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. అవగాహన అవసరంవృద్ధుల రక్షణ చట్టం గురించి అవగాహన మన దేశంలో చాలా మందికి లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులు కూడా తమ సమస్యను చట్టం దృష్టికి తేవాలి. ఆస్తులు లేక΄ోయినా వృద్ధ తల్లిదండ్రులు మెయింటనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.– ఎ.పి.సురేష్, సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్
ఆషాఢంలో అల్ల నేరేడు
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, ఆషాఢంలో ఎండ వేడిమి తగ్గి, శరీరం నుంచి చెమట రూపంలోనూ, మూత్రం రూపంలోనూ నీరు అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సీజన్లో నేరేడు పండు తినడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరిగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో పాఠాలుగా చదువుకుంటాం. దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, వాతావరణంలోని మార్పులకు దేహం సరయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడుని ఔషధంలా ఉపయోగించాలని, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే విషపదార్థాలను బయటకు పంపించడానికి నేరేడు మంచి మందనీ. దానిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ గ్రహించాలి. నేరేడు మనకు ఇంకా ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ⇒ చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.⇒పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.⇒రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.⇒మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.⇒నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.⇒వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.⇒జిగట విరేచనాలతో బాధపడే వారు నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున తాగితే రోగికి శక్తి రావడంతో΄ాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.⇒కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.⇒ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.⇒జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.⇒మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.⇒పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.వీరు తినకూడదు..అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతో΄ాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది.
హెల్దీ డైట్: వీట్ గ్రాస్ స్మూతీ
కావలసినవి: తాజా పండ్ల ముక్కలు – కప్పు (అరటి, మామిడి లేదా బెర్రీలు); వీట్ గ్రాస్ పోడర్– టేబుల్ స్పూన్; పాలకూర– కప్పు; బాదం పాలు లేదా పండ్ల రసం – కప్పు; తేనె – టేబుల్ స్పూన్.తయారీ: పండ్ల ముక్కలు, పాలు, వీట్ గ్రాస్ పోడర్, పాలకూర, తేనె అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేస్తే వీట గ్రాస్ స్మూతీ రెడీ. పిల్లలు బాగా ఇష్టపడతారు. పోషకాలు: విటమిన్ ఏ, సీ, కే, ఈ...లతోపాటు ఫోలేట్, పోటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. సుమారుగా 250 కేలరీలు, ప్రోటీన్ 4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 50 గ్రాములు, ఫైబర్– 6 గ్రాములు, చక్కెరలు– 35 గ్రాములు, ఫ్యాట్– 3 గ్రాములు.ప్రయోజనాలు: ఈ స్మూతీలో ఆల్మలైన్ప్రోపర్టీస్ ఎక్కువ. ఇవి దేహంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు రక్తాన్ని, కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. వ్యాధి నిరోధక శక్తి వృద్ధి అవుతుంది. ఇందులో ఉపయోగించే పాలకూర వంటివి సేంద్రియ ఎరువులతో పండినవైతే మంచిది. రసాయన ఎరువులతో పండిన ఆకులు ఉపయోగించేటట్లయితే ఆకులను ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రం చేయాలి.
ఫొటోలు
తెలుగమ్మాయే కానీ తమిళంలో సూపర్ ఫేమస్.. డైరెక్టర్ని పెళ్లి చేసుకుని (ఫొటోలు)
ఉపాసన పుట్టినరోజు స్పెషల్.. మెగా ఫ్యామిలీ కోడలా మజాకా! (ఫొటోలు)
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫొటోలు)
Sitara Ghattamaneni: సితార బర్త్డే స్పెషల్.. అందంలో తండ్రిని మించిపోతుందేమో! (ఫొటోలు)
రొట్టెల పండుగ : భక్తజనంతో పరవళ్లు తొక్కిన స్వర్ణాల తీరం (ఫొటోలు)
National View all
విమానంలో మహిళ పట్ల జిందాల్ స్టీల్ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ
జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆర
సినీ ఫ్యాన్స్కు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మూవీ టికెట్స్, ఓటీటీలపై పన్ను
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా అభిమానులకు
భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్.. మహిళ మృతి
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జ
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
International View all
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..?
