t bill sent to delhi
-
పటిష్ట భద్రత మధ్య ఢిల్లీ చేరిన తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. బిల్లుతో పాటు బిల్లును తిరస్కరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అధికారులు తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు విభజన బిల్లును పోస్ట్లోనో.. కొరియర్లోనో కాకుండా.. ప్రత్యేక విమానంలో పంపుతున్నట్లు అధికారులు చెప్పారు. సచివాలయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించిన అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపారు. తొమ్మిది పెట్టెల్లో 35 బండిల్స్తో బిల్లును ఏడుగురు అధికారుల బృందం ఉదయం ఆరు గంటల సమయంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. సచివాలయ ప్రత్యేక అధికారి రామకృష్ణరావు పునర్వ్యవస్థీకరణ బిల్లును ఇండిగో ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్తారు. అనంతరం ఏడున్నర గంటలం సమయంలో మరో 20బాక్సుల్లో బిల్లు ప్రతులను పరిపాలన శాఖ అధికారి రామరాజు నేతృత్వంలో బిల్లును తరలించారు. బిల్లుతో పాటు -బిల్లును తిరస్కరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అధికారులు పంపారు. -
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టీ బిల్లు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) తెల్లవారుజామున 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లింది. బిల్లుపై సభ్యుల అభిప్రాయాల నివేదికతో పాటు ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిని కూడా అధికారులు ఢిల్లీకి పంపారు. భారీ భద్రత మధ్య ఈ బిల్లును ఢిల్లీకి తరలిస్తున్నారు. ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇందుకోసం నియమించారు. వారంతా ప్రత్యేక విమానంలో ఈ బిల్లును ఢిల్లీకి తీసుకెళ్లారు. రెండు విడతలుగా విభజన బిల్లు ఢిల్లీకి వెళ్తోంది. తొలివిడతగా 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో కొంత భాగం వెళ్లగా, మళ్లీ ఉదయం 9.40 గంటలకు మరో విమానంలో రెండో భాగం కూడా వెళ్లబోతోంది. అందులో, అసెంబ్లీలో శాసన సభ్యులు ఈ బిల్లుపై వ్యక్తం చేసిన అభిప్రాయాల నివేదిక ప్రధానంగా ఉండబోతోంది. సాధారణ పరిపాలన శాఖ నుంచి ఢిల్లీకి తెలంగాణ బిల్లుతో పాటు ఏడుగురు అధికారులు బయల్దేరారు. మొత్తం బిల్లుకు సంబంధించిన సమాచారం అంతటినీ కేంద్ర హోం శాఖకు అందజేయనున్నారు. -
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టీ బిల్లు