షేర్ ఎ పంజాబ్
దాబా అనగానే గుర్తొచ్చేది పంజాబ్. నగర వాసులకు పంజాబీ దాబా రుచులను పంచేందుకు ‘షేర్ ఎ పంజాబ్’ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది తాజ్బంజారా. పక్కా దాబా స్టైల్లో అలంకరించిన ‘కెబాబ్ ఎ బహార్’ రెస్టారెంట్లో ప్రముఖ చెఫ్ బిలాల్ నేతృత్వంలోని నిపుణులైన చెఫ్ల బృందం పంజాబీ డిష్లను వండి వడ్డిస్తోంది. ఈనెల 18 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్లో సంప్రదాయ పంజాబీ వంటకాలతోపాటు దేశవ్యాప్త ప్రత్యేక వంటకాలు సాయంత్రం 7.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు విందు చేయనున్నాయి.
- సాక్షి, సిటీ ప్లస్