చంద్రబాబుతో టీ. టీడీపీ ముఖ్యనేతల భేటీ
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ సారధి కోసం 'మొబైల్' సర్వే ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సారధ్యం వహించగలిగిన నాయకుడెవరంటూ ఆ పార్టీ సెల్ ఫోన్లలో వెతుకులాడుతోంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది