ఎస్బీహెచ్ ‘శుభ్లాభ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) చిన్న, మధ్యస్థాయి వ్యాపారుల కోసం ‘శుభ్ లాభ్’ పేరుతో ప్రత్యేక రుణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ‘ఎస్బీహెచ్ ఎంఎస్ఎంఈ మార్టిగేజ్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.