నిజామాబాద్లో టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం
నిజామాబాద్ : టీఆర్ఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిజామాబాద్ నగరంలో జరగనుంది. స్థానిక కంఠేశ్వర్ రోడ్డులోని శ్రావ్య గార్డెన్లో ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. స్థానిక ఎంపీ కె. కవిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరనుందని జిల్లా అధ్యక్షుడు ఈ గంగారెడ్డి వెల్లడించారు.
జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు జితేందర్రెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్, నగర మేయర్ కూడా హజరుకానున్నారని తెలిపారు.