s.senthilkumar
-
పోలీసుల తప్పేమి లేదు
నెల్లూరు(క్రైమ్): అనంతసాగరం మండలంలోని మల్లెంకొండ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో పోలీసుల తప్పేమి లేదని ఎస్పీ ఎస్.సెంథిల్కుమార్ అన్నారు. తప్పు చేశారు కాబట్టే ఫారెస్ట్ వాచర్లను అరెస్ట్ చేశామని వెల్లడించారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఈ నెల 27వ తేదీ రాత్రి అనంతసాగరం ఎస్సై పుల్లారావు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఓ టాటా మేజిక్ వాహనంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో మఫ్టీలో ఎస్సై తన సిబ్బందితో కలిసి చిలకలమర్రి శిలల వద్దకు చేరుకున్నారన్నారు. వీరిని గమనించిన ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్స్ ఓబయ్య, మాల కొండయ్య అక్కడ నుంచి పరార య్యే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు వారిని వెంబడించగా ఓ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశారన్నారు. వాచర్లు విధుల్లో ఉంటే పోలీసులను చూసి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. వాళ్లు స్మగ్లర్లకు కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఈ ఘటనపై తాము పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే వాచర్లపై కేసు నమోదు చేశామన్నారు. స్మగ్లర్లతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయని, గుట్టు బయటపడుతుందనే పోలీ సులు అక్రమ కేసులు బనాయించారని డీఎఫ్ఓ ఆరోపించడం దారుణమన్నారు. న్యాయనిపుణులతో మాట్లాడి డీఎఫ్ఓకు లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పిదాల వల్ల ఆ శాఖను తాము తప్పుబట్టలేదన్న విషయా న్ని డీఎఫ్ఓ గుర్తుంచుకోవాలన్నా రు. ఓబయ్య అటవీశాఖలో పని చేస్తూ సర్వీసు నుంచి తొలగింపబడ్డాడని, అలాంటి వ్యక్తికి ఎలా తిరిగి వాచర్గా అవకాశం కల్పించడంపై దర్యాప్తుచేస్తున్నామన్నారు. ప్రజల చెంతకు పోలీసు పోలీసు సేవలను ప్రజల చెంతకు చేరవేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. రిసెప్షనిస్టు వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. జిల్లా అధికారి నుం చి కిందిస్థాయి సిబ్బంది వరకు గ్రా మాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సాదకబాధల్లో తోడుగా ఉంటామన్నారు. హోమ్గార్డు నుంచి అధికారి వరకు వారధి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి అక్రమ రవాణాపై దృష్టి సారించి శాంతిభద్రతలు, దొంగతనాల విషయాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ అలాంటిదేమి లేదన్నారు. చట్టవ్యతిరేకమైన ప్రతి విషయాన్ని పోలీసులు విచారించవచ్చన్నారు. చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామనీ త్వరలోనే అన్ని రకాల దొంగతనాలను నియంత్రిస్తామన్నారు. నెల్లూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీడియాపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నా రు. ఎప్పటిలాగే పోలీసుస్టేషన్కు వెళ్లవచ్చన్నారు. అయితే కేసు విచారణ ఉన్న సమయంలో నిందితుల ఫొటోలను తీయడం తగదన్నారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ బి.వి రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వై. శ్రీనివాసరావు, ఎస్బీ ఎస్సై బి. శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
వైట్కాలర్ నేరాల నియంత్రణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న వైట్కాలర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ ఎస్.సెంథిల్కుమార్ సూచించారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట ఆర్థిక నేరాలు జరుగుతున్నాయన్నారు. చీటీల పేరుతో ప్రజలు మోసపోతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసగిస్తూ కోట్ల రూపాయలు దండుకుని ఉడాయిస్తున్నారన్నారు. వీటన్నింటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులతో కఠినంగా వ్యవహరించాలన్నారు. జాతీయ రహదారులపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, అక్రమ రవాణా జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. వాహనాల తనిఖీ సమయంలో అలసత్వం ప్రదర్శిస్తే ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సిబ్బందిలో కొందరు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, పద్ధతి మార్చుకోని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన వారికి చట్టాలతో పాటు వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. కేసులు, బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలపై త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నెల్లూరులో ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు త్వరలో పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. అనంతరం హైవే తనిఖీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి మైదానంలో అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డిగంగాధర్రావు, డీఎస్పీలు బి.వి రామారావు, చౌడేశ్వరి, వీఎస్ రాంబాబు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.