retire teacher
-
తపాలా: ...అయితే నేను కూడా స్కూల్ నుంచి రిటైర్ అవుతా!
మా వారు డిగ్రీ కాలేజ్లో ఎకనామిక్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. మాకొక బుజ్జి మనవడున్నాడు. మా అబ్బాయి కొడుకు. వాడికిప్పుడు నాలుగో సంవత్సరం. మేం ఎంత చెప్పినా వినకుండా వాడిని మూడు సంవత్సరాలు పూర్తవగానే వాళ్ల నాన్న స్కూల్లో చేర్చాడు. ఇక చూడండి, రోజూ ఏడుపు స్కూల్కి వెళ్లటానికి. ఏడుస్తూ స్కూల్కెళ్లి నవ్వుతూ ఇంటికొచ్చేవాడు. ‘హమ్మయ్య ఈ రోజుకి స్కూల్ అయిపోయింది’ అనుకుంటూ కాబోలు. ఇంట్లో వాడి ముద్దు మాటలకి, చిలిపి పనులకి అలవాటు పడిన మాకు చాలా వెలితిగా ఉండేది, వాడు స్కూల్కెళ్లిపోయినప్పుడు. ఒకరోజు వాళ్ల నాన్న వాడిని బయటికి తీసుకెళ్లాడు. మావారి కాలేజీ ముందు నుండి వస్తూ, ‘‘ఇదుగోరా నాన్నా, తాతగారు ఇక్కడే పనిచేసేవారు, ఈ కాలేజీలోనే. రోజూ వచ్చేవారు ఇక్కడికి’’ అని చెప్పాడంట. ‘‘మరి ఇప్పుడు రావటం లేదే. ఇంట్లోనే ఉంటున్నారెందుకు?’’ అని అడిగాడట వీడు. అందుకు వాళ్ల నాన్న, ‘‘తాతగారు రిటైర్ అయిపోయారు. అందుకని ఇంక కాలేజీకి రానక్కరలేదు. అందుకే ఇంట్లోనే ఉంటున్నారు’’ అన్నాడట. అది విని వెంటనే మా మనవడు, ‘‘డాడీ! నేను కూడా రిటైర్ అయిపోతాను తాతగారిలాగా. రేపటి నుండి స్కూల్కెళ్లను’’ అన్నాడట. ఇంటికొచ్చి అది చెప్పి మా అబ్బాయి ఒకటే నవ్వు! - కె.హేమలత, కాకినాడ ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, భీతిగొల్పిన సందర్భాలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు, వారు రాసే చిట్టిపొట్టి కవితలు, వేసే రంగురంగుల చిత్రాలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు పంపడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
ముగ్గుల పోటీలకు విశేష స్పందన
కల్లూరు రూరల్, న్యూస్లైన్: కర్నూలు నగరం మాధవనగర్ పార్కులో వైఎస్ఆర్సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. 250 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కువ మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముగ్గులు వేసిన మహిళల జీవితం కూడా రంగులమయం కావాలని ఆకాంక్షించారు. మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేవారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ముగ్గుల పోటీ కార్యక్రమం మధ్యాహ్నం దాకా కొనసాగింది. పోటీలకు హాజరైన వారందరికీ నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారు. కళాకారుడు రంగ స్టేజీ ప్రదర్శనలు అలరించాయి. వైఎస్సార్సీపీ కల్లూర్ అర్బన్ సిటీ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ పాతపాడు శ్రీనాథ్, జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ రాకేశ్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు వై.రామయ్య, రిటైర్డు టీచర్ ఆర్థర్ తదితరులు నిర్వాహకులుగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, బుడ్డా శైలజ, పెరుగు వేణుకళావతి, పాతపాడు వీణ, కాకర్ల సులోచన ముఖ్యఅతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు. సూర్యకుమారి, మణిమంజరి, డాక్టర్ విజయలక్ష్మి, ఇందిరాశాంతి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలు వీరే... హైమావతి (టోకన్ 11) మొదటి స్థానం, గౌతమి (2), శ్రీకళ (118) ద్వితీయస్థానం, ఎం.వెంకటలక్ష్మి (26), డి.వేదవతి (266), సంధ్య (400)లు మూడో స్థానంలో నిలిచారు. విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శ్రీమఠంలో సినీ నటుడు వేణుమాధవ్ మంత్రాలయం, న్యూస్లైన్: శ్రీరాఘవేంద్రుల దర్శనార్థం సినీ హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబ సమేతంగా శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చనలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుంచి రాఘవేంద్రుల మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 550 సినిమాల్లో నటించానన్నారు. సంప్రదాయం సినిమాతో రంగప్రవేశం చేశానన్నారు. దిల్, లక్ష్మీ, సింహాద్రి సినిమాలు నటుడిగా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్తేజ్ నటిస్తున్న రేయ్, రుద్రమదేవి సినిమాలతో పాటు 12 కొత్త సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. ఆయనతోపాటు మఠం పీఆర్వో విష్ణుతీర్థ, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు ఉన్నారు.