ఓవరాల్ చాంపియన్షిప్ జేబీ కైవశం
కావలిఅర్బన్ : పట్టణంలోని జవహర్ భారతి కళాశాల ప్రాంగణంలో నాలుగురోజులుగా సాగుతున్న జిల్లా జూనియర్ కళాశాలల ఆటల పోటీల్లో కావలి జవహర్ భారతి జూనియర్ కళాశాల క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్ను కైవశం చేసుకున్నారు. గురువారం పోటీలు హోరాహారీగా సాగాయి. క్రీడాకారులు ఉత్కంఠభరితంగా ఆటల్లో తలపడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయకుమార్రెడ్డి, దొడ్ల లక్ష్మీరెడ్డి, ప్రిన్సిపల్ పోతురాజు, పీడీలు డాక్టర్ మాల్యాద్రి, ప్రసాద్రెడ్డి, ఆయా కళాశాలల పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
బాలుర విభాగం షటిల్ బ్యాట్మింటన్లో వెంకటగిరి ఏపీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల విన్నర్స్గా, నెల్లూరు కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల రన్నర్గా నిలిచాయి.
బాల్ బ్యాట్మింటన్లో కావలి సాయి కో-ఆపరేటివ్ కళాశాల విన్నర్గా, కావలి చైతన్య జూనియర్ కళాశాల రన్నర్గా నిలిచాయి.
హ్యాండ్బాల్లో కోట ఏపీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, కావలి పీహెచ్ఆర్ జేబీ జూనియర్ కళాశాల విన్నర్స్గా నిలిచాయి. కొండాపురం ఏపీ మోడల్ స్కూలు రన్నర్గా నిలిచింది.
బాస్కెట్బాల్లో కావలి పీహెచ్ఆర్ జేబీ జూనియర్ కళాశాల విన్నర్గా, కావలి శ్రీసాయి కళాశాల రన్నర్గా నిలిచింది.
ఫుట్బాల్లో బిట్రగుంట జీజేసీ విన్నర్కాగా, కావలి పీహెచ్ఆర్ జేబీ కళాశాల రన్నర్గా నిలిచింది.
వాలీబాల్లో కావలి జేబీ జూనియర్ కళాశాల విన్నర్స్ కాగా బిట్రగుంట జీజేసీ రన్నర్స్గా నిలిచింది.
కబడ్డీలో ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల విన్నర్స్గా, కావలి శ్రీసాయి జూనియర్ కళాశాల రన్నర్స్గా నిలిచింది.