సమ్మెతో అందని బ్యాంకు సేవలు
యాలాల: ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా చేపట్టిన బ్యాంకుల సమ్మె కారణంగా మండలంలో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని ఎస్బీహెచ్తోపాటు జుంటుపల్లి ఆంధ్రా బ్యాంకు, లక్ష్మీనారాయణపూర్లోని దేనాబ్యాంకు తదితర బ్యాంకులు మూసేశారు. ఈ విషయం తెలియని వినియోగదారులు, అకౌంట్ హోల్డర్లు బ్యాంకు లావాదేవీల కోసం మండల కేంద్రానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.