ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
పిడుగురాళ్ల(గుంటూరు): ప్రేమించుకుంటున్న యువతీయువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన షేక్ మౌలాలి (24), ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమల(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం మౌలాలి బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయాడు.
ఇతను ఓ ప్రై వేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. మౌలాలికి ఇటీవలే వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన అమల పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.