అలర్ట్: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్కు కొండచరియల ముప్పు
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి.
మరో కరోనా వేవ్.. జపాన్లో పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు.
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ
NRI View all
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో విషాదం చోటు చేసుకుంది.
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.
క్రైమ్
15 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీల నుంచి సేకరించిన గంజాయిని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో14 మందిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్.వి.రాజశేఖరబాబు ఆదేశాలతో ఈ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. యాంటి నార్కోటిక్ సెల్, టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను విజయవాడ కమాండ్కంట్రోల్ రూంలో విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు.ప్రధాన నిందితుడు పింక్రౌత్..పోలీసుల అదుపులో నున్న 14మంది గంజాయి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన పింకి రౌత్ను అరెస్ట్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతా లైన బరంపురం, పీలేరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వ్య క్తుల నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు సరఫరా చేయడంలో పింక్రౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని డీసీపీ హరికృష్ణ తెలిపారు.ఇతనిపై గతంలో మాచవరం పోలీస్స్టేషన్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. విజయవాడ సిటీ, చుట్టుపక్కలనున్న పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్ మణికంఠ, సంకేలి గణేష్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్ మొహమ్మద్ గౌస్ అబ్దుల్ హబీబ్, విజయవాడ అజిత్ సింగ్నగర్కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్కు చెందిన కొమ్ము రాకేశ్, విజయవాడ భవానీపురానికి చెందిన పాలెటి మమతరాజు, మహమ్మద్ ముజ్జమిల్ సుల్తాన్, షేక్ నజీర్, మత్తే నాని, ఇల్లురి మధుసూదన్రెడ్డి, కృష్ణలంకకు చెందిన అడపాల వంశీ, అమన్సింగ్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిందరిపై గతంలో అనేక కేసులు నమోదయినట్లు చెప్పారు. నిందితుల నుంచి 90.5 కేజీల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రజలు 91211 62475కు గంజాయి సమాచారం ఇవ్వాలని ప్రజ లను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి, సీఐలు నాగేంద్రకుమార్, శ్రీధర్, రమేష్ పాల్గొన్నారు.
గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు
తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్సీపీ నేతలేనని.. లిక్కర్పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభుత్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు.
HYD: యూట్యూబర్ ప్రణీత్ హన్మంతుపై గంజాయి కేసు
సాక్షి,హైదరాబాద్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై గoజాయి కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసినందుకుగాను ప్రణీత్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.ప్రణీత్ గంజాయి సేవించినట్టు తాజాగా మెడికల్ రిపోర్ట్లో తేలింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్లను పోలీసులు జోడించారు. ఇప్పటికే ప్రణీత్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నాడు. ఇతడిని మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
వినుకొండలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15 మంది వరకు రషీద్ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు. రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు. అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.
వీడియోలు
ఇదేం పాలన పాక్ చంద్రబాబు.. తప్పు సరిచేసుకో..
అర్జంటుగా దాడులు ఆపాలి.. లేదంటే? చంద్రబాబుకు వార్నింగ్
35 రోజుల చంద్రబాబు పాలన.. విజయానందరెడ్డి ఫైర్
కొనసాగుతున్న భేటీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
వరదతో ఎర్రకాలువ ఉగ్రరూపం 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
TGPSC ప్రక్షాళన చేశాం..
నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ
Political Corridor: తెలంగాణలో కొత్త సంప్రదాయం.. ప్రాణ భయంతో పార్టీలు మారుతున్నారా..?
ఏలూరు జిల్లాలో మంత్రి పార్థసారథికి చేదు అనుభవం
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది... రాష్ట్రపతి పాలన విధించాలి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక విధానాలను వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్