breaking news
tamilnadu cricket association
-
విజయ్ శంకర్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల బంధానికి ముగింపు?
దేశవాళీ సీజన్ 2025-26కు ముందు తమిళనాడు స్టార్ ఆల్రౌండర్, టీమిండియా వెటరన్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడు క్రికెట్ అసోయేషిన్తో తెగదింపులు చేసుకునేందుకు విజయ్ శంకర్ సిద్దమైనట్లు సమాచారం. రాబోయే దేశీయ సీజన్లో త్రిపుర తరపున శంకర్ ఆడనున్నాడు. ఇప్పటికే శంకర్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.అయితే అతడికి ఇంకా త్రిపుర క్రికెట్ అసోసియేషన్ నుండి మాత్రం ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో శంకర్ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 2012లో తమిళనాడు తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన శంకర్.. మూడు ఫార్మాట్లోనూ కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చాడు. శంకర్ తన 13 ఏళ్ల కెరీర్లో తమిళనాడు తరపున 328 మ్యాచ్లు ఆడి 8000 పరుగులు సాధించాడు. అదేవిధంగా 143 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడులో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొరత లేనప్పటికి శంకర్ స్దానాన్ని భర్తీ చేయడం కష్టమే అని చెప్పాలి. భారత దేశవాళీ సీజన్ 2025-26 ఆగస్టు 28 నుండి దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది. దులీప్ ట్రోఫీ తర్వాత చాలా డొమాస్టిక్ టోర్నీలు జరగనున్నాయి. ఈసారి రంజీ ట్రోఫీని కూడా రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఫస్ట్ హాఫ్ అక్టోబర్-నవంబర్ వరకు, తర్వాత రెండో దశ జనవరి-ఫిబ్రవరిలలో జరగనుంది. కాగా ఆంధ్ర స్టార్ క్రికెటర్ హనుమా విహారీ కూడా వచ్చే సీజన్లో త్రిపుర తరపున ఆడనున్నాడు.చదవండి: IND vs AUS: యో-యో టెస్టుకు రోహిత్ శర్మ..? అసలేంటి ఈ పరీక్ష? -
సాయి సుదర్శన్కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి?
టీమిండియా స్టార్ సాయి సుదర్శన్కు మరో దేశవాళీ టోర్నమెంట్కు దూరమయ్యాడు. దులిప్ ట్రోఫీ (Duleep Trophy)-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్కు బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడే జట్టులోనూ స్థానం దక్కలేదు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తాజాగా ఈ దేశీ టోర్నమెంట్కు టీఎన్సీఏ ఎలెవన్, టీఎన్సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పేరిట రెండు జట్లు ప్రకటించింది. అయితే, ఇందులో ఏ జట్టులోనూ సాయి సుదర్శన్ (Sai Sudharsan) పేరు లేదు.అంతకు ముందు సౌత్జోన్ జట్టులోనూ సాయి సుదర్శన్కు చోటు దక్కలేదు. దులిప్ ట్రోఫీ ఆడే ఈ జట్టులో సాయితో పాటు.. టీమిండియా స్టార్లు వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ పేర్లు కూడా కనిపించలేదు.ఐపీఎల్లో అదరగొట్టాడుకాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 54కు పైగా సగటుతో 759 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్-2025లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీతో పాటు ఆరు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్లను ఆకట్టుకున్న సాయి సుదర్శన్.. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆడిన సాయి ఆరంభంలోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఈ వన్డౌన్ బ్యాటర్పై వేటు వేసిన యాజమాన్యం తిరిగి నాలుగు, ఐదో టెస్టుల్లో ఆడించింది. ఈ సిరీస్లో సాయి సాధించిన పరుగులు వరుసగా.. 0, 30, 61, 0, 38, 11.ప్లాన్ అదేనా?ఇంగ్లండ్ పర్యటనలో ఈ మేర ఒక్క హాఫ్ సెంచరీ మినహా 23 ఏళ్ల సాయి సుదర్శన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీలకు అతడు దూరం కావడం గమనార్హం. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో సాయి సుదర్శన్కు సెలక్టర్లు ఆడే అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అతడికి కొన్నాళ్లు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సహా అర్ష్దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ తదితరులు దులిప్ ట్రోఫీ-2025 ఆడేందుకు సిద్ధమయ్యారు.బుచ్చిబాబు టోర్నమెంట్కు టీఎన్సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు:ఆర్.సాయి కిషోర్ (కెప్టెన్.), సి. ఆండ్రీ సిద్దార్థ్ సి (వైస్ కెప్టెన్.), బి. ఇంద్రజిత్, విజయ్ శంకర్, ఎం. షారుక్ ఖాన్, ఆర్. విమల్ కుమార్, ఎస్. రాధాకృష్ణన్, ఎస్. లోకేశ్వర్, జి. అజితేష్, జె. హేంచుదేశన్, ఎం. సిద్ధార్థ్, ఆర్.ఎస్. అంబరీష్, సి.వి. అచ్యుత్, హెచ్. త్రిలోక్ నాగ్, పి. శరవణ కుమార్, కె. అభినవ్.బుచ్చిబాబు టోర్నమెంట్ టీఎన్సీఏ ఎలెవన్ప్రదోష్ రంజన్ పాల్ (కెప్టెన్), బూపతి వైష్ణ కుమార్ (వైస్ కెప్టెన్), బి. సచిన్, తుషార్ రహేజా, కిరణ్ కార్తికేయన్, ఎస్. మహమ్మద్ అలీ, ఎస్. రితిక్ ఈశ్వరన్, ఎస్.ఆర్. అతీష్, ఎస్. లక్షయ్ జైన్, డీటీ చంద్రశేఖర్, పి. విద్యుత్, ఆర్. సోను యాదవ్, డి. దీపేష్, జె. ప్రేమ్ కుమార్, ఎ. ఎసక్కిముత్తు, టీడీ లోకేష్ రాజ్.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్ ఆఫ్రిది -
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ను వీక్షించేందుకు ఫ్యాన్స్కు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని టీఎన్సీఏ నిర్ణయించింది. ఈ మెరకు టీఎన్సీఏ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్సీఏ తెలిపింది. అదే విధంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ కూడా ఇదే వేదికలో జరగనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్కు సంబంధించిన టిక్కెట్లను కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. కాగా టీ20 సిరీస్కు కూడా C, D ,E దిగువ స్టాండ్లకు అభిమానులను ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నారు.దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ (ఫిట్నెస్కు లోబడి), రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ (ఫిట్నెస్కు లోబడి), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా, షబ్నమ్ షకీల్. -
ఎన్ శ్రీనివాసన్ 15వసారి..
చెన్నై: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) అధ్యక్షుడిగా ఎన్ శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన టీఎన్సీఏ ఏజీఏం (వార్షిక సర్వసభ్య సమావేశం)లో శ్రీనివాసన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవికి శ్రీనివాసన్ ఒక్కడే పోటీలో నిలవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. తద్వారా వరుసగా 15వ సారి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కు శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 2016-17 సంవత్సరానికి కార్యనిర్వాహక కమిటీ ఆఫీస్ బేరర్స్ కూడా ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.